పశ్చిమ పవర్ ఎవరిది?
సార్వత్రిక ఎన్నికల్లో అత్యంత కీలక రాష్ట్రం ఉత్తర్ ప్రదేశ్. ఇక్కడ ఆధిక్యం సాధించే పార్టీయే దాదాపుగా కేంద్రంలో అధికారంలోకి వస్తుంది.
యూపీలోని ముస్లిం, దళిత ప్రాబల్య ప్రాంతాల్లో తొలి విడతలో పోలింగ్
గత ఎన్నికల్లో ప్రతిపక్షాలదే పైచేయి
ఈసారీ ఇండియా కూటమి ఆశాభావం
భాజపాపై రాజ్పూత్ల ఆగ్రహం
సార్వత్రిక ఎన్నికల్లో అత్యంత కీలక రాష్ట్రం ఉత్తర్ ప్రదేశ్. ఇక్కడ ఆధిక్యం సాధించే పార్టీయే దాదాపుగా కేంద్రంలో అధికారంలోకి వస్తుంది. ఈ రాష్ట్రంలో మొత్తం ఏడు విడతల్లో పోలింగ్ జరగనుంది. శుక్రవారం తొలి విడతలో భాగంగా ముస్లింల ప్రాబల్యమున్న పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్లోని 8 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. ఇక్కడ భాజపా హిందుత్వపై ఆధారపడుతుండగా.. ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో ఇండియా కూటమి బరిలోకి దిగింది. 2019 ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమిదే పైచేయి అయినా అప్పట్లో కలిసి పోటీ చేసిన సమాజ్వాదీ, బీఎస్పీ విడిగా పోటీ చేస్తున్నాయి. ఈసారి కాంగ్రెస్తో సమాజ్వాదీ పార్టీ జట్టు కట్టింది.
- కీలకమైన పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్లో తీవ్రంగా ప్రభావం చూపే అంశాలుగానీ, గంపగుత్తగా ఓటింగ్ సరళిగానీ కనిపించవు.
- పార్టీలకు అతీతంగా హిందూ ఓట్ల కోసం అభ్యర్థులు ప్రయత్నిస్తుంటారు.
- ఈ ప్రాంతంలో 40శాతం నుంచి 50శాతం మధ్య ముస్లింల ఓట్లుంటాయి. అందువల్లే గత ఎన్నికల్లో భాజపా ఇక్కడ కేవలం 3 సీట్లకే పరిమితమైంది. 2014 ఎన్నికల్లో మాత్రం భాజపా ఇక్కడ ఏడు సీట్లను గెలుచుకుని సంచలనం సృష్టించింది.
- సహారన్పుర్లో గత 25ఏళ్లలో భాజపా ఒక్కసారే గెలిచింది.
పోటాపోటీ
- సహారన్పుర్లో భాజపా తరఫున రాఘవ్ లఖన్వాల్ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి ఇమ్రాన్ మసూద్ తలపడుతున్నారు. ఇక్కడ 58శాతం హిందువులున్నారు. 42 శాతం ముస్లిం జనాభా ఉంది.
- మొరాదాబాద్లో 48శాతం ముస్లింలున్నారు. ఇక్కడ తొలిసారిగా హిందూ అభ్యర్థిని సమాజ్వాదీ రంగంలోకి దింపింది. రుచి వీరా ఆ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు.
- దళిత ఓటర్లు అధికంగా ఉన్న నగీనాలో చతుర్ముఖ పోరు సాగుతోంది. ఇక్కడ సమాజ్వాదీ, బీఎస్పీ, భాజపా, ఆజాద్ సమాజ్ పార్టీ పోటీ చేస్తున్నాయి. 1989లో బీఎస్సీ అధినాయకురాలు మాయావతి ఇక్కడి నుంచి గెలిచారు. ఆజాద్ పార్టీ నుంచి సురేంద్రపాల్, భాజపా నుంచి ఓం కుమార్, సమాజ్వాదీ నుంచి మనోజ్ కుమార్ బరిలో ఉన్నారు.
- ముజఫర్నగర్లో కేంద్ర మంత్రి సంజీవ్ బల్యాన్ మూడోసారి పోటీ చేస్తున్నారు. ఆయనపై రాజ్పూత్లు ఆగ్రహంగా ఉన్నారు.
- పీలీభీత్లో ఈసారి వరుణ్ గాంధీకి భాజపా టికెట్ ఇవ్వలేదు. ఆయన స్థానంలో జితిన్ ప్రసాదను నిలిపింది. ఈ నియోజకవర్గంలో ప్రచారం చేసిన ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రామ మందిర అంశాన్ని ప్రస్తావించారు. గతంలో మత ఘర్షణలు, శాంతి భద్రతల సమస్యలు ఉండేవని, ఇప్పుడు అవి లేవని వారు సభల్లో చెప్పారు.
- సహారన్పుర్, కైరానాల్లో ఘర్షణల గురించి భాజపా నేతలు అధికంగా ప్రచారం చేశారు. తామొచ్చాక అవి లేవని స్పష్టం చేశారు.
- ఈ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ తరఫున అగ్రనేతలెవరూ ప్రచారం చేయలేదు. బుధవారం రోజునే సహారన్పుర్లో ప్రియాంకా గాంధీ రోడ్డు షో నిర్వహించారు.
- సమాజ్వాదీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేసిన అఖిలేశ్ యాదవ్.. ఈ ఎన్నికలు భారత రిపబ్లిక్ విలువల పరిరక్షణ కోసం జరుగుతున్నాయని చెప్పారు. భాజపా ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కుతుందని ఆరోపించారు.
ప్రతిపక్షాలకు ఆశ
పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్లో తొలి విడత పోలింగ్ జరగనున్న నియోజకవర్గాలపై ప్రతిపక్షాలకు ఆశ ఉంది. విపక్ష నేతలను దర్యాప్తు సంస్థలతో భాజపా వేధిస్తోందన్న అంశాలను అవి ప్రచారం చేస్తున్నాయి.
- ఈ ప్రాంతంలో స్థానిక ప్రజలు ధరల పెరుగుదలపై ఆందోళనగా ఉన్నారు. 2017కు ముందు ఏమీ లేని భాజపా నేతలు ఇప్పుడు భూములు కొన్నారని, పెద్ద కార్లలో తిరుగుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. భాజపా మద్దతుదారుల్లోనే ఆ పార్టీ పట్ల అసంతృప్తి ఉంది. అవినీతి నేతలను పదేళ్లుగా అరెస్టు చేయకుండా ఎన్నికలకు ముందు చేయడమేంటని వారు ప్రశ్నిస్తున్నారు.
- పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్లో ప్రాబల్యమున్న రాష్ట్రీయ లోక్దళ్ (ఆర్ఎల్డీ) ఈసారి భాజపాతో పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీకి కలిసివచ్చే అంశం.
- ప్రజలు చాలా సమస్యల గురించి మాట్లాడతారుగానీ ఎన్నికలకు వచ్చే సరికి కులాల వారీగా, మతాల వారీగా విడిపోతారని కొందరు స్థానికులు తెలిపారు. కొంత మంది ముస్లింలు పథకాలు ఆపేస్తారనే భయంతో భాజపాకు ఓటేస్తున్నారని వారు వెల్లడించారు.
రాజ్పూత్లు దూరం
సంప్రదాయంగా భాజపాకు మద్దతుగా నిలుస్తున్న రాజ్పూత్లు ఈసారి ఆ పార్టీ పట్ల ఆగ్రహంగా ఉన్నారు. వారికి టికెట్ల కేటాయింపులో అన్యాయం జరిగింది. గతంలో ఎన్నడూ లేనంత తక్కువ టికెట్లు దక్కాయి. దీంతో రాజ్పూత్ నేత సంగీత్ సోం భాజపా నేతలను విమర్శిస్తున్నారు. ఈ ప్రాంతంలో టికెట్ ఇవ్వడానికి సంజీవ్ బల్యాన్ ఎవరని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఎదుట పంచాయితీ జరిగినా ఫలితం కనిపించలేదు. ముస్లింలు, దళితుల తర్వాత పశ్చిమ యూపీలో రాజ్పూత్ల జనాభాయే అధికం. వారు 10శాతం దాకా ఉంటారు. 17 నియోజకవర్గాల్లో వారి ప్రాబల్యం ఉంటుంది. గాజియాబాద్లో రాజ్పూత్ వర్గానికి చెందిన జనరల్ వీకే సింగ్కు టికెట్ ఇవ్వకపోవడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు.
పశ్చిమ యూపీలో సాఠా - చౌరాసీ (144 రాజ్పూత్ గ్రామాలు) గ్రామాల నుంచి వేల మంది సైన్యం, పారామిలిటరీ బలగాల్లో పని చేస్తున్నారు. ఈ గ్రామాలవారు భాజపా పట్ల అసంతృప్తిగా ఉన్నారు.
నేడు పోలింగ్ జరిగే నియోజకవర్గాలు
సహారన్పుర్, కైరానా, ముజఫర్నగర్, బిజ్నోర్, నగీనా (ఎస్సీ), మొరాదాబాద్, రాంపుర్, పీలీభీత్.
2019 ఫలితాలు
భాజపా గెలిచినవి: ముజఫర్నగర్, కైరానా, పీలీభీత్.
సమాజ్వాదీ గెలిచినవి: మొరాదాబాద్, రాంపుర్.
బీఎస్పీ గెలిచినవి: సహారన్పుర్, బిజ్నోర్, నగీనా.
(ఈ ఎన్నికల్లో సమాజ్వాదీ, బీఎస్పీ కలిసి పోటీ చేశాయి.)
ఈనాడు ప్రత్యేక విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
జగన్.. మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి? అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. -
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
తెలంగాణ బడ్జెట్లో హైదరాబాద్ నగర మౌలిక సదుపాయాలకు రూ.10 వేల కోట్లు కేటాయించినందుకు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. -
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