దళితుల జీవన ప్రమాణాలు పెంచింది తెదేపా.. వారిని అణచివేసింది వైకాపా
దళితులు అణచివేతకు గురవకుండా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వారిని పైకి తీసుకువస్తే.. ఎన్నికల ముందు వారిని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి వచ్చాక వాటిని నెరవేర్చకుండా ఆయా వర్గాలవారిని నిండాముంచారని తెదేపా అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు ధ్వజమెత్తారు.
ఎన్డీయే నేతలు ధ్వజం
ఈనాడు డిజిటల్, అమరావతి: దళితులు అణచివేతకు గురవకుండా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వారిని పైకి తీసుకువస్తే.. ఎన్నికల ముందు వారిని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి వచ్చాక వాటిని నెరవేర్చకుండా ఆయా వర్గాలవారిని నిండాముంచారని తెదేపా అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు ధ్వజమెత్తారు. దళితులతో తనకు బంధుత్వముందని 2019 ఎన్నికల ముందు నమ్మబలికి ఓట్లను కొల్లగొట్టి, తెదేపా హయాంలోని పథకాలన్నింటినీ రద్దు చేశారని మండిపడ్డారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఎన్డీయే నేతలతో కలిసి ఆదివారం విలేకర్లతో మాట్లాడారు. ‘తెదేపా హయాంలో దళితుల కోసం పలు పథకాలు ప్రవేశపెట్టి వారి జీవన ప్రమాణాలు పెంచింది. వైకాపా అధికారంలోకి వచ్చాక ఆయా వర్గాల వారిని ఆదుకోవడం పక్కనపెట్టి అణచివేతకు గురిచేసింది’ అని మాణిక్యరావు దుయ్యబట్టారు. ‘సీఎం జగన్ నమ్మినవారిని నట్టేటముంచే వ్యక్తి. ఆయన తల్లి, చెల్లిని సైతం అలాగే మోసం చేశారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులను దారిమళ్లించిన ఏకైక సీఎం జగన్. భూమి కొనుగోలు పథకాన్ని పూర్తిగా నీరుగార్చారు’ అని భాజపా నేత ఆర్డీ విల్సన్ విమర్శించారు. ‘అంబేడ్కర్ పై గౌరవమున్నట్లు వైకాపా నాయకులు నటిస్తూ వారి సొంత మీడియాలో ప్రకటనలు వేసుకుంటున్నారు. రాజ్యాంగాన్ని తుంగలో తొక్కిన వైకాపా ప్రభుత్వం రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసింది. అయిదేళ్ల పాలనలో దళితుల జీవితాలతో జగన్ చెలగాటమాడారు. ఎస్సీ కార్పొరేషన్ నిధులు దారిమళ్లించారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి వైకాపా ప్రభుత్వం ఏం చేసిందో చెప్పి ఓట్లు అడగాలి’ అని జనసేన నేత పెదపూడి విజయ్కుమార్ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి ఎన్నికల ప్రచారంలో చేదు అనుభవం
కడప జిల్లా వేంపల్లి మండలం కుమ్మరంపల్లిలో సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతికి చేదు అనుభవం ఎదురైంది. -
‘మీ బిడ్డను’ అంటూ.. జగన్ ఊరూరా తిరిగినప్పుడే అనుమానించా: లోకేశ్
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. ప్రజల భూములు కొట్టేసే నల్ల చట్టమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దుయ్యబట్టారు. -
భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుంది: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
లోక్సభ ఎన్నికల్లో భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుందని నిర్మలా సీతారామన్ ధీమా వ్యక్తం చేశారు. -
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
ఐదేళ్ల జగన్ పాలనలో అంతా దోపిడీయేనని తెదేపా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. -
కాంగ్రెస్లో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు
భారాసకు మరో షాక్ తగిలింది. తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు అమిత్ కాంగ్రెస్లో చేరారు. -
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలోని వడ్డేపాళ్యం గ్రామంలో ఆదివారం రాత్రి నిర్వహించిన తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి జరిగింది. -
ఆమెను చూసి ‘నెహ్రూ’ ఆత్మ కన్నీరు పెడుతుంది: మధ్యప్రదేశ్ సీఎం
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ఆమె ఇంటి పేరు ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి ఎన్నికల ప్రచారంలో చేదు అనుభవం
-
సొంతగడ్డపై చెలరేగిన కోల్కతా.. దిల్లీపై ఘన విజయం
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
నదిలో ఈతకు వెళ్లి ఐదుగురు బీటెక్ విద్యార్థులు మృతి
-
పెళ్లి పత్రికలో ‘మోదీ’ ప్రస్తావన.. చిక్కుల్లో నవ వరుడు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM