త్రిమూర్తులుపై వేటా.. సీటా..?
దళితుల శిరోముండనం కేసులో శిక్ష పడిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులును ఇప్పుడు మండపేట నియోజకవర్గ అభ్యర్థిగా వైకాపా తప్పిస్తుందా..? లేదా ఎమ్మెల్సీ అనంతబాబులాగే కొనసాగిస్తుందా అన్న చర్చ జరుగుతోంది.
అనంతబాబు తరహాలోనే కొనసాగిస్తారా?
పైకి సాత్వికుడు.. చేసేవన్నీ దౌర్జన్యాలే!
ఈనాడు, అమరావతి: దళితుల శిరోముండనం కేసులో శిక్ష పడిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులును ఇప్పుడు మండపేట నియోజకవర్గ అభ్యర్థిగా వైకాపా తప్పిస్తుందా..? లేదా ఎమ్మెల్సీ అనంతబాబులాగే కొనసాగిస్తుందా అన్న చర్చ జరుగుతోంది. త్రిమూర్తులు పైకి సాత్వికుడిలా కనిపిస్తారు గానీ, చేసేవన్నీ దౌర్జన్యాలు, దాష్టీకాలు, అక్రమాలే. నిత్యం 25-50 మంది అనుచరులను వెంటబెట్టుకుని తిరుగుతారు. అరాచకాలకు పాల్పడటాన్నే ప్రామాణికంగా అమలుచేస్తున్న వైకాపా అధిష్ఠానం.. త్రిమూర్తులుకు శిక్ష పడటాన్ని అదనపు అర్హతగా భావిస్తుందేమో!
త్రిమూర్తులుపై కేసులు
- 1997లో ద్రాక్షారామ పోలీసుస్టేషన్లో శిరోముండనం కేసు
- ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పరిధిలోని నాగర్కర్నూలు పోలీసుస్టేషన్లో 2005లో ఒక కేసు
- కాకినాడ జిల్లా సర్పవరం పోలీసుస్టేషన్లో 2006లో ఒక కేసు
- త్రిమూర్తులు సోదరుడు కొన్నేళ్ల క్రితం హత్యకు గురయ్యారు. ఆ హత్యలో భాగస్వాములైన 11 మంది తర్వాత హతమయ్యారు. త్రిమూర్తులు వర్గానికి చెందిన తండ్రీకొడుకులను ప్రత్యర్థివర్గం హత్యచేసింది. హైదరాబాద్లో దాక్కున్న వారిని.. కొందరు పోలీసుల వేషంలో వెళ్లి తీసుకొచ్చారు. తర్వాత వారు చనిపోయారు. ఇందులో కీలకపాత్ర త్రిమూర్తులుదేనని కొందరు అంటున్నా.. కేసుల్లో ఎక్కడా ఆయన పేరు లేదు. ఇలా చేతికి మట్టి అంటకుండా చేస్తారని అంటారు.
- గతంలో జడ్పీ సమావేశంలో ‘చెంప దెబ్బ తింటావ్’ అంటూ ప్రస్తుత ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ను త్రిమూర్తులు దూషించారు.
- త్రిమూర్తులు వ్యవహారశైలి దూకుడుగా ఉంటుంది. ఎవరినైనా తిడతారు.. బెదిరిస్తారు. అధికారులనైనా సరే, ‘చెప్పిన పని చెయ్’ అని బెదిరిస్తారు. ఆర్టీసీ భూమిని లీజుకు తీసుకుని, అక్కడ థియేటర్ కట్టారు. దీనిపై ఒక సామాజిక కార్యకర్త నిరసన చేపడితే కేసులతో భయపెట్టారు. చివరకు థియేటర్ ప్రారంభ సమయంలో త్రిమూర్తులుకు శుభాకాంక్షలు చెబుతూ బ్యానర్ కట్టేలా చేశారు.పెద్దగా చదువుకోని త్రిమూర్తులు మొదట్లో అమలాపురం ప్రాంతంలో దూడల మారు బేరగాళ్లుగా ప్రస్థానం ప్రారంభించారు. తర్వాత రామచంద్రపురం చేరుకుని.. 1994లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. అప్పట్నుంచి గేర్ మార్చారు. సెటిల్మెంట్లు, భూ దందాలు, పంచాయితీకి వచ్చినవారిని బెదిరించి తానే రాయించుకోవడం వంటి అక్రమాలకు తెరతీశారు. కాజులూరు మండలం పల్లెపాలెంలో 32 ఎకరాలు ఇలాగే రాయించుకున్నారని ఆరోపణలున్నాయి. దీనిపై 2022 నవంబరులో జనసేన నేత లీలాకృష్ణ కలెక్టర్కు ఫిర్యాదుచేశారు. కానీ, ఎలాంటి చర్యలూ లేవు.
అన్ని పార్టీలూ తిరిగొచ్చి...
1994లో రామచంద్రపురంలో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన త్రిమూర్తులు తర్వాత తెదేపా, ప్రరాపా, కాంగ్రెస్లకు మారారు. గత ఎన్నికల్లో తెదేపా అభ్యర్థిగా రామచంద్రపురంలో ఓడిపోయాక వైకాపాలో చేరి, అదే పార్టీ ఎమ్మెల్సీగా 2021 నుంచి కొనసాగుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేసీఆర్ను చూస్తే గోబెల్స్ మళ్లీ పుట్టాడనిపిస్తోంది : సీఎం రేవంత్
తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మండిపడ్డారు. -
ప్రజ్వల్ రేవణ్ణను భారత్కు తీసుకొస్తాం: కర్ణాటక హోంమంత్రి
Prajwal Revanna: కర్ణాటక రాజకీయాల్లో సంచలనంగా మారిన లైంగిక దౌర్జన్యం కేసులో ప్రధాన నిందితుడైన ప్రజ్వల్ రేవణ్ణను భారత్కు తీసుకొచ్చేందుకు సిట్ చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర హోంమంత్రి వెల్లడించారు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో ప్రజల ఆస్తులకు ముప్పు: జీవీ రెడ్డి
ప్రజల ఆస్తులు దోచుకోవడానికే వైకాపా ప్రభుత్వం.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చిందని తెదేపా అధికార ప్రతినిధి జీవీ రెడ్డి ధ్వజమెత్తారు. -
నెలకు రూ.9 వేల కోట్ల సంపద సృష్టించలేక అప్పులపాలు
ప్రతి నెల రూ.9 వేల కోట్ల సంపద సృష్టించడం చేతకాని సీఎం జగన్.. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
జగన్ను ఎందుకు అరెస్టు చేయరు?
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్పై కక్ష గట్టి అరెస్టు చేయించిన కేంద్రంలోని భాజపా ప్రభుత్వం.. ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డికి ఎందుకు మినహాయింపు ఇస్తోందని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, మాజీ రాజ్యసభ సభ్యులు పి.మధు ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
అభ్యంతరకర వీడియోల ఘటన.. ఎంపీ ప్రజ్వల్పై సస్పెన్షన్ వేటు
-
సోనీ రియాన్ పాకెట్ ఏసీ.. ఎక్కడికైనా వెంట తీసుకెళ్లొచ్చు!
-
విజయవాడలో విషాదం.. ఒకే కుటుంబంలో ఐదుగురి మృతి
-
భారత్ సూపర్ పవర్ కావాలని కలలుకంటుంటే.. మనం అడుక్కుంటున్నాం: పాక్ నేత
-
లఖ్నవూ సూపర్ జెయింట్స్కు గుడ్న్యూస్.. ముంబయికి చావోరేవో
-
ఛత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టులు హతం