ఈ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం
వచ్చే సంవత్సర కాలంలో ఏదైనా జరగొచ్చని, లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం ఏర్పడే అవకాశం ఉందని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
104 మంది ఎమ్మెల్యేలుంటేనే.. మా ప్రభుత్వాన్ని కూల్చేందుకు భాజపా యత్నం
64 మంది ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్ను బతకనిస్తుందా?
రాబోయే రోజుల్లో ఉద్యమకాలం నాటి కేసీఆర్ను చూస్తారు
కవిత అరెస్టు కక్ష సాధింపే
భారాస విస్తృతస్థాయి సమావేశంలో కేసీఆర్
ఈనాడు, హైదరాబాద్: వచ్చే సంవత్సర కాలంలో ఏదైనా జరగొచ్చని, లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం ఏర్పడే అవకాశం ఉందని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ‘‘104 మంది ఎమ్మెల్యేలున్న భారాస ప్రభుత్వాన్ని కూల్చేందుకు భాజపా ప్రయత్నించింది. 64 మంది ఎమ్మెల్యేలే ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బతకనిస్తుందా? ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ ఎజెండాతో ముందుకు వెళ్తున్న భాజపా.. ఇతర పార్టీల ప్రభుత్వాలను ఎక్కడ వదిలిపెట్టింది? ఇక్కడి ప్రభుత్వాన్ని కూడా వదలదు. కాంగ్రెస్లో టీమ్ వర్క్ లేదు. స్థిరత్వం లేదు. కాంగ్రెస్ను చీల్చాలని భాజపా వాళ్లు ప్రయత్నం చేసినా.. కరడుకట్టిన నేతలు వెళ్లరు. అలా జరిగితే.. భారాసకు మద్దతిస్తామని కొందరు కాంగ్రెస్ నేతలు నాతో చెప్పారు. ఎంఐఎం కూడా వెళ్లదు. ఏ రాజకీయ గందరగోళం ఏర్పడినా భారాసకే మేలు జరుగుతుంది. భవిష్యత్ ఎన్నికల్లో భారాసదే విజయం. పార్టీ నాయకులు స్థిరచిత్తంతో ఉండండి. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా భారాస బీ-ఫాం తీసుకున్నవారే అదృష్టవంతులు. కత్తుల్లాంటి అభ్యర్థులకు అవకాశాలిస్తా’’ అని కేసీఆర్ అన్నారు. ‘‘రాబోయే రోజుల్లో ఉద్యమ కాలం నాటి కేసీఆర్ను మళ్లీ చూస్తారు. కొందరు నేతలు పార్టీని వీడి వెళ్లినంత మాత్రాన నష్టమేమీ లేదు. భారాస నుంచి కాంగ్రెస్లోకి వెళ్లిన నేతలు బాధపడుతున్నారు. అధికారం ఉందని వెళ్తే.. అక్కడంతా భాజపా కథ నడుస్తోందని ఓ నాయకుడు వాపోయాడు. మళ్లీ భారాసలోకి వస్తానని సంప్రదించాడు. నేను ఒప్పుకోలేదు. పార్టీ వీడినవారిని మళ్లీ చేర్చుకునే ప్రసక్తే లేదు’’ అని ఆయన స్పష్టం చేశారు. గురువారం తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన భారాస విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా 17 మంది ఎంపీ అభ్యర్థులకు, కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం అభ్యర్థి నివేదితకు ఆయన బీ-ఫాంలు అందజేశారు. ఎన్నికల ఖర్చు నిమిత్తం ఎంపీ అభ్యర్థులకు రూ.95 లక్షల చొప్పున చెక్కులను, కంటోన్మెంట్ అసెంబ్లీ అభ్యర్థికి రూ.45 లక్షల చెక్కు అందించారు. లోక్సభ ఎన్నికల్లో ప్రచారం, అనుసరించే వ్యూహంపై గులాబీ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. అంతకుముందు తెలంగాణ భవన్కు చేరుకున్న కేసీఆర్కు మాజీ మంత్రులు హరీశ్రావు, శ్రీనివాస్గౌడ్, వేముల ప్రశాంత్రెడ్డి తదితరులు స్వాగతం పలికారు. అక్కడే ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి కేసీఆర్ పూలమాల వేశారు.
ఉద్ధృతంగా పోస్టు కార్డు ఉద్యమం
సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ.. ‘‘కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దాన్ని అనుకూలంగా మలచుకోవాలి. గట్టిగా పోరాడితే లోక్సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పటివరకు 8 సీట్లలో గెలుస్తామని సర్వేలు చెబుతున్నాయి. మరో మూడు స్థానాల్లోనూ విజయావకాశాలున్నాయి. మరింత గట్టిగా పోరాడాలి. రైతు సమస్యలు ఎజెండాగా ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాలి. దీనిపై పోస్టుకార్డుల ఉద్యమాన్ని ఉద్ధృతం చేయాలి. ఒక్కో లోక్సభ నియోజకవర్గం పరిధిలో లక్ష పోస్టు కార్డులు రాయాలి. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితిలో మిల్లర్లు లేరు. రైతుల కల్లాల వద్దకు వెళ్లి రూ.500 బోనస్పై ప్రభుత్వాన్ని నిలదీయాలి. కాంగ్రెస్ పార్టీకి హామీలను గుర్తుచేయాలి. ప్రభుత్వ వైఫల్యాలను సామాజిక మాధ్యమాల ద్వారా ఎండగట్టాలి.
భాజపాకు ఎందుకు ఓటేయాలి?
లోక్సభ ఎన్నికల్లో భాజపాకు ఎందుకు ఓటేయాలో ఎక్కడికక్కడ నిలదీయాలి. డాలర్ విలువను రూ.83కు పెంచినందుకా? కృష్ణా నదిపై ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించినందుకా? ఏడు మండలాలను ఆంధ్రాలో కలిపినందుకా? రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలని ఒత్తిడి తెచ్చినందుకా? ఒక్క వైద్య కళాశాల, నవోదయ పాఠశాల కూడా ఇవ్వనందుకా? ఆ పార్టీకి ఎందుకు ఓటేయాలి?
ఇసుక కుంగడం వల్లే మేడిగడ్డ సమస్య
మేడిగడ్డ ఆనకట్ట వద్ద ఇసుక కుంగడం వల్లే సమస్య ఏర్పడింది. ఇంజినీరింగ్ నిర్ణయాలు అన్నీ అయ్యాక.. చివరికి మంత్రివర్గం వద్దకు వస్తుంది. నిర్మాణ వ్యవహారాలన్నీ ఇంజినీర్లు చూసుకోవాలి. ప్రతిదీ పైస్థాయిలో జరగదు. చిన్న సంఘటనను అడ్డం పెట్టుకొని.. అక్కడేదో జరిగిపోయినట్లు గడబిడ చేస్తూ.. ఏదో చేస్తామంటే ఎలా? కాళేశ్వరం ప్రాజెక్టులో మూడు పియర్లు కుంగిపోతే.. మొత్తం ప్రాజెక్టే కూలిపోయిందని అబద్ధాలు, కట్టుకథలతో ప్రజలను ఇన్నాళ్లు మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. కాఫర్ డ్యామ్ కట్టాలని నిర్ణయించటం భారాస సాధించిన విజయమే.
బీఎల్ సంతోష్పై కేసు పెట్టడంతో మోదీ కక్ష
భారాస ఎమ్మెల్సీ కవిత అరెస్టు ముమ్మాటికీ అక్రమం. ఎలాంటి ఆధారాలు లేకుండానే అరెస్టు చేశారు. గతంలో భారాస ప్రభుత్వాన్ని కూల్చేందుకు భాజపా జాతీయ నాయకుడు బీఎల్ సంతోష్ ప్రయత్నించారు. ఆయనపై కేసు నమోదు చేసి, నోటీసులు పంపించాం. భాజపా కేంద్ర కార్యాలయానికి నోటీసులు ఇవ్వడానికి రాష్ట్ర పోలీసులు వెళ్లారు. ఆ క్రమంలోనే భారాసపై మోదీ కక్ష కట్టారు. కవితను కుట్రపూరితంగా మనీలాండరింగ్ కేసులో ఇరికించారు. బీఎల్ సంతోష్పై మనం కేసు పెట్టకపోయి ఉంటే.. కవితపై అసలు కేసే ఉండేది కాదు.
నదీ జలాలపై భాజపా కుట్ర
గోదావరి నదిపై ఇచ్చంపల్లి వద్ద ప్రాజెక్టు కట్టి.. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు నీళ్లను తరలించేందుకు భాజపా కుట్ర చేస్తోంది. ఇది బచావత్ ట్రైబ్యునల్ తీర్పునకు వ్యతిరేకం. గత 50 ఏళ్ల నుంచి బచావత్ ట్రైబ్యునల్ తీర్పు ప్రకారమే నీటి పంపకాలు జరుగుతున్నప్పటికీ.. ఇప్పుడు కర్ణాటక, తమిళనాడుల్లో ఓట్లు దండుకోవటానికి నీళ్ల మళ్లింపు కుట్రకు భాజపా తెరలేపింది. ఇంత జరుగుతున్నా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తోంది? ఇది అసమర్థత కాదా? తెలంగాణ నదీ జలాల పరిరక్షణ భారాసతోనే సాధ్యం’’ అని కేసీఆర్ స్పష్టం చేశారు. భారాస నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని, దీన్ని ఎదుర్కొనేందుకు పార్టీ లీగల్ సెల్కు రూ.10 కోట్లు కేటాయిస్తున్నట్లు అధినేత తెలిపారు.
22 నుంచి ఉదయం పొలంబాట.. సాయంత్రం రోడ్ షోలు
ఈ నెల 22 నుంచి రెండు, మూడు వారాల పాటు రోడ్ షోలు, బస్సు యాత్రలు నిర్వహించాలని భారాస అధిష్ఠానం నిర్ణయించింది. ఉదయం 11 గంటల వరకు పొలం బాట కార్యక్రమం ఉంటుంది. పంటలను పరిశీలించడం, రైతుల కష్టాలను తెలుసుకొని.. వారిని ఓదార్చడం వంటి కార్యక్రమాలుంటాయి. సాయంత్రం నుంచి ఒక్కో లోక్సభ నియోజకవర్గం పరిధిలో 2-3 చోట్ల రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లు నిర్వహిస్తారు. వరంగల్, ఖమ్మం, మహబూబ్నగర్లలో లక్ష మందితో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.