అంబేడ్కర్ను అవమానిస్తే ఊరుకుందామా..?
‘భారాసకు ఇప్పుడు పార్లమెంటు ఓట్లు, సీట్లు ఎందుకు అని కొంతమంది తెలివి లేనివాళ్లు అంటున్నారు.. ఇప్పుడే భారాసకు సీట్లు కావాలి.
అతిపెద్ద విగ్రహం మేం నిర్మించామని నివాళి అర్పించకుండా తాళాలేస్తారా?
ఈ ప్రభుత్వానికి ముకుతాడు వేయాలి
అప్పుడప్పుడు లిల్లీపుట్లకు కూడా అధికారం వస్తుంది..
రైతు సమస్యలపై పోస్టుకార్డు ఉద్యమం
భారాస ఎంపీలతోనే తెలంగాణకు న్యాయం
ఆ పార్టీ అధినేత కేసీఆర్
న్యూస్టుడే, సంగారెడ్డి టౌన్: ‘భారాసకు ఇప్పుడు పార్లమెంటు ఓట్లు, సీట్లు ఎందుకు అని కొంతమంది తెలివి లేనివాళ్లు అంటున్నారు.. ఇప్పుడే భారాసకు సీట్లు కావాలి. ఆనాడు కరీంనగర్ ఎంపీగా నన్ను గెలిపించి ఉండకపోతే, తెలంగాణ కావాలని పార్లమెంటులో గర్జించి ఉండకపోతే, ప్రత్యేక రాష్ట్రం సిద్ధించేదా?’ అని మాజీ ముఖ్యమంత్రి, భారాస అధినేత కేసీఆర్ ప్రశ్నించారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ శివారులో మెదక్, జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇప్పుడు కూడా తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరాలంటే భారాస బిడ్డలు పార్లమెంటులో ఉండాలని పేర్కొన్నారు. ‘రాజకీయాల్లో అప్పుడప్పుడు గమ్మత్తు జరుగుతుంది. లిల్లీపుట్లకు కూడా అధికారం వస్తుంది. గత ప్రభుత్వం కంటే మంచి పనులు చేయాలని ప్రజలు అధికారం ఇస్తారు తప్ప, అడ్డదిడ్డంగా వ్యవహరించడానికి కాదు.
రాజ్యాంగంలో ఆర్టికల్ 3ని అంబేడ్కర్ చేర్చడం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాధ్యమైంది. ఆ మహనీయుడిని గౌరవించుకోవడానికి దేశంలో ఎక్కడా లేని విధంగా 125 అడుగుల అతిపెద్ద అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశాం. విగ్రహం నెలకొల్పాక వచ్చిన తొలిజయంతి రోజున ఈ ప్రభుత్వం ఒక్క పూలమాల కూడా వేయలేదు. నివాళి అర్పించలేదు. అంబేడ్కర్ను అవమానిస్తే మౌనం పాటిద్దామా.. దళితబంధు పథకాన్ని బంద్ చేస్తే నోరు మూసుకుందామా?.. అని దళిత సోదరులను అడుగుతున్నా. అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రజలు దర్శించుకునేందుకు వీలు లేకుండా తాళం వేశారు. ఇది అహంకారమా, అజ్ఞానమా? భారాస ప్రభుత్వం ఏర్పాటు చేసిన విగ్రహమైనందునే అలా ప్రవర్తించారు. మరి సచివాలయం, యాదగిరి గుట్ట ఆలయాన్ని కూడా మా ప్రభుత్వమే నిర్మించింది కదా. ఎమ్మెల్యేలు ఉంటున్న క్యాంపు కార్యాలయాలు కూడా మేం నిర్మించినవే. వాటిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండడం లేదా? ఆ లెక్కన మిషన్ కాకతీయ చెరువులను కూడా పూడ్చేస్తారా? ఉద్యోగులు, ఉపాధ్యాయులను మా ప్రభుత్వ హయాంలో ఎంతో గౌరవించాం. అవన్నీ మరిచిపోయి ఆగమాగం అయితే వారే నష్టపోతారు. అందుకే ఆలోచించి ఈ ప్రభుత్వానికి ముకుతాడు వేయాలి.
హామీల అమలేదీ?
ప్రత్యేక రాష్ట్రం కోసం 15 ఏళ్లు పోరాటం చేశాను. తెలంగాణ వచ్చాక పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశాను. రైతులకు అండగా ఎన్నో పథకాలు అమలు చేశాం. డిసెంబరు 9న రైతు రుణ మాఫీ చేస్తామని ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోలేదు. రైతుబంధు సాయం కూడా అందరికీ అందలేదు. పంట ఉత్పత్తులకు రూ.500 బోనస్ ప్రకటన బోగసేనా? రూ.2 లక్షల రుణ మాఫీ, ఎండిన పంటలకు ఎకరాకు రూ.25 వేల పరిహారం, వడ్లు వెంటనే కొనుగోలు తదితర డిమాండ్లతో సిద్దిపేట రైతుల మాదిరిగా రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతలు పోస్టుకార్డు ఉద్యమాన్ని చేపట్టాలి. బోనస్ ఇచ్చేందుకు ఎన్నికల కోడ్ అడ్డు వస్తుందనుకుంటే.. హామీపత్రం ఇవ్వాలి. ఎన్నికల తర్వాత నగదు ఇవ్వాలి’ అని కేసీఆర్ డిమాండ్ చేశారు.
పోలీసులూ జాగ్రత్త.. అన్నీ రికార్డు చేస్తున్నాం
కరీంనగర్ జిల్లాలో భారాస కార్యకర్త సర్వాజీ మాధవరావుపై కేసు పెట్టడంపై కేసీఆర్ స్పందిస్తూ.. ‘పోలీసు సోదరులారా జాగ్రత్త.. అన్నీ రికార్డు చేస్తున్నాం. మీ విధులు మీరు నిర్వహించండి. డీజీపీ తీరు మారాలి. వ్యవస్థపై ఆయనకు గౌరవం ఉంటే సీనియర్ ఐపీఎస్ అధికారితో విచారణ జరిపించాలి. దౌర్జన్యానికి పాల్పడిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు. దౌర్జన్యాలను తాను ఏనాడూ ప్రోత్సహించలేదని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు హరీశ్రావు, మహమూద్ అలీ, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, మెదక్, జహీరాబాద్ ఎంపీ అభ్యర్థులు వెంకట్రామిరెడ్డి, గాలి అనిల్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఈ ప్రభుత్వం ఏడాదైనా ఉంటుందో.. ఉండదో..
‘ఈ ప్రభుత్వంపై తెలంగాణ జనం అప్పుడే తిరగబడుతున్నారు. కాంగ్రెస్కు రెండు పార్లమెంటు సీట్లు కూడా రావని సర్వేలు చెబుతున్నాయి. అందుకే ముఖ్యమంత్రిలో వణుకు మొదలైంది. మొన్న నారాయణపేటలో ఆయన ప్రసంగంలో భయం చూస్తే.. ఈ సర్కారు ఏడాదైనా ఉంటుందో, ఉండదో అనిపిస్తోంది. కాంగ్రెసోళ్లు ఎవరెప్పుడు భాజపాలో చేరతారో.. ముఖ్యమంత్రే దూకేస్తారో చెప్పలేం’
సుల్తాన్పూర్ సభలో కేసీఆర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కమీషన్ల కోసమే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారు: ఉత్తమ్
కమీషన్లకు కక్కుర్తిపడి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మండిపడ్డారు. -
స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు సమంజసం కాదు: కోదండరాం
ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై తెలంగాణ జన సమితి(తెజస) అధ్యక్షుడు ఆచార్య కోదండరాం మండిపడ్డారు. -
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఘటనపై అభూతకల్పన కల్పిస్తున్నారని మాజీ సీఎం, వైకాపా అధినేత జగన్ అన్నారు. -
వైకాపా హయాంలో రూ.9.74 లక్షల కోట్ల అప్పులు చేశారు: ఏపీ సీఎం చంద్రబాబు
2014-19 మధ్య పెట్టుబడులకు చిరునామాగా ఆంధ్రప్రదేశ్ను నిలిపామని సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. -
గోదావరిలో నీరుంది.. కానీ ప్రభుత్వానికి ఇచ్చే మనసు లేదు: కేటీఆర్
తెలంగాణలో కరవు అనే మాట వినపడకూడదని కేసీఆర్.. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
వైకాపా హయాంలో ప్రకటనల కుంభకోణం.. హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేల డిమాండ్
వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రకటనల కుంభకోణంపై హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. -
ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.. మంత్రులకు చంద్రబాబు సూచన
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించడం... వంటి మంచి పనుల్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. -
సకుటుంబ సమేతంగా కేసులు.. అక్రమ కేసులున్నవారు నిలబడాలని కోరిన చంద్రబాబు
వివాహాలు, ఇతర శుభకార్యాలకు సకుటుంబ సపరివార సమేతంగా రావాలని ఆహ్వానిస్తుంటాం.. అయితే గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలపై సకుటుంబ సమేతంగా అక్రమ కేసులు నమోదు చేసి వేధించారని చంద్రబాబు, ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. శ్వేతపత్రం విడుదల సందర్భంగా.. వైకాపా ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలపై నమోదైన అక్రమ కేసుల సంఖ్యను చంద్రబాబు ప్రస్తావించారు. -
ఏపీ ‘ఎస్కోబార్’ జగన్.. చీకటి సామ్రాజ్యాధిపతితో పోల్చిన చంద్రబాబు
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అరాచకాలను వివరించేటప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కొలంబియన్ మాదకద్రవ్యాల చీకటి సామ్రాజ్యాధిపతి పాబ్లో ఎమిలియో ఎస్కోబార్ చరిత్రను సభకు వినిపించారు. -
‘రఘురామను చిత్రహింసలు పెట్టినప్పుడు మీరంతా ఏమయ్యారు?’
మాజీ ముఖ్యమంత్రి జగన్ దిల్లీలో చేసిన నిరసనకు ఇండియా కూటమి నాయకులు మద్దతు పలకడాన్ని అనంతపురం తెదేపా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. -
అన్ని వర్గాలకూ మోసం
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలనూ మోసం చేసిందని, అందర్నీ వెన్నుపోటు పొడిచిందని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. -
శాంతిభద్రతల పరిరక్షణపై సభలో చర్చిద్దాం
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు.. రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలపై శాసనసభలో ఒక రోజు పూర్తిగా చర్చించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు. -
ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని దోచేశారు
‘వైకాపా ప్రభుత్వం చేసిన నిర్వాకాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు విద్యుత్తు, అమరావతి, పోలవరం, గనులు, మద్యంపై శ్వేతపత్రాలు విడుదల చేశారు. -
వైకాపా ప్రభుత్వం ఇళ్లు కూల్చింది.. ఆదుకోండి
తెదేపాకు అనుకూలంగా ఉన్నారని విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం దన్నానపేట గ్రామానికి చెందిన 30 మంది దళితుల ఇళ్లను అప్పటి వైకాపా ప్రభుత్వం కూల్చేసిందని ఆ మండల తెదేపా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు టొంపల నర్సయ్య గురువారం తెదేపా కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. -
వైకాపా పాలనలో తెదేపా శ్రేణులపై 2,560 కేసులు
వైకాపా హయాంలో గత ఐదేళ్లలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై 2,560 కేసులు నమోదు చేసి.. 2,370 మందిని అరెస్టు చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. -
ఇసుక, మద్యం అవినీతిపై విచారణ జరిపించాలి
ముఖ్యమంత్రి చంద్రబాబును రాష్ట్ర సచివాలయంలో గురువారం సీపీఎం నాయకులు కలిశారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. -
సమస్యలపై ప్రశ్నిస్తే.. వేధింపులే సమాధానం
శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం విడుదల చేసిన ‘శాంతిభద్రతల శ్వేతపత్రం’పై కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వేదికగా మాట్లాడారు. -
‘ఇండియా’ కూటమితో పొత్తు కోసమే జగన్ దిల్లీ యాత్ర
‘ఇండియా’ కూటమితో పొత్తు కోసమే వైకాపా అధ్యక్షుడు జగన్ దిల్లీ వెళ్లినట్లుగా ఉందని ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. దిల్లీ నుంచి అమరావతి చేరుకున్న జగన్... శాసనసభ సమావేశాలకు హాజరు కావాలని సూచించారు. -
ఇది పసలేని దండగమారి బడ్జెట్: కేటీఆర్
రాష్ట్ర ప్రభుత్వం పసలేని, దండగమారి బడ్జెట్ ప్రవేశపెట్టిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ప్రజల ఆకాంక్షలు పట్టించుకోకుండా ఆంక్షల పద్దు పెట్టారని అన్నారు. -
సంక్షిప్త వార్తలు (4)
బడ్జెట్లో అధిక కేటాయింపుల ద్వారా.. తమది రైతు ప్రభుత్వమని మరోసారి నిరూపించుకున్నట్లయిందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అన్నారు. -
ఫైళ్ల దహనంతో మాకు సంబంధం లేదు: వైకాపా ఎంపీ మిథున్రెడ్డి
మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో జరిగిన రెవెన్యూ దస్త్రాల దహనం ఘటనతో తమకెలాంటి సంబంధం లేదని వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
విడుదలై బయటకు..తిరిగి జైలుకు
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
-
కమీషన్ల కోసమే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారు: ఉత్తమ్
-
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్