కమలం కల నెరవేరేనా?
తెలంగాణలో వీలైనన్ని ఎక్కువ లోక్సభ స్థానాలు సాధించాలన్న పట్టుదలతో ఉన్న భారతీయ జనతా పార్టీ ఆ దిశగా కసరత్తు చేస్తోంది.
అత్యధిక ఎంపీ సీట్లపై భాజపా కన్ను
గత లోక్సభలో నాలుగు స్థానాల్లో గెలుపు
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏ లోక్సభ స్థానం పరిధిలోనూ దక్కని మెజారిటీ
‘పార్లమెంటు’కు సానుకూలత ఉంటుందని ఆశలు
కాంగ్రెస్, భారాసల్లో ఎవరి ఓట్లకు గండి?
ఈనాడు - హైదరాబాద్
తెలంగాణలో వీలైనన్ని ఎక్కువ లోక్సభ స్థానాలు సాధించాలన్న పట్టుదలతో ఉన్న భారతీయ జనతా పార్టీ ఆ దిశగా కసరత్తు చేస్తోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు భిన్నంగా లోక్సభ విషయంలో ఓటర్ల నుంచి భాజపాకు సానుకూలత ఉంటుందన్న అంచనాతో ముందుకు కదులుతోంది. తమకు వచ్చే ఓట్లకు తోడు.. అధికార కాంగ్రెస్, విపక్ష భారాసల ఓట్లు చీలితేనే కమలానికి విజయావకాశాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో ఎవరి ఓట్లకు గండి పడనుందనే అంశం చర్చనీయాంశమవుతోంది. గత లోక్సభ ఎన్నికల్లో భాజపా నాలుగు స్థానాలు సాధించి, మహబూబ్నగర్లో రెండో స్థానంలో నిలిచింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది స్థానాలు గెలుచుకున్నా.. ఏ లోక్సభ నియోజకవర్గ పరిధిలోనూ ఆధిక్యం సాధించలేకపోయింది. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో ఎజెండా భిన్నమని, అది తమకే లాభిస్తుందని భాజపా ఆశిస్తోంది.
ఓట్లు చీలేనా? భాజపాకు లాభించేనా?
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్.. తొమ్మిది లోక్సభ సీట్ల పరిధిలో ఆధిక్యం సాధించగా, విపక్ష భారాసకు ఏడు స్థానాలు, ఎంఐఎంకు ఒక స్థానం పరిధిలో మెజార్టీ దక్కింది. భాజపాకు సిటింగ్ ఎంపీలున్న నాలుగు లోక్సభ స్థానాల్లో.. మూడు చోట్ల మూడో స్థానం, ఆదిలాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో రెండో స్థానం మాత్రమే దక్కాయి. ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో.. 2019లో గెలిచిన నాలుగింటితో పాటు మహబూబ్నగర్, చేవెళ్ల, మల్కాజిగిరి, జహీరాబాద్, నాగర్కర్నూల్ తదితర స్థానాలపై భాజపా ప్రత్యేక దృష్టి సారించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ లోక్సభ నియోజకవర్గాల పరిధిలోని సెగ్మెంట్లలో భాజపాకు మూడో స్థానాలు.. అది కూడా చాలా తక్కువ శాతం ఓట్లు దక్కాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారం సాధించడంతో ఆయా నియోజకవర్గాల్లోని స్థానిక సంస్థల నాయకులు, ఇతర పార్టీల్లోని ముఖ్యులు ‘హస్తం’ గూటికి చేరారు. విపక్ష భారాస.. కోల్పోయిన ఆధిపత్యాన్ని తిరిగి సంపాదించుకోవడానికి గట్టి ప్రయత్నాలే ప్రారంభించింది. ఈ స్థితిలో కాంగ్రెస్, భారాస పార్టీల ఓట్లు చీలతాయా? అవి భాజపాకు లాభిస్తాయా అనేది చర్చనీయాంశమవుతోంది.
కరీంనగర్లో పోటాపోటీ
కరీంనగర్ లోక్సభ నియోజకవర్గంలో భాజపాకు 43.77 శాతం, భారాసకు 35.87 శాతం ఓట్లు రాగా.. కాంగ్రెస్కు కేవలం 15.73 శాతమే వచ్చాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ లోక్సభ స్థానం పరిధిలో కాంగ్రెస్, భారాసలకు ఐదేసి లక్షలకు పైగా ఓట్లు రాగా, భాజపాకు 2.5 లక్షల ఓట్లు మాత్రమే దక్కాయి. కరీంనగర్, హుజూరాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లలో భాజపాకు రెండో స్థానం రాగా, మరో మూడు స్థానాల్లో పది శాతం లోపు, రెండు చోట్ల 15 నుంచి 17 శాతం ఓట్లు వచ్చాయి. హుజూరాబాద్లో కాంగ్రెస్కు అనూహ్యంగా 25.55 శాతం ఓట్లు రావడంతో భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ 30.49 శాతం ఓట్లతో రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో కరీంనగర్ను భాజపా తిరిగి గెలుచుకోవాలంటే రెండు లక్షలకు పైగా ఓట్లను అదనంగా సాధించాల్సి ఉంటుంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ లోక్సభ స్థానం పరిధిలో కాంగ్రెస్, భారాసలకు 37 శాతం చొప్పున ఓట్లు వస్తే భాజపాకు 18 శాతం మాత్రమే దక్కాయి. ఇప్పుడు ఈ లోక్సభ సీటు పరిధిలో మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండగా, మరో ముగ్గురు ఎమ్మెల్యేలూ కాంగ్రెస్ వారే. వీరంతా తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి గట్టి ప్రయత్నం చేయనున్నారు. భారాస నుంచి ఆ పార్టీ ముఖ్యనాయకుడు వినోద్కుమార్ పోటీలో ఉండగా, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల కూడా ఈ లోక్సభ స్థానం పరిధిలోనే ఉంది. ఈ పోటాపోటీ స్థితిలో భాజపా సిటింగ్ ఎంపీ బండి సంజయ్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ప్రచారం చేస్తున్నారు.
నిజామాబాద్ అండ ఎవరికి?
నిజామాబాద్ స్థానంలో గత పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 6.53 శాతం ఓట్లతో మూడో స్థానానికి పరిమితమైంది. భాజపాకు 45.31 శాతం, భారాసకు 38.62 శాతం ఓట్లు వచ్చాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ లోక్సభ సీటు పరిధిలో భాజపా మూడో స్థానానికి వెళ్లినా, ఓట్ల పరంగా కాంగ్రెస్, భారాసలకు దగ్గరగానే ఉంది. భారాసకు 33.4 శాతం, కాంగ్రెస్కు 32.7 శాతం, భాజపాకు 29.27 శాతం ఓట్లు వచ్చాయి. ఏడు సెగ్మెంట్లలో భారాసకు మూడు.. కాంగ్రెస్, భాజపాలకు రెండేసి చొప్పున దక్కాయి. భాజపా గెలిచిన రెండు చోట్ల భారాస మూడో స్థానంలో ఉంది. కాంగ్రెస్ గెలిచిన రెండు స్థానాల్లో భాజపాకు మూడో స్థానం వచ్చింది. 2019 ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయిన కాంగ్రెస్ ఇప్పుడు బలపడడంతో త్రిముఖ పోటీ వాతావరణం నెలకొంది.
మహబూబ్నగర్లో మార్పులు..
మహబూబ్నగర్ లోక్సభ స్థానంలో 2019లో 34.85 శాతం ఓట్లతో భాజపా రెండో స్థానంలో నిలిచింది. అప్పుడు కాంగ్రెస్కు 19.88 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు 46.35 శాతం, భారాసకు 38.74 శాతం ఓట్లు వస్తే.. భాజపా 8.57 శాతం ఓట్ల వద్దే ఆగిపోయింది. ఈ లోక్సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. భాజపాకు అన్ని చోట్లా మూడో స్థానమే మిగిలింది. మూడు నియోజకవర్గాల్లో 10 వేల లోపు, మరో మూడుచోట్ల 20 వేల లోపు మాత్రమే ఓట్లు వచ్చాయి. ఒక్క మక్తల్లో మాత్రమే 45 వేల ఓట్లు రాగా.. ఇక్కడ ఉన్న ముఖ్యనేత ఇటీవలే కాంగ్రెస్లో చేరారు. ఈ నేపథ్యంలో భాజపా ఆశిస్తున్న స్థానాల్లో ఎన్నిచోట్ల విజయం సాధిస్తుందో వేచి చూడాలి.
సికింద్రాబాద్ బరిలో సీనియర్లు
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్రెడ్డి పోటీ చేస్తున్న సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంలో 2019 నాటి పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ 19.12 ఓట్లకు పరిమితమై.. మూడో స్థానానికి పడిపోయింది. భాజపా 42.47 శాతం, భారాస 35.61 శాతం ఓట్లు సాధించాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో భారాసకు 43.76 శాతం వస్తే.. కాంగ్రెస్కు 26.4, భాజపాకు 20.4 శాతం ఓట్లు దక్కాయి. ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లలో భాజపాకు మూడో స్థానం లభించింది. భారాస తరఫున ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ నాయకుడు దానం నాగేందర్ ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థిగా లోక్సభ బరిలో నిలిచారు. హైదరాబాద్ మేయర్, డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ సహా అనేక మంది కాంగ్రెస్లో చేరారు. సికింద్రాబాద్ లోక్సభ పరిధిలోని ఆరు అసెంబ్లీ స్థానాలను గెల్చుకొన్న భారాస.. పార్టీ సీనియర్ నాయకుడు, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావుగౌడ్ను లోక్సభ అభ్యర్థిగా రంగంలోకి దించింది. నాంపల్లి అసెంబ్లీ స్థానంలో భాజపాకు మొన్నటి ఎన్నికల్లో కేవలం 7.4 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. అంబర్పేటలో మినహా ఎక్కడా 30 శాతం ఓట్లు దాటలేదు. ఇక్కడ బరిలో ఉన్న ముగ్గురు సీనియర్ నాయకుల్లో గెలుపెవరిదన్నది ఆసక్తి రేపుతోంది.
ఆదిలా‘బాద్షా’ ఎవరు?
ఆదిలాబాద్ లోక్సభ స్థానాన్ని 2019లో త్రిముఖ పోటీ ఉన్నా భాజపా గెలుచుకుంది. ఈ పార్టీకి 35.92 శాతం, భారాసకు 30.34, కాంగ్రెస్కు 29.91 శాతం ఓట్లు లభించాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో భారాసకు 35.62 శాతం ఓట్లు వస్తే, భాజపాకు 34.32 శాతం, కాంగ్రెస్కు కేవలం 19.26 శాతం ఓట్లు దక్కాయి. ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో నాలుగు భాజపా, రెండు భారాస, ఒకటి కాంగ్రెస్ గెలుచుకున్నాయి. సిర్పూరు, ముథోల్లలో భారాస రెండో స్థానంలో నిలవగా.. ఈ పార్టీ నుంచి ఓడిపోయిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు ఇటీవల కాంగ్రెస్లో చేరారు. ప్రస్తుతం ఆదిలాబాద్లో త్రిముఖ పోటీ ఛాయలు కనిపిస్తున్నా.. పోలింగ్ దగ్గర పడే సమయానికి పరిస్థితి తారుమారయ్యే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట