నాగ్పుర్లో హ్యాట్రిక్పై గడ్కరీ గురి
సార్వత్రిక ఎన్నికల్లో మహారాష్ట్రలోని నాగ్పుర్ నియోజకవర్గం యావత్ దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. భాజపాలో ప్రధానమంత్రి పదవి విషయంలో నరేంద్ర మోదీకి ప్రత్యామ్నాయంగా ఎక్కువ మంది భావించే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇక్కడ పోటీ చేస్తుండటమే అందుకు ప్రధాన కారణం.
అభివృద్ధి పనులే గెలిపిస్తాయని ధీమా
నాగ్పుర్: సార్వత్రిక ఎన్నికల్లో మహారాష్ట్రలోని నాగ్పుర్ నియోజకవర్గం యావత్ దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. భాజపాలో ప్రధానమంత్రి పదవి విషయంలో నరేంద్ర మోదీకి ప్రత్యామ్నాయంగా ఎక్కువ మంది భావించే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇక్కడ పోటీ చేస్తుండటమే అందుకు ప్రధాన కారణం. గత రెండు ఎన్నికల్లోనూ నాగ్పుర్లో 2 లక్షలకు పైగా ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించిన ఆయన ప్రస్తుతం అంతకంటే ఎక్కువ ఆధిక్యంతో హ్యాట్రిక్ సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు.
కాంగ్రెస్కు ఒకప్పుడు కంచుకోట
విదర్భ ప్రాంతంలోని అతిపెద్ద నగరం నాగ్పుర్. భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ఇక్కడే బౌద్ధమతాన్ని స్వీకరించారు. భాజపాకు సైద్ధాంతిక మార్గదర్శి అయిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్)కు నాగ్పుర్తో బలమైన బంధం ఉంది. ఈ స్థానం ఒకప్పుడు కాంగ్రెస్కు కంచుకోట. ఇప్పటివరకు ఇక్కడ 17 సార్లు లోక్సభ ఎన్నికలు జరగ్గా.. 13 సార్లు ఆ పార్టీ విజయం సాధించింది. గత రెండు దఫాలు గడ్కరీ ఇక్కణ్నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2014లో ఏడుసార్లు ఎంపీ విలాస్ ముత్తేవార్ను 2.84 లక్షల ఓట్ల తేడాతో ఓడించిన ఆయన.. 2019లో ప్రస్తుత మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలెపై 2.16 లక్షల మెజార్టీతో గెలుపొందారు.
అభివృద్ధి పనులపై భరోసాతో..
నాగ్పుర్లో గడ్కరీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. పలు మౌలిక వసతుల ప్రాజెక్టులను తీసుకొచ్చారు. గత పదేళ్లలో నియోజకవర్గ ప్రగతికి చేసిన కృషే తనను మళ్లీ గెలిపిస్తుందని ఆయన ధీమాగా ఉన్నారు. తాను ఎవరి దగ్గరికీ వెళ్లి ఓట్లు అడగనని.. అయినా అయిదు లక్షల మెజార్టీతో విజయం సాధిస్తానని ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనం. ఆరెస్సెస్కు అత్యంత విశ్వాసపాత్రుల్లో ఒకరు కావడం, ప్రధాని మోదీకి ప్రత్యామ్నాయంగా చాలామంది చూస్తుండటం, ముక్కుసూటిగా మాట్లాడే తత్వం వంటివి కూడా ఎన్నికల్లో ఆయనకు కలిసొచ్చే అంశాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
నిరుద్యోగిత, ద్రవ్యోల్బణం ప్రతికూలతలు
మౌలిక వసతుల ప్రాజెక్టులు బాగానే ఉన్నా.. నిరుద్యోగిత, ద్రవ్యోల్బణం వంటివి గడ్కరీకి కొంత ప్రతికూలంగా మారే అవకాశాలున్నాయి. నియోజకవర్గంలో దళిత, కున్బి, హల్బ, ముస్లిం వర్గాల ఓటర్లు దాదాపు 12 లక్షల వరకూ ఉన్నారు. వారి మద్దతును దక్కించుకోవడం ఆయనకు చాలా కీలకం. ప్రస్తుతం గడ్కరీకి ప్రధాన ప్రత్యర్థిగా కాంగ్రెస్ తరఫున వికాస్ ఠాక్రే ఎన్నికల బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన నానా పటోలెకు 4.5 లక్షల ఓట్లు వచ్చాయి. ఆయన స్థానికేతర నేత. ఇప్పుడు బరిలో ఉన్న వికాస్ ఠాక్రే స్థానికుడు కావడంతో.. విజయం కోసం గడ్కరీ శ్రమించక తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్కు సీపీఐ మద్దతు ప్రకటించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా కొనసాగి ఉంటే 2021లోనే పోలవరం పూర్తయ్యేది: సీఎం చంద్రబాబు
2014-19 మధ్య పెట్టుబడులకు చిరునామాగా ఆంధ్రప్రదేశ్ను నిలిపామని సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. -
గోదావరిలో నీరుంది.. కానీ ప్రభుత్వానికి ఇచ్చే మనసు లేదు: కేటీఆర్
తెలంగాణలో కరవు అనే మాట వినపడకూడదని కేసీఆర్.. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
వైకాపా హయాంలో ప్రకటనల కుంభకోణం.. హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేల డిమాండ్
వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రకటనల కుంభకోణంపై హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. -
ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.. మంత్రులకు చంద్రబాబు సూచన
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించడం... వంటి మంచి పనుల్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. -
సకుటుంబ సమేతంగా కేసులు.. అక్రమ కేసులున్నవారు నిలబడాలని కోరిన చంద్రబాబు
వివాహాలు, ఇతర శుభకార్యాలకు సకుటుంబ సపరివార సమేతంగా రావాలని ఆహ్వానిస్తుంటాం.. అయితే గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలపై సకుటుంబ సమేతంగా అక్రమ కేసులు నమోదు చేసి వేధించారని చంద్రబాబు, ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. శ్వేతపత్రం విడుదల సందర్భంగా.. వైకాపా ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలపై నమోదైన అక్రమ కేసుల సంఖ్యను చంద్రబాబు ప్రస్తావించారు. -
ఏపీ ‘ఎస్కోబార్’ జగన్.. చీకటి సామ్రాజ్యాధిపతితో పోల్చిన చంద్రబాబు
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అరాచకాలను వివరించేటప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కొలంబియన్ మాదకద్రవ్యాల చీకటి సామ్రాజ్యాధిపతి పాబ్లో ఎమిలియో ఎస్కోబార్ చరిత్రను సభకు వినిపించారు. -
‘రఘురామను చిత్రహింసలు పెట్టినప్పుడు మీరంతా ఏమయ్యారు?’
మాజీ ముఖ్యమంత్రి జగన్ దిల్లీలో చేసిన నిరసనకు ఇండియా కూటమి నాయకులు మద్దతు పలకడాన్ని అనంతపురం తెదేపా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. -
అన్ని వర్గాలకూ మోసం
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలనూ మోసం చేసిందని, అందర్నీ వెన్నుపోటు పొడిచిందని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. -
శాంతిభద్రతల పరిరక్షణపై సభలో చర్చిద్దాం
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు.. రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలపై శాసనసభలో ఒక రోజు పూర్తిగా చర్చించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు. -
ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని దోచేశారు
‘వైకాపా ప్రభుత్వం చేసిన నిర్వాకాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు విద్యుత్తు, అమరావతి, పోలవరం, గనులు, మద్యంపై శ్వేతపత్రాలు విడుదల చేశారు. -
వైకాపా ప్రభుత్వం ఇళ్లు కూల్చింది.. ఆదుకోండి
తెదేపాకు అనుకూలంగా ఉన్నారని విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం దన్నానపేట గ్రామానికి చెందిన 30 మంది దళితుల ఇళ్లను అప్పటి వైకాపా ప్రభుత్వం కూల్చేసిందని ఆ మండల తెదేపా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు టొంపల నర్సయ్య గురువారం తెదేపా కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. -
వైకాపా పాలనలో తెదేపా శ్రేణులపై 2,560 కేసులు
వైకాపా హయాంలో గత ఐదేళ్లలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై 2,560 కేసులు నమోదు చేసి.. 2,370 మందిని అరెస్టు చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. -
ఇసుక, మద్యం అవినీతిపై విచారణ జరిపించాలి
ముఖ్యమంత్రి చంద్రబాబును రాష్ట్ర సచివాలయంలో గురువారం సీపీఎం నాయకులు కలిశారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. -
సమస్యలపై ప్రశ్నిస్తే.. వేధింపులే సమాధానం
శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం విడుదల చేసిన ‘శాంతిభద్రతల శ్వేతపత్రం’పై కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వేదికగా మాట్లాడారు. -
‘ఇండియా’ కూటమితో పొత్తు కోసమే జగన్ దిల్లీ యాత్ర
‘ఇండియా’ కూటమితో పొత్తు కోసమే వైకాపా అధ్యక్షుడు జగన్ దిల్లీ వెళ్లినట్లుగా ఉందని ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. దిల్లీ నుంచి అమరావతి చేరుకున్న జగన్... శాసనసభ సమావేశాలకు హాజరు కావాలని సూచించారు. -
ఇది పసలేని దండగమారి బడ్జెట్: కేటీఆర్
రాష్ట్ర ప్రభుత్వం పసలేని, దండగమారి బడ్జెట్ ప్రవేశపెట్టిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ప్రజల ఆకాంక్షలు పట్టించుకోకుండా ఆంక్షల పద్దు పెట్టారని అన్నారు. -
సంక్షిప్త వార్తలు (4)
బడ్జెట్లో అధిక కేటాయింపుల ద్వారా.. తమది రైతు ప్రభుత్వమని మరోసారి నిరూపించుకున్నట్లయిందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అన్నారు. -
ఫైళ్ల దహనంతో మాకు సంబంధం లేదు: వైకాపా ఎంపీ మిథున్రెడ్డి
మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో జరిగిన రెవెన్యూ దస్త్రాల దహనం ఘటనతో తమకెలాంటి సంబంధం లేదని వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి పేర్కొన్నారు. -
గాజులదిన్నె ప్రాజెక్టు పనులపై విచారణ చేపడతాం: మంత్రి నిమ్మల
సంజీవయ్య గాజులదిన్నె ప్రాజెక్టు పనులపై విచారణ చేపడతామని జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. -
రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతీయడానికే జగన్ దిల్లీ నిరసన: హోంమంత్రి అనిత
రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతీయడానికే మాజీ సీఎం జగన్ దిల్లీలో నిరసన పేరుతో చౌకబారు ఆరోపణలు చేశారని హోంమంత్రి అనిత మండిపడ్డారు. 36 రాజకీయ హత్యలు జరిగాయని నిస్సిగ్గుగా మాట్లాడారని ధ్వజమెత్తారు. -
వరద బాధిత రైతులను తక్షణమే ఆదుకోవాలి
కోస్తా జిల్లాల్లోని వరద బాధిత రైతులకు తక్షణమే నష్టపరిహారం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల గురువారం లేఖ రాశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కార్గిల్ పోరు వేళ యుద్ధ భూమిలో మోదీ.. పాతికేళ్ల నాటి ఫొటోలు వైరల్
-
రివ్యూ: పురుషోత్తముడు.. రాజ్తరుణ్ ఖాతాలో హిట్ పడిందా?
-
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
-
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
-
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
-
గూగుల్కు పోటీగా కొత్త సెర్చింజిన్.. తీసుకొచ్చిన చాట్జీపీటీ ఓనర్