బాబ్బాబు.. వైకాపా వీడొద్దయ్యా!
మేమంతా సిద్ధం అంటూ జగన్ బస్సు ఎక్కి భీమిలి వస్తుంటే.. ‘మేమంతా సిద్ధమే తెదేపాలోకి వెళ్లేందుకు’ అంటూ ఆనందపురం మండలం కుసులువాడ గ్రామస్థులు మూకుమ్మడిగా సైకిలెక్కారు.
భీమిలి పర్యటనలో.. జగన్కు వలసపోటు
కుసులువాడ సర్పంచి సహా ఊరంతా తెదేపాలోకి
వెళ్లొద్దంటూ.. బతిమాలిన ఎమ్మెల్యే అవంతి సోదరుడు
అయినా ఆగని వలసలు
విశాఖపట్నం (ఆనందపురం), న్యూస్టుడే: మేమంతా సిద్ధం అంటూ జగన్ బస్సు ఎక్కి భీమిలి వస్తుంటే.. ‘మేమంతా సిద్ధమే తెదేపాలోకి వెళ్లేందుకు’ అంటూ ఆనందపురం మండలం కుసులువాడ గ్రామస్థులు మూకుమ్మడిగా సైకిలెక్కారు. బాబ్బాబు, ఈ ఒక్కరోజుకు ఆగండయ్యా అంటూ వైకాపా ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు, ఆయన సోదరుడు బతిమాలినా భంగపాటు తప్పలేదు. తెదేపాలో చేరిన వారు ఒకరిద్దరు కాదు.. పంచాయతీ సర్పంచి మహంతి వెంకటలక్ష్మి, పదిమంది వార్డుసభ్యులు సహా ఒకేసారి దాదాపు 500 మంది ఆదివారం భీమిలి తెదేపా అభ్యర్థి గంటా శ్రీనివాసరావు సమక్షంలో కండువాలు వేసుకున్నారు. జగన్ నియోజకవర్గంలో ఉన్న సమయంలోనే వైకాపా నుంచి తెదేపాలోకి ఊరు ఊరంతా కదలడం చర్చనీయాంశమైంది.
ఎమ్మెల్యే సోదరుడు.. బతిమాలినా
భీమిలి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి జగన్ సోమవారం పర్యటించనున్నారు. కనీసం జగన్ పర్యటన జరిగే వరకైనా ఆగమంటూ.. వైకాపా ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు వారిని తెదేపాలోకి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా ప్రయోజనం లేకపోయింది. అవంతి సోదరుడు మహేశ్ పట్టువిడవకుండా గంటా ఇంటి వరకు వారిని వెంబడించారు. పార్టీ మారొద్దంటూ వారి చేతులు పట్టుకుని బతిమాలుతూనే ఉన్నారు.. అయినా ఎవరూ వినిపించుకోలేదు. అభివృద్ధిని ఆకాంక్షించి తెదేపాలో చేరుతున్నట్లు సర్పంచి వెంకటలక్ష్మితోపాటు ఉపసర్పంచి ఆల్తిరామారావు, వార్డు సభ్యులు తామురోతు లక్ష్మి, కోరాడ పైడిరాజు, చింతాడ వెంకట సూర్యనారాయణ, రవ్వ లక్ష్మి, పిల్లా పార్వతి, ఈగల వెంకటరమణ, రేగాని రాము, రేగాని అప్పలనాయుడు, వరపుల గౌరీతో పాటు పంచాయతీలోని వైకాపా సీనియర్ నాయకులు ప్రకటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదు: హైకోర్టు సంచలన తీర్పు
భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నికపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఎమ్మెల్సీగా ఆయన ఎన్నిక చెల్లదని ప్రకటించింది. -
పిఠాపురంలో పవన్కే జై.. ముద్రగడ కుమార్తె కీలక వ్యాఖ్యలు
జనసేన (Janasena) అధినేత పవన్కల్యాణ్ (Pawan Kalyan)ను ఉద్దేశించి మాజీ మంత్రి, వైకాపా నేత ముద్రగడ పద్మనాభం చేసిన వ్యాఖ్యలను ఆమె కుమార్తె క్రాంతి ఖండించారు. -
ఏకాభిప్రాయం ఉంటేనే యూసీసీకి మద్దతు
‘ముస్లిం మత పెద్దల అంగీకారం, ఏకాభిప్రాయం లేకుండా యూసీసీకి సంబంధించిన అంశాలకు వైకాపా మద్దతు ఇవ్వదు. మా పార్టీ అధ్యక్షుడు, సీఎం జగన్మోహన్రెడ్డి ఈ విషయమై స్పష్టంగా చెప్పారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు తొలిరోజు 3 నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు తొలి రోజు గురువారం ముగ్గురు అభ్యర్థులు తమ నామినేషన్లను రిటర్నింగ్ అధికారి (ఆర్వో), నల్గొండ జిల్లా కలెక్టరు దాసరి హరిచందనకు అందజేశారు.
తాజా వార్తలు (Latest News)
-
శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
-
ఓటీటీలోకి వచ్చేసిన త్రిగుణ్ ‘లైన్ మ్యాన్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఎన్నికల నేపథ్యంలో.. కేజ్రీవాల్కు బెయిల్ అంశాన్ని పరిశీలిస్తాం - సుప్రీంకోర్టు
-
‘ఆమె కన్నీళ్లకు నా హృదయం ముక్కలైంది’: గవర్నర్పై ఆరోపణల వేళ దీదీ వ్యాఖ్య
-
వన్డేలు - టీ20ల్లో టీమ్ఇండియాదే అగ్రస్థానం.. టెస్టుల్లో ఆసీస్ నంబర్ వన్
-
రివ్యూ : బాక్.. తమన్నా, రాశీఖన్నాల హారర్ మూవీ ఎలా ఉంది