బాంబులకే భయపడలేదు.. రాళ్లకు భయపడతానా?
‘నిన్న జగన్పై పడింది చీకట్లో గులకరాయి. ఇప్పుడు నాపై పడింది వెలుగులో రాయి. ముఖ్యమంత్రి వెళుతుంటే కరెంటు ఉండదా? ఎవరికి నేర్పిస్తారు ఈ డ్రామాలు? 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశాను.
గులకరాయి వంకతో నాపై రాళ్లు వేయిస్తారా?
జగన్ ప్రభుత్వంలో అందరూ బాధితులే
గాజువాక ప్రజాగళం సభలో చంద్రబాబు ధ్వజం
ఈనాడు, విశాఖపట్నం: ‘నిన్న జగన్పై పడింది చీకట్లో గులకరాయి. ఇప్పుడు నాపై పడింది వెలుగులో రాయి. ముఖ్యమంత్రి వెళుతుంటే కరెంటు ఉండదా? ఎవరికి నేర్పిస్తారు ఈ డ్రామాలు? 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశాను. ఆవలిస్తే పేగులు లెక్కపెడతా. నాకు రాజకీయాలు నేర్పిస్తారా జగన్? మీ సభలకు ప్రజలు రావడం లేదు, మీరంటే అసహ్యించుకుంటున్నారు. ఎప్పుడెప్పుడు వదిలించుకుందామా అని బాధితులంతా ఒక్కటయ్యారు. రాష్ట్రంలో అందరం జగన్ బాధితులమే. నేనూ బాధితుడినే’ అని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం రాత్రి విశాఖ జిల్లా గాజువాకలో ప్రజాగళం సభ నిర్వహించారు. భారీగా తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడుతుండగా గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు విసిరారు. ‘ఇక్కడ రాళ్లు వేశారు... చూశారా? రేయ్ మీ అందరినీ ఈ ప్రజలు వదిలిపెట్టరు. రేపటి నుంచి మిమ్మల్ని తరిమి తరిమి కొడతారు. పోలీసులు ఏం చేస్తున్నారో నాకు తెలియదు. గంజాయి, బ్లేడ్ బ్యాచ్ ఇక్కడికీ వచ్చింది. మీరు ఇలాంటి చిల్లర పనులు చేస్తే, ప్రజలు తిరగబడి కొడతారు’ అని చంద్రబాబు గట్టిగా హెచ్చరించారు. సీఎం జగన్పై విజయవాడలో రాయి విసిరిన తర్వాత జరిగిన పరిణామాలపై చంద్రబాబు తన ప్రసంగంలో ఎన్నో ప్రశ్నలు లేవనెత్తారు.
పరిపాలనంటే ఏమిటో చూపిస్తా
‘మొన్న ఒక ఘటన జరిగింది, దాన్ని అందరం వ్యతిరేకించాం. విమానాశ్రయంలో నాకు సమాచారం రాగానే జగన్పై జరిగిన దాడిని ఖండించా. కానీ జగన్ అరగంటలోపే అక్కడే నా ప్లకార్డులు చూపించి, నేనే రాయి వేయించానని, దోషినని ప్రచారం చేశారు. మీ మీద గులకరాయి వేయించామా? మీ పోలీసులు, విద్యుత్ శాఖ అధికారులు ఏం చేస్తున్నారు? ముఖ్యమంత్రిగా రాజీనామా చెయ్యండి.. గంటలో పరిపాలన ఎలా చేయాలో చేసి చూపిస్తా. ఆ సత్తా, చేసి చూపించిన ట్రాక్ రికార్డు ఉన్నాయి. కోడి కత్తి డ్రామా చేసి, ఇప్పుడు ఎవరో గులక రాయి వేస్తే.. నేను వేయించానట. ఆ గులకరాయి వంకతో, నాపై రాళ్లు వేస్తారా? బాంబులు వేస్తేనే భయపడలేదు నేను. రాళ్లకు భయపడతానా?’ అంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు.
చర్యలు ఎందుకు తీసుకోలేదు?
‘గతంలో నేను విశాఖ వచ్చినప్పుడు బయటకు రాకుండా వైకాపా గూండాలు అడ్డుకుంటే పోలీసులు చర్యలు తీసుకోకుండా ప్రేక్షకపాత్ర వహించి నన్ను తిప్పి పంపారు. అమరావతిలోని రైతుల సభకు సంఘీభావంగా వెళ్తే వైకాపా రౌడీలు చెప్పులు, రాళ్లు, కర్రలతో దాడిచేశారు. ఆ రోజు డీజీపీ సమాధానం చెబుతూ.. ‘చంద్రబాబు అంటే వ్యతిరేకత ఉంది. ప్రజాస్వామ్యంలో నిరసన తెలపొచ్చు. రాళ్లతో దాడి చేయచ్చు’ అని సిగ్గులేకుండా మాట్లాడారు. మా ఇంటికి ఓ ఎమ్మెల్యే రాళ్లు, కర్రలతో దాడికి వస్తే దాన్ని అడ్డుకుంటే నాపైనే కేసులు పెట్టి ఆ ఎమ్మెల్యే నా అపాయింట్మెంట్ కోసం వచ్చారన్నారు. ఎక్కడికి వెళ్లినా నాపై రాళ్లదాడి చేశారు. పవన్ కల్యాణ్పైన, నాపైన రాళ్లు వేస్తేనో, ప్రధాని వచ్చినప్పుడు మైకులు కట్చేస్తేనో మేం భయపడిపోతామా? టవర్లు ఎక్కితే దిగాలని ప్రధాని కోరారు. పోలీసులకు బాధ్యత లేదా? ఎందుకు అప్పుడు అధికారులపై చర్యలు తీసుకోలేదని ప్రశ్నిస్తున్నా. నిన్న కరెంటు సరఫరా తీసేసిన వారిపై, గులకరాయి వేసిన వాళ్లపై చర్యలు ఎందుకు తీసుకోలేదు? గులకరాయి ఎవరు వేశారో చెప్పాలి కదా? 24 గంటలు అయింది. సీఎస్, డీజీపీ, ఇంటెలిజెన్స్కు బాధ్యత లేదా? నాపై రాయి వేయించి పైశాచిక ఆనందం పొందుతారా? మీపై గులక రాయివేస్తే కొంపలు కూలినట్లు మాట్లాడతారా? రాయి వేయడాన్ని నేను సమర్థించను. అయినా జగన్ రోడ్డుపైకి రాగానే కరెంటు పోయిందట. ఇది ఎవరి వైఫల్యం? ఇప్పుడు ప్రభుత్వం ఎవరిది? బాధ్యత ఎవరిది?’ అని చంద్రబాబు ప్రశ్నించారు.
ప్రభుత్వ సహకారం లేకుండా జరుగుతుందా?
‘ఒకప్పుడు పరిశ్రమల కేంద్రంగా విశాఖను తెదేపా అభివృద్ధి చేస్తే ఇప్పుడు గంజాయి కేంద్రంగా వైకాపా మార్చేసింది. విశాఖ పోర్టు ద్వారా 25వేల కేజీల డ్రగ్స్ దిగుమతి అవుతూ పట్టుబడ్డాయి. ప్రభుత్వ సహకారం లేకుండా అంత ధైర్యంగా డ్రగ్స్ తెస్తారా? ఇందులో ఈ రాష్ట్రప్రభుత్వమే దోషి’ అన్నారు.
14 ఏళ్లు చేసిన అభివృద్ధిని అయిదేళ్లలో చూపిస్తా
‘14 ఏళ్లు సీఎంగా ఉన్న నాలో కసి, పట్టుదల పెరుగుతున్నాయి. 14 ఏళ్లలో చేసిన అభివృద్ధిని అయిదేళ్లలో చేసి మీ రుణం తీర్చుకుంటా. కూటమిలోని మూడు పార్టీలదీ ఒకటే మాట. రాష్ట్రాన్ని కాపాడుకోవడమే లక్ష్యం. వైకాపా ప్రభుత్వం ఇచ్చిన సెంటు భూమి నేను రద్దుచేయను. ఇప్పుడు రానివారికి రెండు సెంట్లు ఇస్తాం. ఇళ్లు పూర్తికాకపోతే పూర్తిచేయిస్తాం. విశాఖలో పరిశ్రమలకు ప్రాధాన్యం ఇస్తాను. విశాఖ స్టీలుప్లాంటు ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంటా’ అని చంద్రబాబు భరోసా ఇచ్చారు.
ఈ తప్పు ఎవరిది?
‘నా సెక్యూరిటీ సిబ్బంది ఒక విషయం చెప్పారు. విజయవాడలో ఓ చిన్న కుటుంబం. యజమాని సెలూన్ దుకాణం నిర్వహిస్తారు. ఆయన భార్య ప్రైవేటు కంపెనీలో పనిచేస్తారు. ఇద్దరూ కలిసి నెలకు రూ.25-30వేలు సంపాదిస్తారు. 8వ తరగతి చదువుతున్న వారి కుమారుడిని ఆ కాలనీలో కొందరు గంజాయికి బానిస చేశారు. ఆ బాబును హైదరాబాద్ తీసుకెళ్లి రూ.5లక్షలతో చికిత్స అందించినా లాభం లేకపోయింది. ఆ విద్యార్థి రోడ్డుపై పోయేవాళ్లపై దౌర్జన్యం చేసి డబ్బులు లాక్కుంటూ దొరికి ఇప్పుడు జైల్లో ఉన్నాడు. ఈ రాష్ట్రంలో గంజాయి తీవ్రతను ముఖ్యమంత్రి నివారించి ఉంటే ఆ విద్యార్థి అలా తయారయ్యేవాడా?’ అని చంద్రబాబు ప్రశ్నించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రధాని మోదీ ఉల్లంఘనలపై చర్యలకు ఆదేశించే డీఎన్ఏ ఈసీలో లేదు: సీతారాం ఏచూరి
ఎన్నికల ప్రవర్తన నియమావళిని ప్రధాని మోదీ పదే పదే ఉల్లంఘిస్తున్నారని, వాటిపై తాము పలుమార్లు ఫిర్యాదులు చేసినా ఎన్నికల సంఘం (ఈసీ) చర్యలు తీసుకోవడంలేదంటూ సీపీఎం తీవ్ర స్థాయిలో ఆక్షేపించింది. -
ఇసుక అక్రమాలపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలి
ఇసుక అక్రమాలపై ఉన్నతస్థాయిలో విచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండు చేశారు. రాజమహేంద్రవరంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. -
కూటమే కొడుతుంది!
రాష్ట్రంలో ఈసారి తెదేపా-జనసేన-భాజపా కూటమిదే విజయం అన్న ధీమాతో పందేలు సాగుతున్నాయి. భీమవరం, కడప, నెల్లూరులాంటి ప్రాంతాల్లో కూటమి విజయంపై, ఎన్ని సీట్లు సాధిస్తుందనే అంశంలపైనే బెట్టింగ్ రాయుళ్లు ఆసక్తి చూపుతున్నారు. -
మేం వచ్చాకే సైన్యానికి జవసత్వాలు
కుంభకోణాలకు మారుపేరు కాంగ్రెస్ అనీ, సైనికుల కనీసావసరాలను కూడా ఆ పార్టీ ఏలుబడిలో తీర్చలేకపోయారని ప్రధాని మోదీ విమర్శించారు. ఆయన శనివారం హరియాణాలో మొట్టమొదటిసారి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. -
ప్రజలను రెచ్చగొట్టడం మోదీకి అలవాటు
ఇండియా కూటమి అధికారంలోకి వస్తే బుల్డోజరు ద్వారా రామమందిరాన్ని కూల్చేస్తుందంటూ ప్రధాని మోదీ చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా ఇతర విపక్ష నేతలు తీవ్రంగా మండిపడ్డారు. -
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక.. కాంగ్రెస్కు సీపీఎం మద్దతు
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు సీపీఎం ప్రకటించింది. ఈ ఎన్నికల్లో పట్టభద్రులైన ఓటర్లు కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని శనివారం పిలుపునిచ్చింది. -
మహాలక్ష్మి పథకంపై మోదీ వ్యాఖ్యలు సరికాదు
మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో మెట్రోరైలుకు నష్టం జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించడం సరికాదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. -
ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్న మోదీ
ఎన్నికల నియమావళిని గౌరవించాల్సిన ప్రధాని మోదీ.. దాన్ని ఉల్లంఘిస్తున్నారని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి ఆరోపించారు. -
అప్పుడు నాటుతుపాకులు.. ఇప్పుడు ఫిరంగి గుళ్లు
ఒకనాడు నాటుతుపాకుల తయారీ కేంద్రంగా ఉన్న ఉత్తర్ప్రదేశ్ నేడు ఫిరంగి గుళ్లు తయారుచేసేదిగా మారింది. మోదీ పాలనలో బుందేల్ఖండ్లో రక్షణరంగ పరిశ్రమల నడవా వచ్చాక ఈ మార్పును చూస్తున్నాం. -
ఒడిశా శాసనసభ ఎన్నికల మూడో దశలో 126 మంది కోటీశ్వరులు
ఒడిశా శాసనసభ ఎన్నికల్లో మూడో దశలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న అభ్యర్థుల్లో 126 మంది కోటీశ్వరులు ఉన్నారు. -
దిల్లీలో గద్దెనెక్కేది ఇండియా కూటమే: మమత
ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించడం ద్వారా ఇండియా కూటమి అధికారాన్ని హస్తగతం చేసుకుంటుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధ్యక్షురాలు మమతా బెనర్జీ పేర్కొన్నారు. -
దేశాభివృద్ధికి మళ్లీ మార్గం చూపాలి
దేశాభివృద్ధికి, ఉత్తర్ప్రదేశ్ ప్రగతికి మరోసారి మార్గం చూపాలంటూ రాయ్బరేలీ ప్రజలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ పిలుపునిచ్చారు. -
స్టాంపు, సంతకాల్లేని పోస్టల్ ఓట్లు చెల్లుబాటయ్యేలా చూడాలి: తెదేపా
అధికారుల తప్పిదాలతో వేసిన పోస్టల్ బ్యాలట్ ఓట్లు చెల్లేలా చూడాలని తెదేపా నేతలు అశోక్బాబు, ఏఎస్ రామకృష్ణ కోరారు. ఈ మేరకు అదనపు ఎన్నికల అధికారి కోటేశ్వరరావుకు శనివారం వినతిపత్రం ఇచ్చారు. -
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పహారా ఉండాలి
ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు ఈవీఎంలు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ల వద్ద పహారా ఉండాలని ఎన్డీయే కూటమి కార్యకర్తలకు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు సూచించారు. వైకాపా శ్రేణులను ఏ దశలోనూ తేలికగా తీసుకోవద్దని శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
చిల్లర కుట్రలు చేసేవారికి సుప్రీం స్టే చెంపపెట్టు
వివేకా హత్య కేసులో దుర్మార్గుల నీచబుద్ధికి దిమ్మతిరిగేలా సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల వ్యాఖ్యానించారు. భావప్రకటన స్వేచ్ఛపై రాక్షస మూక చేయబోయిన దాడిని తిప్పి కొట్టి ధర్మపోరాటంలో న్యాయమే గెలుస్తుందని శుక్రవారం సుప్రీం స్టే ద్వారా నిరూపణ అయిందని ఎక్స్ వేదికగా ఆమె పేర్కొన్నారు. -
వారిపై కుక్కల్ని వదలండి.. కొడాలి నాని అనుచరుడు
పోలింగ్ గడువు సమీపించిన సమయంలో గుడివాడ ఎమ్మెల్యే, వైకాపా అభ్యర్థి కొడాలి నాని తరఫున ముఖ్య నేత రూ.కోట్ల డబ్బును అనుచరులకిచ్చి పంచాలని సూచించిన ఉదంతాలు బయటకొస్తున్నాయి. -
పిన్నెల్లి సోదరులను తప్పించిన పోలీసులపై కఠిన చర్యలు
మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి గృహనిర్బంధం నుంచి తప్పించుకున్న సంఘటనలో పోలీసుల భాగస్వామ్యం ఉన్నట్టు రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటామని సిట్ అధిపతి వినీత్ బ్రిజ్లాల్ చెప్పినట్టు తెదేపా నేతలు తెలిపారు. -
ఇంటి నుంచి ఓటేసిన మన్మోహన్, ఆడ్వాణీ, అన్సారీ, మనోహర్ జోషీ
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ ఉప ప్రధాని ఎల్కే ఆడ్వాణీ, మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, కేంద్ర మాజీ మంత్రి మురళీ మనోహర్ జోషీ దిల్లీలోని తమ నివాసాల నుంచే ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
ఎన్నికల తనిఖీల్లో రూ.8,889 కోట్ల సొత్తు జప్తు
సార్వత్రిక ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) మార్చి 1 నుంచి మే 18 వరకు రూ.8,889 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకొంది. -
మండపేట ఎమ్మెల్యేపై ఎట్రాసిటీ కేసు
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వపురం మండలం వల్లూరులో చోటుచేసుకున్న ఘర్షణలకు సంబంధించి మండపేట అసెంబ్లీ తెదేపా అభ్యర్థి, ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, జనసేన సమన్వయకర్త వేగుళ్ల లీలాకృష్ణ, తెదేపా నాయకుడు వల్లూరి వీరబాబుపై అంగర పోలీసులు శనివారం ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసు నమోదు చేశారు. -
నాతో చర్చకు మోదీ రారు: రాహుల్
ప్రధాని మోదీ తనతో బహిరంగ చర్చకు ఎన్నటికీ రారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ అన్నారు. అదానీ వంటి కొందరు పారిశ్రామికవేత్తలతో సంబంధాలు, ఎలక్టోరల్ బాండ్ల దుర్వినియోగం వంటి అంశాలపై తాను అడిగే ప్రశ్నలకు ఆయన వద్ద సమాధానాలు లేకపోవడమే అందుకు కారణమని పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బుక్ చేస్తే 24 గంటల్లో నీటి ట్యాంకర్
-
ఇంటి దొంగల గుండెల్లో రైళ్లు.. పల్నాట రంగంలోకి దిగిన ప్రత్యేక దర్యాప్తు బృందం
-
గతేడాది ‘ఫైనల్’ ఓవర్ పునరావృతం అవుతుందనుకున్నా: రుతురాజ్ గైక్వాడ్
-
భయపెడుతున్న ఏపీ రెవెన్యూ, ద్రవ్యలోటు
-
ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ
-
రూ.లక్షల్లో జీతాలు.. ఫలితాలు అంతంతమాత్రమా?