గొడ్డలిని వదిలేసి గులకరాయి వాడినందుకే కథ అడ్డం తిరిగింది
వైకాపా ట్రేడ్మార్క్ గొడ్డలిని వదిలేసి గులకరాయిని వాడినందుకే కథ అడ్డం తిరిగిందని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఎద్దేవా చేశారు.
తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య
ఈనాడు డిజిటల్, అమరావతి: వైకాపా ట్రేడ్మార్క్ గొడ్డలిని వదిలేసి గులకరాయిని వాడినందుకే కథ అడ్డం తిరిగిందని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఎద్దేవా చేశారు. సీఎం జగన్ అధికార దాహానికి గతంలో దళిత యువకుడు శ్రీనివాస్ను చేసినట్టు, ఈసారి ఓ అమాయకుడిని బలి చేయబోతున్నారని ఆరోపించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘కథ ఎవరు రచించారో గానీ అందులో పట్టులేదు. అందుకే రక్తి కట్టలేదు. సీఎం జగన్, ప్రభుత్వ సలహాదారు సజ్జలను తృప్తిపరచడానికి విజయవాడ పోలీసు కమిషనర్ కాంతిరాణా తాపత్రయపడటం మంచిది కాదు. ఒక అమాయకుడిని బలిచేసి చెడ్డపేరు తెచ్చుకోవద్దు. ఒకే రాయి ఇద్దరికి తగిలినా.. కింద పడకుండా ఎటోపోవడం ఆశ్చర్యంగా ఉంది. గజమాలకు ఉన్న పుల్ల సీఎం జగన్కు గుచ్చుకుంది. వెంటనే ఆయన చేయి గాయమైన దగ్గరికి వెళ్లింది. అక్కడి నుంచే నాటకం ప్రారంభమైంది. కథా రచయితకు నంది, అద్భుతంగా నటించిన జగన్కు ఆస్కార్ ఇవ్వాలి. ఓడిపోతానన్న భయంతోనే జగన్ డ్రామాలకు ఒడికట్టారు. ఓ రాష్ట్ర సీఎంను చిన్న గులకరాయితో కొట్టి చంపాలన్న ఆలోచన ఎవరికైనా వస్తుందా’ అని ప్రశ్నించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నెలకు రూ.9 వేల కోట్ల సంపద సృష్టించలేక అప్పులపాలు
ప్రతి నెల రూ.9 వేల కోట్ల సంపద సృష్టించడం చేతకాని సీఎం జగన్.. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
జగన్ను ఎందుకు అరెస్టు చేయరు?
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్పై కక్ష గట్టి అరెస్టు చేయించిన కేంద్రంలోని భాజపా ప్రభుత్వం.. ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డికి ఎందుకు మినహాయింపు ఇస్తోందని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, మాజీ రాజ్యసభ సభ్యులు పి.మధు ప్రశ్నించారు. -
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
కడప జిల్లా వేంపల్లి మండలం కుమ్మరంపల్లిలో సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతికి చేదు అనుభవం ఎదురైంది.
తాజా వార్తలు (Latest News)
-
65 ఏళ్లు నిండిన అంగన్వాడీ సిబ్బందికి విశ్రాంతి
-
ఈసారి పింఛనుకు పడవ ప్రయాణం చేయాల్సిందే!
-
మీ నాన్న విగ్రహ పనులూ నాసిరకమేనా జగన్!
-
మార్కుల విషయమై తల్లీ కుమార్తెల ఘర్షణ.. పరస్పరం కత్తిపోట్లు
-
చంద్రబాబు వాహనంపైకి గుర్తుతెలియని వ్యక్తులు
-
బ్యాంకాక్ ఏషియా అందాల పోటీల్లో విశాఖ నివాసి మూడు టైటిల్స్ కైవసం