రాజ్యాంగానికి రుణపడి ఉంటా
నిరాడంబరమైన మూలాల నుంచి ఎదిగేందుకు తనకు తోడ్పడిన బాబాసాహెబ్ అంబేడ్కర్ రాజ్యాంగానికి రుణపడి ఉంటానని ప్రధాని మోదీ అన్నారు.
బిహార్ ఎన్నికల ర్యాలీల్లో ప్రధాని మోదీ
గయా, పూర్ణియా: నిరాడంబరమైన మూలాల నుంచి ఎదిగేందుకు తనకు తోడ్పడిన బాబాసాహెబ్ అంబేడ్కర్ రాజ్యాంగానికి రుణపడి ఉంటానని ప్రధాని మోదీ అన్నారు. బిహార్లోని గయా, పూర్ణియాల్లో మంగళవారం జరిగిన ఎన్నికల ర్యాలీల్లో ప్రధాని మాట్లాడారు. భాజపా రాజ్యాంగాన్ని రద్దు చేసే యోచన చేస్తోందన్న విపక్షాల ఆరోపణలను దీటుగా తిప్పికొట్టారు. అమృతకాల్ ఉత్సవాల తరహాలో భారత రాజ్యాంగానికి 75 ఏళ్లు పూర్తయిన వేడుకను సైతం ఈ ఏడాది జరుపుకోబోతున్నట్లు తెలిపారు. ‘‘ఎమర్జెన్సీ కాలంలో రాజ్యాంగాన్ని తాకట్టు పెట్టి, దాని స్వరూపాన్ని మార్చాలని చూసినవారికి రాజ్యాంగమంటే చిన్నచూపే ఉంటుంది’’ అంటూ కాంగ్రెస్పై మండిపడ్డారు. బిహార్కు జంగిల్రాజ్ నుంచి ఎన్డీయే విముక్తి కల్పించిందని, ఆర్జేడీ నేతల అవినీతిపై విచారణ కొనసాగుతుందన్నారు.
గూండాల లీజులో బెంగాల్
రాయ్గంజ్ : మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ప్రభుత్వం పశ్చిమబెంగాల్ను చొరబాటుదారులు, గూండాలకు లీజుకు ఇచ్చిందని ప్రధాని మోదీ తీవ్ర ఆరోపణలు చేశారు. బెంగాల్లోని బాలుర్ఘాట్, రాయ్గంజ్లలో మంగళవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో మోదీ మాట్లాడారు. సందేశ్ఖాలీలో మహిళలపై జరిగిన అకృత్యాలను చూసి దేశం మొత్తం నివ్వెరపోయిందన్నారు. అవినీతి, నేరాలు నిత్య వ్యవహారంగా మారిన టీఎంసీ పాలనలో దర్యాప్తునకు వచ్చిన కేంద్ర ఏజెన్సీలపై కూడా దాడులు జరుగుతున్నాయని తెలిపారు. ‘‘రాష్ట్ర జనాభాను ప్రభావితం చేసేలా దేశంలోకి అక్రమంగా ప్రవేశించే రోహింగ్యాలు, చొరబాటుదారులకు టీఎంసీ మద్దతు ఇచ్చి.. శాంతిభద్రతల సమస్యలకు దోహదం చేస్తుంది. శరణార్థులకు పౌరసత్వం ఇచ్చే ‘సీఏఏ’ను మాత్రం వ్యతిరేకిస్తోంది’’ అని మోదీ విస్మయం వ్యక్తం చేశారు.
మంగళవారం సాయంత్రం అస్సాంకు చేరుకున్న ప్రధాని రద్దీగా ఉండే గువాహటి - షిల్లాంగ్ రోడ్డుపై 2 కి.మీ.ల మేర రోడ్ షో నిర్వహించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మీ బిడ్డను’ అంటూ.. జగన్ ఊరూరా తిరిగినప్పుడే అనుమానించా: లోకేశ్
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. ప్రజల భూములు కొట్టేసే నల్ల చట్టమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దుయ్యబట్టారు. -
భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుంది: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
లోక్సభ ఎన్నికల్లో భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుందని నిర్మలా సీతారామన్ ధీమా వ్యక్తం చేశారు. -
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
ఐదేళ్ల జగన్ పాలనలో అంతా దోపిడీయేనని తెదేపా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. -
కాంగ్రెస్లో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు
భారాసకు మరో షాక్ తగిలింది. తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు అమిత్ కాంగ్రెస్లో చేరారు. -
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలోని వడ్డేపాళ్యం గ్రామంలో ఆదివారం రాత్రి నిర్వహించిన తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి జరిగింది. -
ఆమెను చూసి ‘నెహ్రూ’ ఆత్మ కన్నీరు పెడుతుంది: మధ్యప్రదేశ్ సీఎం
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ఆమె ఇంటి పేరు ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’
-
మహీంద్రా నుంచి ఎక్స్యూవీ 3XO.. ధర ₹7.49 లక్షలు
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
పాఠ్య పుస్తకాల అప్డేషన్పై NCERTకి కేంద్రం కీలక సూచన!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!
-
‘మీ బిడ్డను’ అంటూ.. జగన్ ఊరూరా తిరిగినప్పుడే అనుమానించా: లోకేశ్