నాడు అధికారులు.. నేడు అభ్యర్థులు!
రాజకీయ నాయకులే కాదు.. అఖిల భారత సర్వీసుల్లో ఉన్నత స్థాయిలో పనిచేసిన పలువురు అధికారులూ ప్రజాసేవ కోసం ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల కదన రంగంలోకి దిగారు.
లోక్సభ ఎన్నికల బరిలో 17 మంది మాజీ ఉన్నతాధికారులు
ఈనాడు, దిల్లీ: రాజకీయ నాయకులే కాదు.. అఖిల భారత సర్వీసుల్లో ఉన్నత స్థాయిలో పనిచేసిన పలువురు అధికారులూ ప్రజాసేవ కోసం ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల కదన రంగంలోకి దిగారు. ఇప్పటికే చట్టసభలకు ఎన్నికై కేంద్రమంత్రులుగా పనిచేస్తున్నవారితోపాటు పదవీకాలం పూర్తిచేసుకున్నవారు, రాజకీయాల్లో అడుగు పెట్టాలన్న ఆసక్తితో ముందుగానే స్వచ్ఛంద పదవీ విరమణ చేసినవారూ ఈ జాబితాలో ఉన్నారు. భాజపా, కాంగ్రెస్, తెలుగుదేశం సహా పలు ఇతర పార్టీల నుంచి వారు ప్రస్తుతం ఎన్నికల బరిలో నిలిచారు. వారి వివరాలివీ..
ఆర్కే సింగ్: ఈయన బిహార్ కేడర్కు చెందిన 1975 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. 2011-2013 మధ్య కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా పనిచేశారు. ఈయన హయాంలోనే ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు రూపకల్పన జరిగింది. బిహార్లో రథయాత్ర చేస్తుండగా భాజపా అగ్రనేత ఎల్కే ఆడ్వాణీని సమస్తీపుర్ అదనపు మేజిస్ట్రేట్ హోదాలో.. అప్పటి సీఎం లాలూప్రసాద్ ప్రత్యేక ఆదేశాలతో అరెస్టు చేయించారు. 2013లో భాజపాలో చేరిన ఈయన.. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో బిహార్లోని ఆరా నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ప్రస్తుతం కేంద్ర విద్యుత్తుశాఖ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
అర్జున్రామ్ మేఘ్వాల్: రాజస్థాన్ ప్రభుత్వ సర్వీసుల నుంచి ఐఏఎస్ స్థాయికి ఎదిగారు. రాజకీయాల్లో చేరి.. 2009 నుంచి బీకానేర్ లోక్సభ స్థానంలో వరుసగా గెలుస్తూ వస్తున్నారు. ప్రస్తుతం కేంద్ర న్యాయ శాఖ మంత్రిగా ఉన్నారు.
అపరాజితా సారంగి: ఒడిశా కేడర్కు చెందిన 1994 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు స్వచ్ఛంద పదవీ విరమణ చేసి.. భువనేశ్వర్ నుంచి భాజపా అభ్యర్థిగా రంగంలోకి దిగారు. తొలి ప్రయత్నంలోనే గెలిచి, ఆ లోక్సభ స్థానంలో కమలదళానికి ప్రథమ విజయాన్ని అందించిన ఘనత సొంతం చేసుకున్నారు. ఇప్పుడూ అదే నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నారు.
బ్రిజేంద్ర సింగ్: ఈయన కేంద్ర మాజీ మంత్రి బీరేంద్ర సింగ్ కుమారుడు. సివిల్స్లో అఖిలభారత స్థాయిలో 9వ ర్యాంకు సాధించి, 1998వ బ్యాచ్ ఐఏఎస్ అధికారిగా ఎంపికయ్యారు. రెండు దశాబ్దాలకుపైగా సర్వీస్ తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. 2019 లోక్సభ ఎన్నికల్లో హరియాణాలోని హిస్సార్ నుంచి భాజపా తరఫున పోటీ చేసి విజయం సాధించారు. ఇప్పుడు అదే స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు.
సత్యపాల్ సింగ్: ఈయన ఐపీఎస్ అధికారి. గతంలో ముంబయి పోలీసు కమిషనర్గా పనిచేశారు. ఆ హోదాలో ఉండగానే ఉద్యోగానికి రాజీనామా చేసి భాజపాలో చేరారు. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో యూపీలోని భాగ్పత్ నుంచి గెలిచారు. ప్రస్తుతం అక్కడే హ్యాట్రిక్ విజయంపై గురిపెట్టారు. ఈయన 2017-19 మధ్య కేంద్ర జలవనరుల శాఖ సహాయమంత్రిగా పనిచేశారు.
విష్ణుదయాళ్రాం: ఝార్ఖండ్ డీజీపీగా పనిచేసిన ఈయన.. పదవీ విరమణ తర్వాత పాలామూ లోక్సభ స్థానం నుంచి 2014, 2019 ఎన్నికల్లో వరుసగా గెలుపొందారు. ఇప్పుడూ అక్కడినుంచే బరిలో దిగారు.
జి.కుమార్నాయక్: 1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. కర్ణాటకలోని రాయచూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. తెలుగువారి ప్రాబల్యం అధికంగా ఉన్న ఈ జిల్లాలో బలమైన అభ్యర్థి కోసం అన్వేషించి.. హస్తం పార్టీ ఈయనకు టికెట్ ఇచ్చింది. అక్కడ జిల్లా కలెక్టర్గా నాయక్ ఇంతకుముందు పనిచేశారు.
పరంపాల్కౌర్ సిద్ధూ: 2011 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి. పంజాబ్ స్టేట్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ ఎండీగా పనిచేస్తూ ఇటీవలే ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఈ నెల 12న భాజపాలో చేరారు. బఠిండా స్థానంలో తమ పార్టీ అభ్యర్థిగా ఈమెను భాజపా మంగళవారమే ప్రకటించింది.
కొప్పుల రాజు: 1988 నుంచి 1992 వరకు నెల్లూరు కలెక్టర్గా పనిచేసిన ఈ ఐఏఎస్ అధికారి.. కేంద్ర ప్రభుత్వంలో సెక్రటరీ స్థాయి హోదాలో పనిచేస్తూ 2013లో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. అనంతరం కాంగ్రెస్లో చేరారు. ప్రస్తుతం నెల్లూరు లోక్సభ స్థానం నుంచి తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీకి అత్యంత సన్నిహితుడిగా ఈయనకు పేరుంది.
టి.కృష్ణప్రసాద్: 1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఇదివరకు గుంటూరు ఎస్పీగా, విజయవాడ పోలీసు కమిషనర్గా విధులు నిర్వర్తించారు. డీజీపీ హోదాలో స్టేట్ రోడ్ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్గానూ పనిచేశారు. ప్రస్తుతం బాపట్ల లోక్సభ స్థానం నుంచి తెదేపా అభ్యర్థిగా తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.
వి.వరప్రసాద్: 1983 బ్యాచ్ తమిళనాడు కేడర్ ఐఏఎస్ అధికారి. 2014లో తిరుపతి నియోజకవర్గం నుంచి వైకాపా తరఫున ఎంపీగా గెలిచారు. 2019 ఎన్నికల్లో గూడూరు నియోజకవర్గంలో అదే పార్టీ తరఫున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈసారి ఆ పార్టీ టికెట్ నిరాకరించడంతో భాజపాలో చేరారు. ప్రస్తుతం ఎన్డీయే కూటమి తరఫున తిరుపతి లోక్సభ స్థానంలో పోటీ చేస్తున్నారు.
తరణ్జీత్సింగ్ సంధూ: 1988వ బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారి. అమెరికాలో భారత రాయబారిగా పనిచేసిన అనుభవం ఉంది. పంజాబ్లోని అమృత్సర్ నియోజకవర్గం నుంచి తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.
అన్నామలై: 2011 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. 2019లో ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేసి రాజకీయాల్లోకి వచ్చారు. ప్రస్తుతం తమిళనాడు భాజపా అధ్యక్షుడిగా కొనసాగుతూనే.. కోయంబత్తూరు నుంచి లోక్సభ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేస్తున్నారు.
శశికాంత్ సెంథిల్: 2009 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. 2019లో మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక ఉద్యోగానికి రాజీనామా చేశారు. ప్రస్తుత ఎన్నికల్లో ఆయన తమిళనాడులోని తిరువళ్లూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేస్తున్నారు.
ప్రసూన్ బెనర్జీ: 2006 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఇటీవలే స్వచ్ఛంద పదవీ విరమణ పొంది.. పశ్చిమ బెంగాల్లోని మాల్దా లోక్సభ స్థానంలో తృణమూల్ కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు. ఈయనకు సినిమాల్లో నటించిన అనుభవం ఉంది. కొన్ని నాటకాలకు దర్శకత్వం కూడా వహించారు.
దేబాశీష్ధర్: 2010 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఈ నెలలోనే ఉద్యోగానికి రాజీనామా చేసి.. పశ్చిమ బెంగాల్లోని బీర్భూమ్ నుంచి భాజపా అభ్యర్థిగా బరిలో దిగారు.
అరూప్ పట్నాయక్: 1979 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. 2011-12 మధ్య ముంబయి పోలీసు కమిషనర్గా పనిచేశారు. 2015లో ఉద్యోగానికి రాజీనామా చేసి బీజేడీలో చేరారు. 2019లో భువనేశ్వర్ లోక్సభ స్థానంలో ఓడిపోయారు. ప్రస్తుతం పూరీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా హయాంలో ప్రకటనల కుంభకోణం.. హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేల డిమాండ్
వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రకటనల కుంభకోణంపై హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. -
ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.. మంత్రులకు చంద్రబాబు సూచన
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించడం... వంటి మంచి పనుల్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. -
సకుటుంబ సమేతంగా కేసులు.. అక్రమ కేసులున్నవారు నిలబడాలని కోరిన చంద్రబాబు
వివాహాలు, ఇతర శుభకార్యాలకు సకుటుంబ సపరివార సమేతంగా రావాలని ఆహ్వానిస్తుంటాం.. అయితే గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలపై సకుటుంబ సమేతంగా అక్రమ కేసులు నమోదు చేసి వేధించారని చంద్రబాబు, ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. శ్వేతపత్రం విడుదల సందర్భంగా.. వైకాపా ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలపై నమోదైన అక్రమ కేసుల సంఖ్యను చంద్రబాబు ప్రస్తావించారు. -
ఏపీ ‘ఎస్కోబార్’ జగన్.. చీకటి సామ్రాజ్యాధిపతితో పోల్చిన చంద్రబాబు
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అరాచకాలను వివరించేటప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కొలంబియన్ మాదకద్రవ్యాల చీకటి సామ్రాజ్యాధిపతి పాబ్లో ఎమిలియో ఎస్కోబార్ చరిత్రను సభకు వినిపించారు. -
‘రఘురామను చిత్రహింసలు పెట్టినప్పుడు మీరంతా ఏమయ్యారు?’
మాజీ ముఖ్యమంత్రి జగన్ దిల్లీలో చేసిన నిరసనకు ఇండియా కూటమి నాయకులు మద్దతు పలకడాన్ని అనంతపురం తెదేపా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. -
అన్ని వర్గాలకూ మోసం
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలనూ మోసం చేసిందని, అందర్నీ వెన్నుపోటు పొడిచిందని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. -
శాంతిభద్రతల పరిరక్షణపై సభలో చర్చిద్దాం
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు.. రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలపై శాసనసభలో ఒక రోజు పూర్తిగా చర్చించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు. -
ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని దోచేశారు
‘వైకాపా ప్రభుత్వం చేసిన నిర్వాకాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు విద్యుత్తు, అమరావతి, పోలవరం, గనులు, మద్యంపై శ్వేతపత్రాలు విడుదల చేశారు. -
వైకాపా ప్రభుత్వం ఇళ్లు కూల్చింది.. ఆదుకోండి
