తమిళనాట ధన ప్రవాహం
తమిళనాట ఎన్నికల వేళ నోట్ల కట్టలు నాట్యమాడుతున్నాయి. కట్టలకొద్దీ డబ్బు సంచులను అభ్యర్థులు తరలిస్తున్నారు. ఓటర్లకు పంచుతున్నారు. నిఘా బృందాల తనిఖీల్లో వందల కోట్ల డబ్బు పట్టుబడుతోంది. తిరునెల్వేలి స్థానంపై భాజపా గురిపెట్టింది.
రూ.1361 కోట్ల డబ్బు, వస్తువుల సీజ్
భారీగా డబ్బు పంచుతున్న పార్టీలు
ఈనాడు, చెన్నై: తమిళనాట ఎన్నికల వేళ నోట్ల కట్టలు నాట్యమాడుతున్నాయి. కట్టలకొద్దీ డబ్బు సంచులను అభ్యర్థులు తరలిస్తున్నారు. ఓటర్లకు పంచుతున్నారు. నిఘా బృందాల తనిఖీల్లో వందల కోట్ల డబ్బు పట్టుబడుతోంది. తిరునెల్వేలి స్థానంపై భాజపా గురిపెట్టింది. ఇక్కడ గెలుపు ఖాయమనే ఉద్దేశంతో ప్రధాని మోదీ రెండు సార్లు ప్రచారం చేశారు. రాహుల్ గాంధీ సైతం ఇక్కడ సభ నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఇటీవల చెన్నై నుంచి తిరునెల్వేలికి రైలులోని ఏసీ 2టైర్ కోచ్లో తరలిస్తున్న రూ.4 కోట్ల డబ్బు పట్టుబడింది. పక్కా సమాచారంతో తాంబరం రైల్వేస్టేషన్లో పోలీసులు ఈ నగదును పట్టుకున్నారు. ఆ డబ్బు తిరునెల్వేలి భాజపా అభ్యర్థి నయినార్ నాగేంద్రన్కు చెందిందని విచారణలో తేలడంతో రాజకీయంగానూ వేడి పుట్టింది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నాగేంద్రన్కు సమన్లు జారీ చేసి విచారణకు పిలిచారు. ఇదే కేసులో భాజపా పారిశ్రామిక విభాగ సభ్యుడు గోవర్ధన్కూ సమన్లు పంపారు. అభ్యర్థిపై అనర్హత వేటు వేయాలనే డిమాండు ప్రతిపక్షాల నుంచి ఎన్నికల కమిషన్కు వెళ్లింది. ఆ డబ్బుకు, తనకు సంబంధం లేదని నాగేంద్రన్ ఖండించారు.
సరిహద్దు ప్రాంతాల్లో..
తమిళనాడు లోక్సభ ఎన్నికల్లో 32 జనరల్ స్థానాలు, 7 ఎస్సీ స్థానాలున్నాయి. ఈనెల 19న పోలింగ్ జరగనుంది. కొన్ని లోక్సభ స్థానాలు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి సరిహద్దులుగా ఉన్నాయి. ఇక్కడ తనిఖీల కోసం 145 చెక్పోస్టులను పెట్టారు. వాటితో పాటు రాష్ట్రంలో అంతర్గతంగా ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు తిరుగుతున్నాయి. చాలాచోట్ల వారి కళ్లుగప్పి ఓటర్ల కోసం నగదు, మద్యం, ఉచితాల్ని తరలిస్తున్నారు. పంపిణీ చేయాల్సిన నియోజకవర్గాలకు దగ్గరగా గోదాములు, హోటళ్లు, దుకాణాల్లాంటి వాటిని నిల్వ ప్రాంతాలుగా ఎంపిక చేసుకుంటున్నారు. కొన్నిచోట్ల తరలింపుపై పక్కా సమాచారంతో నిఘా వర్గాలు దాడులు నిర్వహిస్తున్నాయి. ఎన్నిక దగ్గర పడుతుండటంతో ప్రలోభాలపై ఎన్నికల కమిషన్కు ఆయా పార్టీల నుంచి ఫిర్యాదులు బాగా పెరిగాయి. ఇప్పటివరకూ రూ.1361 కోట్ల నగదు, వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా శ్రీపెరంబుదూరులో రూ.900 కోట్ల విలువైన బంగారాన్ని సీజ్ చేశారు. ఇంత పెద్ద మొత్తంలో పట్టుబడటంతో ఎన్నికల కమిషన్ విచారణలో వేగం పెంచింది. అధికారుల సమాచారం ప్రకారం.. పట్టుబడిన వాటిలో డబ్బు, విలువైన వస్తువులు తొలి రెండు స్థానాల్లో ఉండగా.. ఆ తర్వాత ఉచితాలు, మద్యం ఉన్నాయి. కొన్నిచోట్ల మత్తు పదార్థాల్ని సైతం స్వాధీనం చేసుకున్నారు. 2019 లోక్సభ ఎన్నికల్లో రూ.952 కోట్ల విలువైన డబ్బు, ఇతర వస్తువుల్ని తమిళనాడు వ్యాప్తంగా సీజ్ చేశారు.
కట్టలు కట్టలుగా..
తిరుచ్చి జిల్లాలో అన్నాడీఎంకే మద్దతుదారు పంచాయత్ యూనియన్ అధ్యక్షురాలు ఎ.దివ్య ఇంట్లోనే రూ.కోటి పట్టుకున్నారు. ఆమె భర్త ఓ మాజీ మంత్రికి సన్నిహితుడు. పొల్లాచ్చి లోక్సభ స్థానంలో ఓ పౌల్ట్రీ పరిశ్రమలో దాచిన రూ.32 కోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇవి 3 పెట్టెల్లో ఉన్నట్లు గుర్తించారు. ఓటర్లకు పంచేందుకే తెచ్చారనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. విరుదు నగర్ కాంగ్రెస్ అభ్యర్థి మాణిక్కం ఠాగూర్ తాజాగా నిర్వహించిన సభలో ఓటర్లకు ఆ పార్టీ సభ్యులు డబ్బులు పంచుతున్న వీడియోలు వైరలయ్యాయి. దీనిపై ఎన్నికల అధికారులు దృష్టి పెట్టారు. ఈరోడ్ లో ఏకంగా 24,150 చీరలు పట్టుకున్నారు. అవి అన్నాడీఎంకే అభ్యర్థి అశోక్ కుమార్కు చెందినవిగా అధికారులు గుర్తించారు. ఎన్నికలకు ముందే తాను వాటిని కొనుగోలు చేశానని, పనివాళ్ల కోసం తెచ్చానని అశోక్ కుమార్ చెబుతున్నారు. ప్రత్యర్థుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావడంలో వాటిని సీజ్ చేసి పోలీసులు కేసు నమోదు చేశారు. రాష్ట్రంలోని అభ్యర్థులందరిలోనూ అశోక్ కుమార్ ధనవంతుడు. కుటుంబ ఆస్తి రూ.662 కోట్లుగా అఫిడవిట్లో చూపారాయన. ఇదే నియోజకవర్గంలో వేర్వేరు దాడుల్లో రూ.4.28 కోట్ల డబ్బును పట్టుకున్నారు. హోరాహోరీ పోరు జరుగుతున్న కోయంబత్తూరు నియోజకవర్గంలో డీఎంకేకు చెందిన ఓ వ్యక్తి డబ్బులు పంచుతున్నారని అదుపులోకి తీసుకున్నారు. అరక్కోణంలో రూ.20 లక్షలు సీజ్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
వికసిత్ భారత్ దిశగా అధ్బుతమైన బడ్జెట్ను మోదీ సర్కారు ప్రవేశపెట్టిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ అన్నారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయనతో మీడియాతో మాట్లాడారు. -
బ్రోకర్లకు కమీషన్లు ఇచ్చి అధిక వడ్డీలకు వేల కోట్ల అప్పు తెస్తున్నారు : బండి సంజయ్
మర్చంట్ బ్యాంకర్స్ ద్వారా అధిక వడ్డీలకు వేల కోట్లు అప్పు తెచ్చే కుట్రకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరతీసిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. -
ఉనికి కోసమే దిల్లీలో జగన్ డ్రామాలు : కేశినేని చిన్ని
రెడ్ బుక్ అంటే చాలు.. వైకాపా నేతలకు భయం పట్టుకుందని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని విమర్శించారు. -
బతుకమ్మ చీరలు, గొర్రెల పంపిణీపై విచారణకు సిద్ధమా?: సీఎం రేవంత్రెడ్డి
భారాస ప్రభుత్వ హయాంలో గొర్రెల పంపిణీ పథకంలో రూ.700 కోట్ల అవినీతి జరిగిందని సీఎం రేవంత్రెడ్డి ఆరోపించారు. -
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
బడ్జెట్ ప్రసంగం ఒక రాజకీయ ప్రసంగంలా ఉందని భారాస ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. -
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
జగన్.. మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి? అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. -
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
తెలంగాణ బడ్జెట్లో హైదరాబాద్ నగర మౌలిక సదుపాయాలకు రూ.10 వేల కోట్లు కేటాయించినందుకు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. -
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు