మైనారిటీల మమత!
హోరాహోరీ పోరు నెలకొన్న పశ్చిమ బెంగాల్లో ప్రతి ఓటూ కీలకంగానే భావించి తృణమూల్ కాంగ్రెస్, భాజపా పోరాడుతున్నాయి. దీంతో ఏయే వర్గాల ఓట్లు ఎటు పడతాయన్న ఆసక్తి నెలకొంది.
బెంగాల్లో తృణమూల్కే మొగ్గు..
భాజపా ఓటమే వారి లక్ష్యం?
లౌకిక కూటమికి మద్దతు కష్టమే..
ముస్లిం మహిళల ఓట్లపై కాషాయ పార్టీ ఆశ
ట్రిపుల్ తలాఖ్, సందేశ్ఖాలీ మేలు చేస్తాయనే భావన
హోరాహోరీ పోరు నెలకొన్న పశ్చిమ బెంగాల్లో ప్రతి ఓటూ కీలకంగానే భావించి తృణమూల్ కాంగ్రెస్, భాజపా పోరాడుతున్నాయి. దీంతో ఏయే వర్గాల ఓట్లు ఎటు పడతాయన్న ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో దాదాపు 30శాతంగా ఉన్న మైనారిటీల ఓట్లపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. లౌకిక కూటమిగా పోటీ చేస్తున్న కాంగ్రెస్-లెఫ్ట్ పోటీలో ఉన్నా పెద్దగా ప్రభావం చూపించే అవకాశం కనిపించడం లేదు.
రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో మైనారిటీలైన ముస్లింల పాత్ర కీలకంగా ఉంది. మైనారిటీ నేతలు చెబుతున్న ప్రకారం.. వారి ఓట్లన్నీ తృణమూల్ కాంగ్రెస్కే దక్కే అవకాశం కనిపిస్తోంది. భాజపా విజయాన్ని నిలువరించడానికి మమతకు మద్దతుగా నిలుస్తామని వారంటున్నారు. ముర్షీదాబాద్, మాల్దా, ఉత్తర్ దినాజ్పుర్ జిల్లాల్లో మైనారిటీలే అధికంగా ఉంటారు. ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్) ఒంటరిగా బరిలోకి దిగడంతో మైనారిటీల ఓట్లను గెలుచుకోవాలన్న కాంగ్రెస్-లెఫ్ట్ ఆశలకు గండిపడినట్లే. దీంతో భాజపాను బలంగా ఢీకొనగలిగే మమతవైపే వారు మొగ్గుతున్నారు. రామ మందిరం, పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)తో మిగిలిన ఓట్లను పోలరైజ్ చేసేందుకు భాజపా ప్రయత్నిస్తుండటంతో మైనారిటీలు మమతను ఎంచుకుంటున్నట్లు కనిపిస్తోంది.
కశ్మీర్, అస్సాంల తర్వాత..
దేశంలో జమ్మూకశ్మీర్, అస్సాంల తర్వాత అత్యధిక ముస్లింలున్నది పశ్చిమబెంగాల్లోనే. రాష్ట్ర ప్రభుత్వంపట్ల బెంగాల్ ముస్లింలలో కొంత అసంతృప్తి ఉన్నా భాజపాను అడ్డుకోవడానికి వారు మమతకే ఓటేస్తారని మైనారిటీ నేతలు అంటున్నారు. 2019లో మైనారిటీ ప్రాబల్యమున్న ప్రాంతాల్లోనూ భాజపా కొన్ని విజయాలు సాధించింది. దీంతో స్థానిక ఇమామ్లు ఓట్లు చీలకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. ‘ఉత్తర బెంగాల్లో కాంగ్రెస్-లెఫ్ట్ కూటమి బలంగా ఉన్నచోట ఫర్వాలేదు. కానీ మిగిలిన చోట్ల మమతకే మద్దతు పలకాల్సి ఉంటుంది’ అని ఖాజీ ఒకరు తెలిపారు. ముర్షీదాబాద్, మాల్దా, ఉత్తర్ దినాజ్పుర్లలోని మైనారిటీలు తృణమూల్, కాంగ్రెస్-లెఫ్ట్ కూటముల మధ్య ఎవరికి ఓటేయాలో తేల్చుకోవడం కష్టమేనని ఇమామ్ల సంఘం అధ్యక్షుడు మహమ్మద్ యాహ్యా పేర్కొన్నారు. ఉత్తర దినాజ్పుర్లో గత ఎన్నికల్లో చీలిక కారణంగా భాజపా లాభపడిందని తెలిపారు. 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వారంతా మమతకు మద్దతుగా నిలిచారు. రాష్ట్రంలో దాదాపు 40,000 మసీదులున్నాయి.
చీలికతో లాభపడిన భాజపా
మైనారిటీల ఓట్లలో చీలిక కారణంగా 2019లో ఉత్తర బెంగాల్లోని మాల్దా ఉత్తర, రాయ్గంజ్ నియోజకవర్గాల్లో భాజపా గెలిచింది. ఈ నియోజకవర్గాల్లో 45శాతం మైనారిటీలున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 30శాతం ముస్లిం ఓటర్లున్నా వారి ప్రభావం 16 నుంచి 18 నియోజకవర్గాల్లో అధికంగా ఉంటుంది.
కాంగ్రెస్-లెఫ్ట్ ఆశలు
రాష్ట్రంలో దిగజారిన జీవన ప్రమాణాలు, కుంభకోణాలు, ప్రభుత్వ వ్యతిరేకత, మతపరమైన అంశాలపై కాంగ్రెస్-లెఫ్ట్ కూటమి ఆశలు పెట్టుకుంది. దీనివల్ల మైనారిటీ ఓట్లు తమకే దక్కుతాయని అంటోంది. 2023లో జరిగిన సాగర్దిగి ఉప ఎన్నికల్లో తమ విజయమే దీనికి సంకేతమని చెబుతోంది. మైనారిటీలు తృణమూల్ను వదిలి తమవైపే మొగ్గుచూపుతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ సలీం అంటున్నారు.
ముస్లింల ప్రాబల్యమున్న నియోజకవర్గాలు
రాయ్గంజ్, కూచ్బెహార్, బలూర్ఘాట్, మాల్దా ఉత్తర, మాల్దా దక్షిణ, ముర్షీదాబాద్, డైమండ్ హార్బర్, ఉలుబెరియా. హావ్డా, బిర్భమ్, కాంతి, తమ్లుక్, జాయ్నగర్.
ఐఎస్ఎఫ్ సవాల్?
రాష్ట్రంలోని ప్రధాన పార్టీలను ఐఎస్ఎఫ్ భయం వెంటాడుతోంది. మైనారిటీల ఓట్లను ఆ పార్టీ చీల్చుతుందనే ఆందోళన నెలకొంది. 2021 ఎన్నికల్లో ఐఎస్ఎఫ్కు 1.35 శాతం ఓట్లే వచ్చాయి. ఆ పార్టీ నుంచి నౌషద్ సిద్దిఖీ ఒక్కరే ఎమ్మెల్యేగా గెలిచారు. అయినా ముస్లింల ఓట్లను ఆ పార్టీ చీల్చుతుందని ప్రధాన పార్టీలైన తృణమూల్, కాంగ్రెస్, లెఫ్ట్ ఆందోళన చెందుతున్నాయి. ఐఎస్ఎఫ్ జాదవ్పుర్, బలూర్ఘాట్, ఉలుబెరియా, బారక్పుర్, డైమండ్ హార్బర్, బసిర్హట్లలో పోటీ చేస్తోంది.
గతంలో..
చరిత్రను చూస్తే బెంగాల్లోని మైనారిటీలు తొలుత కాంగ్రెస్కు మద్దతుగా నిలిచారు. అప్పట్లో వారు హిందూ మహాసభ, జనసంఘ్కు వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. 1960ల చివరి నుంచి వారంతా లెఫ్ట్వైపు మొగ్గారు. జ్యోతి బసు లాంటి నేతల వెంట నిలిచారు. 2008లో సచార్ కమిటీ నివేదిక తర్వాత వారు క్రమంగా లెఫ్ట్కు దూరం జరుగుతూ వచ్చారు. 2011 నాటికి వారంతా తృణమూల్కు మద్దతుగా నిలిచారు.
- 2014లో మైనారిటీల మద్దతుతో 34 లోక్సభ సీట్లు గెలుచుకున్న తృణమూల్.. 2019కి వచ్చేసరికి 22 సీట్లకు పరిమితమైంది.
- 2021 అసెంబ్లీ ఎన్నికల్లో మైనారిటీలు మళ్లీ మమతకే ఓటేశారు. దీంతో మూడోసారి ఆమె ఘన విజయం సాధించారు.
సందేశ్ఖాలీ ఘటనపై భాజపా ఆశలు
ట్రిపుల్ తలాఖ్ రద్దు అంశం, సందేశ్ఖాలీ సంఘటనతో ముస్లిం మహిళల్లో తమ పట్ల ఆదరణ పెరిగిందని భాజపా విశ్వసిస్తోంది. తృణమూల్ నేతలు మహిళలను లైంగికంగా వేధించడం పట్ల వారంతా ఆగ్రహంగా ఉన్నారని చెబుతోంది. దీంతో వారి ఓట్లు తమకే పడతాయని ఆశ పడుతోంది.
ఈనాడు ప్రత్యేక విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!