తొలిదశకు ముగిసిన ప్రచారం
సార్వత్రిక సమరం అసలుసిసలు ఘట్టంలోకి ప్రవేశించింది. ఏడు విడతలకు విస్తరించిన ఎన్నికల్లో తొలిదశ కింద 21 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 లోక్సభ స్థానాలకు శుక్రవారం పోలింగ్ జరగనుంది.
రేపు 102 లోక్సభ స్థానాల్లో పోలింగ్
అరుణాచల్ అసెంబ్లీకి కూడా
దిల్లీ: సార్వత్రిక సమరం అసలుసిసలు ఘట్టంలోకి ప్రవేశించింది. ఏడు విడతలకు విస్తరించిన ఎన్నికల్లో తొలిదశ కింద 21 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 లోక్సభ స్థానాలకు శుక్రవారం పోలింగ్ జరగనుంది. నిబంధనల ప్రకారం బుధవారం సాయంత్రంతో ఈ నియోజకవర్గాల్లో ప్రచారానికి తెరపడింది. తమిళనాడులోని మొత్తం 39 నియోజకవర్గాలకూ ఈ దశలోనే ఎన్నికలు జరగనున్నాయి. రాజస్థాన్లో 12, ఉత్తర్ప్రదేశ్ 8, మధ్యప్రదేశ్ 6; మహారాష్ట్ర, అస్సాం, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో అయిదు చొప్పున; బిహార్లో నాలుగు, పశ్చిమ బెంగాల్లో మూడు; అరుణాచల్ప్రదేశ్, మణిపుర్, మేఘాలయల్లో రెండు చొప్పున; ఛత్తీస్గఢ్, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, అండమాన్ నికోబార్, జమ్మూకశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరిలలో ఒక్కొక్కటి చొప్పున లోక్సభ స్థానాలకు ఈ విడతలో పోలింగ్ జరగనుంది. చివరిరోజున- కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్యాదవ్లు యూపీలో ప్రచారం నిర్వహించారు. ప్రధాని మోదీ అస్సాంతో పాటు త్రిపురలో బహిరంగ సభల్లో పాల్గొన్నారు.
బరిలో 8 మంది కేంద్ర మంత్రులు
ఈ విడతలో 8 మంది కేంద్రమంత్రులు, ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు, ఓ మాజీ గవర్నర్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
- కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (భాజపా) మహారాష్ట్రలోని నాగ్పుర్ నుంచి హ్యాట్రిక్ విజయంపై కన్నేశారు. 2014లో 2.84 లక్షలు, 2019లో 2.16 లక్షల ఓట్ల ఆధిక్యంతో గెలుపొందిన ఆయన.. ఈ దఫా ఏకంగా 5 లక్షల మెజార్టీతో ఘన విజయం సాధిస్తానని ధీమాగా చెబుతున్నారు.
- కేంద్ర భూవిజ్ఞాన శాఖ మంత్రి కిరణ్ రిజిజు (భాజపా) అరుణాచల్ పశ్చిమ స్థానం బరిలో ఉన్నారు. 2004 నుంచి ఇక్కడ ఆయన మూడుసార్లు గెలుపొందారు. ప్రస్తుతం ఆయన ప్రధాన ప్రత్యర్థి అరుణాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నబమ్ తుకి (కాంగ్రెస్).
- ః కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రి సర్బానంద సోనోవాల్ (భాజపా) అస్సాంలోని దిబ్రూగఢ్ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న మరో కేంద్రమంత్రి రామేశ్వర్ తేలీని కాదని సోనోవాల్కు కమలదళం టికెట్ ఇచ్చింది.
- కేంద్రమంత్రి సంజీవ్ బలియాన్ (భాజపా) ఉత్తర్ప్రదేశ్లోని ముజఫర్నగర్ నుంచి బరిలో నిలిచారు. హరీంద్ర మాలిక్ (ఎస్పీ), దారాసింగ్ ప్రజాపతి (బీఎస్పీ)ల నుంచి ఆయన గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు.
- రాజస్థాన్లోని బీకానేర్లో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్రామ్ మేఘ్వాల్, అళ్వర్లో మరో కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ భాజపా అభ్యర్థులుగా బరిలో ఉన్నారు.
- కేంద్ర సహాయమంత్రి జితేంద్రసింగ్ (భాజపా) జమ్మూకశ్మీర్లోని ఉధమ్పుర్లో హ్యాట్రిక్ విజయం కోసం ప్రయత్నిస్తుండగా.. మరో సహాయమంత్రి ఎల్.మురుగన్ (భాజపా) తమిళనాడులోని నీలగిరిలో డీఎంకే సిట్టింగ్ ఎంపీ ఎ.రాజాను ఢీకొంటున్నారు.
- తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవులకు ఇటీవల రాజీనామా చేసిన తమిళిసై సౌందరరాజన్ (భాజపా) తమిళనాడులోని చెన్నై దక్షిణ స్థానంలో పోటీ చేస్తున్నారు.
- ః త్రిపుర పశ్చిమ నియోజకవర్గంలో మాజీ సీఎం బిప్లబ్కుమార్ దేవ్ (భాజపా) బరిలో ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేసీఆర్ను చూస్తే గోబెల్స్ మళ్లీ పుట్టాడనిపిస్తోంది : సీఎం రేవంత్
తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మండిపడ్డారు. -
ప్రజ్వల్ రేవణ్ణను భారత్కు తీసుకొస్తాం: కర్ణాటక హోంమంత్రి
Prajwal Revanna: కర్ణాటక రాజకీయాల్లో సంచలనంగా మారిన లైంగిక దౌర్జన్యం కేసులో ప్రధాన నిందితుడైన ప్రజ్వల్ రేవణ్ణను భారత్కు తీసుకొచ్చేందుకు సిట్ చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర హోంమంత్రి వెల్లడించారు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో ప్రజల ఆస్తులకు ముప్పు: జీవీ రెడ్డి
ప్రజల ఆస్తులు దోచుకోవడానికే వైకాపా ప్రభుత్వం.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చిందని తెదేపా అధికార ప్రతినిధి జీవీ రెడ్డి ధ్వజమెత్తారు. -
నెలకు రూ.9 వేల కోట్ల సంపద సృష్టించలేక అప్పులపాలు
ప్రతి నెల రూ.9 వేల కోట్ల సంపద సృష్టించడం చేతకాని సీఎం జగన్.. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
జగన్ను ఎందుకు అరెస్టు చేయరు?
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్పై కక్ష గట్టి అరెస్టు చేయించిన కేంద్రంలోని భాజపా ప్రభుత్వం.. ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డికి ఎందుకు మినహాయింపు ఇస్తోందని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, మాజీ రాజ్యసభ సభ్యులు పి.మధు ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
సత్తా చాటిన ‘పొలిమేర 2’, ‘ఉస్తాద్’.. ఉత్తమ నటుడిగా నవీన్ చంద్ర
-
నిజమే.. ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్నాం : చైనా
-
‘ఆయుధాలు అప్పగించేదే లేదు..!’ ఆర్మీని అడ్డుకున్న మహిళలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
విడాకులు తీసుకున్న కుమార్తెను ఘనంగా ఇంటికి ఆహ్వానించిన తండ్రి
-
ఓటీటీలో సిద్ధార్థ్ రాయ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?