భారాస బలహీనపడింది.. భాజపాపై పోరాడండి
ఉత్తరాదిలో భాజపా గత పక్షం రోజులుగా బలహీనపడిందని, అందుకే దక్షిణ భారతంపై దృష్టి పెట్టిందని.. ఇక్కడా అవకాశం ఇవ్వవద్దని కాంగ్రెస్ రాష్ట్ర నేతలకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సూచించారు.
తెలంగాణలో కాంగ్రెస్ అత్యధిక స్థానాల్లో గెలవాలి
పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ దిశానిర్దేశం
లోక్సభ స్థానాల ఇన్ఛార్జులు, అభ్యర్థులతో సమీక్ష
కొందరు నేతలు పనితీరు మార్చుకోవాలని హెచ్చరిక
ఈనాడు, హైదరాబాద్: ఉత్తరాదిలో భాజపా గత పక్షం రోజులుగా బలహీనపడిందని, అందుకే దక్షిణ భారతంపై దృష్టి పెట్టిందని.. ఇక్కడా అవకాశం ఇవ్వవద్దని కాంగ్రెస్ రాష్ట్ర నేతలకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సూచించారు. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో అత్యధిక స్థానాలు గెలవడం పార్టీకి అత్యంత కీలకమని, 15 చోట్ల విజయం సాధించాలన్న లక్ష్యంతో పనిచేయాలని ఆయన చెప్పారు. ఎన్నికల వ్యూహంపై లోక్సభ స్థానాల ఇన్ఛార్జులు, అభ్యర్థులతో ఆదివారం రాత్రి హైదరాబాద్లోని శంషాబాద్ నోవాటెల్ హోటల్లో ఆయన సమీక్ష నిర్వహించారు. పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్రెడ్డి, పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జి దీపా దాస్మున్షీ, ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్బాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు, 14 లోక్సభ నియోజకవర్గాల అభ్యర్థులు పాల్గొన్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రచారంపై నేతలకు అధిష్ఠానం తరపున వేణుగోపాల్ దిశానిర్దేశం చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించినందువల్ల ఇప్పుడూ గెలుస్తామనే భ్రమపడవద్దని, కష్టపడి పనిచేయాలని స్పష్టం చేశారు. భారాస పూర్తిగా బలహీనపడిందని.. ఆ పార్టీపై ఎక్కువ దృష్టి పెట్టవద్దని, భాజపాపైనే పోరాడాలని ఉద్బోధించారు. భాజపా, భారాసలకు చెందిన పలువురు నేతలు కాంగ్రెస్లో చేరడానికి ముందుకొస్తే క్షేత్రస్థాయిలో కొందరు నాయకులు ఎందుకు అడ్డుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. భారాస నేతలు, కార్యకర్తలను స్థానిక కారణాలతో పార్టీలోకి రాకుండా అడ్డుకుంటే.. వారు భాజపాలోకి వెళ్తారన్నారు. తద్వారా ఆ పార్టీ బలం పెరుగుతుందని, అలా జరగకూడదని ఆయన స్పష్టం చేశారు. భారాస బలహీనం కావడం వల్ల ఆరేడు నియోజకవర్గాల్లో బలం పుంజుకోవడానికి భాజపా గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోందని కేసీ వేణుగోపాల్ అన్నట్లు సమాచారం. జిల్లాల్లో ఇతర పార్టీల నుంచి వచ్చేవారిని కాంగ్రెస్లో చేర్చుకోవడంపై మంత్రులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో క్షణికావేశంలో పార్టీని వీడినవారిని తిరిగి కాంగ్రెస్లో చేర్చుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ పాలనపై ప్రజల్లో ఎవరికైనా ఏమైనా అనుమానాలుంటే వాటిని మంత్రులు నివృత్తి చేయాలని తెలిపారు.
సీఎం సహా అందరూ ప్రచారానికి వెళ్లాలి..
కొందరు అభ్యర్థులు ప్రచారంలో వెనకబడ్డారని, వారంతా ఇకనుంచి చురుగ్గా ప్రజల్లోకి వెళ్లాలని ఆయన సూచించారు. అంతకుముందు అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జులు, అభ్యర్థుల అభిప్రాయాలను వేణుగోపాల్ అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో ప్రచారం ఎలా సాగుతోందో ఆరా తీశారు. మంత్రులందరూ తమ అభిప్రాయాలు చెప్పారు. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రులు, నియోజకవర్గాల ఇన్ఛార్జులు, అభ్యర్థులు సోమవారం నుంచి నియోజకవర్గాల్లోనే ఉండాలని, హైదరాబాద్లో కనిపించవద్దని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యనేతలు అన్ని నియోజకవర్గాలకు వెళ్లి ప్రచారం చేయాలని చెప్పారు. పార్టీ జాతీయ స్థాయిలో ప్రకటించిన గ్యారంటీ హామీలు, మ్యానిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కొందరు నేతల తీరు బాగా లేదని, మారాలని సున్నితంగా హెచ్చరించినట్లు తెలిసింది.
నేతలంతా కష్టపడితే 15 సీట్లు గెలుస్తాం: రేవంత్రెడ్డి
సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర నేతలంతా కష్టపడి పనిచేస్తే 15 సీట్లు గెలుస్తామని స్పష్టం చేశారు. గత నాలుగు నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన గ్యారంటీ హామీలు, ఇతర పథకాల వివరాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన చెప్పారు. ఉద్ధృతంగా ప్రచారం చేయాలని, మండల స్థాయిలో, పోలింగ్ బూత్ స్థాయికెళ్లి ప్రచారం చేయాలని పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి మాట్లాడుతూ.. పార్టీ విజయం కోసం అందరూ కష్టపడి పనిచేయాలన్నారు. సోమవారం నుంచి పెద్దఎత్తున ప్రచారం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు విమానాశ్రయం నుంచి హోటల్కు వచ్చిన వేణుగోపాల్కు రేవంత్రెడ్డి, భట్టి, దీపా దాస్మున్షీ స్వాగతం పలికారు. అభ్యర్థులను ప్రకటించాల్సి ఉన్న 3 నియోజకవర్గాలపై సీఎం, నేతలతో వేణుగోపాల్ చర్చించినట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హామీలను అమలు చేసే శక్తి సీఎం రేవంత్రెడ్డికి లేదు: కిషన్రెడ్డి
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసే శక్తి సీఎం రేవంత్రెడ్డికి లేదని కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి అన్నారు. -
అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం: జీవన్రెడ్డి
ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి విమర్శించారు. హైదరాబాద్లోని గాంధీభవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. -
రైతుబంధు పథకంపై కేబినెట్ సమావేశంలో చర్చించాలి: వినోద్కుమార్
ఈ కేబినెట్ సమావేశంలోనైనా మంచి నిర్ణయాలు తీసుకోవాలని భారాస నేత వినోద్కుమార్ కోరారు. -
సినిమాల కంటే ఎన్నికల ప్రచారమే చాలా కష్టం: కంగనా రనౌత్ ఆసక్తికర పోస్ట్
Kangana Ranaut: సినిమాల కంటే ఎన్నికల ప్రచారమే చాలా కష్టంతో కూడుకున్న పని అని అంటున్నారు బాలీవుడ్ ‘క్వీన్’ కంగనా రనౌత్. దీనిపై ఆమె చేసిన పోస్ట్ వైరల్గా మారింది. -
మళ్లీ గెలుస్తున్నామంటూ జగన్ ప్రగల్భాలు పలకడం విడ్డూరం
వైకాపా నేతలకు ఓటమి భయం పట్టుకుందని.. అందుకే జగన్ ఐ-ప్యాక్ కార్యాలయానికి వెళ్లి, చిన్నపాటి ఓదార్పు యాత్ర చేశారని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. -
అభ్యర్థులకు చెప్పకుండా బ్యాలట్ బాక్సుల తరలింపు!
ఓటమి భయం పట్టుకున్న వైకాపా నేతలు గెలుపు కోసం ఎన్ని అడ్డదారులు తొక్కాలో అన్నీ చేస్తున్నారని, తొత్తులుగా ఉన్న కొందరు అధికారులు వారికి సహకరిస్తున్నారని విపక్ష పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. -
విదేశాలకు తరలిపోతున్నారా..?
ఓటమి భయంతో సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇతర వైకాపా నేతలు వారి కంపెనీలతో సహా ఇతర దేశాలు, పక్క రాష్ట్రాలకు పారిపోవడానికి సిద్ధమయ్యారని తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. -
అరెస్టు భయంతో పిన్నెల్లి సోదరుల పరారీ?
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో దాడులు, అల్లర్లకు కారకులైన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకట్రెండు రోజుల్లో వారిద్దరినీ అరెస్టు చేస్తారనే మాట వినిపిస్తున్న తరుణంలో మాచర్ల నుంచి హైదరాబాద్కు వెళ్లినట్లు సమాచారం. -
తెదేపా కార్యకర్తలపై పోలీసుల లాఠిన్యం
పల్నాడు జిల్లా మాచవరంలో ఎంపీపీ కుమారుడిపై జరిగిన దాడి కేసులో తెదేపాకు చెందిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకొని తీవ్రంగా హింసించారు. -
ఇసుక దోపిడీలో తాడేపల్లి ప్యాలెస్కు రూ.40 వేల కోట్లు
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గనుల శాఖ డీఎంజీ వెంకటరెడ్డి కనుసన్నల్లోనే రాష్ట్రంలో పెద్దఎత్తున ఇసుక దోపిడీకి గురైందని మాజీ మంత్రి నక్కా ఆనంద్బాబు ధ్వజమెత్తారు. -
కన్హయ్య కుమార్పై దాడికి యత్నం
కాంగ్రెస్ పార్టీ నుంచి ఈశాన్య దిల్లీ లోక్సభ స్థానానికి పోటీచేస్తున్న కన్హయ్య కుమార్పై కొందరు దుండగులు సిరా చల్లి, దాడికి యత్నించారు. -
మోదీ పదే పదే మమ్మల్ని లక్ష్యంగా చేసుకుంటున్నారు
ప్రధాని మోదీ పదే పదే తనను, ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్ పవార్ను లక్ష్యంగా చేసుకుని మాట్లాడుతున్నారని శివసేన(యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఆరోపించారు. -
మాలీవాల్పై దాడి కేసు భాజపా కుట్రే: ఆప్
తమ పార్టీ ఎంపీ స్వాతి మాలీవాల్పై దాడి కేసు దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను ఇరికించేందుకు భాజపా పన్నిన కుట్ర అని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) శుక్రవారం ఆరోపించింది. -
రాయ్బరేలీ మీ కుటుంబ స్థానమా?
ఉత్తర్ప్రదేశ్లోని రాయ్బరేలీని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకాగాంధీ తమ కుటుంబ నియోజకవర్గంగా చెప్పడాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్షా తప్పుబట్టారు. శుక్రవారం యూపీలోని దౌలత్పుర్లో సభలో ఆయన ప్రసంగించారు. -
నా తనయుడు మిమ్మల్ని నిరాశపరచడు
రెండు దశాబ్దాల పాటు రాయ్బరేలీ లోక్సభ స్థానానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం కల్పించిన ప్రజలు ఇప్పుడు తన తనయుడు రాహుల్గాంధీని సొంత మనిషిగా స్వీకరించాలని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కోరారు. -
మళ్లీ భాజపా గెలిస్తే.. శరద్ పవార్, ఉద్ధవ్ జైలుకే
మహారాష్ట్రలోని భివండీలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో దిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. -
కాంగ్రెస్, ఎస్పీ అధికారంలోకి వస్తే.. రామమందిరాన్ని కూల్చేస్తాయ్
కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ)లపై ప్రధాని మోదీ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. అవి అధికారంలోకి వస్తే..రామమందిరాన్ని కూల్చివేస్తాయని అన్నారు. దేశంలో అస్థిరతను సృష్టించేందుకే విపక్ష ఇండియా కూటమి ఎన్నికల బరిలో నిలిచిందంటూ విమర్శించారు. -
ఔరంగజేబు స్ఫూర్తి కాంగ్రెస్ నేతల్లో ప్రవేశించింది
మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు స్ఫూర్తి మన కాంగ్రెస్ నేతల్లో ప్రవేశించింది. అందుకే అప్పట్లో హిందువులపై జిజియా పన్ను విధించిన తరహాలో ఇప్పుడు వీరు అధికారంలోకి వస్తే వారసత్వ పన్ను వేద్దామని అనుకుంటున్నారు. -
జేఎంఎం నుంచి సీతా సోరెన్ బహిష్కరణ
ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ వదిన సీతా సోరెన్ను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి ఆరేళ్లపాటు బహిష్కరిస్తున్నట్లు ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) శుక్రవారం ప్రకటించింది. -
నాలుగో దశలో 4 రాష్ట్రాల్లో మహిళల పోలింగే ఎక్కువ
సార్వత్రిక ఎన్నికల నాలుగోదశలో నాలుగు రాష్ట్రాల్లో పురుషుల కంటే స్త్రీ ఓటర్లే కొంత అధికంగా పోలింగ్కు తరలివచ్చారని ఎన్నికల సంఘం తెలిపింది. -
ఉత్తరాన తీవ్ర ఉత్కంఠ!
లఖ్నవూ, రాయ్బరేలీ నుంచి నీరేంద్ర దేవ్ఉత్తర్ ప్రదేశ్లోని 14 నియోజకవర్గాల్లో ఐదో విడతలో భాగంగా ఈ నెల 20వ తేదీన పోలింగ్ జరగనుంది.
తాజా వార్తలు (Latest News)
-
తనలాంటి వ్యక్తిని వైద్య పరీక్షలకు పంపి.. బెయిల్ కోసం ‘లావా’ బాస్ నిర్వాకం
-
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
-
టీమ్ఇండియా.. ‘అమెరికా’ విమానం ఎక్కేదప్పుడే!
-
హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో మార్పు లేదు
-
కడప గౌస్నగర్ ఘటనపై ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఆగ్రహం
-
పల్నాడు కలెక్టర్, మూడు జిల్లాలకు ఎస్పీలను నియమించిన ఈసీ