పిచ్చోడి చేతిలో రాయి.. జగన్ చేతిలో అధికారం.. రెండూ ఒక్కటే
పిచ్చోడి చేతిలో రాయి, జగన్ చేతిలో అధికారం రెండూ ఒక్కటేనని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ విమర్శించారు. అరాచక పాలనతో రాష్ట్రాన్ని పదేళ్లు వెనక్కి తీసుకెళ్లారని జగన్పై ధ్వజమెత్తారు.
వైకాపా పాలనలో రాష్ట్రాన్ని పదేళ్లు వెనక్కి తీసుకెళ్లారు
స్వర్ణాంధ్ర సాకార బస్సుయాత్రలో నందమూరి బాలకృష్ణ
ఈనాడు డిజిటల్, అనంతపురం, న్యూస్టుడే, శింగనమల: పిచ్చోడి చేతిలో రాయి, జగన్ చేతిలో అధికారం రెండూ ఒక్కటేనని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ విమర్శించారు. అరాచక పాలనతో రాష్ట్రాన్ని పదేళ్లు వెనక్కి తీసుకెళ్లారని జగన్పై ధ్వజమెత్తారు. రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేదు అని మండిపడ్డారు. స్వర్ణాంధ్ర సాకార బస్సుయాత్రలో భాగంగా ఆదివారం ఆయన శింగనమల, అనంతపురం అర్బన్ నియోజకవర్గాల్లో పర్యటించి మాట్లాడారు. ‘నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అంటూ ప్రసంగించే జగన్.. ఆ వర్గాలకు చేసిందేమి లేదు. ఉద్యోగాలు ఇవ్వకుండా యువతను, సీపీఎస్ రద్దు చేయకుండా ఉద్యోగులను మోసం చేశారు. గత ఎన్నికల ముందు ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చలేదు. వైకాపా హయాంలో వ్యవసాయశాఖను నిర్వీర్యం చేశారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకోవడం లేదు. జగన్ మళ్లీ గెలిస్తే ప్రభుత్వ ఆస్తులతో పాటు ప్రజల్ని కూడా తాకట్టుపెట్టి అప్పులు తెస్తారేమో! అందుకే ఈ ఎన్నికల్లో ఫ్యాన్ రెక్కలు విరిచేయాలి’ అని బాలకృష్ణ పిలుపునిచ్చారు.
దళితులకు రెండెకరాల సాగుభూమి
‘వైకాపా పాలనలో దళితులపై దాడులు పెరిగాయి. జగన్ దళితుల ద్రోహిగా మిగిలిపోయారు. తెదేపా అధికారంలోకి రాగానే దళితులకు రెండెకరాల సాగుభూమి అందిస్తాం. ఎస్సీ వర్గీకరణ చేసి దళితులకు న్యాయం చేస్తాం. అంబేడ్కర్ విదేశీ విద్య పథకాన్ని మళ్లీ తీసుకొస్తాం. ముస్లింల కోసం దుల్హాన్ పథకం ద్వారా రూ.లక్ష సాయం చేస్తాం. ఉర్దూ పాఠశాలలు, గురుకులాలు నెలకొల్పుతాం’ అని బాలకృష్ణ హామీలిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలోని వడ్డేపాళ్యం గ్రామంలో ఆదివారం రాత్రి నిర్వహించిన తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి జరిగింది. -
ఆమెను చూసి ‘నెహ్రూ’ ఆత్మ కన్నీరు పెడుతుంది: మధ్యప్రదేశ్ సీఎం
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ఆమె ఇంటి పేరు ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
-
వైవిధ్య చిత్రాలు వచ్చేస్తున్నాయ్.. ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
-
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,505
-
తెదేపాకు మద్దతిస్తున్నారని.. ఎస్టీ కాలనీకి తాగునీరు బంద్
-
ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం: 9 మంది మృతి, 23 మందికి గాయాలు
-
భర్త మద్దతుగా మాట్లాడలేదని వివాహిత ఆత్మహత్య