వాలంటీర్లపై ఆగని వైకాపా ఒత్తిళ్లు
వాలంటీర్లందరూ రాజీనామా చేసి ఆ పత్రాలను పంచాయతీ కార్యదర్శికి అందించాలి. అధికారంలోకి రాగానే వారందరినీ మళ్లీ విధుల్లోకి తీసుకుంటాం.
అయినా రాజీనామాకు ససేమిరా
కొన్నిచోట్ల బెదిరింపులు.. మరికొన్ని చోట్ల వేడుకోళ్లు
నెల రోజుల్లో వైదొలిగిన వారు 40 వేల మందే
వాలంటీర్లందరూ రాజీనామా చేసి ఆ పత్రాలను పంచాయతీ కార్యదర్శికి అందించాలి. అధికారంలోకి రాగానే వారందరినీ మళ్లీ విధుల్లోకి తీసుకుంటాం. ముఖ్యమంత్రికి మద్దతుగా మీ పరిధిలో సేవాతత్పరతతో కార్యక్రమాలు చేయాలి. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం నేను చూసుకుంటా. నేరుగా ఇన్వాల్వ్ అయి నాకు సహకరించాలి. దయచేసి రాజీనామా చేయండి.
చోడవరం వైకాపా ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ వేడుకోలు
ఈనాడు, అమరావతి: ఎన్నికల వేడి రాజుకుంటున్న కొద్దీ వాలంటీర్లందరూ రాజీనామా చేయాలంటూ వైకాపా నేతల ఒత్తిళ్లు అధికమవుతున్నాయి. కొందరు బెదిరింపులకు దిగుతుండగా, మరికొందరు దయచేసి అంటూ బతిమాలుతున్నారు. రాజీనామా చేసి, వైకాపా తరఫున ప్రచారంలో పాల్గొంటే రూ.10 వేలు ఇస్తామంటూ నజరానాలు ప్రకటిస్తున్నారు. అయినా చాలావరకు వాలంటీర్లు ససేమిరా అంటున్నారు. ‘మళ్లీ వైకాపానే అధికారంలోకి వస్తుందన్న గ్యారెంటీ ఏంటి? వచ్చినా, మమ్మల్నే కొనసాగిస్తుందా?’ అని ప్రశ్నిస్తున్నారు. నెల రోజులుగా వైకాపా నేతలు అన్నిరకాల అస్త్రాలు ప్రయోగించినా ఇప్పటివరకు అధికారికంగా రాజీనామా చేసింది 40 వేల మందే. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో 2.66 లక్షల మంది వాలంటీర్లున్నారు.
ఇష్టం లేకున్నా తప్పుకొన్నవారే ఎక్కువ
వాలంటీర్లతో రాజీనామా చేయించే బాధ్యతను వైకాపా నాయకులు గ్రామాల్లోని ఆ పార్టీ స్థానిక నేతలకు అప్పగించారు. కొన్నిచోట్ల ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీకి చెందిన ఎమ్మెల్వో (మండల్ లెవల్ ఆఫీసర్)లు తీసుకున్నారు. పదేపదే ఫోన్లు చేస్తూ వారికి ఇష్టం లేకున్నా రాజీనామా చేయాల్సిన పరిస్థితులు సృష్టిస్తున్నారు. తెల్ల కాగితంపై సంతకం పెడితే చాలు, ఏం రాయాలో తాము చూసుకుంటామంటూ ఒకే కాగితంపై స్థానిక వాలంటీర్లందరి సంతకాలు తీసుకొని వారంతా రాజీనామా చేశారంటూ అధికారులకు ఇస్తున్నారు. దీన్ని వారు అంగీకరించడం లేదు. ప్రతి వాలంటీర్ నిర్దేశిత కారణాన్ని చూపి రాజీనామా లేఖను వ్యక్తిగతంగా అందించాల్సిందేనని తేల్చిచెబుతున్నారు. రాజీనామా చేసిన ప్రతి 100 మందిలో ఐదుగురు కూడా ఇష్టపూర్వకంగా చేయలేదని నెల్లూరు జిల్లాకు చెందిన ఓ అధికారి తెలిపారు. వైయస్ఆర్ జిల్లా ముద్దనూరులోనూ వైకాపా నేతలు బలవంతంగా రాజీనామా చేయించారు. రాష్ట్రమంతా ఇదే పరిస్థితి. వాలంటీర్ పోస్టు నియామకానికి గరిష్ఠ వయోపరిమితి 35 ఏళ్లు. ఆ వయసుకు చేరువైన వారు తప్పుకొనేందుకు ముందుకు రావడం లేదు. వారిని మభ్యపెట్టేందుకు వైకాపా మరో ఎత్తుగడ వేసింది. మార్చి, ఏప్రిల్ నెలల్లో రాజీనామా చేసిన 35 ఏళ్లకు పైబడిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకుంటామని సమాచారమిస్తోంది.
అంతర్గత చర్చల్లో ఆవేదన
తమను నియమించింది ప్రభుత్వమైతే, ఏ కారణమూ లేకుండా వైకాపా నేతలు రాజీనామాలకు ఒత్తిడి చేయడమేంటని వాలంటీర్లు అంతర్గత చర్చల్లో వాపోతున్నారు. ‘పారితోషికం పెంచాలని నిరసన తెలిపినా సీఎం జగన్ పట్టించుకోలేదు. తెదేపా అధికారంలోకి వస్తే రూ.10 వేలు ఇస్తామంటోంది. అదీ దక్కకుండా చేస్తున్నారు. ఇప్పటిదాకా మేం ఎన్నికల్లో ఏ పార్టీకీ అనుకూలంగా తిరగలేదు. వాలంటీర్ పోస్టు ఇచ్చినందున వైకాపాకు అనుకూల ప్రచారం చేయాలని చెప్పడమేంట’ని పలువురు మండిపడుతున్నారు. ‘మాతో వైకాపా నేతలు బలవంతంగా రాజీనామా చేయించారు. దాన్ని వెనక్కి తీసుకునే అవకాశముందా?’ అని ఓ వాలంటీర్ వారికి సంబంధించిన గ్రూపులో మెసేజ్ పెట్టారు. రాజీనామా చేస్తే రూ.10 వేలు ఇస్తామన్న వారు కూడా ముందుకు రావడం లేదని మరొకరు స్పందించారు. ‘వేతనాలిచ్చేది ప్రభుత్వం. రాజకీయ పార్టీ కాదు. ప్రభుత్వం ఉత్తర్వులిచ్చే దాకా ఎవరూ తొందర పడొద్ద’ని మరో వాలంటీర్ మెసేజ్ పెట్టారు.
వైకాపా తరఫున ప్రచారం
కొందరు వాలంటీర్లు మాత్రం వైకాపా నేతలు చెప్పినట్టే ఆడుతున్నారు. సెల్ఫోన్లు ప్రభుత్వానికి ఇచ్చేసినప్పటికీ, వేరే నంబర్తో తమ పరిధిలోని 50 కుటుంబాలతో ప్రత్యేక వాట్సప్ గ్రూపుల్లో కొనసాగుతున్నారు. విధుల్లోంచి వైదొలిగాక ప్రజలు, లబ్ధిదారులతో నేరుగా సంబంధం పెట్టుకోకూడదు. కానీ ఎమ్మెల్వోల దిశానిర్దేశంలో వివిధ గ్రూపుల్లో చేరి, వైకాపా అనుకూల ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల్లో వైకాపాకే మెజార్టీ స్థానాలు వస్తాయంటూ తప్పుడు సర్వేలను గ్రూపుల్లో పోస్టు చేస్తూ ఓటర్లను ప్రభావితం చేస్తున్నారు. రాజీనామా చేసిన వారి కార్యకలాపాలపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా కొనసాగి ఉంటే 2021లోనే పోలవరం పూర్తయ్యేది: సీఎం చంద్రబాబు
2014-19 మధ్య పెట్టుబడులకు చిరునామాగా ఆంధ్రప్రదేశ్ను నిలిపామని సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. -
గోదావరిలో నీరుంది.. కానీ ప్రభుత్వానికి ఇచ్చే మనసు లేదు: కేటీఆర్
తెలంగాణలో కరవు అనే మాట వినపడకూడదని కేసీఆర్.. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
వైకాపా హయాంలో ప్రకటనల కుంభకోణం.. హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేల డిమాండ్
వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రకటనల కుంభకోణంపై హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. -
ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.. మంత్రులకు చంద్రబాబు సూచన
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించడం... వంటి మంచి పనుల్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. -
సకుటుంబ సమేతంగా కేసులు.. అక్రమ కేసులున్నవారు నిలబడాలని కోరిన చంద్రబాబు
వివాహాలు, ఇతర శుభకార్యాలకు సకుటుంబ సపరివార సమేతంగా రావాలని ఆహ్వానిస్తుంటాం.. అయితే గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలపై సకుటుంబ సమేతంగా అక్రమ కేసులు నమోదు చేసి వేధించారని చంద్రబాబు, ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. శ్వేతపత్రం విడుదల సందర్భంగా.. వైకాపా ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలపై నమోదైన అక్రమ కేసుల సంఖ్యను చంద్రబాబు ప్రస్తావించారు. -
ఏపీ ‘ఎస్కోబార్’ జగన్.. చీకటి సామ్రాజ్యాధిపతితో పోల్చిన చంద్రబాబు
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అరాచకాలను వివరించేటప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కొలంబియన్ మాదకద్రవ్యాల చీకటి సామ్రాజ్యాధిపతి పాబ్లో ఎమిలియో ఎస్కోబార్ చరిత్రను సభకు వినిపించారు. -
‘రఘురామను చిత్రహింసలు పెట్టినప్పుడు మీరంతా ఏమయ్యారు?’
