వ్యూహకర్తలదే పెత్తనం!.. ప్రచారంలో పార్టీలను శాసించేది వారే
భారత రాజకీయాల్లో వ్యూహకర్తల పెత్తనం పెరిగిపోయింది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించే రోజులు పోయాయి. ప్రచారం మొత్తాన్ని వ్యూహకర్తలే శాసించే రోజులు వచ్చాయి.
అన్ని పార్టీలదీ అదే దారి
భారత రాజకీయాల్లో వ్యూహకర్తల పెత్తనం పెరిగిపోయింది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించే రోజులు పోయాయి. ప్రచారం మొత్తాన్ని వ్యూహకర్తలే శాసించే రోజులు వచ్చాయి. ఎక్సెల్ షీట్లు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్, లక్షిత సమాచార షేరింగ్, సర్వే నివేదికలు, టెక్నాలజీ, అపరిమిత డేటానే ఇప్పుడు ఎన్నికల్లో ముఖ్యాంశాలయ్యాయి. రెండు దశాబ్దాల కిందటి సంప్రదాయ ప్రచారానికి ఇప్పుడు స్థానం లేదు. అంతా వ్యూహాల మయమే. వ్యూహకర్తల పెత్తనమే. గతంలో తెరవెనుక ఉండి సలహాలను ఇచ్చే వ్యూహకర్తలు ఇప్పుడు తెరమీదకు వచ్చి అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకూ అన్నింటినీ శాసిస్తున్నారు.
ఈసారి మరింతగా..
ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో వ్యూహకర్తల పాత్ర గతంలో ఎన్నడూ లేనంతగా విస్తృతమైంది. ఎన్నికలు భావోద్వేగాలపై ఆధారపడి జరుగుతుంటాయని, ఎన్నికల్లో పోరాడటం అనేది ఒక కళ అని, అది సైన్సు కాదనేది సాధారణంగా ఉన్న ఒక అభిప్రాయం. కానీ వ్యూహకర్తల మాట వేరేలా ఉంది. రాజకీయ సలహాదారుల్లో పోస్టర్ బోయ్ సంస్కృతి వచ్చింది. 2014 ఎన్నికల్లో ప్రశాంత్ కిశోర్ రూపంలో ప్రాచుర్యంలోకి వచ్చింది. ఆ ఎన్నికల్లో భాజపా తరఫున వ్యూహాలను ప్రశాంత్ కిశోర్ రచించారు. ఆ పార్టీ 282 సీట్లను గెలుచుకుంది.
2014లో వ్యూహమిదీ..
సిటిజెన్స్ ఫర్ ఎకౌంటబుల్ గవర్నెన్స్ను (సీఏజీ) 2013లో ప్రశాంత్ కిశోర్ ప్రారంభించారు. రెండేళ్ల తర్వాత అది ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీగా (ఐ-ప్యాక్) రూపాంతరం చెందింది. అప్పటి నుంచి పలు ఎన్నికల్లో పార్టీల తరఫున వ్యూహాలను రచించడం ప్రారంభించింది. ఇందులో భాగంగా 2014 ఎన్నికల్లో ప్రశాంత్ కిశోర్ బృందం అమలు చేసిన ప్రత్యేక ప్రచారం భాజపాకు బాగా కలిసి వచ్చింది. బ్రాండ్ మోదీ, చాయ్పే చర్చ, ఐక్యతా ఉద్యమం వంటివి భాజపాను గెలిపించాయి. మోదీని వికాస పురుషుడిగా అభివర్ణిస్తూ ఏర్పాటు చేసిన 3డీ హోలోగ్రామ్ ర్యాలీలూ విజయవంతమయ్యాయి.
ముఖ్యమైన ప్రచారకర్తలు
- దేశంలో పలు పార్టీలతో పని చేసి చాలాసార్లు విజయవంతంగా అధికారం సాధించేలా వ్యూహాలను రచించిన ప్రశాంత్ కిశోర్ వ్యూహకర్తల్లో ముఖ్యమైన వ్యక్తి. ఆ తర్వాత ఆయన వ్యూహకర్తగా పనిచేయడం మానేసి నేరుగా రాజకీయాల్లోకి వచ్చారు. బిహార్లో పాదయాత్ర చేశారు. గతంలో రాజకీయ పార్టీలకు, నేతలకు సలహాలు ఇచ్చేవాడినని, ఇప్పుడు ప్రజలకు నేరుగా అసలైన సమస్యల గురించి వివరిస్తున్నానని ఆయన తెలిపారు. బిహార్లో పాదయాత్ర చేసిన ఆయన.. తానేమీ విప్లవాత్మక మార్పుల దిశగా చేయలేదని, క్షేత్ర స్థాయిలో పరిస్థితులపైనే పని చేశానని చెప్పారు.
- పలు రాష్ట్రాల్లో భాజపా తరఫున పని చేసిన మరో వ్యూహకర్త సునీల్ కనుగోలు ఇప్పుడు కాంగ్రెస్ తరఫున పని చేస్తున్నారు. ఆయన విజయాల ఖాతాల్లో కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, భారత్ జోడో యాత్ర ఉన్నాయి.
- ఐఐఎం బెంగళూరులో చదివిన పార్థ ప్రతిమ్ దాస్ 2013లో కర్ణాటకలోని జెవర్గిలో పోటీ చేసిన అజయ్ సింగ్కు వ్యూహకర్తగా తొలిసారిగా పని చేశారు. 2013 నవంబరులో ఆయన ఆరిందమ్ మన్నాతో కలిసి చాణక్య సంస్థను స్థాపించారు. జెవర్గిలో సిటింగ్ భాజపా ఎమ్మెల్యేను అజయ్ సింగ్ 36,700 ఓట్ల తేడాతో ఓడించారు. 2018లో మళ్లీ అజయ్ సింగ్ తరఫున పని చేసి గెలిపించారు. ‘2009లో సోషల్ మీడియా ప్రభావం పెద్దగా లేదు. ఓటింగ్ విధానం కూడా కుటుంబ అవసరాలు, ట్రెండ్ను బట్టి ఉండేది. ఎల్కే ఆడ్వాణీ, ములాయంసింగ్ యాదవ్ లాంటి వారు దేశమంతా తిరిగేవారు. అయితే కొత్త తరం నేతలు క్షేత్ర స్థాయిలో తిరగడం కంటే వ్యూహాలకే అధిక ప్రాధాన్యమిస్తున్నారు. వారు సాంకేతికతను ఎక్కువగా వాడుకుంటున్నారు. వర్గాలవారీగా ఓట్ల లెక్కలకు ప్రాధాన్యం పెరిగింది. గతంలో సర్వేలకు పెద్దగా ప్రాధాన్యం ఉండేది కాదు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది’ అని పార్థ ప్రతిమ్ దాస్ స్పష్టం చేశారు.
- 2016లో వార్ రూం స్ట్రాటజీస్ అనే సంస్థను తుషార్ పాంచాల్ ప్రారంభించారు. రాజకీయ వ్యూహకర్తల విధానం కొత్తదేమీ కాదని, దశాబ్దాల కిందటే ఉందని, అయితే అది రహస్యంగా సాగేదని పాంచాల్ పేర్కొన్నారు. ప్రశాంత్ కిశోర్ వచ్చాకే అది బహిరంగమైందని అభిప్రాయపడ్డారు.
- రాజకీయ వ్యూహ సంస్థలనేవి కొత్త విధానానికి శ్రీకారం చుట్టాయని యాక్సిస్ మై ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ప్రదీప్ గుప్తా తెలిపారు. గతంలో గెలుపోటములనేవి నాయకులపై ఆధారపడి ఉండేవి. ఇప్పుడవి వ్యూహకర్తల వ్యవహారంగా మారిపోయాయి.
ప్రచార కండూతి
పాంచాల్ అభిప్రాయపడినట్లు ప్రశాంత్ కిశోర్ రాకతో రాజకీయ వ్యూహకర్తలకు ప్రచార కండూతి ఎక్కువైంది. గతంలో వ్యూహకర్త పదవికి అంత ప్రాధాన్యం ఉండేది కాదు. ప్రచారమూ లభించేది కాదు. ఒక యాడ్ ఏజెన్సీలాగా పని చేసేవారు. ప్రస్తుతం ఆ పనిలో తేడా లేకున్నా వ్యూహకర్తలు ప్రచారం అధికంగా చేసుకుంటున్నారు. తద్వారా మరిన్ని పార్టీల నుంచి కాంట్రాక్టులు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రాంతాన్ని బట్టి, నేతలను బట్టి వ్యూహకర్తల ఫీజులు మారుతుంటాయి. సాధారణంగా నేతలకు వ్యక్తిగతంగా ఇటువంటి సంస్థలు పని చేయవు. పార్టీలకే పని చేస్తాయి. రాజకీయ వ్యూహాలకు నెలలకొద్దీ సమయం పడుతుంది. ప్రతి వ్యూహకర్తకూ అభ్యర్థుల వారీగా విభిన్న వ్యూహం ఉంటుంది. ఒక పార్టీకి, నేతకు పని చేయాలంటే దాదాపుగా 5 నుంచి 6 నెలల సమయం పడుతుంది.
- పోల్ బూత్ స్థాయి నుంచీ డేటాను వ్యూహకర్తలు సేకరిస్తారు.
- ఆయా నియోజకవర్గాల్లో ఓట్ల సరళి ఎలా మారిందో చరిత్ర అంతా తీసుకుంటారు.
- క్షేత్ర స్థాయిలో సర్వేలు నిర్వహిస్తారు.
- ఓటర్ల అవసరాలను గుర్తిస్తారు.
- ఆ తర్వాత ప్రచార వ్యూహాన్ని నిర్ణయిస్తారు.
- అభ్యర్థులకు సలహాలిస్తారు. క్షేత్ర స్థాయి ప్రచార తీరును నిర్ణయిస్తారు.
గతంలో నేతలే వ్యూహకర్తలు
తొలి సార్వత్రిక ఎన్నికల్లో నాయకులంతా స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నవారే ఉండేవారు. వారికి ప్రజల నాడి తెలుసు కాబట్టి వారే వ్యూహాలను రచించుకునేవారు. ఇది దాదాపు 15ఏళ్లపాటు సాగింది. ఆ తర్వాత రాజకీయ వారసుల శకం ప్రారంభమైంది. ఆ తర్వాత ఇప్పుడు రాజకీయ వ్యూహకర్తల శకం మొదలైందని చెప్పవచ్చు.
సామాజిక మాధ్యమ వేదికగా పోరు
రాజకీయ వ్యూహ సంస్థల పాత్ర పెరిగింది. సామాజిక మాధ్యమాల మద్దతు లేకుండా పార్టీలు, నాయకులు ఎన్నికల్లో నెగ్గుకురాలేమనే నిర్ణయానికి వచ్చారు. వారికి వాట్సప్ కంటెంట్ కావాలి. వ్యక్తిగత కంటెంట్ కావాలి. సామాజిక మాధ్యమ పోస్టులు కావాలి. వీటన్నింటినీ వారు సొంతంగా చేసుకోలేరు. పార్టీలన్నింటికీ సలహాదారులు కావాలి. ఈసారి దాదాపు 60 పార్టీలు వ్యూహకర్తలను నియమించుకున్నాయి.
ఈనాడు ప్రత్యేక విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి