ఖర్సయిపోతున్నాం..!
‘శాసనసభ ఎన్నికలు ముగిసి ఆరు నెలలు తిరగకముందే లోక్సభ పోరుకు సిద్ధం కావాల్సి రావడంతో నాయకులకు చుక్కలు కనపడుతున్నాయి.
ప్రచార పెట్టుబడికి ముఖం చాటేస్తున్న నాయకులు
అసెంబ్లీ వెంటే లోక్సభ ఎన్నికలు రావడమే కారణం
పార్టీ కార్యక్రమాలతో జేబులు గుల్లవుతున్నాయని ఆవేదన
ప్రచారం జోరందుకుంటున్న తరుణంలో పార్టీలకు సంకట పరిస్థితి
ఈనాడు, హైదరాబాద్: ‘శాసనసభ ఎన్నికలు ముగిసి ఆరు నెలలు తిరగకముందే లోక్సభ పోరుకు సిద్ధం కావాల్సి రావడంతో నాయకులకు చుక్కలు కనపడుతున్నాయి. ముఖ్యంగా ద్వితీయశ్రేణి నాయకులు డబ్బులు ఖర్చు పెట్టలేక లబోదిబోమంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో జనాన్ని తరలించినంత ఉత్సాహంగా.. లోక్సభ ఎన్నికల్లో కిందిస్థాయి నాయకులు స్పందించడంలేదని పలు పార్టీల పెద్ద నాయకులు చెబుతున్నారు. ఇటీవల రెండు ప్రధాన పార్టీలు నిర్వహించిన సభలకు జనసమీకరణ కోసమని.. పలు జిల్లాల్లో నియోజకవర్గ స్థాయి నాయకులకు ఒకటికి పదిసార్లు ఫోన్లు చేసి గట్టిగా చెబితే గానీ పని కాలేదని ఆ పార్టీలకు చెందిన పలువురు నాయకులు తెలిపారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీలు పడి మరీ జనసమీకరణ చేసిన కొందరు నాయకులు ఇప్పుడు ముఖం చాటేస్తున్నారు. డబ్బులు సమకూరిస్తేనే ఏ పనైనా చేయగలమని.. లేదంటే తమ వల్ల కాదని తెగేసి చెబుతున్నట్లు సమాచారం.
భవిష్యత్తేమిటో అర్థం కాక..
‘లోక్సభ ఎన్నికలతో మాకేం ఒరుగుతుంది? పోయిన ఎన్నికల్లో ఖర్చు చేసిన డబ్బులే మాకు వెనక్కి ఇవ్వలేదు. ఇప్పుడు మళ్లీ ఖర్చు చేయలేం.. కార్యక్రమాలకు రాలేం..’ అంటూ ద్వితీయ శ్రేణి నాయకులు దూరంగా ఉంటున్నారని దక్షిణ తెలంగాణ జిల్లాకు చెందిన ఓ పార్టీ నేతలు వాపోయారు. ఎన్నికల ప్రచారం ఊపందుకోవాల్సిన ఈ తరుణంలో కింది నాయకులు చేతులెత్తేస్తుండడం అభ్యర్థులకు తలనొప్పిగా మారింది. పార్టీలో ప్రాధాన్యం కోసం అసెంబ్లీ ఎన్నికల సమయంలో పోటీపడి డబ్బులు ఖర్చు చేసినవారు.. ఇప్పుడు ప్రత్యర్థులు పలువురు పార్టీలో చేరుతుంటే తమ పరిస్థితి ఏమిటని తలలు పట్టుకుంటున్నారు. రాజధాని పరిధిలో పలువురు తమ భవిష్యత్తేమిటో అర్థం కాక.. మరోసారి ఖర్చు చేసేందుకు ముందుకు రావడంలేదని సమాచారం.
- ఇటీవల తమ పార్టీ సభకు ఆర్టీసీ బస్సుల్లో జనాన్ని తరలించిన ఉత్తర తెలంగాణ జిల్లాకు చెందిన ఓ నాయకుడికి రూ.7 లక్షలు ఖర్చయింది. పార్టీ నుంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. మళ్లీ మరోసభకు జనాన్ని తరలించాలని ఓ కీలక నేత చెప్పడంతో ఆ చోటా నాయకుడు ముఖం చాటేస్తున్నారు. ఇప్పటికే రూ.అర కోటి పెట్టుబడి పెట్టగా.. ప్రత్యర్థులు పార్టీలో చేరడంతో కష్టంగా మారిందని ఒక నాయకుడు చెప్పారు.
- మొన్నటి ఎన్నికల్లో రూ.కోటిన్నర వరకు పెట్టుబడి పెట్టిన ఓ పార్టీ ద్వితీయశ్రేణి నాయకుడు.. లోక్సభ ఎన్నికల్లో తన వల్ల కాదని తప్పించుకుంటున్నారు. మళ్లీ మంచి రోజులొస్తాయని నాయకులు బుజ్జగించినా.. పార్టీ కార్యక్రమాలకు ఆయన పైసలు తీయడం లేదని సమాచారం.
- జిల్లాలో సభ అంటే కనీసం మూడు వేల మందినైనా తీసుకురావాలని నాయకులకు పలు పార్టీలు సూచిస్తున్నాయి. లారీలు, వ్యాన్లకు అద్దెలు పెరగడం, బిర్యానీ, మద్యం, నగదు.. ఇలా మొత్తం ఖర్చు ఒక్కో సభకు రూ.20 లక్షలకు తగ్గడం లేదని పలువురు నాయకులు చెబుతున్నారు.
- ఎండలు తీవ్రంగా ఉండటంతో ఆర్టీసీ బస్సులే పెట్టాలని కార్యకర్తలు కోరుతుండడం.. ఛోటా నాయకులకు మరో భారమవుతోంది. ప్రైవేటు వాహనాలైతే ఎవరో ఒకరిని బతిమిలాడి.. డీజిల్ పోసి తెచ్చుకోవచ్చని, కానీ ఆర్టీసీ బస్సులో ముందే ఛార్జీ చెల్లించాల్సి రావడం, నిర్దిష్ట గంటలు దాటితే అదనపు చెల్లింపులు తట్టుకోవడం కష్టంగా ఉందని వాపోతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా హయాంలో ప్రకటనల కుంభకోణం.. హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేల డిమాండ్
వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రకటనల కుంభకోణంపై హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. -
ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.. మంత్రులకు చంద్రబాబు సూచన
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించడం... వంటి మంచి పనుల్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. -
సకుటుంబ సమేతంగా కేసులు.. అక్రమ కేసులున్నవారు నిలబడాలని కోరిన చంద్రబాబు
వివాహాలు, ఇతర శుభకార్యాలకు సకుటుంబ సపరివార సమేతంగా రావాలని ఆహ్వానిస్తుంటాం.. అయితే గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలపై సకుటుంబ సమేతంగా అక్రమ కేసులు నమోదు చేసి వేధించారని చంద్రబాబు, ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. శ్వేతపత్రం విడుదల సందర్భంగా.. వైకాపా ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలపై నమోదైన అక్రమ కేసుల సంఖ్యను చంద్రబాబు ప్రస్తావించారు. -
ఏపీ ‘ఎస్కోబార్’ జగన్.. చీకటి సామ్రాజ్యాధిపతితో పోల్చిన చంద్రబాబు
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అరాచకాలను వివరించేటప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కొలంబియన్ మాదకద్రవ్యాల చీకటి సామ్రాజ్యాధిపతి పాబ్లో ఎమిలియో ఎస్కోబార్ చరిత్రను సభకు వినిపించారు. -
‘రఘురామను చిత్రహింసలు పెట్టినప్పుడు మీరంతా ఏమయ్యారు?’
మాజీ ముఖ్యమంత్రి జగన్ దిల్లీలో చేసిన నిరసనకు ఇండియా కూటమి నాయకులు మద్దతు పలకడాన్ని అనంతపురం తెదేపా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. -
అన్ని వర్గాలకూ మోసం
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలనూ మోసం చేసిందని, అందర్నీ వెన్నుపోటు పొడిచిందని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. -
శాంతిభద్రతల పరిరక్షణపై సభలో చర్చిద్దాం
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు.. రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలపై శాసనసభలో ఒక రోజు పూర్తిగా చర్చించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు. -
ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని దోచేశారు
‘వైకాపా ప్రభుత్వం చేసిన నిర్వాకాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు విద్యుత్తు, అమరావతి, పోలవరం, గనులు, మద్యంపై శ్వేతపత్రాలు విడుదల చేశారు. -
వైకాపా ప్రభుత్వం ఇళ్లు కూల్చింది.. ఆదుకోండి
తెదేపాకు అనుకూలంగా ఉన్నారని విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం దన్నానపేట గ్రామానికి చెందిన 30 మంది దళితుల ఇళ్లను అప్పటి వైకాపా ప్రభుత్వం కూల్చేసిందని ఆ మండల తెదేపా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు టొంపల నర్సయ్య గురువారం తెదేపా కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. -
వైకాపా పాలనలో తెదేపా శ్రేణులపై 2,560 కేసులు
వైకాపా హయాంలో గత ఐదేళ్లలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై 2,560 కేసులు నమోదు చేసి.. 2,370 మందిని అరెస్టు చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. -
ఇసుక, మద్యం అవినీతిపై విచారణ జరిపించాలి
ముఖ్యమంత్రి చంద్రబాబును రాష్ట్ర సచివాలయంలో గురువారం సీపీఎం నాయకులు కలిశారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. -
సమస్యలపై ప్రశ్నిస్తే.. వేధింపులే సమాధానం
శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం విడుదల చేసిన ‘శాంతిభద్రతల శ్వేతపత్రం’పై కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వేదికగా మాట్లాడారు. -
‘ఇండియా’ కూటమితో పొత్తు కోసమే జగన్ దిల్లీ యాత్ర
‘ఇండియా’ కూటమితో పొత్తు కోసమే వైకాపా అధ్యక్షుడు జగన్ దిల్లీ వెళ్లినట్లుగా ఉందని ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. దిల్లీ నుంచి అమరావతి చేరుకున్న జగన్... శాసనసభ సమావేశాలకు హాజరు కావాలని సూచించారు. -
ఇది పసలేని దండగమారి బడ్జెట్: కేటీఆర్
రాష్ట్ర ప్రభుత్వం పసలేని, దండగమారి బడ్జెట్ ప్రవేశపెట్టిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ప్రజల ఆకాంక్షలు పట్టించుకోకుండా ఆంక్షల పద్దు పెట్టారని అన్నారు. -
సంక్షిప్త వార్తలు (4)
బడ్జెట్లో అధిక కేటాయింపుల ద్వారా.. తమది రైతు ప్రభుత్వమని మరోసారి నిరూపించుకున్నట్లయిందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అన్నారు. -
ఫైళ్ల దహనంతో మాకు సంబంధం లేదు: వైకాపా ఎంపీ మిథున్రెడ్డి
మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో జరిగిన రెవెన్యూ దస్త్రాల దహనం ఘటనతో తమకెలాంటి సంబంధం లేదని వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి పేర్కొన్నారు. -
గాజులదిన్నె ప్రాజెక్టు పనులపై విచారణ చేపడతాం: మంత్రి నిమ్మల
సంజీవయ్య గాజులదిన్నె ప్రాజెక్టు పనులపై విచారణ చేపడతామని జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. -
రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతీయడానికే జగన్ దిల్లీ నిరసన: హోంమంత్రి అనిత
రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతీయడానికే మాజీ సీఎం జగన్ దిల్లీలో నిరసన పేరుతో చౌకబారు ఆరోపణలు చేశారని హోంమంత్రి అనిత మండిపడ్డారు. 36 రాజకీయ హత్యలు జరిగాయని నిస్సిగ్గుగా మాట్లాడారని ధ్వజమెత్తారు. -
వరద బాధిత రైతులను తక్షణమే ఆదుకోవాలి
కోస్తా జిల్లాల్లోని వరద బాధిత రైతులకు తక్షణమే నష్టపరిహారం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల గురువారం లేఖ రాశారు. -
రైతుల జీవితాలతో చెలగాటం వద్దు!
‘ఎన్నికలు అయిపోయాయి.. రాజకీయాలు వదిలేయండి.. రాజకీయాల కోసం రైతుల జీవితాలతో చెలగాటమాడొద్దు’ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. -
సంతోషదాయక బడ్జెట్: కూనంనేని
నిధుల పరంగా రాష్ట్రం సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సంతోషదాయకంగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు.