ప్రతిపక్ష నేతపై దాడి భావప్రకటనా స్వేచ్ఛా?
తెదేపా అధినేత చంద్రబాబు రాజధాని అమరావతిలో పర్యటించినప్పుడు, ఆ తర్వాత వివిధ సందర్భాల్లో ఆయనపై వైకాపా ప్రేరేపిత అల్లరి మూకలు దాడులకు దిగినప్పుడు వైకాపా నాయకులు, మాజీ డీజీపీ బాధ్యతారహితంగా చేసిన వ్యాఖ్యలివి..
ముఖ్యమంత్రిపై రాయి విసిరితే హత్యాయత్నమా?
అప్పట్లో ఏం మాట్లాడారో వైకాపా నేతలు మర్చిపోయారా?
తెదేపా అధినేత చంద్రబాబు రాజధాని అమరావతిలో పర్యటించినప్పుడు, ఆ తర్వాత వివిధ సందర్భాల్లో ఆయనపై వైకాపా ప్రేరేపిత అల్లరి మూకలు దాడులకు దిగినప్పుడు వైకాపా నాయకులు, మాజీ డీజీపీ బాధ్యతారహితంగా చేసిన వ్యాఖ్యలివి..
ఆయన పిట్టా.. పావురమా..?
- కొడాలి నాని, అప్పట్లో మంత్రి
‘‘పోలీసు కాపలాతో యాత్ర నడుస్తుంటే... ఆయనపైకి ఎవరో చీకట్లో రాయి విసిరారట. ఆయనను చంపేద్దామని చెప్పి.. ఇంత గులకరాయి విసిరారట. ఆయనేమైనా పావురమా... పిట్టా.. గులకరాయితో కొడితే పోవడానికి? ఎవరు విసురుతారు రాయి? ఆయనే సొంత పార్టీ కార్యకర్తలతో గులకరాళ్లు వేయించుకున్నారు.’’
ఎవరో తుంటర్ల పని..
- అంబటి రాంబాబు, ప్రస్తుత మంత్రి, అప్పట్లో ఎమ్మెల్యే
‘‘ఓడిపోతున్నామని తెలిసి నాటకం ఆడే పరిస్థితికి దిగజారిపోయిన మాట వాస్తవమా.. కాదా? మీరు అన్యాయంగా, అక్రమంగా కేసులు పెట్టి అందర్నీ వేధించారు కాబట్టి... మీరు వస్తున్నప్పుడు వారు నిరసన చేపట్టారు. ఎవరో తుంటరివాళ్లు రాళ్లు వేసి ఉండొచ్చు. మీ మీద ఎంత చెడు అభిప్రాయం ఉందో నేను చెప్పాల్సిన అవసరం లేదు.’’
మోసం చేస్తే.. రాళ్లే పడతాయి..
- పేర్ని నాని, అప్పట్లో మంత్రి
‘‘వారి కలల్ని కల్లలు చేసి వాళ్లని భ్రమల్లో ఉంచి, కల్పన కలగజేశారు. అవన్నీ వాస్తవరూపం దాల్చకపోయేసరికి ఆ కసి, కోపంతో తిరుగుబాటు చేస్తున్నారు. డబ్బులిచ్చి పువ్వులైతే వేయించుకోగలరు గానీ... ప్రజల్ని మోసం చేస్తే చెప్పులు, రాళ్లే పడతాయి.’’
మాకేం సంబంధం
- వల్లభనేని వంశీ, ఎమ్మెల్యే
‘‘ఎమోషనల్ కనెక్టివిటీ అన్నది ఒకటుంటుంది. దేశంలో ఏ హింస జరిగినా నేరుగా సంబంధం ఉన్నవాళ్లే చెయ్యరు. వ్యక్తిగతంగా అభిమానించేవాళ్లు ఉంటారు. వ్యక్తిగతంగా దురభిమానం చూపెట్టేవాళ్లూ ఉంటారు. వాళ్లెవరైనా ఏదైనా చేయొచ్చు. మాకేం సంబంధం?’’
కడుపు తరుక్కుపోతే ఏం చేస్తారు?
- బొత్స సత్యనారాయణ, మంత్రి
‘‘మోసపోయిన రైతులు, బాధతో ఉన్నవారు కడుపు తరుక్కుపోతే ఏం చేస్తారు?’’
వాళ్లే రాళ్లేసుకుని ఉండొచ్చు కదా..
- తానేటి వనిత, మంత్రి
‘‘ఎంతోమందిని ఇబ్బంది పెట్టారు. కడుపు మండి వాళ్లు తిరగబడి ఉండొచ్చు కదా. వీళ్లకు వీళ్లే రాళ్లేసుకుని సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నారు. వాళ్ల కార్యకర్తల్ని వాళ్లే పురమాయించుకుని రాళ్లేసుకుని ఉండొచ్చు కదా...’’
రాళ్ల వర్షమంటూ నాటకం
- పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మంత్రి
‘‘ఇదంతా ఒక డ్రామా. ఒక నాటకం, బూటకం. రాళ్ల వర్షం అన్నారు. సీసీ కెమెరా ఫుటేజీ చూస్తే అదేమీ కనిపించలేదు. రాళ్లు వెయ్యకపోయినా వేసినట్టు చూపించి, సానుభూతి పొంది... దాంతో ఓట్లు వేయించుకోవాలన్న ఆలోచనే ఇది.’’
యాత్ర హైలైట్ కోసమే...
- కురసాల కన్నబాబు, అప్పట్లో మంత్రి
‘‘యాత్రకు వెళ్లి హైడ్రామా క్రియేట్ చేస్తున్నారు. యాత్ర హైలైట్ కావాలంటే అక్కడేదో జరిగిపోతున్నట్టు, తన మీదేదో దాడులు చేస్తున్నట్టు చూపించాలని అక్కడో వీధి నాటకాన్ని ప్రదర్శిస్తున్నారు.’’
విషపు రాజకీయ కుట్రలో ఒక కోణం
- జోగి రమేష్, అప్పట్లో ఎమ్మెల్యే, ప్రస్తుత మంత్రి
‘‘నరనరాల్లో జీర్ణించుకున్న విషపు రాజకీయ కుట్రలో ఒక కోణం రాయి విసిరించుకోవడం’’
అది భావవ్యక్తీకరణ స్వేచ్ఛలో భాగమే..
- అప్పటి డీజీపీ, ప్రస్తుత ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్
‘‘కొందరు రైతులు చెప్పులు విసిరారని, అల్లరి చేశారని, గ్లాస్ పగిలిందని... చెబుతున్నారు. వేసినవాళ్లు ఎవరు? ఎందుకు వేశారు? మనం మొన్ననే రాజ్యాంగ దినోత్సవం చేసుకున్నాం. ప్రతి ఒక్కరికీ నిరసన తెలియజేసే, భావాన్ని వ్యక్తీకరించే స్వేచ్ఛ ఉంది. దానిలో భాగమే అది.’’
ఈనాడు, అమరావతి: ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు. అది చిన్నదైనా, పెద్దదైనా ప్రతి ఒక్కరూ ఖండించాల్సిందే. అలాంటి ఘటనలు జరిగినప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలుగా కీలకమైన పదవుల్లో ఉన్నవారు మరింత బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంతో స్పందించాలి. కానీ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన ప్రధాన ప్రతిపక్ష నేతపై రాళ్లదాడులు జరిగితే మంత్రులు ఎంత బాధ్యతారహితంగా వ్యవహరించారో చెప్పడానికి వారి వ్యాఖ్యలే అద్దం పడుతున్నాయి. హింసాకాండను నివారించాల్సిన, దాడులకు దిగినవారిపై వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అప్పటి డీజీపీ కూడా తన కర్తవ్యాన్ని మర్చిపోయి, వైకాపా కార్యకర్తలా ఇష్టానుసారం మాట్లాడారు. ప్రతిపక్ష నాయకుడిపై దాడి జరిగితే... అది భావప్రకటన స్వేచ్ఛని, నిరసన తెలిపే హక్కని, సానుభూతి కోసం వారి మనుషులతోనే దాడి చేయించుకున్నారని నోటికొచ్చిన వ్యాఖ్యలు చేసిన వైకాపా నాయకులు... ఇప్పుడు వారి నాయకుడు, సీఎం జగన్పై దాడి జరిగితే శివాలెత్తిపోతున్నారు. ప్రొటోకాల్ పరంగా రాష్ట్రంలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రతలో ఉండే ముఖ్యమంత్రిపై గుర్తుతెలియని వ్యక్తి రాయితో దాడి చేయడం ఘోర భద్రతా వైఫల్యానికి నిదర్శనం. దాని గురించి ఒక్క మాట కూడా మాట్లాడని వైకాపా నేతలు... సీఎంపై దాడికి చంద్రబాబే కారణమని ఆరోపిస్తున్నారు. సీఎంపై ఎప్పుడు దాడి జరుగుతుందా, ఎప్పుడు విపక్ష నేతలపై విరుచుకుపడదామా అని కాచుకుని కూర్చున్నట్టుగా... ఇలా ఆ ఘటన జరిగిందో లేదో మరుక్షణం ప్రతిపక్ష నాయకులపై విరుచుకుపడటం మొదలు పెట్టారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ల ఫొటోలను చెప్పులతో కొట్టారు. ఫ్లెక్సీలు తగలబెట్టారు. రాస్తారోకోలు చేశారు. అంతా ముందే సిద్ధం చేసుకున్నట్టుగా... సీఎంపై దాడి జరిగిన కొద్దిసేపటికే ఇవన్నీ జరిగిపోయాయి. ప్రతిపక్ష నేతపై దాడి జరిగితే అది భావప్రకటన స్వేచ్ఛ, నిరసన వ్యక్తం చేయడమా? అదే ముఖ్యమంత్రిపై దాడి జరిగితే అది హత్యాయత్నమా? మంత్రులకు, వైకాపా నాయకులకు వారేం మాట్లాడుతున్నారో అర్థమవుతోందా అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
భద్రతా వైఫల్యంపై మాట్లాడరేం?
సీఎం అంటేనే వివిధ అంచెల్లో కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ ఉంటుంది. ఆయన ఏ సభలో పాల్గొన్నా ఎవరైనా ఎటునుంచైనా దాడి చేస్తారేమోనని భద్రతా అధికారులు డేగకళ్లతో పర్యవేక్షిస్తుంటారు. జగన్ భద్రత గురించి చెప్పాల్సిన పనేలేదు. ఆయన రోడ్డుపైకి వస్తున్నారంటేనే పరదాలు కట్టేస్తారు, బారికేడ్లు పెట్టేస్తారు, చివరకు పచ్చటి చెట్లూ కొట్టేస్తారు. అలాంటిది శుక్రవారం రాత్రి ఆయనపై జరిగిన దాడిలో భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నా వైకాపా నాయకులెవరూ దాని గురించి మాట్లాడలేదు. సీబీఐ, ఎన్ఐఏ లాంటి సంస్థలతో దర్యాప్తునకు డిమాండ్ చేయాల్సింది పోయి... విపక్షాలపై ఆరోపణలు చేయడమేంటనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. విజయవాడలో జగన్ పర్యటిస్తున్న సమయంలో ప్రతి సెంటర్లో కరెంటు ఎందుకు తీసేశారు? సీఎంకి రాయి తగిలిందని చెబుతున్న సమయంలో భద్రతా సిబ్బంది ఎందుకు కూర్చుని ఉన్నారు? ఆ సమయంలో సాక్షి ఛానల్లో లైవ్ ఎందుకు ఇవ్వలేదు? అది ప్రధాన కూడలి కానప్పుడు, అక్కడ పెద్దగా జనం కూడా లేనప్పుడు జగన్ బస్సుపైకి ఎందుకు ఎక్కారు? ప్రొటోకాల్ పరంగా రాష్ట్రంలో మొదటిస్థానంలో ఉండే సీఎంపైకి రాయి విసిరారంటే... దుండగుడు అక్కడకు సమీపంలోనే ఉంటాడు. వందల సంఖ్యలో ఉండే భద్రతా సిబ్బంది, పోలీసులు వెంటనే ఆ దుండగుడిని గుర్తించి ఎందుకు పట్టుకోలేదు? రాయి విసిరిన వారెవరో ఇప్పటికీ ఎందుకు గుర్తించలేకపోయారు? ఇలాంటి ప్రశ్నలెన్నో ప్రజల నుంచి వస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
జగన్.. మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి? అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. -
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
తెలంగాణ బడ్జెట్లో హైదరాబాద్ నగర మౌలిక సదుపాయాలకు రూ.10 వేల కోట్లు కేటాయించినందుకు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. -
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల