ప్రవీణ్ ప్రకాశ్ ఆదేశాలు నిలిపివేయాలి
ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులతో ఈ నెల 23న సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర పాఠశాల ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ జారీచేసిన ఆదేశాలను నిలిపివేయాలని కోరుతూ.. ఎన్నికల ప్రధాన కమిషనర్ ముకేశ్కుమార్ మీనాకు మంగళవారం భాజపా రాష్ట్ర శాఖ వినతిపత్రం అందజేసింది.
ఈసీని కోరిన భాజపా
ఈనాడు, అమరావతి: ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులతో ఈ నెల 23న సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర పాఠశాల ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ జారీచేసిన ఆదేశాలను నిలిపివేయాలని కోరుతూ.. ఎన్నికల ప్రధాన కమిషనర్ ముకేశ్కుమార్ మీనాకు మంగళవారం భాజపా రాష్ట్ర శాఖ వినతిపత్రం అందజేసింది. ప్రవీణ్ ప్రకాశ్ అమానుష చర్యలతో ఉపాధ్యాయులు మనస్తాపానికి గురవుతున్నారని పేర్కొంది. పబ్లిక్ సర్వెంట్గా కాకుండా.. అధికారంలో ఉన్న ప్రభుత్వానికి ఆయన ఏజెంట్గా వ్యవహరిస్తున్నారని ఆరోపించింది. మే13న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఈ నెల 23న ఉపాధ్యాయుల సమావేశాలు నిర్వహించాలని ఆదేశాలు జారీచేయడం ఎలక్షన్ కోడ్ను ఉల్లంఘించడమేనని తెలిపింది. ఆ అమలును నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీచేయాలని సచివాలయంలో ఈసీకి అందజేసిన వినతిపత్రంలో ఆ పార్టీ లీగల్ సెల్ కన్వీనర్ కె.మల్లికార్జున మూర్తి కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేసీఆర్ను చూస్తే గోబెల్స్ మళ్లీ పుట్టాడనిపిస్తోంది : సీఎం రేవంత్
తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మండిపడ్డారు. -
ప్రజ్వల్ రేవణ్ణను భారత్కు తీసుకొస్తాం: కర్ణాటక హోంమంత్రి
Prajwal Revanna: కర్ణాటక రాజకీయాల్లో సంచలనంగా మారిన లైంగిక దౌర్జన్యం కేసులో ప్రధాన నిందితుడైన ప్రజ్వల్ రేవణ్ణను భారత్కు తీసుకొచ్చేందుకు సిట్ చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర హోంమంత్రి వెల్లడించారు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో ప్రజల ఆస్తులకు ముప్పు: జీవీ రెడ్డి
ప్రజల ఆస్తులు దోచుకోవడానికే వైకాపా ప్రభుత్వం.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చిందని తెదేపా అధికార ప్రతినిధి జీవీ రెడ్డి ధ్వజమెత్తారు. -
నెలకు రూ.9 వేల కోట్ల సంపద సృష్టించలేక అప్పులపాలు
ప్రతి నెల రూ.9 వేల కోట్ల సంపద సృష్టించడం చేతకాని సీఎం జగన్.. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
జగన్ను ఎందుకు అరెస్టు చేయరు?
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్పై కక్ష గట్టి అరెస్టు చేయించిన కేంద్రంలోని భాజపా ప్రభుత్వం.. ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డికి ఎందుకు మినహాయింపు ఇస్తోందని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, మాజీ రాజ్యసభ సభ్యులు పి.మధు ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ సూపర్ పవర్ కావాలని కలలుకంటుంటే.. మనం అడుక్కుంటున్నాం: పాక్ మంత్రి
-
లఖ్నవూ సూపర్ జెయింట్స్కు గుడ్న్యూస్.. ముంబయికి చావోరేవో
-
ఛత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. నలుగురు మావోయిస్టులు హతం
-
‘అసహనంతోనే ఫేక్ వీడియోలు’ : కాంగ్రెస్పై మండిపడ్డ అమిత్ షా
-
సెక్షన్ 54F.. బంగారం విక్రయించి ఇల్లు కొనుగోలు చేస్తే పన్నుండదు!
-
ఆ అపోహ కారణంగానే నాకు దక్షిణాదిలో అవకాశాలు తగ్గాయి: ఇలియానా