‘మేమంతా సిద్ధం’ కాదన్న గుడివాడ!
బస్సులు పెట్టారు. మద్యం తాగించారు. బిర్యానీ పెట్టారు. తలా రూ.300 ఇచ్చారు. కృష్ణా జిల్లాతో పాటు పక్క జిల్లాలకూ బస్సులు పంపి మరీ జనాన్ని తరలించేందుకు ప్రయత్నించారు. అయినా ‘మేమంతా సిద్ధం’గా లేమంటూ ప్రజలు పెద్దగా స్పందించలేదు.
జనాలు లేక వెలవెలబోయిన జగన్ సభ
ఏలూరు జిల్లా బస్సుయాత్రలోనూ అదేతీరు
ఈనాడు, అమరావతి: బస్సులు పెట్టారు. మద్యం తాగించారు. బిర్యానీ పెట్టారు. తలా రూ.300 ఇచ్చారు. కృష్ణా జిల్లాతో పాటు పక్క జిల్లాలకూ బస్సులు పంపి మరీ జనాన్ని తరలించేందుకు ప్రయత్నించారు. అయినా ‘మేమంతా సిద్ధం’గా లేమంటూ ప్రజలు పెద్దగా స్పందించలేదు. సోమవారం కృష్ణా జిల్లా గుడివాడలో సీఎం జగన్ నిర్వహించిన ‘మేమంతా సిద్ధం’ సభ వెలవెలబోయింది. రోడ్డు షోలోనూ అదే పరిస్థితి. విజయవాడలో జగన్పై రాయి దాడి ఘటన తర్వాత ఏర్పాటుచేసిన తొలి సభ కావడంతో సానుభూతి వెల్లువలా వస్తుందని వైకాపా వర్గాలు భావించాయి. కానీ ఎక్కడా ఆ స్పందన కనిపించలేదు. మచిలీపట్నం, పెడన, అవనిగడ్డ, నూజివీడు, పామర్రు, గన్నవరం, విజయవాడ, మైలవరం, తిరువూరు నియోజకవర్గాల నుంచి జనాన్ని తరలించారు. సోమవారం కృష్ణా జిల్లాలో యాత్ర చేపట్టారు. ఉదయం 9 గంటలకు కేసరపల్లి నుంచి బయల్దేరాల్సిన బస్సు.. జనాలు సిద్ధంగా లేరని 11 గంటలకు ప్రారంభమైంది.
గన్నవరంలో విమానాశ్రయానికి భూములు కోల్పోయిన నిర్వాసితులు సీఎంకు వినతి పత్రమిచ్చారు. వారితో కాసేపు మాట్లాడిన జగన్.. దారిలో ఎక్కడా పెద్దగా మాట్లాడలేదు. యాత్ర హైవేలో వెళ్తుండగా, పోలీసులు గన్నవరం, హనుమాన్ జంక్షన్లలో దుకాణాలు మూయించారు. మధ్యాహ్నం జొన్నపాడు మీదుగా బయల్దేరి సాయంత్రం గుడివాడ శివారు నాగవరప్పాడు సభాస్థలికి చేరుకున్నారు. ఐదు ఎకరాల విస్తీర్ణంలో సభ ఏర్పాటు చేయగా, అందులో ర్యాంపు, వేదిక పోనూ సభికులకు కొద్ది స్థలమే మిగిలింది. అది కూడా నిండలేదు. జనాన్ని తరలించిన వాహనాలను రోడ్లపైనే నిలపడంతో గుడివాడ పట్టణంలో ట్రాఫిక్ సమస్యలెదురయ్యాయి. తొలుత ప్రకటించిన రూట్ మ్యాప్ ప్రకారం ఈ సభ తర్వాత గుడ్లవల్లేరు, పెడన, కృత్తివెన్ను మీదుగా భీమవరం వెళ్లాలి. కానీ ఆదివారం ప్రణాళికను మార్చి, కృష్ణా జిల్లాలో గుడివాడకే పరిమితం చేశారు. అక్కడి నుంచి హనుమాన్ జంక్షన్కు వచ్చి హైవే మీదుగా ఏలూరు జిల్లాలోకి ప్రవేశించారు.
అబద్ధాల ప్రవాహం
సీఎం జగన్ తన ప్రసంగంలో అబద్ధాలు వల్లెవేశారు. బందరు పోర్టు నిర్మాణానికి తెదేపా హయాంలోనే శంకుస్థాపన చేసి, ముడా ఏర్పాటు చేయగా, తానే శంకుస్థాపన చేసినట్లు జగన్ చెప్పారు. మూడు పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటు చేశామన్నారు. వాస్తవానికి బందరు కారిడార్లో ఒక్క పరిశ్రమా రాలేదు.
ఏలూరు జిల్లాలో అభివాదాలతో సరి
ఈనాడు, ఏలూరు: కలపర్రు టోల్గేటు వద్ద బస్సుయాత్ర సోమవారం రాత్రి ఏలూరు జిల్లాలోకి ప్రవేశించింది. ఏలూరు, దెందులూరు, ఉంగుటూరు నియోజకవర్గాల్లోని ఆశ్రం కూడలి, గుండుగొలను, భీమడోలు, కైకరం, చేబ్రోలు మీదుగా నారాయణపురం వరకు దాదాపు 60 కిమీ ప్రయాణించిన జగన్.. ఎక్కడా ప్రసంగించలేదు. అభివాదం చేస్తూ, చేతులూపుతూ ముందుకు సాగారు. కూడళ్లలో ప్రజలు పల్చగా ఉండటంతో జగన్ బస్సులోంచి బయటకు రాలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి ఎన్నికల ప్రచారంలో చేదు అనుభవం
కడప జిల్లా వేంపల్లి మండలం కుమ్మరంపల్లిలో సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతికి చేదు అనుభవం ఎదురైంది. -
‘మీ బిడ్డను’ అంటూ.. జగన్ ఊరూరా తిరిగినప్పుడే అనుమానించా: లోకేశ్
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. ప్రజల భూములు కొట్టేసే నల్ల చట్టమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దుయ్యబట్టారు. -
భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుంది: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
లోక్సభ ఎన్నికల్లో భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుందని నిర్మలా సీతారామన్ ధీమా వ్యక్తం చేశారు. -
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
ఐదేళ్ల జగన్ పాలనలో అంతా దోపిడీయేనని తెదేపా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. -
కాంగ్రెస్లో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు
భారాసకు మరో షాక్ తగిలింది. తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు అమిత్ కాంగ్రెస్లో చేరారు. -
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలోని వడ్డేపాళ్యం గ్రామంలో ఆదివారం రాత్రి నిర్వహించిన తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి జరిగింది. -
ఆమెను చూసి ‘నెహ్రూ’ ఆత్మ కన్నీరు పెడుతుంది: మధ్యప్రదేశ్ సీఎం
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ఆమె ఇంటి పేరు ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి ఎన్నికల ప్రచారంలో చేదు అనుభవం
-
సొంతగడ్డపై చెలరేగిన కోల్కతా.. దిల్లీపై ఘన విజయం
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
నదిలో ఈతకు వెళ్లి ఐదుగురు బీటెక్ విద్యార్థులు మృతి
-
పెళ్లి పత్రికలో ‘మోదీ’ ప్రస్తావన.. చిక్కుల్లో నవ వరుడు!