సంక్షిప్త వార్తలు (9)
అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగ భృతి రూ.4వేలు చెల్లిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులను మోసం చేసిందంటూ మాజీ మంత్రి కేటీఆర్ శుక్రవారం ‘ఎక్స్’ వేదికగా చేసిన విమర్శలను ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఖండించారు.
అధికారంలో ఉన్నప్పుడు నిరుద్యోగులు గుర్తురాలేదా?
కేటీఆర్కు ఎమ్మెల్సీ బల్మూరి ప్రశ్న
హైదరాబాద్, న్యూస్టుడే: అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగ భృతి రూ.4వేలు చెల్లిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులను మోసం చేసిందంటూ మాజీ మంత్రి కేటీఆర్ శుక్రవారం ‘ఎక్స్’ వేదికగా చేసిన విమర్శలను ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఖండించారు. పదేళ్లు అధికారంలో ఉండి నిరుద్యోగులకు భారాస ఏం చేసింది? వారు అప్పుడు గుర్తురాలేదా? అని ‘ఎక్స్’ వేదికగా కేటీఆర్ను ప్రశ్నించారు.
భారీ మెజారిటీతో గెలవబోతున్నా: గడ్కరీ
నాగ్పుర్: మహారాష్ట్రలోని నాగ్పుర్ లోక్సభ నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలవబోతున్నట్లు భాజపా అభ్యర్థి, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శుక్రవారం ధీమా వ్యక్తం చేశారు.
గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలనే ఏకైక డిమాండ్తో యుగతులసి పార్టీ జాతీయ అధ్యక్షుడు కొలిశెట్టి శివకుమార్ లోక్సభ ఎన్నికల బరిలో దిగుతున్నారు. శుక్రవారం ఆయన సికింద్రాబాద్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఆయనకు చంద్రస్వామి, అరుణ్స్వామి, నాగరాజు, న్యాయవాది వినోద్ తదితరులు మద్దతు తెలిపారు.
న్యూస్టుడే, సికింద్రాబాద్
ఓట్లకోసం వచ్చే నాయకులతో జాగ్రత్తగా ఉండాలి
లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విజయ్కుమార్
ఈనాడు డిజిటల్, అమరావతి: మూడు ఎమ్మెల్యే, రెండు ఎంపీ స్థానాలతో కలిపి మొత్తం అయిదుగురు అభ్యర్థులను లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విజయకుమార్ ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం అయిదో జాబితాను విడుదల చేశారు. ‘ఓట్ల పేరుతో గ్రామాల్లోకి వచ్చే నాయకులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. భావితరాల భవిష్యత్తు కోసం బావి గుర్తుకు ఓటెయ్యాలి. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ప్రజల మధ్య ఉండి, ప్రజలకు సేవ చేసే వ్యక్తికి ఓటెయ్యాలి’ అని ఆయన పేర్కొన్నారు.
కాంగ్రెస్ వార్రూం శిక్షకుల నియామకం
హైదరాబాద్, న్యూస్టుడే: లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గాలకు వార్ రూం శిక్షకులను నియమించింది. డా.అనిల్ కేఆర్ పులిని మహబూబాబాద్కు, డా.రియాజ్ను వరంగల్, నిజామాబాద్; ప్రతాప్రెడ్డిని ఖమ్మం, పెద్దపల్లి, నల్గొండ; గౌరీ సతీష్ను మెదక్, జహీరాబాద్, సికింద్రాబాద్ నియోజకవర్గాలకు శిక్షకులుగా బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు వార్ రూం ఛైర్మన్ పవన్ మల్లాది శుక్రవారం ప్రకటించారు. వీరంతా వారికి కేటాయించిన నియోజకవర్గాల పరిధిలోని బూత్స్థాయి ఏజెంట్ల(బీఎల్ఏ)కు పోలింగ్కు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలు చేస్తారని తెలిపారు.
