బాంబులకే భయపడలేదు.. రాళ్లకు భయపడతానా?
‘నిన్న జగన్పై పడింది చీకట్లో గులకరాయి. ఇప్పుడు నాపై పడింది వెలుగులో రాయి. ముఖ్యమంత్రి వెళుతుంటే కరెంటు ఉండదా? ఎవరికి నేర్పిస్తారు ఈ డ్రామాలు? 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశాను.
గులకరాయి వంకతో నాపై రాళ్లు వేయిస్తారా?
జగన్ ప్రభుత్వంలో అందరూ బాధితులే
గాజువాక ప్రజాగళం సభలో చంద్రబాబు ధ్వజం
ఈనాడు, విశాఖపట్నం: ‘నిన్న జగన్పై పడింది చీకట్లో గులకరాయి. ఇప్పుడు నాపై పడింది వెలుగులో రాయి. ముఖ్యమంత్రి వెళుతుంటే కరెంటు ఉండదా? ఎవరికి నేర్పిస్తారు ఈ డ్రామాలు? 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశాను. ఆవలిస్తే పేగులు లెక్కపెడతా. నాకు రాజకీయాలు నేర్పిస్తారా జగన్? మీ సభలకు ప్రజలు రావడం లేదు, మీరంటే అసహ్యించుకుంటున్నారు. ఎప్పుడెప్పుడు వదిలించుకుందామా అని బాధితులంతా ఒక్కటయ్యారు. రాష్ట్రంలో అందరం జగన్ బాధితులమే. నేనూ బాధితుడినే’ అని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం రాత్రి విశాఖ జిల్లా గాజువాకలో ప్రజాగళం సభ నిర్వహించారు. భారీగా తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడుతుండగా గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు విసిరారు. ‘ఇక్కడ రాళ్లు వేశారు... చూశారా? రేయ్ మీ అందరినీ ఈ ప్రజలు వదిలిపెట్టరు. రేపటి నుంచి మిమ్మల్ని తరిమి తరిమి కొడతారు. పోలీసులు ఏం చేస్తున్నారో నాకు తెలియదు. గంజాయి, బ్లేడ్ బ్యాచ్ ఇక్కడికీ వచ్చింది. మీరు ఇలాంటి చిల్లర పనులు చేస్తే, ప్రజలు తిరగబడి కొడతారు’ అని చంద్రబాబు గట్టిగా హెచ్చరించారు. సీఎం జగన్పై విజయవాడలో రాయి విసిరిన తర్వాత జరిగిన పరిణామాలపై చంద్రబాబు తన ప్రసంగంలో ఎన్నో ప్రశ్నలు లేవనెత్తారు.
పరిపాలనంటే ఏమిటో చూపిస్తా
‘మొన్న ఒక ఘటన జరిగింది, దాన్ని అందరం వ్యతిరేకించాం. విమానాశ్రయంలో నాకు సమాచారం రాగానే జగన్పై జరిగిన దాడిని ఖండించా. కానీ జగన్ అరగంటలోపే అక్కడే నా ప్లకార్డులు చూపించి, నేనే రాయి వేయించానని, దోషినని ప్రచారం చేశారు. మీ మీద గులకరాయి వేయించామా? మీ పోలీసులు, విద్యుత్ శాఖ అధికారులు ఏం చేస్తున్నారు? ముఖ్యమంత్రిగా రాజీనామా చెయ్యండి.. గంటలో పరిపాలన ఎలా చేయాలో చేసి చూపిస్తా. ఆ సత్తా, చేసి చూపించిన ట్రాక్ రికార్డు ఉన్నాయి. కోడి కత్తి డ్రామా చేసి, ఇప్పుడు ఎవరో గులక రాయి వేస్తే.. నేను వేయించానట. ఆ గులకరాయి వంకతో, నాపై రాళ్లు వేస్తారా? బాంబులు వేస్తేనే భయపడలేదు నేను. రాళ్లకు భయపడతానా?’ అంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు.
చర్యలు ఎందుకు తీసుకోలేదు?
‘గతంలో నేను విశాఖ వచ్చినప్పుడు బయటకు రాకుండా వైకాపా గూండాలు అడ్డుకుంటే పోలీసులు చర్యలు తీసుకోకుండా ప్రేక్షకపాత్ర వహించి నన్ను తిప్పి పంపారు. అమరావతిలోని రైతుల సభకు సంఘీభావంగా వెళ్తే వైకాపా రౌడీలు చెప్పులు, రాళ్లు, కర్రలతో దాడిచేశారు. ఆ రోజు డీజీపీ సమాధానం చెబుతూ.. ‘చంద్రబాబు అంటే వ్యతిరేకత ఉంది. ప్రజాస్వామ్యంలో నిరసన తెలపొచ్చు. రాళ్లతో దాడి చేయచ్చు’ అని సిగ్గులేకుండా మాట్లాడారు. మా ఇంటికి ఓ ఎమ్మెల్యే రాళ్లు, కర్రలతో దాడికి వస్తే దాన్ని అడ్డుకుంటే నాపైనే కేసులు పెట్టి ఆ ఎమ్మెల్యే నా అపాయింట్మెంట్ కోసం వచ్చారన్నారు. ఎక్కడికి వెళ్లినా నాపై రాళ్లదాడి చేశారు. పవన్ కల్యాణ్పైన, నాపైన రాళ్లు వేస్తేనో, ప్రధాని వచ్చినప్పుడు మైకులు కట్చేస్తేనో మేం భయపడిపోతామా? టవర్లు ఎక్కితే దిగాలని ప్రధాని కోరారు. పోలీసులకు బాధ్యత లేదా? ఎందుకు అప్పుడు అధికారులపై చర్యలు తీసుకోలేదని ప్రశ్నిస్తున్నా. నిన్న కరెంటు సరఫరా తీసేసిన వారిపై, గులకరాయి వేసిన వాళ్లపై చర్యలు ఎందుకు తీసుకోలేదు? గులకరాయి ఎవరు వేశారో చెప్పాలి కదా? 24 గంటలు అయింది. సీఎస్, డీజీపీ, ఇంటెలిజెన్స్కు బాధ్యత లేదా? నాపై రాయి వేయించి పైశాచిక ఆనందం పొందుతారా? మీపై గులక రాయివేస్తే కొంపలు కూలినట్లు మాట్లాడతారా? రాయి వేయడాన్ని నేను సమర్థించను. అయినా జగన్ రోడ్డుపైకి రాగానే కరెంటు పోయిందట. ఇది ఎవరి వైఫల్యం? ఇప్పుడు ప్రభుత్వం ఎవరిది? బాధ్యత ఎవరిది?’ అని చంద్రబాబు ప్రశ్నించారు.
ప్రభుత్వ సహకారం లేకుండా జరుగుతుందా?
‘ఒకప్పుడు పరిశ్రమల కేంద్రంగా విశాఖను తెదేపా అభివృద్ధి చేస్తే ఇప్పుడు గంజాయి కేంద్రంగా వైకాపా మార్చేసింది. విశాఖ పోర్టు ద్వారా 25వేల కేజీల డ్రగ్స్ దిగుమతి అవుతూ పట్టుబడ్డాయి. ప్రభుత్వ సహకారం లేకుండా అంత ధైర్యంగా డ్రగ్స్ తెస్తారా? ఇందులో ఈ రాష్ట్రప్రభుత్వమే దోషి’ అన్నారు.
14 ఏళ్లు చేసిన అభివృద్ధిని అయిదేళ్లలో చూపిస్తా
‘14 ఏళ్లు సీఎంగా ఉన్న నాలో కసి, పట్టుదల పెరుగుతున్నాయి. 14 ఏళ్లలో చేసిన అభివృద్ధిని అయిదేళ్లలో చేసి మీ రుణం తీర్చుకుంటా. కూటమిలోని మూడు పార్టీలదీ ఒకటే మాట. రాష్ట్రాన్ని కాపాడుకోవడమే లక్ష్యం. వైకాపా ప్రభుత్వం ఇచ్చిన సెంటు భూమి నేను రద్దుచేయను. ఇప్పుడు రానివారికి రెండు సెంట్లు ఇస్తాం. ఇళ్లు పూర్తికాకపోతే పూర్తిచేయిస్తాం. విశాఖలో పరిశ్రమలకు ప్రాధాన్యం ఇస్తాను. విశాఖ స్టీలుప్లాంటు ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంటా’ అని చంద్రబాబు భరోసా ఇచ్చారు.
ఈ తప్పు ఎవరిది?
‘నా సెక్యూరిటీ సిబ్బంది ఒక విషయం చెప్పారు. విజయవాడలో ఓ చిన్న కుటుంబం. యజమాని సెలూన్ దుకాణం నిర్వహిస్తారు. ఆయన భార్య ప్రైవేటు కంపెనీలో పనిచేస్తారు. ఇద్దరూ కలిసి నెలకు రూ.25-30వేలు సంపాదిస్తారు. 8వ తరగతి చదువుతున్న వారి కుమారుడిని ఆ కాలనీలో కొందరు గంజాయికి బానిస చేశారు. ఆ బాబును హైదరాబాద్ తీసుకెళ్లి రూ.5లక్షలతో చికిత్స అందించినా లాభం లేకపోయింది. ఆ విద్యార్థి రోడ్డుపై పోయేవాళ్లపై దౌర్జన్యం చేసి డబ్బులు లాక్కుంటూ దొరికి ఇప్పుడు జైల్లో ఉన్నాడు. ఈ రాష్ట్రంలో గంజాయి తీవ్రతను ముఖ్యమంత్రి నివారించి ఉంటే ఆ విద్యార్థి అలా తయారయ్యేవాడా?’ అని చంద్రబాబు ప్రశ్నించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు