ఆ డ్రోన్లు ఎందుకు దిగిపోయాయి?
ముఖ్యమంత్రి జగన్పై దాడి ఘటనలో కొందరు పోలీసుల పాత్ర ఉందని తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి సందేహం వెలిబుచ్చారు.
పోలీసుల పాత్రపై సందేహం
ఒక రాయి ఇద్దరి కళ్లు, ఒకరి కాలిని గాయపరిచిందా?
సునీత, షర్మిల, భాస్కరరెడ్డి జాగ్రత్తగా ఉండాలి
తెదేపా నేత ఆనం వెంకటరమణారెడ్డి
ఈనాడు, అమరావతి: ముఖ్యమంత్రి జగన్పై దాడి ఘటనలో కొందరు పోలీసుల పాత్ర ఉందని తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి సందేహం వెలిబుచ్చారు. అప్పటివరకూ ఎగిరిన డ్రోన్లు దాడి సమయంలో ఏమైపోయాయని, విజువల్స్ ఎందుకు లేవని ప్రశ్నించారు. రెండంతస్తుల భవనం నుంచి రాయి విసిరితే అది జగన్కు తగిలి, తర్వాత వెలంపల్లి శ్రీనివాస్ వైపు వచ్చి ఆయన కంటి దగ్గర గాయం చేసిందా? అని ప్రశ్నించారు. మంగళగిరిలోని తెదేపా కార్యాలయంలో ఆదివారం విలేకరులతో వెంకటరమణారెడ్డి మాట్లాడారు. ‘ఎన్నికలు వచ్చాయంటే వైఎస్ కుటుంబంలో ఏదో ఒకటి జరుగుతుంది. జగన్ కుటుంబానికి ముప్పు ఉందని, భద్రత పెంచాలని వివిధ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు నివేదికలు ఇచ్చినట్లు ప్రభుత్వమే చెప్పింది. మరి డీజీపీ ఏం చేస్తున్నారు? అంటే ఈ స్కెచ్లో ఆయనకూ భాగం ఉందా? డీజీపీ దిగజారిపోయారు కాబట్టే ఆయనపైనా మాట్లాడాల్సి వస్తోంది. కోడి కత్తి కేసులో శ్రీను బలయ్యాడు. ఈ కేసులో ఎవరిని ఇరికిస్తారో? రేపోమాపో తెదేపా కార్యకర్త ఒకరిని తెచ్చి హత్యాయత్నం కేసు పెట్టాలని పోలీసులు చూస్తున్నార’ని ఆనం ఆరోపించారు.
క్రియేటివ్ డైరెక్టర్ భార్గవ్రెడ్డి
‘ఐప్యాక్ స్క్రీన్ ప్లే, డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమాకు నిర్మాత విజయసాయిరెడ్డి. జగన్కు సంబంధించిన మద్యం డబ్బంతా ఆయన దగ్గరే ఉంది. హీరో జగన్, హీరోయిన్ భారతి. క్రియేటివ్ డైరెక్టర్ సజ్జల భార్గవ్రెడ్డి. విలన్ అవుతు శ్రీధర్రెడ్డి. సైడ్ యాక్టర్లు వెలంపల్లి శ్రీనివాస్, కేశినేని నాని, రహమతుల్లా, అవినాశ్. వీరంతా పక్కా ప్రణాళిక రూపొందించి అమలు చేశారు. అన్నీ స్కెచ్ ప్రకారమే చేసినా, ఒక తప్పు చేశారు. శ్రీధర్రెడ్డి వల్ల దొరికిపోయారు. నాలుగు రోజుల్లో రాష్ట్రంలో సంచలన ఘటనలు జరిగే అవకాశముందని, అవి ఎన్నికల మూడ్నే మార్చేసే సంఘటనలని ఆయన ట్విటర్లో పోస్ట్ చేశారు. ఆ ప్రకారమే నాలుగో రోజు రాయి దాడి జరిగింది’ అని ఆనం వివరించారు. ‘వీరి పథకం ప్రకారమే రాత్రి 7 గంటలకు కరెంటు ఆగిపోయింది. ఎగిరే డ్రోన్లు కిందికి దిగిపోయాయి. సీఎంపై రాయిదాడికి సంబంధించి డ్రోన్ విజువల్స్ లేకుండా పోయాయి. సీఎం చుట్టూ ఉన్న 3 వేల మంది పోలీసులు ఏం చేస్తున్నారు?’ అని ప్రశ్నించారు. ‘అంతా రాయి అనుకుంటున్నారు. రాయా? పిల్లెట్టా? ఎయిర్గన్ బుల్లెట్టా? ఏమైనా అయి ఉండొచ్చు అని సాక్షిలో రాశారు. బస్సుయాత్రలో ఉన్న జగన్ను పొద్దున్నే భారతి చేతులూపుతూ పలకరించారు. రాత్రికి దెబ్బ తగిలింది. ఎంత మంచి నటనో? విజయవాడలో వైకాపా గూండాలు తెదేపా నాయకుడు చెన్నుపాటి గాంధీ కంట్లో రాడ్ దించి కన్ను లేకుండా చేసినా వారిపై హత్యాయత్నం కేసు పెట్టలేదు. జగన్పై రాయి వేస్తే హత్యాయత్నం అంటున్నారు’ అని విమర్శించారు.
జగన్ సానుభూతి డ్రామాలో.. వారికి ప్రాణహాని
‘2018 అక్టోబరులో కోడికత్తి దాడి విఫలమైంది కాబట్టి వివేకానందరెడ్డిని హత్య చేయాల్సిన అవసరం వచ్చింది. 2019 ఎన్నికల్లో గెలవడానికి, జగన్ సీఎం కావడానికి వివేకానందరెడ్డి బలయ్యారని ఆయన కుమార్తె సునీతారెడ్డి, జగన్ సొంత చెల్లెలు షర్మిల చెప్పారు’ అని ఆనం గుర్తుచేశారు. ‘ఈసారి రాయి దాడి డ్రామా విఫలమైంది. కాబట్టి వైఎస్ కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి. షర్మిల, సునీతారెడ్డి, అవినాష్రెడ్డి తండ్రి భాస్కరరెడ్డిపైనా హత్యాయత్నం జరగొచ్చు. వారికీ ప్రాణహాని ఉంది. వీరిలో ఎవరికేం జరిగినా జగన్కే సానుభూతి వస్తుంది. చంద్రబాబే హత్య చేయించారని ప్రచారం చేసేందుకు ప్రణాళిక తయారవుతోంది’ అని ఆనం పేర్కొన్నారు.
3 నిమిషాల్లో ప్రచారం ఎలా సాధ్యం?
‘రాయి దాడి జరిగిన వెంటనే వాలంటీర్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. జగన్పై హత్యాయత్నం జరిగిందని ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలని, టీవీలు చూడాలని చెప్పారు. ఇదంతా మూడు నిమిషాల్లోనే ఎలా సాధ్యమైంది’ అని ఆనం ప్రశ్నించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే