జగనాసురుడి ఓటమి ఖాయం
‘రాముడిని తలచుకుంటే.. మంచి పాలన గుర్తొస్తుంది. మనకూ మంచి పాలకులు కావాలి, సుపరిపాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. రావణాసురుడిని చంపిన రాముడే ఆదర్శంగా.. ఈ రాష్ట్రంలోని ప్రజలంతా కలిసి తమ ఓట్లతో జగనాసురుడిని ఓడించేందుకు సిద్ధమయ్యారు.
రాష్ట్రంలో రామరాజ్యం తీసుకొచ్చే బాధ్యత నాది
కూటమే గెలుస్తోందని 11 సర్వేలు తేల్చి చెప్పాయి
25 లోక్సభ.. 165 అసెంబ్లీ స్థానాల్లో గెలుస్తున్నాం
పెడన, మచిలీపట్నం ప్రజాగళం సభల్లో చంద్రబాబు
జగన్పై దాడి చేయడమే మాకు పనా.. ఇంకేం పనుల్లేవా?
పాతికేళ్ల భవిష్యత్తు కోసమే ఈ ఎన్నికలు: పవన్ కల్యాణ్
ఈనాడు, అమరావతి: ‘రాముడిని తలచుకుంటే.. మంచి పాలన గుర్తొస్తుంది. మనకూ మంచి పాలకులు కావాలి, సుపరిపాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. రావణాసురుడిని చంపిన రాముడే ఆదర్శంగా.. ఈ రాష్ట్రంలోని ప్రజలంతా కలిసి తమ ఓట్లతో జగనాసురుడిని ఓడించేందుకు సిద్ధమయ్యారు. అందరూ ఆశీర్వదిస్తే.. రాష్ట్రంలో రామరాజ్యాన్ని స్థాపించే బాధ్యత నాది’ అని తెదేపా అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. పెడన, మచిలీపట్నం నియోజకవర్గాల్లో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్తో కలిసి బుధవారం ప్రజాగళం సభల్లో పాల్గొని మాట్లాడారు. జగన్ పాలనలో ఈ రాష్ట్రంలోని ఏ వర్గమూ ఆనందంగా లేదన్నారు. ‘అందరినీ నట్టేట ముంచిన వ్యక్తి.. ఈ జగన్. ఒక్కరోజే 11 సర్వేలు విడుదలవ్వగా.. అన్నింటిలోనూ.. 17 నుంచి 23 ఎంపీ స్థానాల్లో కూటమే గెలుస్తోందని తేలిపోయింది. కేంద్రంలో 400 సీట్లతో ఎన్డీయే అధికారంలోకి వస్తుంది. ఏపీలో 25 లోక్సభ స్థానాలు, 165 అసెంబ్లీ సీట్లు గెలుస్తాం’ అని చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్రంలో అందరినీ భయపెట్టి, బానిసలుగా మార్చుకోవాలని జగన్ అనుకుంటున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. ‘ఎన్నికలకు 25 రోజులే ఉంది. తెదేపా, జనసేన, భాజపా కార్యకర్తలు.. ఈ కొద్దిరోజులు కష్టపడి, ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు వేయించండి. కేంద్రం, రాష్ట్రంలో మనమే వస్తున్నాం. బాగా కష్టపడిన కార్యకర్తలకు.. గుర్తింపు ఇచ్చే బాధ్యత మేం తీసుకుంటాం. ప్రతి ఓటూ చాలా ముఖ్యమనే విషయం మరచిపోవద్దు’ అని చంద్రబాబు సూచించారు.
మరో కొత్త నాటకం
అయిదేళ్ల తర్వాత కొత్త బిచ్చగాడిలా జగన్ మళ్లీ గులకరాయితో నాటకాలు మొదలెట్టి.. ప్రజల వద్దకు వస్తున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ‘కోడికత్తి నాటకం అయిపోయింది, ఇప్పుడు కొత్తగా గులకరాయి డ్రామా మొదలెట్టారు. ఘటన జరిగిన అరగంటలోనే మామీద బురదజల్లే ప్రయత్నాలు ఆరంభించారు. ఆ దాడి జరిగిన వెంటనే మేం ఖండించాం. కానీ.. పవన్ మీద, నామీద దాడి జరిగితే ఆయనెప్పుడూ ఖండించకపోగా.. అపహాస్యం చేశారు’ అని చంద్రబాబు మండిపడ్డారు.
మా దగ్గర నీతి, నిజాయతీ తప్ప డబ్బుల్లేవు..
ఈ అయిదేళ్లలో మద్యం, ఇసుక, భూదందాలపై దోచిన డబ్బులు బయటకు తీసి.. మళ్లీ ప్రజల్ని కొనేందుకు జగన్ వస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ‘మా దగ్గర డబ్బులు లేవు. నీతి, నిజాయతీ మాత్రమే ఉన్నాయి. ప్రజల జీవితాల్లో మళ్లీ వెలుగులు నింపాలనే లక్ష్యం ఉంది. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, ప్రజాస్వామ్య పరిరక్షణ, తెలుగు ప్రజల వెలుగే ధ్యేయంగా సాగుతున్నాం. ఎంతమంది ఎన్ని విమర్శలు చేసినా.. అదరకుండా బెదరకుండా ఓ యోధుడిలా ఈ పొత్తు కోసం నిలబడిన వ్యక్తి పవన్కల్యాణ్’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
జగన్పై దాడిచేస్తే.. అసలు బతకనిస్తారా?
పవన్ కల్యాణ్
‘జగన్కు గాయమైతే.. ఈ రాష్ట్రానికి గాయమా? రాష్ట్రంలో ఇంతమంది యువతకు ఉపాధి లేకపోతే అది గాయం కాదా?’ అని పవన్ ప్రశ్నించారు. పెడన, మచిలీపట్నంలో నిర్వహించిన ప్రజాగళం సభల్లో పవన్ మాట్లాడారు. ‘చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే అది గాయం కాదా? వైకాపా నేతలు 15ఏళ్ల అమర్నాథ్ను పెట్రోలు పోసి కాల్చేస్తే అది గాయం కాదా? ఇలాంటివన్నీ వదిలేసి జగన్దే గాయమా? ఏం జరిగిందో.. ఆ గోల, మాయ.. ఏంటో తెలియదు. ఆయనపై దాడిచేయడమే మా పనా? మాకింకేం పనులు లేవా? అందరిమీద దాడి చేసే మీ మీద దాడిచేసే ధైర్యం ఎవరికైనా ఉంటుందా? మీరు వాళ్లను బతకనిస్తారా?’ అని పవన్ ధ్వజమెత్తారు.
చెల్లి వ్యక్తిగత జీవితాన్నే రోడ్డుకీడ్చారు..
‘నా గురించి మరీ వ్యక్తిగతంగా దిగజారి మాట్లాడుతున్నారు. సొంత చెల్లి వ్యక్తిగత జీవితాన్ని రోడ్లపై పెట్టారు. జగన్ లాంటివాళ్లను ఈ ఎన్నికల్లోనే కాదు, పూర్తిగా రాజకీయాల నుంచి పక్కన పెట్టకపోతే.. దేశానికే చీడపురుగులుగా మారతారు’ అని పవన్ ఘాటుగా విమర్శించారు.
చంద్రబాబు మహా దార్శనికుడు
ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు అనుభవం చాలా అవసరమని పవన్ స్పష్టం చేశారు. ‘చంద్రబాబు మహా దార్శనికుడు.. మాదాపూర్కు వెళ్లినప్పుడు ఆయన విజన్ 2020 కనిపిస్తోంది. రాష్ట్రాన్ని ఈ అయిదేళ్లలో పూర్తిగా జగన్ భ్రష్టుపట్టించారు. జనాన్ని అడ్డగోలుగా దోచేశారు. ఎన్డీయే కన్వీనర్గా కేంద్రంలో కీలకంగా పనిచేసిన వ్యక్తి చంద్రబాబు. ఈరోజు ఆయన తగ్గి.. ఎమ్మెల్యేలను కుదించుకుని పొత్తు కోసం వచ్చారు. నేనూ బలం ఉన్నా.. పట్టున్న బందరు లాంటి స్థానాలనూ పొత్తు కోసం వదులుకున్నా. ఈ ఎన్నికలు, ఓట్లు అయిదేళ్ల కోసం కాదు.. వచ్చే పాతికేళ్ల భవిష్యత్తు కోసం’ అని పవన్ భావోద్వేగానికి గురయ్యారు.
మీకేనా.. ప్రజలకు మండదా?
‘జగన్పైకి రాయి విసిరినందుకు చాలా మండిందంట. మరి పోలవరం రాకుండా చేసినందుకు, రాజధాని లేకుండా చేసినందుకు ప్రజలకు మండదా? అంబేడ్కర్ విదేశీవిద్య లేకుండా చేసినందుకు మండదా? మాస్క్ అడిగినందుకు దళిత వైద్యుడు సుధాకర్ను పిచ్చోడిని చేసి చంపేశారు.. మండదా? దళిత డ్రైవర్ను చంపి డోర్ డెలివరీ చేస్తే ప్రజలకు మండదా? మీ నిరంకుశత్వ పాలన చూస్తే మండదా.. కడుపు మండదా?’ అంటూ పవన్ మండిపడ్డారు. కూటమి గెలుస్తోందని దాదాపు అన్ని సర్వేలూ తేల్చేశాయని పవన్ వెల్లడించారు. ‘వై నాట్ 175.. అని జగన్ అంటున్నారు. బందరు గడ్డపై నుంచి చెబుతున్నా.. మీకు 15 సీట్లే చాలా ఎక్కువ.. గుర్తుపెట్టుకోండి’ అని పవన్ హెచ్చరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా హయాంలో ప్రకటనల కుంభకోణం.. హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేల డిమాండ్
వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రకటనల కుంభకోణంపై హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. -
ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.. మంత్రులకు చంద్రబాబు సూచన
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించడం... వంటి మంచి పనుల్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. -
సకుటుంబ సమేతంగా కేసులు.. అక్రమ కేసులున్నవారు నిలబడాలని కోరిన చంద్రబాబు
వివాహాలు, ఇతర శుభకార్యాలకు సకుటుంబ సపరివార సమేతంగా రావాలని ఆహ్వానిస్తుంటాం.. అయితే గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలపై సకుటుంబ సమేతంగా అక్రమ కేసులు నమోదు చేసి వేధించారని చంద్రబాబు, ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. శ్వేతపత్రం విడుదల సందర్భంగా.. వైకాపా ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలపై నమోదైన అక్రమ కేసుల సంఖ్యను చంద్రబాబు ప్రస్తావించారు. -
ఏపీ ‘ఎస్కోబార్’ జగన్.. చీకటి సామ్రాజ్యాధిపతితో పోల్చిన చంద్రబాబు
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అరాచకాలను వివరించేటప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కొలంబియన్ మాదకద్రవ్యాల చీకటి సామ్రాజ్యాధిపతి పాబ్లో ఎమిలియో ఎస్కోబార్ చరిత్రను సభకు వినిపించారు. -
‘రఘురామను చిత్రహింసలు పెట్టినప్పుడు మీరంతా ఏమయ్యారు?’
మాజీ ముఖ్యమంత్రి జగన్ దిల్లీలో చేసిన నిరసనకు ఇండియా కూటమి నాయకులు మద్దతు పలకడాన్ని అనంతపురం తెదేపా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. -
అన్ని వర్గాలకూ మోసం
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలనూ మోసం చేసిందని, అందర్నీ వెన్నుపోటు పొడిచిందని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. -
శాంతిభద్రతల పరిరక్షణపై సభలో చర్చిద్దాం
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు.. రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలపై శాసనసభలో ఒక రోజు పూర్తిగా చర్చించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు. -
ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని దోచేశారు
‘వైకాపా ప్రభుత్వం చేసిన నిర్వాకాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు విద్యుత్తు, అమరావతి, పోలవరం, గనులు, మద్యంపై శ్వేతపత్రాలు విడుదల చేశారు. -
వైకాపా ప్రభుత్వం ఇళ్లు కూల్చింది.. ఆదుకోండి
తెదేపాకు అనుకూలంగా ఉన్నారని విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం దన్నానపేట గ్రామానికి చెందిన 30 మంది దళితుల ఇళ్లను అప్పటి వైకాపా ప్రభుత్వం కూల్చేసిందని ఆ మండల తెదేపా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు టొంపల నర్సయ్య గురువారం తెదేపా కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. -
వైకాపా పాలనలో తెదేపా శ్రేణులపై 2,560 కేసులు
వైకాపా హయాంలో గత ఐదేళ్లలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై 2,560 కేసులు నమోదు చేసి.. 2,370 మందిని అరెస్టు చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. -
ఇసుక, మద్యం అవినీతిపై విచారణ జరిపించాలి
ముఖ్యమంత్రి చంద్రబాబును రాష్ట్ర సచివాలయంలో గురువారం సీపీఎం నాయకులు కలిశారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. -
సమస్యలపై ప్రశ్నిస్తే.. వేధింపులే సమాధానం
శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం విడుదల చేసిన ‘శాంతిభద్రతల శ్వేతపత్రం’పై కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వేదికగా మాట్లాడారు. -
‘ఇండియా’ కూటమితో పొత్తు కోసమే జగన్ దిల్లీ యాత్ర
‘ఇండియా’ కూటమితో పొత్తు కోసమే వైకాపా అధ్యక్షుడు జగన్ దిల్లీ వెళ్లినట్లుగా ఉందని ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. దిల్లీ నుంచి అమరావతి చేరుకున్న జగన్... శాసనసభ సమావేశాలకు హాజరు కావాలని సూచించారు. -
ఇది పసలేని దండగమారి బడ్జెట్: కేటీఆర్
రాష్ట్ర ప్రభుత్వం పసలేని, దండగమారి బడ్జెట్ ప్రవేశపెట్టిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ప్రజల ఆకాంక్షలు పట్టించుకోకుండా ఆంక్షల పద్దు పెట్టారని అన్నారు. -
సంక్షిప్త వార్తలు (4)
బడ్జెట్లో అధిక కేటాయింపుల ద్వారా.. తమది రైతు ప్రభుత్వమని మరోసారి నిరూపించుకున్నట్లయిందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అన్నారు. -
ఫైళ్ల దహనంతో మాకు సంబంధం లేదు: వైకాపా ఎంపీ మిథున్రెడ్డి
మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో జరిగిన రెవెన్యూ దస్త్రాల దహనం ఘటనతో తమకెలాంటి సంబంధం లేదని వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి పేర్కొన్నారు. -
గాజులదిన్నె ప్రాజెక్టు పనులపై విచారణ చేపడతాం: మంత్రి నిమ్మల
సంజీవయ్య గాజులదిన్నె ప్రాజెక్టు పనులపై విచారణ చేపడతామని జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. -
రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతీయడానికే జగన్ దిల్లీ నిరసన: హోంమంత్రి అనిత
రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతీయడానికే మాజీ సీఎం జగన్ దిల్లీలో నిరసన పేరుతో చౌకబారు ఆరోపణలు చేశారని హోంమంత్రి అనిత మండిపడ్డారు. 36 రాజకీయ హత్యలు జరిగాయని నిస్సిగ్గుగా మాట్లాడారని ధ్వజమెత్తారు. -
వరద బాధిత రైతులను తక్షణమే ఆదుకోవాలి
కోస్తా జిల్లాల్లోని వరద బాధిత రైతులకు తక్షణమే నష్టపరిహారం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల గురువారం లేఖ రాశారు. -
రైతుల జీవితాలతో చెలగాటం వద్దు!
‘ఎన్నికలు అయిపోయాయి.. రాజకీయాలు వదిలేయండి.. రాజకీయాల కోసం రైతుల జీవితాలతో చెలగాటమాడొద్దు’ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. -
సంతోషదాయక బడ్జెట్: కూనంనేని
నిధుల పరంగా రాష్ట్రం సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సంతోషదాయకంగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
జేడీ వాన్స్ వ్యాఖ్యలు వైరల్.. తీవ్రంగా ఖండించిన ప్రముఖ నటి
-
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
-
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
-
అగ్నిపథ్ పథకంపై విపక్షాల విమర్శలు.. ఖండించిన మోదీ
-
మెక్సికన్ డ్రగ్ లార్డ్ ఇస్మాయిల్ ‘ఎల్ మాయో’ జంబాడ అరెస్ట్
-
26 మంది హత్య.. మృతదేహాలను నదిలోకి ఈడ్చుకెళ్లిన మొసళ్లు..!