జగన్ది విధ్వంసం.. కూటమిది నిర్మాణం
‘మొక్కకు నీరు పోసి పెంచితే పెరిగి పెద్దదై మహావృక్షమై ఫలాలు, నీడనిస్తుంది. అన్ని విధాలా ఉపయోగపడుతుంది. మీరు విజ్ఞతతో ఎన్డీయేకు ఓటేస్తే వృథా పోదు. మీ అభివృద్ధి, అభ్యున్నతికి బాటలు వేస్తుంది.
ఎవరి పాలన కావాలో ప్రజలే ఆలోచించాలి
నాతో ఉంటే వాలంటీర్లకు భవిష్యత్తు
రాష్ట్రాన్ని గాడిన పెట్టేందుకే కష్టపడుతున్నా
జె‘గన్’రెడ్డీ.. గులకరాయి డ్రామాలు ఆపు
రాజాం, పలాస ప్రజాగళం సభల్లో తెదేపా అధినేత చంద్రబాబు
ఈనాడు- విజయనగరం, ఈనాడు డిజిటల్ శ్రీకాకుళం, న్యూస్టుడే - రాజాం, గరివిడి, రేగిడి, టెక్కలి: ‘మొక్కకు నీరు పోసి పెంచితే పెరిగి పెద్దదై మహావృక్షమై ఫలాలు, నీడనిస్తుంది. అన్ని విధాలా ఉపయోగపడుతుంది. మీరు విజ్ఞతతో ఎన్డీయేకు ఓటేస్తే వృథా పోదు. మీ అభివృద్ధి, అభ్యున్నతికి బాటలు వేస్తుంది. మీ జీవితాలకు మాది భరోసా. రాష్ట్రంలో అందలం ఎక్కిన తొలిరోజు నుంచే రివర్స్ పాలనకు శ్రీకారం చుట్టిన జగన్ది అరాచకం.. విధ్వంసం. మా కూటమి విధానం నిర్మాణం.. ఎవరి పాలన కావాలో ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి’ అని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. విజయనగరం జిల్లా రాజాం, శ్రీకాకుళం జిల్లా పలాసలలో సోమవారం ప్రజాగళం సభల్లో ఆయన మాట్లాడారు. నవ్యాంధ్రప్రదేశ్ బాగుకు ఏనాడూ ఆలోచించని జగన్కు ఈ సభ నుంచే ‘జె-గన్ రెడ్డి’ అని నామకరణం చేస్తున్నానన్నారు. ‘ఏ ప్రాంతమైనా బాగుపడాలంటే నీరు, రహదారులు, విద్యాలయాలు అవసరం. కానీ ఈ ప్రభుత్వం వాటిని పట్టించుకోలేదు. రాజాం నుంచి పాలకొండ రోడ్డు ఆ పరిస్థితికి అద్దం పడుతోంది’ అని ఎద్దేవా చేశారు. ఈ రహదారిలో ఎంతమంది ప్రాణాలు విడిచారో అందరికీ తెలుసని.. ఈ ప్రభుత్వానికి సిగ్గుండాలని ధ్వజమెత్తారు. కూటమి సభలకు స్వచ్ఛందంగా వచ్చిన జనాలను చూసి వైకాపా నాయకులకు దడ పుడుతోందన్నారు.
‘అసాక్షి’లో అందమైన అబద్ధాలు..
రాష్ట్రాన్ని బాగు చేయాలన్న కమిట్మెంట్ ఉందా అని జగన్ను తెదేపా అధినేత ప్రశ్నించారు. తెదేపా పాలనలో ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని తీసుకొచ్చాం. రూ.రెండు వేల కోట్లు ఖర్చు చేశాం.. వైకాపా ప్రభుత్వం ఈ అయిదేళ్లలో రూ.5 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. ఉత్తరాంధ్రలోని సాగునీటి ప్రాజెక్టులకు రూ.16 వేల కోట్లు వెచ్చించాం. ఆయన సొంత పత్రిక అసాక్షి తప్పుడు కథనాలు రాస్తోంది. ఆ పత్రికకు రూ.వందల కోట్ల విలువైన ప్రభుత్వ ప్రకటనలిచ్చారు. ఈ సొమ్ముతో ఉత్తరాంధ్రలో జలవనరుల ప్రాజెక్టులన్నీ పూర్తయ్యేవి. రాష్ట్ర విభజన అనంతరం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలంటే రవాణా మార్గాలు మెరుగుపడాలని అప్పట్లో భావించాం. ఆ ఉద్దేశంతోనే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అవసరమైన భూములు సేకరించాం. నేను అధికారంలో ఉంటే భోగాపురం విమానాశ్రయం 2020 నాటికే పూర్తయ్యేది. తిక్కలోడు వచ్చి రివర్స్ చేశారు.