మాజీ ముఖ్యమంత్రి జగన్ దిల్లీలో చేసిన నిరసనకు ఇండియా కూటమి నాయకులు మద్దతు పలకడాన్ని అనంతపురం తెదేపా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. -
అన్ని వర్గాలకూ మోసం
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలనూ మోసం చేసిందని, అందర్నీ వెన్నుపోటు పొడిచిందని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. -
శాంతిభద్రతల పరిరక్షణపై సభలో చర్చిద్దాం
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు.. రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలపై శాసనసభలో ఒక రోజు పూర్తిగా చర్చించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు. -
ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని దోచేశారు
‘వైకాపా ప్రభుత్వం చేసిన నిర్వాకాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు విద్యుత్తు, అమరావతి, పోలవరం, గనులు, మద్యంపై శ్వేతపత్రాలు విడుదల చేశారు. -
వైకాపా ప్రభుత్వం ఇళ్లు కూల్చింది.. ఆదుకోండి
తెదేపాకు అనుకూలంగా ఉన్నారని విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం దన్నానపేట గ్రామానికి చెందిన 30 మంది దళితుల ఇళ్లను అప్పటి వైకాపా ప్రభుత్వం కూల్చేసిందని ఆ మండల తెదేపా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు టొంపల నర్సయ్య గురువారం తెదేపా కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. -
వైకాపా పాలనలో తెదేపా శ్రేణులపై 2,560 కేసులు
వైకాపా హయాంలో గత ఐదేళ్లలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై 2,560 కేసులు నమోదు చేసి.. 2,370 మందిని అరెస్టు చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. -
ఇసుక, మద్యం అవినీతిపై విచారణ జరిపించాలి
ముఖ్యమంత్రి చంద్రబాబును రాష్ట్ర సచివాలయంలో గురువారం సీపీఎం నాయకులు కలిశారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. -
సమస్యలపై ప్రశ్నిస్తే.. వేధింపులే సమాధానం
శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం విడుదల చేసిన ‘శాంతిభద్రతల శ్వేతపత్రం’పై కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వేదికగా మాట్లాడారు. -
‘ఇండియా’ కూటమితో పొత్తు కోసమే జగన్ దిల్లీ యాత్ర
‘ఇండియా’ కూటమితో పొత్తు కోసమే వైకాపా అధ్యక్షుడు జగన్ దిల్లీ వెళ్లినట్లుగా ఉందని ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. దిల్లీ నుంచి అమరావతి చేరుకున్న జగన్... శాసనసభ సమావేశాలకు హాజరు కావాలని సూచించారు. -
ఇది పసలేని దండగమారి బడ్జెట్: కేటీఆర్
రాష్ట్ర ప్రభుత్వం పసలేని, దండగమారి బడ్జెట్ ప్రవేశపెట్టిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ప్రజల ఆకాంక్షలు పట్టించుకోకుండా ఆంక్షల పద్దు పెట్టారని అన్నారు. -
సంక్షిప్త వార్తలు (4)
బడ్జెట్లో అధిక కేటాయింపుల ద్వారా.. తమది రైతు ప్రభుత్వమని మరోసారి నిరూపించుకున్నట్లయిందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అన్నారు. -
ఫైళ్ల దహనంతో మాకు సంబంధం లేదు: వైకాపా ఎంపీ మిథున్రెడ్డి
మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో జరిగిన రెవెన్యూ దస్త్రాల దహనం ఘటనతో తమకెలాంటి సంబంధం లేదని వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి పేర్కొన్నారు. -
గాజులదిన్నె ప్రాజెక్టు పనులపై విచారణ చేపడతాం: మంత్రి నిమ్మల
సంజీవయ్య గాజులదిన్నె ప్రాజెక్టు పనులపై విచారణ చేపడతామని జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. -
రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతీయడానికే జగన్ దిల్లీ నిరసన: హోంమంత్రి అనిత
రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతీయడానికే మాజీ సీఎం జగన్ దిల్లీలో నిరసన పేరుతో చౌకబారు ఆరోపణలు చేశారని హోంమంత్రి అనిత మండిపడ్డారు. 36 రాజకీయ హత్యలు జరిగాయని నిస్సిగ్గుగా మాట్లాడారని ధ్వజమెత్తారు. -
వరద బాధిత రైతులను తక్షణమే ఆదుకోవాలి
కోస్తా జిల్లాల్లోని వరద బాధిత రైతులకు తక్షణమే నష్టపరిహారం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల గురువారం లేఖ రాశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కొనసాగి ఉంటే 2021లోనే పోలవరం పూర్తయ్యేది: సీఎం చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
గోదావరిలో నీరుంది.. కానీ ప్రభుత్వానికి ఇచ్చే మనసు లేదు: కేటీఆర్
-
ఐటీఆర్ దాఖలు గడువు పొడిగింపు లేనట్లేనా?
-
మదనపల్లెలో బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన సిసోదియా
-
కేరళ, బెంగాల్ గవర్నర్ కార్యాలయాలకు సుప్రీం నోటీసులు