రాజ్యాంగాన్ని మార్చడానికే 400 సీట్ల లక్ష్యం
రాజ్యాంగాన్ని మార్చడానికే ఈసారి ఎన్నికల్లో 400 పైగా సీట్లను సాధించాలనే లక్ష్యాన్ని భాజపా నిర్దేశించుకుంది. మహాత్మాగాంధీ ఆశయాలు, ఆయన పాటించిన విలువలపై ప్రధానికి నిజంగా గౌరవం ఉందా? రైతుల ఆత్మహత్యల్ని ఎందుకు మోదీ ఆపలేకపోతున్నారు? అటవీహక్కుల చట్టాన్ని ఎందుకు అమలు చేయడం లేదు? గాంధీ, గాడ్సేలలో మోదీ ఎవరి పక్షాన ఉంటారు? మౌనం వీడి ఆయన స్పష్టత ఇవ్వాలి.
‘ఎక్స్’లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్
రాహుల్, ప్రియాంక రాజకీయ పర్యాటకులు
రాహుల్, ప్రియాంక గాంధీ రాజకీయ పర్యాటకుల్లాంటివారు. ఎన్నికలప్పుడు వస్తారు, తర్వాత మాయమవుతారు. అలాంటివారి మాటల్ని ఓటర్లు సీరియస్గా ఎందుకు తీసుకుంటారు? వారసత్వ రాజకీయాలు ప్రజాస్వామ్యానికి హానికరం. కాంగ్రెస్, వామపక్షాలు సైద్ధాంతికంగా దివాలాతీశాయి. భాజపాను వ్యతిరేకించడానికి దిల్లీలో అవి కలిసి పోరాడి, వయనాడ్ సహా మిగిలినచోట్ల ప్రత్యర్థులుగా ఉండటమేమిటి? వాటి ద్వంద్వ ప్రమాణాలు, వంచన తీరు స్పష్టంగా బయటపడుతున్నాయి.
వయనాడ్లో పీటీఐతో భాజపా జాతీయాధ్యక్షుడు జె.పి.నడ్డా
ఇది మరో స్వాతంత్య్ర పోరాటం
ఇప్పుడు జరుగుతున్న సార్వత్రిక సమరం మరో స్వాతంత్య్ర పోరాటానికంటే తక్కువేమీ కాదు. భాజపా ప్రభుత్వం మరోసారి కేంద్రంలో అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ మనుగడకు ముప్పు. ఒత్తిళ్లకు తలొగ్గి ‘భాజపా కమిషన్’గా ఎన్నికల సంఘం మారిపోరాదు. కేంద్రంలో ప్రతిపక్షాల కూటమి (ఇండియా) ఏర్పాటులో నేనే కీలకపాత్ర పోషించాను. బెంగాల్లో సీపీఎం, కాంగ్రెస్లు భాజపా కోసం పనిచేస్తున్నాయి. మా పార్టీ ఒంటరిగానే బరిలో ఉంటుంది.
ముర్శీదాబాద్ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పశ్చిమబెంగాల్ సీఎం మమత
ఓటేయకపోయినా సరే.. మీ కుమారుడిని ఆశీర్వదించండి
భాజపా టికెట్పై పథనంథిట్ట నుంచి పోటీ చేస్తున్న కుమారుడు అనిల్ ఆంటోనీకి మీరు ఓటేయకపోయినా ఫర్వాలేదు. కనీసం ఆయన్ని ఆశీర్వదించండి. అనిల్ ఓడిపోవాలంటూ కొద్దిరోజుల క్రితం మీరు అనడం ఆశ్చర్యం కలిగించింది. మీ ఇబ్బందిని అర్థం చేసుకోగలను.. కాంగ్రెస్ ఒత్తిడితో మీరు అలా మాట్లాడి ఉండొచ్చు.
కొట్టాయం సభలో ఏకే ఆంటోనీని ఉద్దేశించి రక్షణ మంత్రి రాజ్నాథ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి