సార్వత్రిక సవాల్..
సార్వత్రిక ఎన్నికల సమరానికి రాష్ట్రం సిద్ధమైంది. శాసనసభ ఎన్నికల అనంతరం మరో ప్రతిష్ఠాత్మక పోరుకు తెరలేస్తోంది.
నేడే నోటిఫికేషన్.. నామినేషన్ల స్వీకారం
ప్రధాన పార్టీలకు, నేతలకు ప్రతిష్ఠాత్మకం
అస్త్రశస్త్రాలతో సిద్ధమైన కాంగ్రెస్, భారాస, భాజపా
ఇప్పటికే ప్రచారానికి నాంది
అందరి దృష్టీ రెండంకెల స్థానాలపైనే
ఈనాడు - హైదరాబాద్
సార్వత్రిక ఎన్నికల సమరానికి రాష్ట్రం సిద్ధమైంది. శాసనసభ ఎన్నికల అనంతరం మరో ప్రతిష్ఠాత్మక పోరుకు తెరలేస్తోంది. తెలంగాణలోని 17 లోక్సభ స్థానాల ఎన్నికలకు గురువారం నోటిఫికేషన్ వెలువడడంతోపాటు నామినేషన్ల పర్వం కూడా ప్రారంభం కానుంది. మెజారిటీ స్థానాల్లో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు అస్త్రశస్త్రాలతో సిద్ధమయ్యాయి. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, భారాస, భాజపా ఈ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించాయి. శాసనసభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలతో రాష్ట్రంలో అధికారం సాధించిన కాంగ్రెస్ పార్టీ.. అయిదు నెలల్లోనే ఎదుర్కోబోయే లోక్సభ పోరు ప్రతిష్ఠాత్మకం కావడంతో హోరాహోరీకి సిద్ధమైంది. మొన్నటి ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన భారాస తన సత్తాను నిరూపించుకోవాలన్న పట్టుదలతో ఉంది. శాసనసభ ఎన్నికల్లో ఓట్ల శాతాన్ని పెంచుకున్న భాజపా.. లోక్సభ పోరులో గతంలో కంటే ఎక్కువ స్థానాలు సాధించాలన్న లక్ష్యంతో బరిలో దిగుతోంది. భారాస, భాజపాలు అన్ని స్థానాలకూ అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించగా.. కాంగ్రెస్ 14 సీట్లకు పేర్లు ఖరారు చేసింది. కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్లకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. పలువురు అభ్యర్థులు తొలిరోజైన గురువారం నుంచే నామినేషన్లు దాఖలు చేయడానికి సన్నద్ధమవుతున్నారు. నెల రోజుల కిందటే ఎన్నికల షెడ్యూలు వెలువడడంతో ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ, భారాస అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో బహిరంగసభలతో ప్రచారాన్ని ఇప్పటికే ప్రారంభించారు. సీపీఎం భువనగిరి నుంచి పోటీ చేస్తుండగా.. సీపీఐ పోటీ చేయబోయే స్థానంపై కసరత్తు చేస్తోంది. ఎంఐఎం సిటింగ్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మరోసారి హైదరాబాద్ బరిలో నిలిచారు. కాంగ్రెస్ తరఫున ముగ్గురు మహిళలు, భాజపా నుంచి ఇద్దరు, భారాస తరఫున ఒకరు పోటీ చేస్తున్నారు.
బరిలో సిటింగ్ ఎంపీలు 9 మంది..
రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాల్లో ఈసారి సిటింగ్ ఎంపీల్లో తొమ్మిది మంది మాత్రమే పోటీ చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం కాంగ్రెస్, భాజపాలు చేరికలపై దృష్టి సారించి క్షేత్రస్థాయిలో బలం పెంచుకునేందుకు ప్రయత్నించే క్రమంలో భారాసకు చెందిన తొమ్మిది మంది సిటింగ్ ఎంపీల్లో అయిదుగురు పార్టీ మారిపోయారు. వీరిలో ముగ్గురు కాంగ్రెస్లో, ఇద్దరు భాజపాలో చేరారు. భారాస సిటింగ్ ఎంపీల్లో ఒకరు కాంగ్రెస్ తరఫున, మరొకరు భాజపా అభ్యర్థిగా బరిలో దిగారు. గత ఎన్నికల్లో చేవెళ్ల నుంచి భారాస తరఫున నెగ్గిన ఎంపీ జి.రంజిత్రెడ్డి ఈసారి అదే స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. జహీరాబాద్ భారాస సిటింగ్ ఎంపీ బి.బి.పాటిల్ ఈసారి అక్కడి నుంచే భాజపా అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. భారాసకు చెందిన మరో ఇద్దరు సిటింగ్ ఎంపీలు.. వెంకటేశ్ నేత, పసునూరి దయాకర్ కాంగ్రెస్లో చేరినా ఈసారి పోటీలో లేరు. నాగర్కర్నూల్ భారాస ఎంపీ రాములు భాజపాలో చేరి.. తన కుమారుడు భరత్ప్రసాద్ను కమలం తరఫున బరిలో నిలిపారు. గత లోక్సభ ఎన్నికల్లో నెగ్గిన ముగ్గురు కాంగ్రెస్ ఎంపీలు ఈసారి పోటీలో లేరు. వారిలో రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి కాగా.. ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి రాష్ట్ర మంత్రులుగా ఉన్నారు. గత లోక్సభ ఎన్నికల్లో భారాస తరఫున మెదక్ స్థానంలో విజయం సాధించిన కొత్త ప్రభాకర్రెడ్డి.. ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో ఆయన కూడా లోక్సభకు పోటీ చేయడంలేదు. ఆదిలాబాద్ భాజపా సిటింగ్ ఎంపీ సోయం బాపురావుకు ఈసారి టికెట్ దక్కలేదు. మాజీ మంత్రి, భారాస నుంచి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా నెగ్గిన దానం నాగేందర్.. కాంగ్రెస్లో చేరి.. సికింద్రాబాద్ నుంచి లోక్సభకు పోటీ చేస్తున్నారు. తొలుత వరంగల్ భారాస అభ్యర్థిగా ఎంపికైన కడియం కావ్య.. నాటకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీ మారి, ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. భారాస మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి నల్గొండ భాజపా అభ్యర్థిగా బరిలో ఉన్నారు.
పట్టు నిలుపుకొనే యత్నంలో భారాస
శాసనసభ ఎన్నికల్లో వెనకబడిన భారాస.. సిటింగ్ లోక్సభ స్థానాలతోపాటు మిగిలిన సీట్లపైనా ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించింది. అధినేత కేసీఆర్ బహిరంగసభలతో శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు ప్రయత్నిస్తున్నారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్రావు ఇతర ముఖ్యనేతలు కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలతో పాటు, కేంద్రంలోని భాజపా విభజన హామీలు అమలు చేయలేదనే అంశాలను భారాస ప్రచారాస్త్రాలుగా సంధిస్తోంది. భారాసకు చెందిన తొమ్మిదిమంది సిటింగ్ ఎంపీల్లో ఇప్పుడు ముగ్గురు మాత్రమే పోటీలో ఉన్నారు. ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు, మహబూబ్నగర్ నుంచి మన్నె శ్రీనివాస్రెడ్డి, మహబూబాబాద్ నుంచి ఎం.కవిత మాత్రమే బరిలో నిలిచారు. కొందరు పార్టీని వీడి వెళ్లడం, మారిన సమీకరణాల రీత్యా మిగిలిన 14 స్థానాల్లో ఇతర అభ్యర్థులను భారాస బరిలో దించింది. బీఎస్పీ నుంచి భారాసలో చేరిన ఐపీఎస్ మాజీ అధికారి ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ నాగర్కర్నూల్ నుంచి పోటీ చేస్తున్నారు. కేసీఆర్ గురువారం తమ పార్టీ అభ్యర్థులు 17 మందికి బీఫాంలను అందజేయనున్నారు.
బలం పెంచుకోవడమే లక్ష్యంగా భాజపా
గత లోక్సభ ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో నెగ్గిన భాజపా ఈసారి రెండంకెల సీట్లపై దృష్టి సారించింది. అసెంబ్లీ ఎన్నికల్లో గతంలో కంటే ఓట్ల శాతం పెరగడంతో లోక్సభ పోరులోనూ సత్తా చాటాలని ముందుకు సాగుతోంది. చేరికలకు ప్రాధాన్యం ఇచ్చిన భాజపా ముందుగానే అభ్యర్థులను ప్రకటించింది. కేంద్రంలో పదేళ్ల భాజపా పాలనలో విజయాలు, మరోమారు ప్రధానిగా మోదీ ఉండాల్సిన అవసరం, కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీ హామీల అమలులో లోపాలు, పదేళ్ల భారాస పాలన వైఫల్యాలను ప్రచారాస్త్రాలుగా భాజపా ప్రయోగిస్తోంది. అగ్రనేతలు నరేంద్రమోదీ, అమిత్షాలతో పాటు కేంద్రమంత్రులు, ఇతర ముఖ్యనేతల ప్రచారానికి కార్యాచరణ సిద్ధమవుతోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్రెడ్డి మరోమారు సికింద్రాబాద్ నుంచి పోటీ చేస్తుండగా.. జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కరీంనగర్, జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె.అరుణ మహబూబ్నగర్, మరో ముఖ్యనేత ఈటల రాజేందర్ మల్కాజిగిరి, డి.అర్వింద్ నిజామాబాద్ స్థానాల నుంచి బరిలో దిగారు. నామినేషన్ల కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించేలా భాజపా ఏర్పాట్లు చేసుకుంటోంది. గురువారం గోవా సీఎం ప్రమోద్ సావంత్.. మెదక్ అభ్యర్థి రఘునందన్రావు నామినేషన్లో, కేంద్రమంత్రి హర్దీప్సింగ్ పురి.. ఈటల రాజేందర్ నామినేషన్లో పాల్గొననున్నారు. 19న రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్.. కిషన్రెడ్డి నామినేషన్లో పాల్గొంటుండగా ఇతర అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమాలకు కేంద్రమంత్రులు, ఇతర రాష్ట్రాల సీఎంలు హాజరు కానున్నారు.
కాంగ్రెస్కు కీలకం
శాసనసభ ఎన్నికల్లో 64 స్థానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్కు లోక్సభ ఎన్నికలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారాయి. మూడు లోక్సభ సిటింగ్ స్థానాలు ఉన్న కాంగ్రెస్ పార్టీ శాసనసభ ఎన్నికల విజయోత్సాహంతో రెండంకెల ఎంపీ సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం, అగ్రనేతలు ప్రత్యేక దృష్టి సారించారు. తొలి ప్రచారసభను హైదరాబాద్ సమీపంలోని తుక్కుగూడలో నిర్వహించగా.. అగ్రనేత రాహుల్గాంధీ హాజరయ్యారు. ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. బలాబలాలను సర్వేలతో మదింపు చేసుకుని ఏ అవకాశాన్నీ వదులుకోకూడదనే ప్రణాళికను కాంగ్రెస్ అమలు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారంటీలతో పాటు.. పార్టీ జాతీయస్థాయి మ్యానిఫెస్టో అంశాలనూ ప్రజల్లోకి తీసుకెళ్తోంది. నామినేషన్ల సందర్భంగా ర్యాలీలు నిర్వహించేందుకు కాంగ్రెస్ అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. ర్యాలీలు, నామినేషన్ల కార్యక్రమాల్లో కొన్నిచోట్ల ముఖ్యమంత్రి, మరికొన్నిచోట్ల మంత్రులు, ఇతర ముఖ్యనేతలు పాల్గొంటారు. రాహుల్, ప్రియాంకలు పలు ప్రచారసభలకు హాజరుకానున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.. మంత్రులకు చంద్రబాబు సూచన
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించడం... వంటి మంచి పనుల్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. -
సకుటుంబ సమేతంగా కేసులు.. అక్రమ కేసులున్నవారు నిలబడాలని కోరిన చంద్రబాబు
వివాహాలు, ఇతర శుభకార్యాలకు సకుటుంబ సపరివార సమేతంగా రావాలని ఆహ్వానిస్తుంటాం.. అయితే గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలపై సకుటుంబ సమేతంగా అక్రమ కేసులు నమోదు చేసి వేధించారని చంద్రబాబు, ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. శ్వేతపత్రం విడుదల సందర్భంగా.. వైకాపా ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలపై నమోదైన అక్రమ కేసుల సంఖ్యను చంద్రబాబు ప్రస్తావించారు. -
ఏపీ ‘ఎస్కోబార్’ జగన్.. చీకటి సామ్రాజ్యాధిపతితో పోల్చిన చంద్రబాబు
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అరాచకాలను వివరించేటప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కొలంబియన్ మాదకద్రవ్యాల చీకటి సామ్రాజ్యాధిపతి పాబ్లో ఎమిలియో ఎస్కోబార్ చరిత్రను సభకు వినిపించారు. -
‘రఘురామను చిత్రహింసలు పెట్టినప్పుడు మీరంతా ఏమయ్యారు?’
మాజీ ముఖ్యమంత్రి జగన్ దిల్లీలో చేసిన నిరసనకు ఇండియా కూటమి నాయకులు మద్దతు పలకడాన్ని అనంతపురం తెదేపా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. -
అన్ని వర్గాలకూ మోసం
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలనూ మోసం చేసిందని, అందర్నీ వెన్నుపోటు పొడిచిందని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. -
శాంతిభద్రతల పరిరక్షణపై సభలో చర్చిద్దాం
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు.. రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలపై శాసనసభలో ఒక రోజు పూర్తిగా చర్చించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు. -
ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని దోచేశారు
‘వైకాపా ప్రభుత్వం చేసిన నిర్వాకాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు విద్యుత్తు, అమరావతి, పోలవరం, గనులు, మద్యంపై శ్వేతపత్రాలు విడుదల చేశారు. -
వైకాపా ప్రభుత్వం ఇళ్లు కూల్చింది.. ఆదుకోండి
తెదేపాకు అనుకూలంగా ఉన్నారని విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం దన్నానపేట గ్రామానికి చెందిన 30 మంది దళితుల ఇళ్లను అప్పటి వైకాపా ప్రభుత్వం కూల్చేసిందని ఆ మండల తెదేపా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు టొంపల నర్సయ్య గురువారం తెదేపా కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. -
వైకాపా పాలనలో తెదేపా శ్రేణులపై 2,560 కేసులు
వైకాపా హయాంలో గత ఐదేళ్లలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై 2,560 కేసులు నమోదు చేసి.. 2,370 మందిని అరెస్టు చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. -
ఇసుక, మద్యం అవినీతిపై విచారణ జరిపించాలి
ముఖ్యమంత్రి చంద్రబాబును రాష్ట్ర సచివాలయంలో గురువారం సీపీఎం నాయకులు కలిశారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. -
సమస్యలపై ప్రశ్నిస్తే.. వేధింపులే సమాధానం
శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం విడుదల చేసిన ‘శాంతిభద్రతల శ్వేతపత్రం’పై కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వేదికగా మాట్లాడారు. -
‘ఇండియా’ కూటమితో పొత్తు కోసమే జగన్ దిల్లీ యాత్ర
‘ఇండియా’ కూటమితో పొత్తు కోసమే వైకాపా అధ్యక్షుడు జగన్ దిల్లీ వెళ్లినట్లుగా ఉందని ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. దిల్లీ నుంచి అమరావతి చేరుకున్న జగన్... శాసనసభ సమావేశాలకు హాజరు కావాలని సూచించారు. -
ఇది పసలేని దండగమారి బడ్జెట్: కేటీఆర్
రాష్ట్ర ప్రభుత్వం పసలేని, దండగమారి బడ్జెట్ ప్రవేశపెట్టిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ప్రజల ఆకాంక్షలు పట్టించుకోకుండా ఆంక్షల పద్దు పెట్టారని అన్నారు. -
సంక్షిప్త వార్తలు (4)
బడ్జెట్లో అధిక కేటాయింపుల ద్వారా.. తమది రైతు ప్రభుత్వమని మరోసారి నిరూపించుకున్నట్లయిందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అన్నారు. -
ఫైళ్ల దహనంతో మాకు సంబంధం లేదు: వైకాపా ఎంపీ మిథున్రెడ్డి
మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో జరిగిన రెవెన్యూ దస్త్రాల దహనం ఘటనతో తమకెలాంటి సంబంధం లేదని వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి పేర్కొన్నారు. -
గాజులదిన్నె ప్రాజెక్టు పనులపై విచారణ చేపడతాం: మంత్రి నిమ్మల
సంజీవయ్య గాజులదిన్నె ప్రాజెక్టు పనులపై విచారణ చేపడతామని జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. -
రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతీయడానికే జగన్ దిల్లీ నిరసన: హోంమంత్రి అనిత
రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతీయడానికే మాజీ సీఎం జగన్ దిల్లీలో నిరసన పేరుతో చౌకబారు ఆరోపణలు చేశారని హోంమంత్రి అనిత మండిపడ్డారు. 36 రాజకీయ హత్యలు జరిగాయని నిస్సిగ్గుగా మాట్లాడారని ధ్వజమెత్తారు. -
వరద బాధిత రైతులను తక్షణమే ఆదుకోవాలి
కోస్తా జిల్లాల్లోని వరద బాధిత రైతులకు తక్షణమే నష్టపరిహారం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల గురువారం లేఖ రాశారు. -
రైతుల జీవితాలతో చెలగాటం వద్దు!
‘ఎన్నికలు అయిపోయాయి.. రాజకీయాలు వదిలేయండి.. రాజకీయాల కోసం రైతుల జీవితాలతో చెలగాటమాడొద్దు’ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. -
సంతోషదాయక బడ్జెట్: కూనంనేని
నిధుల పరంగా రాష్ట్రం సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సంతోషదాయకంగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. -
హామీల అమలుపై చిత్తశుద్ధి ఏదీ?
ప్రగతి పట్టని, సరైన దిశానిర్దేశం లేని, హామీల అమలుపై చిత్తశుద్ధి లేని బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిందని భాజపా శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి విమర్శించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణలో కొత్తగా మరో 9 వేల బీటెక్ సీట్లు..!
-
అనాథలా తల్లి శవం.. ఆస్తుల కోసం కుమార్తెల పంతం
-
ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.. మంత్రులకు చంద్రబాబు సూచన
-
ఎన్టీఆర్కు ఒక్క సెకను.. నాకు 10 రోజులు: జాన్వీకపూర్
-
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
-
గాజాలో సంక్షోభంపై మౌనంగా ఉండలేను.. నెతన్యాహుతో కమలా హారిస్