భారాస బలహీనపడింది.. భాజపాపై పోరాడండి
ఉత్తరాదిలో భాజపా గత పక్షం రోజులుగా బలహీనపడిందని, అందుకే దక్షిణ భారతంపై దృష్టి పెట్టిందని.. ఇక్కడా అవకాశం ఇవ్వవద్దని కాంగ్రెస్ రాష్ట్ర నేతలకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సూచించారు.
తెలంగాణలో కాంగ్రెస్ అత్యధిక స్థానాల్లో గెలవాలి
పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ దిశానిర్దేశం
లోక్సభ స్థానాల ఇన్ఛార్జులు, అభ్యర్థులతో సమీక్ష
కొందరు నేతలు పనితీరు మార్చుకోవాలని హెచ్చరిక
ఈనాడు, హైదరాబాద్: ఉత్తరాదిలో భాజపా గత పక్షం రోజులుగా బలహీనపడిందని, అందుకే దక్షిణ భారతంపై దృష్టి పెట్టిందని.. ఇక్కడా అవకాశం ఇవ్వవద్దని కాంగ్రెస్ రాష్ట్ర నేతలకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సూచించారు. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో అత్యధిక స్థానాలు గెలవడం పార్టీకి అత్యంత కీలకమని, 15 చోట్ల విజయం సాధించాలన్న లక్ష్యంతో పనిచేయాలని ఆయన చెప్పారు. ఎన్నికల వ్యూహంపై లోక్సభ స్థానాల ఇన్ఛార్జులు, అభ్యర్థులతో ఆదివారం రాత్రి హైదరాబాద్లోని శంషాబాద్ నోవాటెల్ హోటల్లో ఆయన సమీక్ష నిర్వహించారు. పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్రెడ్డి, పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జి దీపా దాస్మున్షీ, ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్బాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు, 14 లోక్సభ నియోజకవర్గాల అభ్యర్థులు పాల్గొన్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రచారంపై నేతలకు అధిష్ఠానం తరపున వేణుగోపాల్ దిశానిర్దేశం చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించినందువల్ల ఇప్పుడూ గెలుస్తామనే భ్రమపడవద్దని, కష్టపడి పనిచేయాలని స్పష్టం చేశారు. భారాస పూర్తిగా బలహీనపడిందని.. ఆ పార్టీపై ఎక్కువ దృష్టి పెట్టవద్దని, భాజపాపైనే పోరాడాలని ఉద్బోధించారు. భాజపా, భారాసలకు చెందిన పలువురు నేతలు కాంగ్రెస్లో చేరడానికి ముందుకొస్తే క్షేత్రస్థాయిలో కొందరు నాయకులు ఎందుకు అడ్డుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. భారాస నేతలు, కార్యకర్తలను స్థానిక కారణాలతో పార్టీలోకి రాకుండా అడ్డుకుంటే.. వారు భాజపాలోకి వెళ్తారన్నారు. తద్వారా ఆ పార్టీ బలం పెరుగుతుందని, అలా జరగకూడదని ఆయన స్పష్టం చేశారు. భారాస బలహీనం కావడం వల్ల ఆరేడు నియోజకవర్గాల్లో బలం పుంజుకోవడానికి భాజపా గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోందని కేసీ వేణుగోపాల్ అన్నట్లు సమాచారం. జిల్లాల్లో ఇతర పార్టీల నుంచి వచ్చేవారిని కాంగ్రెస్లో చేర్చుకోవడంపై మంత్రులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో క్షణికావేశంలో పార్టీని వీడినవారిని తిరిగి కాంగ్రెస్లో చేర్చుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ పాలనపై ప్రజల్లో ఎవరికైనా ఏమైనా అనుమానాలుంటే వాటిని మంత్రులు నివృత్తి చేయాలని తెలిపారు.
సీఎం సహా అందరూ ప్రచారానికి వెళ్లాలి..
కొందరు అభ్యర్థులు ప్రచారంలో వెనకబడ్డారని, వారంతా ఇకనుంచి చురుగ్గా ప్రజల్లోకి వెళ్లాలని ఆయన సూచించారు. అంతకుముందు అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జులు, అభ్యర్థుల అభిప్రాయాలను వేణుగోపాల్ అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో ప్రచారం ఎలా సాగుతోందో ఆరా తీశారు. మంత్రులందరూ తమ అభిప్రాయాలు చెప్పారు. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రులు, నియోజకవర్గాల ఇన్ఛార్జులు, అభ్యర్థులు సోమవారం నుంచి నియోజకవర్గాల్లోనే ఉండాలని, హైదరాబాద్లో కనిపించవద్దని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యనేతలు అన్ని నియోజకవర్గాలకు వెళ్లి ప్రచారం చేయాలని చెప్పారు. పార్టీ జాతీయ స్థాయిలో ప్రకటించిన గ్యారంటీ హామీలు, మ్యానిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కొందరు నేతల తీరు బాగా లేదని, మారాలని సున్నితంగా హెచ్చరించినట్లు తెలిసింది.
నేతలంతా కష్టపడితే 15 సీట్లు గెలుస్తాం: రేవంత్రెడ్డి
సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర నేతలంతా కష్టపడి పనిచేస్తే 15 సీట్లు గెలుస్తామని స్పష్టం చేశారు. గత నాలుగు నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన గ్యారంటీ హామీలు, ఇతర పథకాల వివరాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన చెప్పారు. ఉద్ధృతంగా ప్రచారం చేయాలని, మండల స్థాయిలో, పోలింగ్ బూత్ స్థాయికెళ్లి ప్రచారం చేయాలని పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి మాట్లాడుతూ.. పార్టీ విజయం కోసం అందరూ కష్టపడి పనిచేయాలన్నారు. సోమవారం నుంచి పెద్దఎత్తున ప్రచారం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు విమానాశ్రయం నుంచి హోటల్కు వచ్చిన వేణుగోపాల్కు రేవంత్రెడ్డి, భట్టి, దీపా దాస్మున్షీ స్వాగతం పలికారు. అభ్యర్థులను ప్రకటించాల్సి ఉన్న 3 నియోజకవర్గాలపై సీఎం, నేతలతో వేణుగోపాల్ చర్చించినట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.. మంత్రులకు చంద్రబాబు సూచన
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించడం... వంటి మంచి పనుల్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. -
సకుటుంబ సమేతంగా కేసులు.. అక్రమ కేసులున్నవారు నిలబడాలని కోరిన చంద్రబాబు
వివాహాలు, ఇతర శుభకార్యాలకు సకుటుంబ సపరివార సమేతంగా రావాలని ఆహ్వానిస్తుంటాం.. అయితే గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలపై సకుటుంబ సమేతంగా అక్రమ కేసులు నమోదు చేసి వేధించారని చంద్రబాబు, ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. శ్వేతపత్రం విడుదల సందర్భంగా.. వైకాపా ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలపై నమోదైన అక్రమ కేసుల సంఖ్యను చంద్రబాబు ప్రస్తావించారు. -
ఏపీ ‘ఎస్కోబార్’ జగన్.. చీకటి సామ్రాజ్యాధిపతితో పోల్చిన చంద్రబాబు
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అరాచకాలను వివరించేటప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కొలంబియన్ మాదకద్రవ్యాల చీకటి సామ్రాజ్యాధిపతి పాబ్లో ఎమిలియో ఎస్కోబార్ చరిత్రను సభకు వినిపించారు. -
‘రఘురామను చిత్రహింసలు పెట్టినప్పుడు మీరంతా ఏమయ్యారు?’
మాజీ ముఖ్యమంత్రి జగన్ దిల్లీలో చేసిన నిరసనకు ఇండియా కూటమి నాయకులు మద్దతు పలకడాన్ని అనంతపురం తెదేపా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. -
అన్ని వర్గాలకూ మోసం
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలనూ మోసం చేసిందని, అందర్నీ వెన్నుపోటు పొడిచిందని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. -
శాంతిభద్రతల పరిరక్షణపై సభలో చర్చిద్దాం
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు.. రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలపై శాసనసభలో ఒక రోజు పూర్తిగా చర్చించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు. -
ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని దోచేశారు
‘వైకాపా ప్రభుత్వం చేసిన నిర్వాకాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు విద్యుత్తు, అమరావతి, పోలవరం, గనులు, మద్యంపై శ్వేతపత్రాలు విడుదల చేశారు. -
వైకాపా ప్రభుత్వం ఇళ్లు కూల్చింది.. ఆదుకోండి
తెదేపాకు అనుకూలంగా ఉన్నారని విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం దన్నానపేట గ్రామానికి చెందిన 30 మంది దళితుల ఇళ్లను అప్పటి వైకాపా ప్రభుత్వం కూల్చేసిందని ఆ మండల తెదేపా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు టొంపల నర్సయ్య గురువారం తెదేపా కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. -
వైకాపా పాలనలో తెదేపా శ్రేణులపై 2,560 కేసులు
వైకాపా హయాంలో గత ఐదేళ్లలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై 2,560 కేసులు నమోదు చేసి.. 2,370 మందిని అరెస్టు చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. -
ఇసుక, మద్యం అవినీతిపై విచారణ జరిపించాలి
ముఖ్యమంత్రి చంద్రబాబును రాష్ట్ర సచివాలయంలో గురువారం సీపీఎం నాయకులు కలిశారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. -
సమస్యలపై ప్రశ్నిస్తే.. వేధింపులే సమాధానం
శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం విడుదల చేసిన ‘శాంతిభద్రతల శ్వేతపత్రం’పై కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వేదికగా మాట్లాడారు. -
‘ఇండియా’ కూటమితో పొత్తు కోసమే జగన్ దిల్లీ యాత్ర
‘ఇండియా’ కూటమితో పొత్తు కోసమే వైకాపా అధ్యక్షుడు జగన్ దిల్లీ వెళ్లినట్లుగా ఉందని ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. దిల్లీ నుంచి అమరావతి చేరుకున్న జగన్... శాసనసభ సమావేశాలకు హాజరు కావాలని సూచించారు. -
ఇది పసలేని దండగమారి బడ్జెట్: కేటీఆర్
రాష్ట్ర ప్రభుత్వం పసలేని, దండగమారి బడ్జెట్ ప్రవేశపెట్టిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ప్రజల ఆకాంక్షలు పట్టించుకోకుండా ఆంక్షల పద్దు పెట్టారని అన్నారు. -
సంక్షిప్త వార్తలు (4)
బడ్జెట్లో అధిక కేటాయింపుల ద్వారా.. తమది రైతు ప్రభుత్వమని మరోసారి నిరూపించుకున్నట్లయిందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అన్నారు. -
ఫైళ్ల దహనంతో మాకు సంబంధం లేదు: వైకాపా ఎంపీ మిథున్రెడ్డి
మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో జరిగిన రెవెన్యూ దస్త్రాల దహనం ఘటనతో తమకెలాంటి సంబంధం లేదని వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి పేర్కొన్నారు. -
గాజులదిన్నె ప్రాజెక్టు పనులపై విచారణ చేపడతాం: మంత్రి నిమ్మల
సంజీవయ్య గాజులదిన్నె ప్రాజెక్టు పనులపై విచారణ చేపడతామని జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. -
రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతీయడానికే జగన్ దిల్లీ నిరసన: హోంమంత్రి అనిత
రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతీయడానికే మాజీ సీఎం జగన్ దిల్లీలో నిరసన పేరుతో చౌకబారు ఆరోపణలు చేశారని హోంమంత్రి అనిత మండిపడ్డారు. 36 రాజకీయ హత్యలు జరిగాయని నిస్సిగ్గుగా మాట్లాడారని ధ్వజమెత్తారు. -
వరద బాధిత రైతులను తక్షణమే ఆదుకోవాలి
కోస్తా జిల్లాల్లోని వరద బాధిత రైతులకు తక్షణమే నష్టపరిహారం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల గురువారం లేఖ రాశారు. -
రైతుల జీవితాలతో చెలగాటం వద్దు!
‘ఎన్నికలు అయిపోయాయి.. రాజకీయాలు వదిలేయండి.. రాజకీయాల కోసం రైతుల జీవితాలతో చెలగాటమాడొద్దు’ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. -
సంతోషదాయక బడ్జెట్: కూనంనేని
నిధుల పరంగా రాష్ట్రం సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సంతోషదాయకంగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. -
హామీల అమలుపై చిత్తశుద్ధి ఏదీ?
ప్రగతి పట్టని, సరైన దిశానిర్దేశం లేని, హామీల అమలుపై చిత్తశుద్ధి లేని బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిందని భాజపా శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి విమర్శించారు.