రాష్ట్రానికి మరోసారి ప్రధాని మోదీ రాక
రాష్ట్రంలో నిర్వహించబోయే ఎన్డీయే ప్రచార సభల్లో ప్రధాని మోదీతోపాటు భాజపా జాతీయ సీనియర్ నేతలు పాల్గొంటారని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సూర్యనారాయణ రాజు వెల్లడించారు.
మూడు లేదా నాలుగు సభల్లో పాల్గొనే అవకాశం
భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సూర్యనారాయణరాజు వెల్లడి
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో నిర్వహించబోయే ఎన్డీయే ప్రచార సభల్లో ప్రధాని మోదీతోపాటు భాజపా జాతీయ సీనియర్ నేతలు పాల్గొంటారని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సూర్యనారాయణ రాజు వెల్లడించారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ప్రధాని మోదీ మూడు లేదా నాలుగు బహిరంగ సభల్లో పాల్గొనే అవకాశం ఉంది. హోంశాఖ మంత్రి అమిత్షా నాలుగైదు సభల్లో పాల్గొంటారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఉత్తర్ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సైతం ప్రచార సభలకు హాజరవుతారు. రాష్ట్ర భాజపా అధ్యక్షురాలు పురందేశ్వరి, సీఎం రమేష్, ఇతర అభ్యర్థులు నామినేషన్లు దాఖలుచేసే కార్యక్రమాల్లోనూ పార్టీ అగ్రనేతలు పాల్గొంటారు. అనకాపల్లి లోక్సభ అభ్యర్థి సీఎం రమేష్ నామినేషన్కు కేంద్రమంత్రి రాజ్నాథ్సింగ్ హాజరవుతున్నట్లు పార్టీ అధిష్ఠానం నుంచి సమాచారం వచ్చింది’ అని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో ప్రజల ఆస్తులకు ముప్పు: జీవీ రెడ్డి
ప్రజల ఆస్తులు దోచుకోవడానికే వైకాపా ప్రభుత్వం.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చిందని తెదేపా అధికార ప్రతినిధి జీవీ రెడ్డి ధ్వజమెత్తారు. -
నెలకు రూ.9 వేల కోట్ల సంపద సృష్టించలేక అప్పులపాలు
ప్రతి నెల రూ.9 వేల కోట్ల సంపద సృష్టించడం చేతకాని సీఎం జగన్.. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
జగన్ను ఎందుకు అరెస్టు చేయరు?
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్పై కక్ష గట్టి అరెస్టు చేయించిన కేంద్రంలోని భాజపా ప్రభుత్వం.. ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డికి ఎందుకు మినహాయింపు ఇస్తోందని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, మాజీ రాజ్యసభ సభ్యులు పి.మధు ప్రశ్నించారు. -
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
కడప జిల్లా వేంపల్లి మండలం కుమ్మరంపల్లిలో సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతికి చేదు అనుభవం ఎదురైంది.
తాజా వార్తలు (Latest News)
-
మీ నాన్న విగ్రహ పనులూ నాసిరకమేనా జగన్!
-
65 ఏళ్లు నిండిన అంగన్వాడీ సిబ్బందికి విశ్రాంతి
-
ఈసారి పింఛనుకు పడవ ప్రయాణం చేయాల్సిందే!
-
మార్కుల విషయమై తల్లీ కుమార్తెల ఘర్షణ.. పరస్పరం కత్తిపోట్లు
-
చంద్రబాబు వాహనంపైకి గుర్తుతెలియని వ్యక్తులు
-
బ్యాంకాక్ ఏషియా అందాల పోటీల్లో విశాఖ నివాసి మూడు టైటిల్స్ కైవసం