ఆరు జిల్లాల్లో ఒక్కరూ ఓటెయ్యలేదు
లోక్సభ ఎన్నికల వేళ నాగాలాండ్లో దారుణ పరిస్థితి కనిపించింది. తూర్పు నాగాలాండ్లోని ఆరు జిల్లాల్లో ఒక్క ఓటరు కూడా పోలింగ్ కేంద్రం వైపు కన్నెత్తి చూడలేదు.
తూర్పు నాగాలాండ్లో ఎన్నికల బహిష్కరణ
కోహిమా: లోక్సభ ఎన్నికల వేళ నాగాలాండ్లో దారుణ పరిస్థితి కనిపించింది. తూర్పు నాగాలాండ్లోని ఆరు జిల్లాల్లో ఒక్క ఓటరు కూడా పోలింగ్ కేంద్రం వైపు కన్నెత్తి చూడలేదు. ఆరు జిల్లాల్లో కలిపి మొత్తం 4,00,632 మంది ఓటర్లు ఉండగా.. వారిలో ఒక్కరంటే ఒక్కరు కూడా ఓటు వేయలేదు. తూర్పు నాగాలాండ్కు ‘ఫ్రాంటియర్ నాగాలాండ్ టెరిటరీ (ఎఫ్ఎన్టీ)’ పేరుతో స్వతంత్ర ప్రతిపత్తి కల్పించాలని స్థానికులు కొన్నేళ్లుగా కోరుతున్నారు. ప్రత్యేక రాష్ట్ర డిమాండ్నూ వినిపిస్తున్నారు. ఈ పోరాటానికి నేతృత్వం వహిస్తున్న ఏడు గిరిజన సంఘాల అత్యున్నత నిర్ణాయక మండలి ‘ఈస్టర్న్ నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్స్ (ఈఎన్పీవో)’.. పోలింగ్ రోజున బంద్కు పిలుపునివ్వడమే తాజాగా ఎన్నికల బహిష్కరణకు కారణం. ఈ ఆరు జిల్లాల్లోని 20 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 738 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వాటిలో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ అధికారులు ఓటర్ల కోసం వేచి చూశారు. కానీ ఒక్కరూ రాలేదు. ఆ ప్రాంతంలోని 20 మంది ఎమ్మెల్యేలూ ఓటుహక్కును వినియోగించుకోలేదు. ఈ పరిణామంపై సీఎం నీఫియూ రియో స్పందిస్తూ.. తూర్పు నాగాలాండ్కు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించే దిశగా తాము ఇప్పటికే సిఫార్సులు చేశామని పేర్కొన్నారు. మరోవైపు- బంద్ పిలుపుపై ఈఎన్పీవోకు షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు నాగాలాండ్ ప్రధాన ఎన్నికల అధికారి వయసన్ తెలిపారు.
తొలిసారి ఓటేసిన శోంపెన్ తెగ ప్రజలు
అండమాన్ నికోబార్ దీవుల్లోని అరుదైన శోంపెన్ తెగ ప్రజలు ఈ సార్వత్రిక ఎన్నికల్లోనే తొలిసారిగా ఓటు వేశారు. స్థానిక అటవీ శాఖ కార్యాలయంలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఏడుగురు శోంపెన్లు.. అనువాదకుడి సాయంతో తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. అనంతరం అక్కడ ఎన్నికల కమిషన్ ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన కటౌట్ ముందు ఫొటోలకు పోజులిచ్చారు. మొత్తం 98 మంది శోంపెన్లకు ఓటుహక్కు ఉన్నా.. వారిలో ఏడుగురే తమ హక్కును వినియోగించుకోవడం గమనార్హం. గ్రేట్ నికోబార్ దీవుల్లో కనిపించే ఈ తెగ ప్రస్తుతం అంతరించిపోయే ముప్పును తీవ్రస్థాయిలో ఎదుర్కొంటోంది. 2011 నాటి లెక్కల ప్రకారం శోంపెన్ల జనాభా కేవలం 229గా ఉంది. గతంలో వీరెప్పుడూ ఓటు వేయలేదు.
అస్సాంలో 150 ఈవీఎం సెట్ల మార్పు
అస్సాంలో శుక్రవారం లోక్సభ ఎన్నికల వాస్తవ పోలింగ్ ప్రారంభానికి 90 నిమిషాల ముందు మాక్ ఓటింగ్ నిర్వహిస్తుండగా పలు నియోజకవర్గాల్లోని ఈవీఎంలలో అధికారులు లోపాలను గుర్తించారు. దాంతో వాటి స్థానంలో కొత్త వాటిని ప్రవేశపెట్టారు. వాస్తవ పోలింగ్ మొదలయ్యాక కూడా ఆరు ఈవీఎంలను మార్చారు. మొత్తంగా రాష్ట్రంలో శుక్రవారం 150 ఈవీఎం సెట్లను ఇలా మార్చాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు.
ఆ కేంద్రంలో ఒకే ఒక్క ఓటరు
అరుణాచల్ ప్రదేశ్లోని అంజావ్ జిల్లా మాలోగామ్ పోలింగ్ కేంద్రంలో 100% ఓటింగ్ నమోదైంది. అబ్బో.. చాలా గ్రేట్.. అని అనుకుంటున్నారా? అక్కడి ఓటర్ల సంఖ్య తెలిస్తే మాత్రం ముక్కున వేలేసుకుంటారు. ఎందుకంటే అక్కడున్నది ఒకే ఒక్క ఓటరు! అవును.. నిజమే. మాలోగామ్ అరుణాచల్ తూర్పు లోక్సభ స్థానం పరిధిలోకి వస్తుంది. అక్కడ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటుచేయాలంటే దాదాపు 40 కిలోమీటర్ల మేర కాలినడకన అత్యంత సంక్లిష్టమైన మార్గంలో వెళ్లాలి. నిజానికి ఇక్కడి స్థానికులంతా వేరే పోలింగ్ కేంద్రాల్లో తమ పేర్లను నమోదు చేసుకున్నప్పటికీ.. 44 ఏళ్ల సొకేలా తయాంగ్ అనే మహిళ మాత్రం అందుకు ససేమిరా అన్నారు. చేసేదేం లేక అధికారులు ఆమె కోసం ఎంతో శ్రమించి మాలోగామ్లో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. శుక్రవారం మధ్యాహ్నం దాదాపు ఒంటిగంట సమయంలో తయాంగ్ అక్కడికి వచ్చి తన ఓటుహక్కును వినియోగించుకున్నారు.
ఈవీఎంను తీసుకెళ్తూ నదిలో మునిగిన వాహనం
అస్సాంలోని లఖింపుర్ నియోజకవర్గంలో ఈవీఎంను తీసుకెళ్తున్న ఓ వాహనం నదిలో మునగడం కలకలం సృష్టించింది. సాదియాలోని అమర్పుర్ ప్రాంతంలో ఓ పోలింగ్ కేంద్రంలోని ఈవీఎంలో సాంకేతిక లోపం తలెత్తింది. దాని స్థానంలో ఉపయోగించేందుకు సాదియా నుంచి మరో ఈవీఎంను తీసుకెళ్తున్న వాహనం.. మధ్యలో దేవపానీ నదిని దాటాల్సి వచ్చింది. వాహనాన్ని ఓ యాంత్రిక పడవలోకి ఎక్కించి ఆవలి ఒడ్డుకు వెళ్తుండగా.. నదీ ప్రవాహం ఒక్కసారిగా పెరిగి పడవ మునిగిపోయింది. అందులోని వాహనం కూడా చాలావరకు నీట మునిగింది. వాహన డ్రైవర్, పోలింగ్ అధికారి సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. ఈ ఘటనలో ఈవీఎం దెబ్బతింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి