‘ఢీ’కొడుతున్న ‘ఇండియా’!
రాజస్థాన్లోని 12 స్థానాలకు తొలి విడతలో భాగంగా శుక్రవారం పోలింగ్ జరగనుంది. 2,53,15,541 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
రాజస్థాన్లోని 12 స్థానాలకు నేడే పోలింగ్
6 సీట్లలో పోటాపోటీ
(జైపుర్ నుంచి ప్రకాశ్ భండారీ)
రాజస్థాన్లోని 12 స్థానాలకు తొలి విడతలో భాగంగా శుక్రవారం పోలింగ్ జరగనుంది. 2,53,15,541 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 1,32,89,538 మంది పురుషులుకాగా 1,20,25,699 మంది మహిళలు. 304 మంది ట్రాన్స్జెండర్లు. 114 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అందులో 12 మంది మహిళలు. తొలి విడత పోలింగ్ జరిగే నియోజకవర్గాల్లో జైపుర్, శ్రీగంగానగర్ (ఎస్సీ), బీకానేర్ (ఎస్సీ), చురు, ఝుంఝునూ, సీకర్, జైపుర్ రూరల్, అలవర్, నాగౌర్, భరత్పుర్ (ఎస్సీ), దౌసా (ఎస్టీ), కరౌలీ-ధోల్పుర్ (ఎస్సీ) ఉన్నాయి. వీటిలో 6 నియోజకవర్గాల్లో భాజపాకు ఇండియా కూటమి గట్టి పోటీ ఇస్తోంది. కమలదళానికి ముచ్చెమటలు పట్టిస్తోంది.
ఎక్కడ?.. ఎలా?..
హిందుత్వ, రామ మందిరం వంటి అంశాలతో క్లీన్స్వీప్ చేస్తామని ఇప్పటిదాకా చెబుతూ వచ్చిన భాజపా ఇప్పుడు అకస్మాత్తుగా ఆత్మ రక్షణలో పడింది. క్లీన్స్వీప్, హ్యాట్రిక్ నినాదాలను చాలా మంది ఓటర్లు ఇష్టపడటం లేదు. వారంతా కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా కూటమివైపు మొగ్గు చూపుతున్నారు. చురు, దౌసా, నాగౌర్, సీకర్, ఝుంఝునూ, శ్రీగంగానగర్, జైపుర్ రూరల్లో భాజపా పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. కాంగ్రెస్ ఇక్కడ గట్టి పోటీ ఇస్తోంది.
- చురు: భాజపా నుంచి వచ్చిన సిటింగ్ ఎంపీ రాహుల్ కాస్వాను ఇక్కడ కాంగ్రెస్ బరిలోకి దింపింది. భాజపా తరఫున పారా ఒలింపిక్ పతక విజేత దేవేంద్ర ఝఝరియా పోటీ చేస్తున్నారు. ఆయన అభ్యర్థిత్వాన్ని భాజపా నేతలు అంగీకరించడం లేదు. పైగా ఓడిస్తామని హెచ్చరిస్తున్నారు. జాట్ల మద్దతు కాస్వాకే ఉంది. ఝఝరియా కూడా జాట్ వర్గానికి చెందినవారే.
- ఝుంఝునూ: ఈ నియోజకవర్గంలో బిర్లాలు, పిరమల్లు, రుంగ్తాలు, మోరార్కాలు, మహేశ్వరీలు, వ్యాపారవర్గానికి చెందినవారు అధికంగా ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి శీశ్రాం ఓలా తనయుడు బ్రజేంద్ర ఓలా పోటీ చేస్తున్నారు. ఆయనకు మాజీ సైనికుల్లో ఎక్కువ మంది మద్దతుగా నిలుస్తున్నారు. పోస్టల్ ఓట్లను ఉపయోగించుకునే సైనికుల్లోనూ ఆయనకు మద్దతు లభిస్తోంది. బ్రజేంద్ర సిటింగ్ ఎమ్మెల్యే. బలమైన నేత. 2019లో ఇక్కడి నుంచి భాజపా తరఫున నరేంద్ర కుమార్ గెలిచారు. ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోవడంతో ఈసారి ఆ పార్టీ శుభ్కరణ్ చౌధరికి టికెట్ ఇచ్చింది.
- సీకర్: ఇక్కడ ఇండియా కూటమి తరఫున సీపీఎం అభ్యర్థిగా 3 సార్లు ఎమ్మెల్యే అయిన అమ్రా రామ్ పోటీ చేస్తున్నారు. భాజపా తరఫున సుమేధానంద్ సరస్వతి బరిలో ఉన్నారు. గత రెండు ఎన్నికల్లో సుమేధానంద్ గెలిచారు. అయితే ఈ సారి ఆయనకు జాట్లు మద్దతు ఇవ్వడం లేదు. ఆయన హరియాణాకు చెందినవారు. స్థానికంగా ఉండే జాట్ నేతలు టికెట్ ఆశించినా భాజపా ఇవ్వలేదు. దీంతో వారు వ్యతిరేకంగా పని చేస్తున్నారు. ఆమ్రా రామ్ కార్మిక నేతగా ఉన్నారు. ఆయనకు క్లీన్ ఇమేజ్ ఉంది.
- శ్రీగంగానగర్: ఇక్కడ మహిళా అభ్యర్థి అయిన ప్రియాంకా బలియాన్ను భాజపా నిలిపింది. 3 సార్లు ఎంపీగా గెలిచిన నిహాల్ చంద్కు టికెట్ ఇవ్వలేదు. దీంతో భాజపాలో అంతర్గత పోరు సాగుతోంది. కాంగ్రెస్ నుంచి కుల్దీప్ ఇందోరా పోటీ చేస్తున్నారు. ఆయన అనుభవమున్న నేత. బలమైన వ్యూహకర్త కూడా. దీంతో కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తోంది.
- దౌసా: ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి మురారీలాల్ మీనా తరఫున మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ ప్రచారం చేస్తున్నారు. ఇది భాజపా అభ్యర్థి కన్హయాలాల్ మీనాకు ఇబ్బందికరంగా మారింది. కన్హయాలాల్కు అసెంబ్లీ టికెట్ నిరాకరించిన భాజపా లోక్సభ టికెట్ ఇచ్చింది. ఆయన మీనా వర్గానికి చెందిన మంత్రి కిరోడీ మీనాపై ఆధారపడుతున్నారు. అయితే ఆ వర్గంలో ఒకప్పుడు గట్టి నేతగా ఉన్న కిరోడీ ప్రభ క్రమంగా తగ్గుతోంది. దీంతోపాటు సచిన్ పైలట్ ప్రచారం కాంగ్రెస్కు కలిసివస్తోంది. గుజ్జర్లు, ఎస్సీలు, ఇతర వర్గాల వారి మద్దతు కాంగ్రెస్కు లభిస్తోంది.
- జైపుర్ రూరల్: ఇక్కడ కాంగ్రెస్ నుంచి యువ నేత అనిల్ చోప్రా, భాజపా నుంచి మాజీ డిప్యూటీ స్పీకర్ రావు రాజేంద్ర సింగ్ పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో భారీగా జాట్ ఓటర్లున్నారు. వారంతా దాదాపుగా అనిల్కే మద్దతు ఇస్తున్నారు. ఈసారి రాజ్పూత్లు కూడా భాజపాపై అసంతృప్తితో ఉన్నారు. టికెట్ల కేటాయింపులో తమకు అన్యాయం చేసిందని ఆగ్రహంగా ఉన్నారు. క్షత్రియ వర్గంపై కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా చేసిన వ్యాఖ్యలూ వారికి ఆగ్రహం తెప్పించాయి. దీంతో ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్లలోని రాజ్పూత్లు కాంగ్రెస్కు మద్దతుగా నిలుస్తున్నారు.
- జైపుర్: ఈ నియోజకవర్గంలో రాజ్పూత్లు బహిరంగంగా కాంగ్రెస్ అభ్యర్థి ప్రతాప్ సింగ్ ఖచారియావాస్కు మద్దతు తెలిపారు. భాజపా తరఫున ఇక్కడ మంజు శర్మ పోటీ చేస్తున్నారు.
- భరత్పుర్: ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ సొంత జిల్లాలోని భరత్పుర్లో సిటింగ్ ఎంపీని భాజపా మార్చింది. ఈసారి రాంస్వరూప్ కోలిని నిలిపింది. ఆయనకు క్రిమినల్ రికార్డు ఉంది. ఇక్కడ యూత్ ఐకాన్గా పేరొందిన సంజనా జాటవ్ను కాంగ్రెస్ బరిలోకి దించింది.
- కరౌలీ-ధోల్పుర్: ఇక్కడ బలమైన సీనియర్ నేత భజన్లాల్ జాటవ్ను కాంగ్రెస్ బరిలోకి దించింది. మాజీ మంత్రి అయిన ఆయన ఈ ప్రాంతంలో పట్టున్న నేత. భాజపా ఇందు దేవి జాటవ్ను నిలిపింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ప్రాంతంలో కాంగ్రెస్ మెరుగైన ఫలితాలను సాధించింది. ఇక్కడ మోదీ వేవ్ లేదని, తామే గెలుస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజఖేరా రోహిత్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
వికసిత్ భారత్ దిశగా అధ్బుతమైన బడ్జెట్ను మోదీ సర్కారు ప్రవేశపెట్టిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ అన్నారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయనతో మీడియాతో మాట్లాడారు. -
బ్రోకర్లకు కమీషన్లు ఇచ్చి అధిక వడ్డీలకు వేల కోట్ల అప్పు తెస్తున్నారు : బండి సంజయ్
మర్చంట్ బ్యాంకర్స్ ద్వారా అధిక వడ్డీలకు వేల కోట్లు అప్పు తెచ్చే కుట్రకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరతీసిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. -
ఉనికి కోసమే దిల్లీలో జగన్ డ్రామాలు : కేశినేని చిన్ని
రెడ్ బుక్ అంటే చాలు.. వైకాపా నేతలకు భయం పట్టుకుందని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని విమర్శించారు. -
బతుకమ్మ చీరలు, గొర్రెల పంపిణీపై విచారణకు సిద్ధమా?: సీఎం రేవంత్రెడ్డి
భారాస ప్రభుత్వ హయాంలో గొర్రెల పంపిణీ పథకంలో రూ.700 కోట్ల అవినీతి జరిగిందని సీఎం రేవంత్రెడ్డి ఆరోపించారు. -
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
బడ్జెట్ ప్రసంగం ఒక రాజకీయ ప్రసంగంలా ఉందని భారాస ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. -
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
జగన్.. మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి? అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. -
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
తెలంగాణ బడ్జెట్లో హైదరాబాద్ నగర మౌలిక సదుపాయాలకు రూ.10 వేల కోట్లు కేటాయించినందుకు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. -
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు
-
పారిస్ టూర్.. సంతోషకరమైన క్షణమిది: చిరంజీవి పోస్ట్
-
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు