యూపీ సీటు కాపాడుకోలేని యువరాజు
కాంగ్రెస్ యువరాజు ఉత్తర్ప్రదేశ్లో తన కుటుంబ స్థానాన్ని (అమేఠీ) కాపాడుకోవడం చేతకాక, కేరళలో కొత్త స్థావరాన్ని ఏర్పరచుకున్నారని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు.
కేరళలో రాహుల్ పోటీపై ప్రధాని ఎద్దేవా
తిరువనంతపురం, త్రిశ్శూర్: కాంగ్రెస్ యువరాజు ఉత్తర్ప్రదేశ్లో తన కుటుంబ స్థానాన్ని (అమేఠీ) కాపాడుకోవడం చేతకాక, కేరళలో కొత్త స్థావరాన్ని ఏర్పరచుకున్నారని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. సోమవారం కేరళలో పర్యటించిన ప్రధాని త్రిశ్శూర్ జిల్లా కున్నమ్కులం ఎన్నికల సభలో మాట్లాడుతూ రాహుల్గాంధీ పేరెత్తకుండా పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఆయన కేరళలో ఓట్లు అడుగుతున్నారు. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రం గళమెత్తరు’’ అని దుయ్యబట్టారు. సహకార బ్యాంకుల కుంభకోణంలో సీపీఎం పేదల సొమ్మును దోచుకొందని, దీనిపై కాంగ్రెస్ అగ్రనేత మౌనం ఎందుకు పాటిస్తున్నారని నిలదీశారు. ఈ ఎన్నికల్లో గెలవడానికి దేశంలో నిషేధించిన పీఎఫ్ఐ సంస్థ రాజకీయ విభాగమైన సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియాతో కాంగ్రెస్ రహస్య ఒప్పందం చేసుకుందని మోదీ ఆరోపించారు. ‘‘త్రిపుర, పశ్చిమబెంగాల్ నుంచి కేరళ వరకు వామపక్ష ప్రభుత్వాలకు ఒక లక్షణం ఉంది. లెఫ్ట్ ప్రభుత్వాలు పాలించినచోట ఏమీ మిగలదు.. ఏదీ సరిగా జరగదు’’ అని వ్యాఖ్యానించిన ప్రధాని ‘నథింగ్ లెఫ్ట్ అండ్ నథింగ్ రైట్’ అనే పదజాలాన్ని వాడారు. ఎన్డీయే ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి రాగానే దేశ ఉత్తర, దక్షిణ, తూర్పు ప్రాంతాల్లో బుల్లెట్ రైళ్ల కోసం సర్వే ప్రారంభమవుతుందని హామీ ఇచ్చారు. తిరువనంతపురం జిల్లాలోని అట్టింగల్ లోక్సభ నియోజకవర్గ పరిధి కట్టక్కడా పట్టణ ఎన్నికల సభలో మోదీ మాట్లాడారు.
కాంగ్రెస్, డీఎంకే ‘కచ్చతీవు’ పాపులు
ఈనాడు, చెన్నై - తిరునల్వేలి: తమిళనాడులో లోక్సభ ఎన్నికల ప్రచారం ముగింపులో భాగంగా సోమవారం తిరునల్వేలి బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ ఒక్కసారి ఎన్డీయేకు అవకాశమివ్వాలని ఓటర్లను కోరారు. ప్రపంచవ్యాప్తంగా తిరువళ్లువర్ కేంద్రాలను ఏర్పాటుచేస్తామన్న ప్రధాని.. కచ్చతీవు ద్వీపాన్ని శ్రీలంకకు అప్పగించిన కాంగ్రెస్, డీఎంకే పార్టీలను ‘పాపులు’గా అభివర్ణించారు. తమిళనాడు నుంచి ఆ దీవిని విడగొట్టి మరో దేశానికి ఇచ్చేసిన ఈ రెండు పార్టీలు జాతి ప్రయోజనాలకు విరుద్ధమైనవిగా పేర్కొన్నారు. నాలుగు దశాబ్దాలపాటు వారు దాచిన ఈ నిజాన్ని భాజపా బట్టబయలు చేసిందని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి ఎన్నికల ప్రచారంలో చేదు అనుభవం
కడప జిల్లా వేంపల్లి మండలం కుమ్మరంపల్లిలో సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతికి చేదు అనుభవం ఎదురైంది. -
‘మీ బిడ్డను’ అంటూ.. జగన్ ఊరూరా తిరిగినప్పుడే అనుమానించా: లోకేశ్
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. ప్రజల భూములు కొట్టేసే నల్ల చట్టమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దుయ్యబట్టారు. -
భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుంది: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
లోక్సభ ఎన్నికల్లో భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుందని నిర్మలా సీతారామన్ ధీమా వ్యక్తం చేశారు. -
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
ఐదేళ్ల జగన్ పాలనలో అంతా దోపిడీయేనని తెదేపా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. -
కాంగ్రెస్లో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు
భారాసకు మరో షాక్ తగిలింది. తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు అమిత్ కాంగ్రెస్లో చేరారు. -
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలోని వడ్డేపాళ్యం గ్రామంలో ఆదివారం రాత్రి నిర్వహించిన తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి జరిగింది. -
ఆమెను చూసి ‘నెహ్రూ’ ఆత్మ కన్నీరు పెడుతుంది: మధ్యప్రదేశ్ సీఎం
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ఆమె ఇంటి పేరు ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి ఎన్నికల ప్రచారంలో చేదు అనుభవం
-
సొంతగడ్డపై చెలరేగిన కోల్కతా.. దిల్లీపై ఘన విజయం
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
నదిలో ఈతకు వెళ్లి ఐదుగురు బీటెక్ విద్యార్థులు మృతి
-
పెళ్లి పత్రికలో ‘మోదీ’ ప్రస్తావన.. చిక్కుల్లో నవ వరుడు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM