చంద్రబాబుపై ఐదేళ్లలో అనేక రాళ్ల దాడులు
విశాఖ జిల్లా గాజువాకలో ఆదివారం రాత్రి తెదేపా అధినేత చంద్రబాబు పాల్గొన్న ఎన్నికల ప్రచార సభలో ఆగంతుకులు రాళ్లు విసిరారు.
భద్రతా సిబ్బంది అప్రమత్తతతో తప్పిన ముప్పు
సీఎస్వో, ఎన్ఎస్జీ కమాండెంట్లకు తీవ్రగాయాలు
అంగళ్లులో వైకాపా బీభత్సం..
ఉల్టా చంద్రబాబుపైనే హత్యాయత్నం కేసు
ఒక్కసారీ స్పందించని సీఎం జగన్
ఈనాడు, అమరావతి: విశాఖ జిల్లా గాజువాకలో ఆదివారం రాత్రి తెదేపా అధినేత చంద్రబాబు పాల్గొన్న ఎన్నికల ప్రచార సభలో ఆగంతుకులు రాళ్లు విసిరారు. ఈ ఐదేళ్లలో చంద్రబాబు లక్ష్యంగా రాళ్లదాడి జరగడం ఇదే తొలిసారి కాదు. ప్రతిపక్ష నేతగా ప్రజాసమస్యలపై పోరాడే క్రమంలో ఆయన జనంలోకి వెళ్లిన పలు సందర్భాల్లో వైకాపా ప్రేరేపిత దుండగులు రాళ్లు, కర్రలతో విరుచుకుపడిన ఉదంతాలెన్నో. జడ్ ప్లస్ కేటగిరీ భద్రత గల ప్రతిపక్ష నేతపై ఈ తరహా దుశ్చర్యలు రాష్ట్ర పోలీసుల వైఫల్యానికి నిదర్శనం. అన్నిసార్లూ ఘటనల వెనుక వైకాపా నాయకులే ఉన్నారని స్పష్టమవుతున్నా సీఎం జగన్ ఒక్కసారీ ఖండించలేదు. బాధ్యులపై కఠిన చర్యలూ తీసుకోలేదు. పైగా చంద్రబాబు కావాలనే దాడులు చేయించుకుంటున్నట్లుగా మంత్రులు, వైకాపా నాయకులు ఎద్దేవా చేస్తూ మాట్లాడారు. ముఖ్యంగా అన్నమయ్య జిల్లా అంగళ్లులో తనను చంపేందుకు వైకాపా మూకలు ప్రయత్నించాయని, ఎన్ఎస్జీ కమాండోల రక్షణలో బయటపడ్డానని 2023 ఆగస్టు 13న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీలకు చంద్రబాబు ఫిర్యాదు చేశారు. 9 పేజీల లేఖతో పాటు తనపై దాడులకు ఆధారంగా 75 పేజీల డాక్యుమెంట్లు పంపించారు.
అమరావతిలో... ప్రతిపక్ష నేతపై దాడి భావ ప్రకటన స్వేచ్ఛట!
వైకాపా అధికారంలోకి వచ్చాక అమరావతి విధ్వంసానికి తెరలేపగా, అక్కడి పరిస్థితుల్ని పరిశీలించి, రైతులకు భరోసానిచ్చేందుకు 2019 నవంబరు 29న చంద్రబాబు రాజధానిలో పర్యటించారు. ఆయన రాకను నిరసిస్తూ వైకాపా ప్రోద్బలంతో కొందరు ఆందోళన చేపట్టారు. సీడ్ యాక్సిస్ రోడ్లో నల్ల బ్యానర్లు కట్టారు. చంద్రబాబుతో పాటు సీనియర్ నేతలు ప్రయాణిస్తున్న బస్సుపైకి రాళ్లు, చెప్పులు విసిరారు. బస్సు ముందుభాగం, నాయకులు కూర్చున్న వైపు అద్దాలు పగిలాయి. ఈ అరాచకానికి బాధ్యులపై చర్యలు తీసుకోకపోగా, నాటి డీజీపీ గౌతమ్ సవాంగ్ అది వారికి రాజ్యాంగం కల్పించిన భావప్రకటన స్వేచ్ఛని వ్యాఖ్యానించారు.
తిరుపతిలో... ఉపఎన్నిక సందర్భంలోనూ..
తిరుపతి లోక్సభ ఉపఎన్నిక ప్రచారం సందర్భంగా 2021 ఏప్రిల్ 12న చంద్రబాబు తిరుపతిలో ప్రసంగిస్తుండగా, దుండగులు ఆయనే లక్ష్యంగా రాళ్లు విసిరారు. పలువురు కార్యకర్తలు గాయపడ్డారు. జడ్ ప్లస్ కేటగిరీ రక్షణ వలయంలో ఉన్న తనకే భద్రత లేకపోతే సామాన్యుల పరిస్థితేంటని ఆనాడు బాబు మండిపడ్డారు. పోలీసులు దుండగులను పట్టుకోకపోవడాన్ని నిరసిస్తూ అక్కడే నేలపై బైఠాయించారు. చివరకు కాలినడకన ఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు.
అంగళ్లులో... బాధితులపైనే హత్యాయత్నం కేసు
సాగునీటి ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా చంద్రబాబు 2023 ఆగస్టు 4న అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం అంగళ్లులో పర్యటించారు. ఆరోజు ఉదయం నుంచే వైకాపా శ్రేణులు కవ్వింపు చర్యలకు దిగాయి. తెదేపా జెండాలు, ఫ్లెక్సీలు చించేసి దాడులకు దిగిన దుండగులు.. చంద్రబాబు వచ్చాక ఏకంగా రాళ్ల దాడికి తెగబడ్డారు. పలువురు తెదేపా కార్యకర్తలు గాయపడ్డారు. చంద్రబాబు అంగళ్లు నుంచి వెళ్లిపోయాక, వైకాపా శ్రేణులు మళ్లీ రెచ్చిపోయి తెదేపా నేతల కార్లను ధ్వంసం చేశాయి. ఈ ఘటనలో చంద్రబాబును ఏ1గా పేర్కొంటూ, ఆయనపైనే హత్యాయత్నం కేసు పెట్టారు.
భీమవరంలో... యువగళం పాదయాత్రపైనా..
నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రపై పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం తాడేరులో 2023 సెప్టెంబరు 5న వైకాపా శ్రేణులు కర్రలు, రాళ్లతో విరుచుకుపడ్డాయి. అడ్డుకోబోయిన తెదేపా కార్యకర్తలను చితకబాదాయి. పోలీసులు యువగళం వాలంటీర్లను నియంత్రించారే తప్ప వైకాపా శ్రేణులను అడ్డుకోలేదు. ఈ దాడిలో ఉండి మాజీ ఎమ్మెల్యే శివరామరాజుతో పాటు పలువురు నాయకులు గాయపడ్డారు. ఓ కానిస్టేబుల్ తలకూ బలమైన గాయమైంది.
యర్రగొండపాలెంలో.. మంత్రి చొక్కా విప్పి మరీ బెదిరించినా..
ప్రకాశం జిల్లాలో 2023 ఏప్రిల్ 22న చంద్రబాబు పర్యటించిన సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్ సమక్షంలోనే రాళ్లదాడి జరిగింది. బాబు యర్రగొండపాలేనికి రాకుండా అడ్డుకోవాలని మంత్రి ముందుగానే వైకాపా కార్యకర్తలను రెచ్చగొట్టారు. ఆయన తన క్యాంప్ కార్యాలయం వద్దకు నల్లదుస్తులతో వచ్చి, చొక్కా విప్పి మరీ సవాల్ చేశారు. బాబు వాహనం వచ్చే సమయానికి దాదాపు 200 మంది రోడ్డు వెంట నిల్చొని గోబ్యాక్ అంటూ ప్లకార్డులు, నల్ల జెండాలు, నల్ల బెలూన్లు ప్రదర్శించారు. చంద్రబాబు వాహనంపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. భద్రతా సిబ్బంది బుల్లెట్ ప్రూఫ్ షీట్లను అడ్డుపెట్టి, ఆయనకు రక్షణగా నిలవడంతో ముప్పు తప్పింది. ఎన్ఎస్జీ కమాండెంట్ సంతోష్కుమార్ తలకు రాయి తగిలి బలమైన గాయమైంది. మంత్రి సురేష్ దుశ్చర్యను సీఎం జగన్ ఖండించలేదు. దోషులపై చర్యలూ లేవు. పైగా తెదేపా నేతలపైనే ఎదురు కేసులు పెట్టారు.
నందిగామలో... భద్రతాధికారి అడ్డుకోవడంతో తప్పిన ముప్పు
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో 2022 నవంబరు 4న ‘బాదుడే బాదుడు’ కార్యక్రమంలో భాగంగా రోడ్డుషోలో పాల్గొన్న చంద్రబాబుపై ఓ దుండగుడు భవనంపై నుంచి పూలతో పాటు పదునైన రాయి విసిరాడు. పూలను బలంగా విసురుతున్నట్లు గమనించిన ముఖ్య భద్రతాధికారి మధుసూదనరావు అప్రమత్తమై చంద్రబాబుకు అడ్డుగా నిలిచారు. మధు గవదపై దెబ్బతగిలి తీవ్ర రక్తస్రావమైంది. ఇది జరిగి ఏడాదవుతున్నా నిందితులెవరో గుర్తించలేదు. హత్యాయత్నం కేసు పెట్టాలని తెదేపా నేతలు డిమాండ్ చేయగా, పోలీసులు ఐపీసీ సెక్షన్ 324 కింద సాధారణ కేసు పెట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
జగన్.. మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి? అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. -
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
తెలంగాణ బడ్జెట్లో హైదరాబాద్ నగర మౌలిక సదుపాయాలకు రూ.10 వేల కోట్లు కేటాయించినందుకు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. -
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