తెదేపాకు అనుకూలంగా ఉన్నారని విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం దన్నానపేట గ్రామానికి చెందిన 30 మంది దళితుల ఇళ్లను అప్పటి వైకాపా ప్రభుత్వం కూల్చేసిందని ఆ మండల తెదేపా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు టొంపల నర్సయ్య గురువారం తెదేపా కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. -
వైకాపా పాలనలో తెదేపా శ్రేణులపై 2,560 కేసులు
వైకాపా హయాంలో గత ఐదేళ్లలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై 2,560 కేసులు నమోదు చేసి.. 2,370 మందిని అరెస్టు చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. -
ఇసుక, మద్యం అవినీతిపై విచారణ జరిపించాలి
ముఖ్యమంత్రి చంద్రబాబును రాష్ట్ర సచివాలయంలో గురువారం సీపీఎం నాయకులు కలిశారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. -
సమస్యలపై ప్రశ్నిస్తే.. వేధింపులే సమాధానం
శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం విడుదల చేసిన ‘శాంతిభద్రతల శ్వేతపత్రం’పై కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వేదికగా మాట్లాడారు. -
‘ఇండియా’ కూటమితో పొత్తు కోసమే జగన్ దిల్లీ యాత్ర
‘ఇండియా’ కూటమితో పొత్తు కోసమే వైకాపా అధ్యక్షుడు జగన్ దిల్లీ వెళ్లినట్లుగా ఉందని ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. దిల్లీ నుంచి అమరావతి చేరుకున్న జగన్... శాసనసభ సమావేశాలకు హాజరు కావాలని సూచించారు. -
ఇది పసలేని దండగమారి బడ్జెట్: కేటీఆర్
రాష్ట్ర ప్రభుత్వం పసలేని, దండగమారి బడ్జెట్ ప్రవేశపెట్టిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ప్రజల ఆకాంక్షలు పట్టించుకోకుండా ఆంక్షల పద్దు పెట్టారని అన్నారు. -
సంక్షిప్త వార్తలు (4)
బడ్జెట్లో అధిక కేటాయింపుల ద్వారా.. తమది రైతు ప్రభుత్వమని మరోసారి నిరూపించుకున్నట్లయిందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అన్నారు. -
ఫైళ్ల దహనంతో మాకు సంబంధం లేదు: వైకాపా ఎంపీ మిథున్రెడ్డి
మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో జరిగిన రెవెన్యూ దస్త్రాల దహనం ఘటనతో తమకెలాంటి సంబంధం లేదని వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి పేర్కొన్నారు. -
గాజులదిన్నె ప్రాజెక్టు పనులపై విచారణ చేపడతాం: మంత్రి నిమ్మల
సంజీవయ్య గాజులదిన్నె ప్రాజెక్టు పనులపై విచారణ చేపడతామని జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. -
రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతీయడానికే జగన్ దిల్లీ నిరసన: హోంమంత్రి అనిత
రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతీయడానికే మాజీ సీఎం జగన్ దిల్లీలో నిరసన పేరుతో చౌకబారు ఆరోపణలు చేశారని హోంమంత్రి అనిత మండిపడ్డారు. 36 రాజకీయ హత్యలు జరిగాయని నిస్సిగ్గుగా మాట్లాడారని ధ్వజమెత్తారు. -
వరద బాధిత రైతులను తక్షణమే ఆదుకోవాలి
కోస్తా జిల్లాల్లోని వరద బాధిత రైతులకు తక్షణమే నష్టపరిహారం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల గురువారం లేఖ రాశారు. -
రైతుల జీవితాలతో చెలగాటం వద్దు!
‘ఎన్నికలు అయిపోయాయి.. రాజకీయాలు వదిలేయండి.. రాజకీయాల కోసం రైతుల జీవితాలతో చెలగాటమాడొద్దు’ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. -
సంతోషదాయక బడ్జెట్: కూనంనేని
నిధుల పరంగా రాష్ట్రం సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సంతోషదాయకంగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
-
అగ్నిపథ్ పథకంపై విపక్షాల విమర్శలు.. ఖండించిన మోదీ
-
మెక్సికన్ డ్రగ్ లార్డ్ ఇస్మాయిల్ ‘ఎల్ మాయో’ జంబాడ అరెస్ట్
-
26 మంది హత్య.. మృతదేహాలను నదిలోకి ఈడ్చుకెళ్లిన మొసళ్లు..!
-
2034 నాటికి అలాంటి ఉద్యోగాలు ఉండవ్.. లింక్డిన్ వ్యవస్థాపకుడి అంచనా!
-
మీ దుర్మార్గపు కుట్రలు తిప్పికొడతాం.. కార్గిల్ నుంచి పాక్కు మోదీ హెచ్చరిక