మహా సంక్లిష్టం!
పశ్చిమ కనుమల్లో కమల వికాసం అంత సులభంగా లేదు. అత్యంత కీలక రాష్ట్రమైన మహారాష్ట్రలో భాజపాకు ఈసారి గెలుపు నల్లేరుపై నడక కాబోవడం లేదు.
కమలానికి నల్లేరుపై నడక కాదు
ఉద్ధవ్పై కార్యకర్తల్లో సానుభూతి
పశ్చిమ కనుమల్లో కమల వికాసం అంత సులభంగా లేదు. అత్యంత కీలక రాష్ట్రమైన మహారాష్ట్రలో భాజపాకు ఈసారి గెలుపు నల్లేరుపై నడక కాబోవడం లేదు. కూటముల్లో సంక్లిష్టత రాష్ట్రంలో ఎన్నికలను మరింత సంక్లిష్టం చేసింది.
రెండు కూటముల మధ్యే..
మహారాష్ట్రలోని 48 నియోజకవర్గాల్లో ఐదు విడతల్లో పోలింగ్ జరుగుతోంది. రెండు కూటముల మధ్యే ప్రధానంగా పోరు సాగుతోంది. మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ), మహాయుతి కూటముల మధ్య హోరాహోరీ పోరు జరుగుతోంది. పార్టీల చీలికల తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో రెండు కూటములకూ ఈ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకమే.
అఘాడీలో ఇదీ లెక్క..
- మొత్తం స్థానాలు: 48
- శివసేన (ఉద్ధవ్) పోటీ చేసే స్థానాలు: 21
- కాంగ్రెస్ చేసేవి: 17
- ఎన్సీపీ (శరద్చంద్ర పవార్) చేసేవి: 10
- శివసేన (ఉద్ధవ్) రాష్ట్రంలోని ఐదు ప్రాంతాల్లో పోటీ చేస్తోంది. కొంకణ్, పశ్చిమ మహారాష్ట్ర, మరాఠ్వాడా, ఉత్తర మహారాష్ట్ర, విదర్భ రీజియన్లలో బరిలోకి దిగుతోంది.
- చక్కెర పరిశ్రమలున్న పశ్చిమ మహారాష్ట్రపై ఎన్సీపీ(శరత్చంద్ర) దృష్టి సారించింది.
- కాంగ్రెస్ విదర్భ, పశ్చిమ మహారాష్ట్ర, మరాఠ్వాడా ప్రాంతాల్లో బరిలోకి దిగుతోంది. కొంకణ్తోపాటు ముంబయిలోని సీట్లను భాగస్వాములకు వదిలేసింది.
మహాయుతిలో..
భాజపా, శివసేన (శిందే), ఎన్సీపీ (అజిత్ పవార్) పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు దాదాపు కొలిక్కి వచ్చింది. 9 సీట్లపై పీటముడి కొనసాగుతోంది. కూటమి మధ్య రత్నగిరి-సింధుదుర్గ్, సతారా, ఔరంగాబాద్, నాసిక్, ఠాణే, పాల్ఘర్, దక్షిణ ముంబయి, వాయవ్య ముంబయి, ఉత్తర మధ్య ముంబయి నియోజకవర్గాల్లో ఇంకా పార్టీల మధ్య ఒప్పందం కుదరలేదు. ఇప్పటికే రెండుసార్లు ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే, ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడణవీస్, అజిత్ పవార్ల మధ్య చర్చలు జరిగిన ఫలితం కనిపించలేదు. ఇప్పటివరకే భాజపా 24, శివసేన 10, ఎన్సీపీ 4 సీట్లకు అభ్యర్థులను ప్రకటించాయి. రాష్ట్రీయ సమాజ్ పార్టీకి ఒక సీటును ఎన్డీయే కూటమి కేటాయించింది.
- నాసిక్ సీటుపై ఎన్డీయేలోని రెండు పార్టీలు పట్టుబడుతున్నాయి. శివసేన సిట్టింగ్ ఎంపీ హేమంత్ గాడ్సే ఈ సీటుపై ఒత్తిడి తెస్తున్నారు. ఎన్సీపీకి చెందిన ఛగన్ భుజ్బల్ ఈ సీటును ఆశిస్తున్నారు. ఆయన తమ పార్టీ గుర్తుపై పోటీ చేయాలని భాజపా కోరుకుంటోంది. కానీ ఆయన తిరస్కరించారు.
- సతారాలోనూ ఎన్డీయేలోని మూడు పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.
ప్రభావం చూపే అంశాలు
- విదర్భ ప్రాంతంలో వ్యవసాయరంగంలో తీవ్ర సమస్యలున్నాయి. ఈ ప్రాంతంలో అకాల వర్షంవల్ల 38,000 హెక్టార్లలో పంటలను రైతులు నష్టపోయారు. ఇక్కడ ఈ నెల 19, 26 తేదీల్లో పోలింగ్ జరగనుంది.
- విదర్భ డివిజన్లో 2020 నుంచి 2022 మధ్యలో 4,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇందులో ఒక్క అమరావతి రీజియన్లోనే 3,452 మంది బలవన్మరణం పాలయ్యారు.
- గత ఎన్నికల్లో విదర్భలోని 10 నియోజకవర్గాల్లో ఐదు చోట్ల భాజపా గెలిచింది. ఆ పార్టీ అప్పటి భాగస్వామి శివసేన 3 సీట్లు గెలుచుకుంది.
- మరాఠాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేయడంపై ఓబీసీల్లో వ్యతిరేకత ఉంది.
- అయోధ్యలో రామ మందిర నిర్మాణ అంశం విదర్భ ప్రాంతంలో పెద్దగా ప్రభావం చూపడం లేదు. నాగ్పుర్-అయోధ్య ఆస్థా ఎక్స్ప్రెస్లో టికెట్లు నిండకపోవడమే ఇందుకు నిదర్శనమని స్థానికుడొకరు చెప్పారు.
- నిరుద్యోగ అంశం రాష్ట్రంలో ప్రభావం చూసే అవకాశముంది.
- 2011 జనాభా లెక్కల ప్రకారం.. రాష్ట్రంలో 11.5శాతం మంది ముస్లింలు ఉన్నారు. వీరంతా ఎటు మొగ్గుచూపుతారనేది ఆసక్తికరం. ఎంఐఎం గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓట్లను భారీగానే చీల్చింది. ఈసారి మళ్లీ పోటీ చేస్తామని ఆ పార్టీ అధినేత ఒవైసీ చెబుతున్నారు.
- మళ్లీ భాజపా కేంద్రంలో అధికారంలోకి వస్తే అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని మారుస్తుందనే ఆందోళన రాష్ట్రంలో అధికంగా ఉన్న దళితుల్లో నెలకొంది. దానివల్ల రిజర్వేషన్లను కోల్పోతామని వారు ఆందోళన చెందుతున్నారు. మళ్లీ అంబేడ్కర్ వచ్చినా రాజ్యాంగాన్ని మార్చలేరని ప్రధాని మోదీ చెబుతున్నా వారిలో నమ్మకం కలగడం లేదు.
2019లో మిత్రులే ఇప్పుడు బద్ధ శత్రువులు
గత లోక్సభ ఎన్నికల్లో భాజపా, అవిభాజ్య శివసేన కలిసి పోటీ చేశాయి. కాంగ్రెస్ అవిభాజ్య ఎన్సీపీ కలిసి బరిలోకి దిగాయి. ప్రస్తుత ఎన్నికల్లో భాజపా, శివసేన (ఉద్ధవ్) బద్ధ శత్రువులుగా మారాయి. గత ఎన్నికల్లో శత్రువులుగా బరిలోకి దిగిన శివసేన, కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి ఈసారి మిత్రులుగా మారాయి. శరద్ పవార్ కుటుంబం రెండుగా చీలిపోయింది. ఆయన కుమార్తె సుప్రియా సూలేపై బారామతిలో కోడలు వరుసయ్యే సునేత్రా పవార్ (అజిత్ వర్గం నుంచి) పోటీ చేస్తున్నారు.
ప్రస్తుత పరిస్థితి..
- ‘భాజపాపై నాకు నమ్మకం లేదు. అదే సమయంలో కాంగ్రెస్లో సరైన నాయకుడు లేరు’ అని నాగ్పుర్లో కిరాణా దుకాణం నడిపే వ్యక్తి చెబుతున్నారు.
- విదర్భ నుంచి 10 మంది ఎంపీలను పంపుతున్నా ఏ ఒక్క అభ్యర్థీ రైతుల ఆత్మహత్యలపై మాట్లాడటం లేదు.
- విదర్భలోని అతి పెద్ద నగరమైన నాగ్పుర్లో కేంద్ర మంత్రి గడ్కరీ పోటీ చేస్తున్నారు. ఆయన గెలుపు నల్లేరుపై నడకే.
- ముఖ్యమంత్రి శిందే సొంత ప్రాంతం ఠాణేలోని శివసేన కార్యకర్తలు సంతృప్తిగా లేరు. వారు భాజపాపై వ్యతిరేకతతో ఉన్నారు. ఠాణే, కల్యాణ్లలో ఒక నియోజకవర్గాన్ని ఎంచుకోవాలని భాజపా సూచించడం వారికి రుచించడం లేదు. ఇప్పటికే కల్యాణ్ నుంచి శిందే కుమారుడు శ్రీకాంత్ శిందే ఎంపీగా ఉన్నారు.
- మహారాష్ట్ర నవ నిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రే భాజపాకు మద్దతు ప్రకటించారు.
పార్టీల ఆశలు
- రాష్ట్రంలో మోదీ ప్రభావంపైనే భాజపా ఆశలు పెట్టుకుంది. గత ఎన్నికల్లో 41 సీట్లను గెలుచుకున్న ఎన్డీయే ఈసారి 45 సీట్లను లక్ష్యంగా పెట్టుకుంది.
- కాంగ్రెస్ సానుభూతి ఓట్లపై ఆధారపడుతోంది.
- సర్వేల్లో ఉద్ధవ్పై ప్రజల్లో సానుభూతి ఉందని తేలడం శివసేనకు (ఉద్ధవ్) ఊరట కలిగించే అంశం. ఇప్పటికీ క్షేత్ర స్థాయి కార్యకర్తల్లో ఆయనపైనే అభిమానం కనిపిస్తోంది.
ఈనాడు ప్రత్యేక విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
బడ్జెట్ ప్రసంగం ఒక రాజకీయ ప్రసంగంలా ఉందని భారాస ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. -
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
జగన్.. మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి? అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. -
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
తెలంగాణ బడ్జెట్లో హైదరాబాద్ నగర మౌలిక సదుపాయాలకు రూ.10 వేల కోట్లు కేటాయించినందుకు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. -
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం