జగన్పై దాడి ప్రభుత్వ వైఫల్యమే
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిపై దాడిపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని తెదేపా రాష్ట్ర అద్యక్షుడు అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. పలాసలో విలేకరులతో ఆయన మాట్లాడారు.
తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడి వ్యాఖ్యలు
ఈనాడు, న్యూస్టుడే, యంత్రాంగం: ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిపై దాడిపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని తెదేపా రాష్ట్ర అద్యక్షుడు అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. పలాసలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ‘సీఎం బస్సు యాత్ర తుస్సుమంది. 3,500 బస్సుల్లో జనాలను తరలించి బిర్యానీ, డబ్బులు ఇచ్చినా విఫలమవడంతో జగన్ కొత్త డ్రామాకు తెర లేపారు. రాయితో దాడి జరిగితే మూడు గంటల అనంతరం ఆసుపత్రికి వెళ్లడమేంటి? ముఖ్యమంత్రి పాల్గొన్న యాత్రలో విద్యుత్తు సరఫరా నిలిచిపోవడం, దాడి జరిగిన ఒక్క నిమిషానికే రాయి కాదు క్యాట్ బాల్తో దాడి జరిగిందంటూ ప్రచారం చేయించడం.. ఘటనకు చంద్రబాబే కారణమని వైకాపా శ్రేణులు ప్లకార్డులతో ధర్నాలు చేయడం వెనుక కుట్ర దాగి ఉంది. జగన్పై దాడి ప్రభుత్వ వైఫల్యమే. పోలీసులు, భద్రతా సిబ్బంది అక్కడే ఉండి ఏం చేస్తున్నారు? దాడి చేసిన వారిని ఎందుకు పట్టుకోలేకపోయారు? 2019 ఎన్నికల ముందు విశాఖపట్నంలో కోడి కత్తి, వివేకానందరెడ్డి హత్యను అడ్డు పెట్టుకుని సానుభూతి పొంది అధికారంలోకి వచ్చారు. మరోసారి సానుభూతి ఓట్ల కోసం రాయి డ్రామా ఆడుతున్నారు. జగన్పై దాడి జరిగితే చంద్రబాబు స్పందించలేదని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడం విడ్డూరంగా ఉంది. దాడి జరిగిన సమయంలో ఆయన విమాన ప్రయాణంలో ఉన్నారు. దిగిన వెంటనే స్పందించారు. అయిదేళ్లలో చంద్రబాబుపై ఎన్నోసార్లు దాడులు జరిగినా ఎవరైనా స్పందించారా? గతంలో జడ్జిలపై తప్పుడు వ్యాఖ్యలు పెట్టి జైలుకెళ్లిన వ్యక్తి త్వరలో సంచలన సంఘటన జరుగుతుందంటూ ఎక్స్లో ట్వీట్ చేసిన నాలుగు రోజుల్లో ఈ దాడి జరిగింది. ఇదంతా పథకం ప్రకారమే జరిగిందని రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి’ అని అచ్చెన్నాయుడు అన్నారు.
ఓటమి భయంతోనే.. గులకరాయి డ్రామా!