గిరిజన విశ్వవిద్యాలయం ఎక్కడుందో..
విభజన చట్టంలో భాగంగా రాష్ట్రానికి కేటాయించిన కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం నిర్మాణాన్ని పూర్తిచేయలేకపోయారని చంద్రబాబు మండిపడ్డారు. నేను శంకుస్థాపన చేశానన్న అక్కసుతో వేరే చోటుకు మార్చారు. విశాఖలో రూ.40 వేల కోట్ల ఆస్తులను హస్తగతం చేసుకున్నారు. విశాఖను మాదకద్రవ్యాల కేంద్రంగా మార్చారు. విదేశాల నుంచి 25 వేల కిలోల డ్రగ్స్ సముద్ర మార్గంలో దిగుమతి అవడం ప్రభుత్వానికి తెలియకుండా జరుగుతుందా. ఐటీ హబ్గా మార్చేందుకు ఎన్నో మల్టీ నేషనల్ కంపెనీలను తీసుకొస్తే వాటిని తరిమేశారు. నా హయాంలో మెడ్టెక్ జోన్ ఏర్పాటు చేసి పది వేలమందికి పైగా ఉద్యోగావకాశాలు కల్పించా. దాన్ని మూసే ప్రయత్నం చేశారు. కేంద్ర ప్రభుత్వం అడ్డుపడటంతో కొనసాగిస్తున్నారు. ‘ఉత్తరాంధ్రలో ఈ ప్రభుత్వం సామాజిక న్యాయం ఎక్కడ పాటించింది? నా బీసీలు, నా ఎస్టీలు అంటారు తప్ప వారికి ఏ రకంగానూ ఊతమివ్వలేదు. విశాఖలో విజయసాయిరెడ్డి, వైవీ.సుబ్బారెడ్డి పెత్తనం ఏంటి? మీ బోడి పెత్తనం ఇక్కడ ఏంటని వారిని నిలదీస్తున్నా’ అని చంద్రబాబు ప్రశ్నించారు.
భువనేశ్వరిని అభినందిస్తున్నా..
‘నన్ను వేధించారు.. రాళ్లతో దాడి చేశారు. చివరకు ఇంటి గుమ్మం దాటని నా భార్యపై విమర్శలు చేశారు. ఆమె ఆరు నెలలుగా ప్రజల ముంగిట తిరుగుతున్నారు. నా అక్రమ అరెస్టు వల్ల ప్రాణాలు విడిచిన 203 మంది కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం అందించారు. వారి పిల్లలను చదివిస్తానని భరోసా ఇచ్చారు. మీ అందరి తరఫున నా భార్య భువనేశ్వరిని అభినందిస్తున్నా’ అని పేర్కొన్నారు.
పవన్కు మహిళలంటే గౌరవం
పవన్ కల్యాణ్కు మహిళలంటే గౌరవం. రాష్ట్రాన్ని కాపాడటానికి నడుం కట్టారు. ఆయనను జె-గన్రెడ్డి మానసికంగా, శారీరకంగా ఎంతో ఇబ్బందికి గురి చేసినా.. మడమ తిప్పని నాయకుడిగా నిలిచారు. రాష్ట్రం కోసం ఆయన తీసుకున్న నిర్ణయం ఎంతో గొప్పది’ అని అన్నారు.
అయిదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు..
‘పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశా. రాష్ట్ర ప్రగతి కోసమే ఎన్టీయే, జనసేనతో కలిశా. కేంద్రంలో మోదీ మూడోసారి ప్రధాని అవుతారు. ఆయన ఎన్నో పథకాలు తీసుకొచ్చారు. నేనూ సూపర్- 6 పథకాలు అమలు చేస్తా. వచ్చే అయిదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. మెగా డీఎస్సీ, 25 వేల కానిస్టేబుళ్ల ఉద్యోగాలు భర్తీ చేస్తాం.. రైతు భరోసా కింద రూ. 12,500 ఇస్తానని జె-గన్రెడ్డి రూ. 7,500 ఇచ్చి పచ్చి మోసం చేస్తున్నారు. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు ఏటా రూ. 20 వేలు ఇస్తాం. సామాజిక భద్రత పింఛను రూ. 4 వేలకు పెంచి ఏప్రిల్ నుంచే అందిస్తాం. వాలంటీర్ల వేతనాలను రూ. 10 వేలకు పెంచుతాం’ అని హామీ ఇచ్చారు.
వారు ఇచ్చిందెంతో.. కొట్టేసిందెంతో లెక్కేయండి
‘జగన్ ఇచ్చిందెంతో.. తిరిగి కొట్టేసిందెంతో ప్రజలు లెక్క కట్టాలి. విద్యుత్తు ఛార్జీల పెంపు, నిత్యావసర సరకులు, పెట్రోల్, మద్యం, ఇసుక, సిమెంటు, ఇనుము ధరలు భారీగా పెంచడంతో ఎంత ఆర్థిక భారం పడిందో తెలుసుకోవాలి. రూ. 10 లక్షల కోట్ల అప్పు చేయడంతో ప్రతి కుటుంబం పైనా రూ. ఆరు లక్షల చొప్పున భారం పడింది. ప్రతి వ్యక్తి రక్తాన్ని జలగలా తాగేశారు’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
నిద్ర లేని రాత్రులు గడిపాను
‘ఈ అయిదేళ్లలో నిద్ర లేని రాత్రులెన్నో గడిపాను. ఏ సమయంలో ఎవరిని అరెస్టు చేస్తారో తెలియదు. వారి కోసం కోర్టుకెళ్లాలి.. కాపాడుకోవాలి.. ఇలా ఎన్నో బాధలు పడ్డాం. రాత్రికి రాత్రే అచ్చెన్నాయుడిని అరెస్టు చేశారు. శుక్రవారం వస్తే పొక్లెయిన్ పంపుతారు. ఆస్తులను కూల్చడం వారికి అలవాటుగా మారింది. ఆర్థికంగా దెబ్బకొట్టాలని ప్రయత్నించారు’ అని అన్నారు.
పలాసలో చంద్రబాబు హెలికాప్టర్ తనిఖీ
చంద్రబాబు ప్రయాణించిన హెలికాప్టర్ను శ్రీకాకుళం జిల్లా పలాసలో ఎన్నికల ఫ్లయింగ్ స్వ్కాడ్ సిబ్బంది తనిఖీ చేశారు. స్థానిక జూనియర్ కళాశాల మైదానంలో ఆయన దిగిన వెంటనే ఫ్లయింగ్ స్వ్కాడ్ అధికారి, ఆర్డబ్ల్యూఎస్ డీఈ (పలాస) దుప్పల ఆశాలత హెలికాప్టర్లో తనిఖీ చేశారు.
మంత్రి సీదిరిని అడవుల్లోకి పంపాలి
‘దేశంలోనే నంబర్ వన్ సంపన్న ముఖ్యమంత్రి జగన్రెడ్డి. అదే సమయంలో దేశంలోనే పేదరికం ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. బిహార్కు మించిన నిరుద్యోగం ఇక్కడ ఉంది. రాష్ట్రంలో జనగణనతో పాటు నైపుణ్య గణన చేస్తాం. వారి ఆసక్తి మేరకు శిక్షణ అందిస్తాం. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని రానున్న అయిదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. 14 ఏళ్లలో సాధించిన ప్రగతి వచ్చే అయిదేళ్లలో చూపిస్తాం. 30 ఏళ్లలో చెప్పుకోవడానికి ఏం చేశారని వాళ్లు అడుగుతున్నారు. బాబు వస్తే జాబు వస్తుందనేది నా బ్రాండ్. గంజాయి, డ్రగ్స్ జగన్ బ్రాండ్. ముఖ్యమంత్రి రుషికొండకు బోడి గుండు చేస్తే, పలాసలో మంత్రి సీదిరి అప్పలరాజు నాలుగు కొండలను అక్రమంగా కబ్జా చేశారు. అడవుల్లోని ఎలుగుబంట్లు గ్రామాల మీద పడి మనుషుల్ని చంపేస్తున్నాయి. మంత్రి అప్పలరాజును అడవుల్లోకి పంపాలి’ అని చంద్రబాబు పేర్కొన్నారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్నాయుడు, పొలిట్ బ్యూరో సభ్యురాలు ప్రతిభా భారతి, విజయనగరం ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు, వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల తెదేపా అభ్యర్థులు గౌతు శిరీష, మామిడి గోవిందరావు, బగ్గు రమణమూర్తి, గొండు శంకర్, కోండ్రు మురళీమోహన్, బెందాళం అశోక్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
బడ్జెట్ ప్రసంగం ఒక రాజకీయ ప్రసంగంలా ఉందని భారాస ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. -
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
జగన్.. మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి? అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. -
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
తెలంగాణ బడ్జెట్లో హైదరాబాద్ నగర మౌలిక సదుపాయాలకు రూ.10 వేల కోట్లు కేటాయించినందుకు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. -
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం