గ్యారంటీగా వచ్చేది మేమే
ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో గ్యారంటీగా అధికారంలోకి వచ్చేది తామేనని ప్రధాని మోదీ మరోసారి ధీమా వ్యక్తంచేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం అస్సాంలోని నలబాడీలో, త్రిపుర రాజధాని అగర్తలలో బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు.
అస్సాం, త్రిపుర సభల్లో మోదీ
నలబాడీ (అస్సాం), అగర్తల: ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో గ్యారంటీగా అధికారంలోకి వచ్చేది తామేనని ప్రధాని మోదీ మరోసారి ధీమా వ్యక్తంచేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం అస్సాంలోని నలబాడీలో, త్రిపుర రాజధాని అగర్తలలో బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు. ‘‘మొదటిసారి 2014 ఎన్నికల్లో ప్రజల వద్దకు ఆశతో వెళ్లాం. రెండోసారి 2019లో నమ్మకంతో, ఇప్పుడు మూడోసారి 2024లో గ్యారంటీతో వెళ్తున్నాం. దేశవ్యాప్తంగా మోదీ గ్యారంటీలు వినిపిస్తున్నాయి. ఆ హామీలన్నీ నెరవేర్చే పూచీ నాది అని కూడా నేను గ్యారంటీ ఇస్తున్నాను. ఈశాన్య భారతమే దీనికి ఉదాహరణ. ఈ ప్రాంతానికి కాంగ్రెస్ ఏమైనా ఇచ్చిందంటే అవి సమస్యలు మాత్రమే. భాజపా ఈ ప్రాంతాన్ని అవకాశాలకు వనరుగా మార్చింది. కాంగ్రెస్ ఇక్కడ తిరుగుబాటుకు ఆజ్యం పోసింది. నేను ఈశాన్య ప్రజల్ని హత్తుకుని ఇక్కడ శాంతిని నెలకొల్పాను. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో జరగనిదానిని పదేళ్లలోనే నేను చేసి చూపించాను’’ అని వివరించారు. భాజపా ఎన్నికల ప్రణాళికలోని హామీలను మోదీ మరోసారి గుర్తుచేస్తూ- ఆయుష్మాన్ భారత్ కింద 70 ఏళ్ల పైబడినవారికి రూ.5 లక్షల వరకు వైద్యఖర్చుల భారం ఆయా కుటుంబాలపై పడకుండా చూస్తామన్నారు. ‘మీ కొడుకుగా ఆ వ్యయం విషయాన్ని నేను చూసుకుంటా’ అని చెప్పారు.
వారిది లూట్ఈస్ట్.. మాది యాక్ట్ఈస్ట్
తూర్పున ఉన్న ప్రాంతాలను దోచుకునేందుకు ‘లూట్ఈస్ట్’ను కాంగ్రెస్ ఒక విధానంగా పాటిస్తే భాజాపా మాత్రం ఆ ప్రాంతానికి మేలు చేసేలా ‘యాక్ట్ఈస్ట్’ను అమలు చేసిందని మోదీ చెప్పారు. తూర్పు, ఈశాన్య ప్రాంతాలను మరింతగా అభివృద్ధి చేయనున్నామని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలో ఉండిఉంటే మొబైల్ ఫోన్ల బిల్లులు నెలకు రూ.4,000-5,000కి చేరేవన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేసీఆర్ను చూస్తే గోబెల్స్ మళ్లీ పుట్టాడనిపిస్తోంది : సీఎం రేవంత్
తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మండిపడ్డారు. -
ప్రజ్వల్ రేవణ్ణను భారత్కు తీసుకొస్తాం: కర్ణాటక హోంమంత్రి
Prajwal Revanna: కర్ణాటక రాజకీయాల్లో సంచలనంగా మారిన లైంగిక దౌర్జన్యం కేసులో ప్రధాన నిందితుడైన ప్రజ్వల్ రేవణ్ణను భారత్కు తీసుకొచ్చేందుకు సిట్ చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర హోంమంత్రి వెల్లడించారు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో ప్రజల ఆస్తులకు ముప్పు: జీవీ రెడ్డి
ప్రజల ఆస్తులు దోచుకోవడానికే వైకాపా ప్రభుత్వం.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చిందని తెదేపా అధికార ప్రతినిధి జీవీ రెడ్డి ధ్వజమెత్తారు. -
నెలకు రూ.9 వేల కోట్ల సంపద సృష్టించలేక అప్పులపాలు
ప్రతి నెల రూ.9 వేల కోట్ల సంపద సృష్టించడం చేతకాని సీఎం జగన్.. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
జగన్ను ఎందుకు అరెస్టు చేయరు?
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్పై కక్ష గట్టి అరెస్టు చేయించిన కేంద్రంలోని భాజపా ప్రభుత్వం.. ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డికి ఎందుకు మినహాయింపు ఇస్తోందని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, మాజీ రాజ్యసభ సభ్యులు పి.మధు ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
యువ రోహిత్ను చూశారా.. బర్త్డే గిఫ్ట్గా టీనేజ్ ఫొటో షేర్ చేసిన తల్లి పుర్ణిమ
-
షారుక్ విమానం కోరిక.. కమల్ హాసన్ ఫన్నీ కామెంట్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అభ్యంతరకర వీడియోల ఘటన.. ఎంపీ ప్రజ్వల్పై సస్పెన్షన్ వేటు
-
సోనీ రియాన్ పాకెట్ ఏసీ.. ఎక్కడికైనా వెంట తీసుకెళ్లొచ్చు!
-
విజయవాడలో విషాదం.. ప్రముఖ వైద్యుడు సహా ఒకే కుటుంబంలో ఐదుగురి మృతి