మాజీ మంత్రి, తెదేపా సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి
‘ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిపై దాడిని ఖండిస్తున్నాం. కానీ, ఎన్నికల్లో ఓటమి భయంతోనే ఈ డ్రామాకు తెరదీశారని అర్థమవుతోంది. దాడికి పాల్పడిన వారిని వదిలేసి.. మంత్రులంతా చంద్రబాబుపై ఆరోపిస్తున్నారు. ముఖ్యమంత్రికే రక్షణ కల్పించలేని సీఎస్, డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్లను ఈసీ తక్షణమే విధుల నుంచి తప్పించాలి. జగన్మోహన్రెడ్డిపై దాడి జరిగినప్పటి నుంచి ప్రతిక్షణం మంత్రులు, వైకాపా నాయకులు చంద్రబాబునాయుడి కుట్ర, ప్రతిపక్షాల కుట్ర అనడం విడ్డూరంగా ఉంది. ముఖ్యమంత్రిపై దాడి జరుగుతుంటే డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్, చీఫ్ సెక్రటరీ ఏం చేస్తున్నారు. ముందుకు వారిపై చర్యలు తీసుకోండి. ఇదంతా చంద్రబాబు కుట్ర అని మాట్లాడుతున్న హోమంత్రి.. దాడి చేసిన వారిని పట్టుకోకుండా ఏం చేస్తున్నారు? గతంలో విశాఖలో పిన్నీసు గుచ్చుకున్నంత గాయమైతే.. ఏపీలో చికిత్స చేసే వైద్యులు లేరని, హైదరాబాద్ వెళ్లారు. ఏపీలో పోలీసులను చేతకానివాళ్లుగా చూపి, ఎన్ఐఏ దర్యాప్తు కోరారు. వారు విచారణ జరిపి.. అందులో కుట్రలు, కుతంత్రాలు లేవని తేల్చారు. శ్రీనును అయిదేళ్లు అన్యాయంగా జైలులో ఉంచారు. వివేకానందరెడ్డి చనిపోతే మొదట గుండెపోటు అని మీరే చెప్పారు. తర్వాత చంద్రబాబు చంద్రబాబు అంటూ పాటెత్తుకున్నారు. ఇప్పుడు ఆ కేసులో నిందితులు ఎవరో ముఖ్యమంత్రి చెల్లెళ్లే చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో కోడికత్తి డ్రామా, మా చిన్నాయన్ని చంపేశారు, ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు గులకరాయి డ్రామాకు తెరలేపారు’
మీకే భద్రత లేదంటే.. అది మీ చేతగానితనమే
- మాజీమంత్రి, తెదేపా నేత నక్కా ఆనందబాబు
‘జగన్పై రాయి దాడి నూటికి నూరు శాతం పథకం ప్రకారం జరిగిందే. మరో కోడికత్తి డ్రామాకు తెర తీసి అట్టర్ ఫ్లాప్ అయ్యారు’.. ఈ తరహా కుటిల రాజకీయాలకు కాలం చెల్లింది. పదేపదే చేస్తుంటే ఇలాంటివి ఎవరూ నమ్మరు. రాష్ట్రానికి భద్రత కల్పించాల్సిన సీఎంకే భద్రత లేదంటే.. అది చేతగానితనానికి నిదర్శనం. రోడ్షోలో ప్రతిసారీ కరెంట్ తీసి నాటకాలాడారు. భద్రతా సిబ్బంది మోకాళ్లపై కూర్చుని తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ను రక్తి కట్టించేందుకు ప్రయత్నాలు చేశారు. దీనిని అడ్డుపెట్టుకుని మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తున్నారని ప్రజలకు అర్థమై అసహ్యించుకుంటున్నారు. మీ కార్యకర్తల్లోనే ఈ పని ఎవరు చేశారో గుర్తించి వాళ్లను అరెస్టు చేయాలి. అలా కాకుండా ఎస్సీనో, బీసీనో బలి చేయొద్దు. బాబాయ్ వివేకా హత్య రక్తపు పునాదులపై జగన్ ప్రభుత్వం ఏర్పడిందని చెల్లెమ్మలు చెబుతున్నారు. సొంత చెల్లెళ్లు ఆరోపణలు గుప్పిస్తున్నా జగన్ ఎందుకు స్పందించడం లేదు? గత ఎన్నికల్లో కోడికత్తి డ్రామా ఆడి దళిత యువకుణ్ని జైల్లో మగ్గేలా చేశారు. తెదేపా అధికారంలోకి రాగానే ఈ దాడి ఘటనపై విచారణ చేయించి దోషుల్ని శిక్షిస్తాం’
రాయి జగన్కే ఎలా తగిలింది?
- కేంద్ర మాజీమంత్రి, తెదేపా సీనియర్ నేత పి.అశోక్గజపతిరాజు
‘జగన్ ముందు అంతమంది రక్షణగా ఉన్నా రాయి ఆయనకే ఎలా తగిలింది? పుంగనూరులో చంద్రబాబుపై ప్రణాళిక ప్రకారం రాళ్లు విసిరినా రక్షణ సిబ్బంది అడ్డుగా ఉండటంతో ఆయనకు తగలలేదు. జగన్ బస్సు యాత్రలో అంతమంది రక్షణ సిబ్బంది ఉండగా ఆయనకే రాయి ఎలా తగిలిందో వారే చెప్పాలి’
ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి
- మాజీమంత్రి, తెదేపా నేత కన్నా లక్ష్మీనారాయణ
‘జగన్ ఆధ్వర్యంలో ఎన్నికలకు వెళ్తే రాష్ట్రంలో రక్తపాతం జరుగుతుందేమో. జగన్ పాలనలో రాష్ట్రంలో శాంతి, భద్రతలు నశించాయి. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాల్సిన అవసరముంది. తనను తాను రక్షించుకోలేని జగన్.. ప్రజలకు ఎలా భద్రత కల్పిస్తారు? ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదు. వెంటనే రాజీనామా చేయాలి. భద్రతా వైఫల్యం వల్లే రాయి దాడి జరిగింది. డీజీపీని తక్షణమే విధుల నుంచి తప్పించాలి’
ఈ దాడిపై అనేక అనుమానాలు
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
‘ఈ దాడిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. అత్యంత రక్షణ వలయంలో ఉండే సీఎంపైనే దాడి అమానుషం. రాజకీయాల్లో విమర్శలు, ఆత్మవిమర్శలు ఉండాలే తప్ప, భౌతిక దాడులు సరికాదు. ఈ ఘటనపై అధికార, విపక్ష నేతలు ఒకరిపై ఒకరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వీటిని నివృత్తి చేయాలంటే ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా విచారణ చేయాలి’
సీఎంపై దాడి..హేయమైన చర్య!
- భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి
‘సీఎం జగన్పై జరిగిన దాడి హేయమైన చర్య. ఈ ఘటనపై లోతైన దర్యాప్తు జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి’
ప్రజల సానుభూతి కోసం డ్రామా ఇది
- తెదేపా రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్
‘ఎన్నికల్లో ప్రజల సానుభూతి కోసం వైకాపా గులకరాయి డ్రామా మొదలుపెట్టింది. జగన్రెడ్డి ప్రచారంలో తీవ్ర ప్రజావ్యతిరేకత రావడంతో కొత్త నాటకం ఆడుతున్నారు. వైకాపా అయిదేళ్ల పాలనలో జగన్రెడ్డి చెప్పుకోడానికి ఒక్క మంచి పనీ చేయలేదు. అనుభవరాహిత్యం, అవినీతి, అక్రమాలతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. అయిదేళ్లలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ తేలేదు. ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయలేదు. రాష్ట్ర పురోగతిని బలి పెట్టి అరాచకత్వంతో ఏపీని అంధకారంలోకి నెట్టారు. ‘రాష్ట్రంలో సంచలన సంఘటన జరుగుతుంది ఎన్నికల వాతావరణాన్ని మార్చేస్తుందంటూ’ వైకాపా నేత అవుతు శ్రీధర్రెడ్డి చెప్పిన నాలుగో రోజే గులకరాయి సంఘటన జరగడం ఈ డ్రామాలో భాగం కాదా? విజయవాడలో జగన్ ప్రచారం సాగే ప్రాంతంలో రాత్రి 7 గంటలకు కరెంటు తీయడం 8.10కి దాడి, 11 గంటలకు కుటుంబ సమేతంగా ఆసుపత్రికి వెళ్లడం మీ సానుభూతి నాటకాలు కావా?’
డీజీపీ అసమర్థత వల్లే ఈ పరిణామం..
- భాజపా రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్
‘అసమర్థ డీజీపీ వల్లనే సీఎం జగన్పై దాడి జరిగింది. సీఎంకి భద్రత ఇవ్వలేని డీజీపీ, నిఘా విభాగం ముఖ్య అధికారి ప్రతిపక్ష నేతలకు ఎలా ఇస్తారు. వారిని వెంటనే విధుల నుంచి తొలగించి సమర్థులైన అధికారులను నియమించాలని రాష్ట్ర భాజపా తరఫున కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరాం. ‘బెంగాల్లో ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ, రాష్ట్రంలో జగన్పై ఎన్నికల సమయంలోనే దాడులు జరగడం విస్మయకరం. ఆ దాడి చంద్రబాబే చేయించారని వైకాపా ఆరోపించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. 2019లో కోడికత్తి, బాబాయి హత్యతో ప్రజలను మభ్యపెట్టినవాళ్లు 2024లోనూ అదే తరహా ప్రయత్నం చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల్లో భారీ ఓటమి తప్పదని తెలిసి వైకాపా ఇలాంటి డ్రామాలు ఆడుతోంది.’
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఎడారి దేశాల్లో.. గాయపడిన గుండెలెన్నో!
-
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
-
‘12th ఫెయిల్’కు జాతీయ అవార్డు.. ప్రచారంపై స్పందించిన నటుడు
-
అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలాహారిస్ ఖరారు
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు