రాష్ట్ర ప్రభుత్వం సహకరించకున్నా అభివృద్ధి చేశా
ఓటు వేసి గెలిపించిన ఓటరు తలదించుకునేలా తాను ఏ రోజూ వ్యవహరించలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు. ఐదేళ్లలో తాను చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు ఓటేయాలని కోరారు.
అంకితభావంతో పనిచేశానని భావిస్తేనే నాకు ఓట్లు వేయండి
ఓటరు తలదించుకునే పని నేను ఎప్పుడూ చేయలేదు
తెలంగాణకు ఈ పదేళ్లలో రూ.10 లక్షల కోట్ల కేంద్ర నిధులు
‘ప్రజలకు నివేదిక’ విడుదల సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
ఈనాడు, హైదరాబాద్: ఓటు వేసి గెలిపించిన ఓటరు తలదించుకునేలా తాను ఏ రోజూ వ్యవహరించలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు. ఐదేళ్లలో తాను చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు ఓటేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోయినా కేంద్ర మంత్రిగా అందివచ్చిన ప్రతి అవకాశాన్ని ఒడిసిపట్టి రాష్ట్రంలో అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ఎంపీగా, కేంద్ర మంత్రిగా రాష్ట్రానికి, జంటనగరాలకు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ‘ప్రజలకు నివేదిక’ పేరుతో పుస్తకాన్ని రూపొందించారు. అందులోని వివరాలతో గురువారం ఇక్కడ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ పాల్గొన్నారు. ‘‘నాకు ఎప్పుడూ కాంట్రాక్టర్లతో సంబంధాలు లేవు. నాపై అవినీతి, భూదందా సెటిల్మెంట్ల ఆరోపణలు, పోలీసు కేసులు లేవు. కేంద్ర మంత్రిగా దేశానికి సేవ చేస్తూనే సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేశా. ఈయనకు ఎందుకు ఓటు వేశామా అని ఓటర్లు అనుకునేలా నేను ఎప్పుడూ ప్రవర్తించలేదు. అంకితభావంతో పనిచేశానని, అభివృద్ధి చేశానని భావిస్తేనే ఓట్లు వేయండి.
కేంద్ర మంత్రిగా ఉన్నా ఎంతో హేళన చేశారు
రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలపై వందల లేఖలు రాసినా గత ముఖ్యమంత్రి స్పందించలేదు. నేను కేంద్ర మంత్రిగా ఉన్నా ఎంతో హేళన చేశారు. చులకనగా మాట్లాడారు. అయినా నేను పట్టించుకోలేదు. రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళ్లా. మొదటిసారి దేశానికి సేవచేసే అవకాశాన్ని సికింద్రాబాద్ ఓటర్లు కల్పించారు. భాజపా జాతీయ నాయకత్వం, ప్రధాని నరేంద్రమోదీ కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించా. ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించి కీలక బాధ్యతలను నిర్వహించా. రైతు ఉద్యమ సమయంలో, కరోనా సమయంలో బాధ్యతాయుతమైన సేవలు అందించా. ఆజాదీకా అమృత్ మహోత్సవ్, జి-20 దేశాల సమావేశాల సందర్భంగా మా శాఖ ద్వారా ముఖ్య కార్యక్రమాలు నిర్వహించాం. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి రూ.లక్షల కోట్లు వ్యయం చేశాం.
కేంద్రం ద్వారా రాష్ట్రాభివృద్ధికి అహరహం కృషి
నాకు కేంద్ర మంత్రిగా లభించిన అవకాశం ద్వారా రాష్ట్రాభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేశా. భాజపా ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి పదేళ్లలో రూ.10 లక్షల కోట్లను వ్యయం చేసింది. రోడ్లు, రైల్వేలు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి కేంద్రం ద్వారా రాష్ట్రంలో భారీ ఎత్తున నిధులను వ్యయం చేశాం. రాష్ట్రంలో జాతీయ రహదారులు 67 ఏళ్లలో 2,700 కిలోమీటర్లు ఉండగా కొత్తగా 2,500 కిలోమీటర్లు వచ్చాయి. తెలంగాణలోని 33 జిల్లాల్లో పెద్దపల్లి మినహా అన్ని జిల్లాలు జాతీయ రహదారులతో అనుసంధానం అయ్యాయి. కేంద్రమే రూ.26 వేల కోట్లను వ్యయం చేసి హైదరాబాద్ చుట్టుపక్కల రీజినల్ రింగ్ రోడ్డును నిర్మిస్తుంది. భూసేకరణ మొత్తంలో కూడా సగం వ్యయం కేంద్రమే భరించనుంది. తెలంగాణకు సంబంధించి ఏం చేయలేదనే వాళ్లకు అనేక సమాధానాలు ఉన్నాయి. రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు తేవడంతో పాటు ఓరుగల్లులో చారిత్రక నిర్మాణాల పరిరక్షణ, పునరుద్ధరణ చర్యలు చేపట్టాం. కేవలం నా శాఖ ద్వారానే కాకుండా ఇంకా వివిధ శాఖల ద్వారా అవకాశం ఉన్నమేర రాష్ట్ర అభివృద్ధికి కృషి చేశా’’ అని కిషన్రెడ్డి వివరించారు.
ప్రజలు విచక్షణతో ఆలోచించాలి: జయప్రకాశ్ నారాయణ
‘మనకు సంక్షేమాన్ని, అభివృద్ధిని సమతూకం చేసి దీర్ఘకాలిక అభివృద్ధి కోసం పని చేసే ప్రభుత్వాలు కావాలా? తాత్కాలికమైన తాయిలాలతో ప్రజలను మభ్యపెడుతూ, వారి అసహాయతను అడ్డం పెట్టుకొని ఓట్లు పొందే రాజకీయం కావాలా? ప్రజలు విచక్షణతో ఆలోచించాలి’ అని జయప్రకాశ్ నారాయణ అన్నారు. దేశ ప్రజలు, ఓటర్లు తమ మంచి తాము తెలుసుకోవాలన్నారు. ‘మహాత్మాగాంధీ చెప్పినట్లు నువ్వు చేసే పనివల్ల ఒక వ్యక్తి తన కాళ్లపై తాను నిలబడతాడా? అతడికి జీవితంపై పట్టు వస్తుందా? ఆతనిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందా అని ఆలోచించాలి. అలా పెంచితే అది మంచి పని.. లేదంటే నిరర్థకం అని గుర్తించాలి. రాష్ట్రం నా జాగీరు, జిల్లా నా జాగీరు అనేది హేయమైన ఆలోచన’ అని అన్నారు. కేంద్రమంత్రి కిషన్రెడ్డిని మనసారా అభినందిస్తూ..దేశంలో మంచి ప్రభుత్వాన్ని, మన పిల్లల భవిష్యత్తును కాపాడే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని కోరుకుంటున్నా’ అని అన్నారు. కార్యక్రమంలో బార్ కౌన్సిల్ ఛైర్మన్ నరసింహారెడ్డి, పద్మశ్రీ అవార్డు గ్రహీత హనుమంతరావు, సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి సహా పలువురు భాజపా ముఖ్యనేతలు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!