కోడ్ ఉండగా వైకాపా వాళ్లు ధర్నాలెలా చేస్తారు?
సీఎం జగన్పై రాయితో దాడి జరిగిన రోజున వైకాపా వాళ్లు రహదారులపైకి వచ్చి ధర్నాలు, నిరసనలు చేయడం ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమేనని తెదేపా నేతలు తెలిపారు.
సీఈవోకు తెదేపా నేతల ఫిర్యాదు
ఈనాడు డిజిటల్, అమరావతి : సీఎం జగన్పై రాయితో దాడి జరిగిన రోజున వైకాపా వాళ్లు రహదారులపైకి వచ్చి ధర్నాలు, నిరసనలు చేయడం ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమేనని తెదేపా నేతలు తెలిపారు. ధర్నా చేస్తుంటే వాళ్లను పోలీసులు కనీసం అడ్డుకోలేదన్నారు. మండపేట వైకాపా అభ్యర్థి తోట త్రిమూర్తులు, కనిగిరి వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ యాదవ్ తదితరులు వాలంటీర్లతో సమావేశాలు నిర్వహించి, ఎన్నికల ప్రచారం చేయాల్సిందిగా ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. అవసరమైతే రాజీనామా చేయాలని వాలంటీర్లను వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయా అంశాలపై మంగళవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేశారు. అనంతరం విలేకర్లతో వర్ల రామయ్య మాట్లాడుతూ.. పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ప్రకాశ్ లాంటి వాళ్లు వైకాపా తొత్తుల్లా వ్యవహరిస్తూ, ఐఏఎస్ అధికారుల పరువు తీస్తున్నారని వర్ల దుయ్యబట్టారు. ‘‘23వ తేదీన విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించాలని ఉపాధ్యాయులు ఆదేశించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా సమావేశాలు నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చింది?’’ అని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో ‘కోడి కత్తి’ నాటకంతో లబ్ధిపొందిన జగన్...ఈసారి గులక రాయిని వాడుకొంటున్నారని ఎద్దేవా చేశారు. ఆయన వెంట తెదేపా నేతలు కేఎస్ జవహర్, మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ, మన్నవ సుబ్బారావు, సయ్యద్ రఫీ తదితరులు ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేసీఆర్ను చూస్తే గోబెల్స్ మళ్లీ పుట్టాడనిపిస్తోంది : సీఎం రేవంత్
తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మండిపడ్డారు. -
ప్రజ్వల్ రేవణ్ణను భారత్కు తీసుకొస్తాం: కర్ణాటక హోంమంత్రి
Prajwal Revanna: కర్ణాటక రాజకీయాల్లో సంచలనంగా మారిన లైంగిక దౌర్జన్యం కేసులో ప్రధాన నిందితుడైన ప్రజ్వల్ రేవణ్ణను భారత్కు తీసుకొచ్చేందుకు సిట్ చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర హోంమంత్రి వెల్లడించారు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో ప్రజల ఆస్తులకు ముప్పు: జీవీ రెడ్డి
ప్రజల ఆస్తులు దోచుకోవడానికే వైకాపా ప్రభుత్వం.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చిందని తెదేపా అధికార ప్రతినిధి జీవీ రెడ్డి ధ్వజమెత్తారు. -
నెలకు రూ.9 వేల కోట్ల సంపద సృష్టించలేక అప్పులపాలు
ప్రతి నెల రూ.9 వేల కోట్ల సంపద సృష్టించడం చేతకాని సీఎం జగన్.. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
జగన్ను ఎందుకు అరెస్టు చేయరు?
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్పై కక్ష గట్టి అరెస్టు చేయించిన కేంద్రంలోని భాజపా ప్రభుత్వం.. ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డికి ఎందుకు మినహాయింపు ఇస్తోందని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, మాజీ రాజ్యసభ సభ్యులు పి.మధు ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
సెక్షన్ 54F.. బంగారం విక్రయించి ఇల్లు కొనుగోలు చేస్తే పన్నుండదు!
-
ఆ అపోహ కారణంగానే నాకు దక్షిణాదిలో అవకాశాలు తగ్గాయి: ఇలియానా
-
5 రోజుల్లో రూ.3 లక్షల కోట్లు ఎగసిన మస్క్ సంపద
-
పన్నూపై హత్యాయత్నం.. వాషింగ్టన్ పోస్టు కథనంపై భారత్ ఘాటు స్పందన
-
కేసీఆర్ను చూస్తే గోబెల్స్ మళ్లీ పుట్టాడనిపిస్తోంది : సీఎం రేవంత్
-
సునీల్ నరైన్ను టీమ్ మీటింగ్లకు రావొద్దనే వాడిని: శ్రేయస్ అయ్యర్