రాష్ట్రానికి విజనరీ కావాలా.. ప్రిజనరీ కావాలా?
ధర్మానికి, అధర్మానికి; న్యాయానికి, అన్యాయానికి; నీతికి, అవినీతికి; టూరిజానికి, శాడిజానికి; విజనరీకి, ప్రిజనరీకి మధ్య జరుగుతున్న పోరాటంలో ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని తెలంగాణ తెదేపా నేత నర్సిరెడ్డి పిలుపునిచ్చారు.
జనం వీపులు నిమిరి.. నెత్తిన చేతులు పెట్టిన జగన్
ఆకట్టుకున్న తెలంగాణ తెదేపా నేత నర్సిరెడ్డి ప్రసంగం
ఈనాడు, అమరావతి: ధర్మానికి, అధర్మానికి; న్యాయానికి, అన్యాయానికి; నీతికి, అవినీతికి; టూరిజానికి, శాడిజానికి; విజనరీకి, ప్రిజనరీకి మధ్య జరుగుతున్న పోరాటంలో ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని తెలంగాణ తెదేపా నేత నర్సిరెడ్డి పిలుపునిచ్చారు. పల్నాడు జిల్లా మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో తెదేపా ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ‘ప్రజాగళం.. గురజాల ఆత్మగౌరవ సభ’లో నర్సిరెడ్డి ప్రసంగం ఆకట్టుకుంది. ‘చంద్రబాబు హయాంలో రెండు డీఎస్సీలు వేస్తే, జగన్ ఒక్కటీ పూర్తి చేయలేదు. తెదేపా ప్రభుత్వం 4.32 లక్షల మందికి నిరుద్యోగ భృతి చెల్లిస్తే దాన్నీ తీసేశారు. నైపుణ్య కేంద్రాల్లో అవినీతి జరిగిందని కుట్ర పన్ని బాబును జైలుకు పంపిన దుష్టుడు జగన్’ అని మండిపడ్డారు. ‘ఇద్దరికి రెండు ఓట్లు వేసి, ముగ్గురితో పని చేయించుకోండి. ఎమ్మెల్యేగా యరపతినేని శ్రీనివాసరావు, ఎంపీగా లావు శ్రీకృష్ణదేవరాయలుతో పాటు ఎమ్మెల్సీగా ఉన్న జంగా కృష్ణమూర్తితోనూ సేవలు పొందవచ్చ’ని సూచించారు.
నర్సిరెడ్డి ప్రసంగంలోని వ్యంగ్యోక్తులు.. విసుర్లు
- జగన్.. 2014లో నాన్న లేడు అన్నారు. జనం నమ్మారు. 2019లో చిన్నాన్న లేడు అన్నారు. జనం నమ్మారు. ఒక్క అవకాశమివ్వండి, అంటే అక్కలంతా కరిగిపోయి ఓటేశారు. ఆ పాపానికి ఇంట్లో వెలుగు, నదిలో ఇసుక, గుడిలో విగ్రహాలు పోయాయి. నేరాలు పెరిగిపాయే.. ఘోరాలు జరిగిపాయే.. పరిశ్రమలు పారిపాయే.. అప్పులు పెరిగిపాయే.. అమ్మకు గౌరవాధ్యక్ష పదవి పాయే.. చెల్లికి ఆస్తి పాయే.. బాబాయి పైకి పాయే.. బాబు జైలుకు పాయే.. రాజశేఖరరెడ్డి కుమారుడని నమ్మిన పాపానికి.. మనల్నే అమ్మిన దుష్టుడు జగన్.
- ఐదేళ్లలో జగన్ ప్రజలకు కనిపిస్తే బ్రేకింగ్ న్యూస్. మాట్లాడితే షాకింగ్ న్యూస్. మెరుపు తీగ వచ్చినట్లు పరదాల మధ్యన వచ్చిపోతారు.
- నేను 130 సార్లు బటన్ నొక్కాను. నా కోసం ఒక్కసారి నొక్కాలని జగన్ అంటుంటే.. అనంతపురం జిల్లాలో ఓ ఎంపీ లైవ్లో బటన్ చించుకొని నొక్కుకున్నారు. ఇంతటి మహానాయకులు వీరు.
- ‘ఆడుదాం అంధ్రా’ అని ఆటల పోటీ పెడితే అంబటి రాంబాబు గంట ఆడుదామన్నారు. అవంతి శ్రీనివాస్ అరగంట చాలన్నారు.
- గన్ కంటే తొందరగా జగన్ వస్తారని రోజక్క చెబుతున్నారు. గన్ కంటే వేగంగా వైకాపా నాయకులు ఈవినింగ్ డార్లింగ్.. మార్నింగ్ డైవర్స్ అంటున్నారు.
- రాష్ట్రంలో బడిలో పిల్లోడికి, గుడిలో దేవుడికి రక్షణ లేదు. పట్టపగలు వీధిలోకి వెళ్లినోడు ఇంటికి చేరే గ్యారెంటీ లేదు.
- పాదయాత్రలో జగన్ జనం నుదుట ముద్దులు పెట్టారు. చెంపకు చెంపలు కలిపారు. గవదకు గంధం పూశారు. వీపున చేతులు నిమిరారు. అధికారంలోకి రాగానే నెత్తిన చేతులు పెట్టారు.
- 99.5 శాతం హామీలు అమలు చేశానని చెబుతున్న జగన్.. 730 హామీలిచ్చి 85 శాతం కూడా అమలు చేయలేదు. 2.30 లక్షల ఉద్యోగాలేమయ్యాయి? 1.40 లక్షల బ్యాక్లాగ్ పోస్టులేమయ్యాయి? మెగా డీఎస్సీ ఏదీ? కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఏదీ? జాబ్ క్యాలెండర్ లేదు. మద్య నిషేధం అమలుకాలేదు. చెరుకు ఫ్యాక్టరీలు తెరవలేదు. ప్రత్యేక హోదా రాలేదు. రైల్వే జోన్ రాలేదు. దుగరాజపట్నం పోర్టు రాలేదు. కడపకు ఉక్కు ఫ్యాక్టరీ తేలేదు.
- ఫ్యానుకు ఓటేసిన పాపానికి రాష్ట్రంలో ఫ్యాను వేసుకునే పరిస్థితి లేదు. 9 సార్లు కరెంటు ఛార్జీలు, 3 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. మద్యం, గ్యాస్, పెట్రోలు, డీజిల్ ధరలు పెంచుడే కాదు, చెత్త మీదా పన్ను వేసి మన ముఖాన మన్ను కొట్టిన మహానుభావుడు జగన్. ఇంతటి సక్కనైన పాలనకు 40 మంది సలహాదారులు సజ్జలు, జొన్నలు, రాగులు..
- తనకు టీవీ, పత్రిక లేవని చెప్పుకొనే జగన్.. బ్రాహ్మణి స్టీల్స్, రఘురామ్ సిమెంట్, కర్ణాటక, సిక్కింలో పవర్ ప్రాజెక్టులు, జింపెక్స్ సంస్థ, సాక్షి పత్రిక, ఛానెల్, బెంగళూరులో వెయ్యెకరాల భూమి, రూ.250 కోట్ల కాంప్లెక్స్, హైదరాబాద్లో 60 ఎకరాల జాగా.. ఎవరివో మాత్రం చెప్పరు. ఇన్ని ఉండీ, చెల్లి షర్మిల ఆస్తిలో వాటా అడిగితే గొంతు పట్టుకుంటారా?
- రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్తో ఉన్న రాష్ట్రానికి నాడు సీఎం అయిన చంద్రబాబు.. బస్సులోంచే పాలన సాగించి, ఎన్నో సంక్షేమ పథకాలతో మెప్పిస్తే ఆయన్ను ఓడగొట్టారు. 11.40 లక్షల ఇళ్లు కట్టించి, 4 లక్షల మందికి నిరుద్యోగ భృతి ఇచ్చి, డ్వాక్రా మహిళలకు రూ.20 వేల కోట్ల రుణాలిచ్చి, 1.87 లక్షల మందికి సైకిళ్లు ఇచ్చి, 1.47 లక్షల మందికి పౌష్టికాహారం అందించి, రోడ్లు నిర్మించి, రవాణా సౌకర్యం కల్పించి, తాగునీరు, సాగునీరు, షాదీఖానాలు ఇస్తే ఆయన్ను ఓడించారు. పాలిచ్చే బర్రెను కాదని, తన్నె దున్నపోతును కొనుక్కున్నట్లైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!