సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ
ఎన్డీయే అభ్యర్థులకే ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ మద్దతు
ఏలూరు అర్బన్, న్యూస్టుడే: ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ పదవీవిరమణ పొందినవారిని వైకాపా ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని మండిపడ్డారు. సంఘ ప్రధాన కార్యదర్శి బి.పెద్దన్న గౌడ్ మాట్లాడుతూ క్వాంటమ్ ఆఫ్ పింఛన్ను తగ్గించడమే కాకుండా మెడికల్ బిల్లులు రెండేళ్లయినా విడుదల చేయలేదన్నారు.
కేంద్ర ఫిర్యాదుల విభాగం ప్రారంభం
విజయవాడ నేరవార్తలు, న్యూస్టుడే: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నగదు, మద్యం, ఓటర్లను ప్రలోభపెట్టే ఉచిత వస్తువుల పంపిణీ, శాంతిభద్రతల పరిరక్షణ, ఇతర ఎన్నికల నేరాలను అరికట్టేందుకు రాష్ట్ర స్థాయిలో విజయవాడలో ‘కేంద్ర ఫిర్యాదుల విభాగాన్ని’ ప్రారంభించినట్లు నగర పోలీస్ కమిషనర్(సీపీ) కాంతిరాణా తెలిపారు. ఎన్నికల ప్రలోభాలపై ఎలాంటి సమాచారమైనా టోల్ ఫ్రీ నంబరు 1800 425 5049కు చెప్పాలని సీపీ ఓ ప్రకటనలో కోరారు.
తెదేపా బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర కమిటీ సభ్యుడిగా శ్రీధర్బాబు
ఈనాడు, అమరావతి: తెదేపా సాధికార సమితి రాష్ట్ర కమిటీ సభ్యుడిగా కర్నూలు నియోజకవర్గానికి చెందిన సముద్రాల శ్రీధర్బాబును నియమిస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సోమవారం ఆదేశాలు జారీచేశారు. 12 లోక్సభ స్థానాల పరిధిలో తెదేపా బ్రాహ్మణ సాధికార సమితి పార్లమెంట్ కన్వీనర్లను నియమించారు. రాష్ట్రంలో 15 లోక్సభ స్థానాల పరిధిలో తెదేపా ప్రొఫెషనల్స్ వింగ్ పార్లమెంటు కమిటీలను నియమిస్తూ అచ్చెనాయుడు ఆదేశాలు జారీచేశారు.
ప్రమాణపత్రం అందజేసిన నారా లోకేశ్
మంగళగిరి, న్యూస్టుడే: మంగళగిరి నియోజకర్గ తెదేపా అభ్యర్థి నారా లోకేశ్ సోమవారం మున్సిపల్ కార్పొరేషన్లోని కార్యాలయంలో ఆర్వో రాజకుమారికి తన ప్రమాణ పత్రాన్ని అందజేశారు. ఆయనతో పాటు నియోజకవర్గ తెదేపా సమన్వయకర్త నందం అబద్ధయ్య ఉన్నారు. లోకేశ్ ఇప్పటికే నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
వైకాపాకు కురుబ కార్పొరేషన్ ఛైర్మన్ సూర్యప్రకాశ్ గుడ్బై
బత్తలపల్లి, న్యూస్టుడే: ‘శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి బీసీల ద్రోహి.. వారిని ఆర్థికంగా అణగదొక్కారు’ అని రాష్ట్ర కురుబ కార్పొరేషన్ ఛైర్మన్ కోటి సూర్యప్రకాశ్బాబు చెప్పారు. తాను వైకాపాకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. సీఎం జగన్ నమ్మించి మోసం చేశారన్నారు. కురుబ కార్పొరేషన్కు నిధులివ్వలేదని, కురుబలకు అన్యాయం చేసిన పార్టీ వైకాపా అని విమర్శించారు.
నేడు భాజపాలో చేరిక: మంగళవారం ధర్మవరంలో భాజపా అభ్యర్థి సత్యకుమార్ నామినేషన్కు హాజరుకానున్న కేంద్ర మంత్రి వి.కె.సింగ్ సమక్షంలో భాజపాలో చేరనున్నట్లు సూర్యప్రకాశ్బాబు ప్రకటించారు.
ఎన్నారైల్ని ఉగ్రవాదుల్లా చిత్రీకరిస్తున్న వైకాపా
తెదేపా నేత కోమటి జయరాం ధ్వజం
ఈనాడు డిజిటల్, అమరావతి: తెదేపాకు మద్దతిస్తున్న ఎన్నారైల్ని వైకాపా నేతలు ఉగ్రవాదుల్లా చిత్రీకరిస్తున్నారని తెదేపా ఎన్నారై విభాగం సమన్వయకర్త కోమటి జయరాం ధ్వజమెత్తారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా.. ప్రవాసాంధ్రుల సమస్యల పరిష్కారానికి తెదేపా కృషి చేసిందని గుర్తు చేశారు. తెలుగు ప్రజల అభ్యున్నతికి దోహదపడాలనే ఉద్దేశంతో ఎన్నారైలంతా ఈ ఎన్నికల్లో పని చేయాలని తాను చెప్పిన మాటల్ని వైకాపా నాయకులు వక్రీకరిస్తున్నారని సోమవారం ఓ ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఉన్నారంటే.. అందుకు చంద్రబాబు తీసుకొచ్చిన సంస్కరణలే కారణం. అలాంటి వ్యక్తిని ఎన్నో ఇబ్బందులకు గురిచేశారు. రాష్ట్ర హితం కోసం మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడమే ప్రవాసాంధ్రుల లక్ష్యం’ అని జయరాం స్పష్టం చేశారు.
16 గిరిజన సంక్షేమ పథకాల్ని రద్దు చేసిన జగన్
గిరిజన సమ్మేళనంలో తెదేపా నేతల ధ్వజం
ఈనాడు డిజిటల్, అమరావతి: తెదేపా హయాంలో గిరిజనుల కోసం ప్రత్యేకంగా అమలు చేసిన 16 సంక్షేమ పథకాల్ని.. సీఎం జగన్ రద్దు చేశారని తెదేపా నేతలు ధ్వజమెత్తారు. నా ఎస్టీలు అంటూనే జగన్ వారిని వంచిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు భైరి ఓంకార్ నేతృత్వంలో గిరిజన సమ్మేళనం నిర్వహించారు. తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మాట్లాడుతూ.. దళిత, గిరిజనులకు రుణాలివ్వకుండా బ్యాంకులు ఇబ్బందులు పెడుతున్నాయని ఆరోపించారు. ఆయా వర్గాల అభివృద్ధి, సంక్షేమం తమ పార్టీతోనే సాధ్యమని స్పష్టం చేశారు. ‘‘ఎన్టీఆర్ మొదలు చంద్రబాబు వరకు ఎస్సీ, ఎస్టీల్ని ఆదుకున్నారు. విదేశీవిద్య పథకం ద్వారా ఉన్నత చదువులకు అవకాశం కల్పించారు. కానీ అయిదేళ్లలో వైకాపా ప్రభుత్వం ఎంత మందిని విదేశాలకు పంపింది’’ అని వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా ప్రభుత్వ అరాచకాల్ని ప్రశ్నించిన ఎస్టీలపై తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపారని తెదేపా ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ధారునాయక్ ఆరోపించారు.
తెదేపా ప్రొఫెషనల్స్ వింగ్ కమిటీలోకి కొత్తగా 20 మంది
ఈనాడు డిజిటల్, అమరావతి: తెదేపా ప్రొఫెషనల్స్ వింగ్ రాష్ట్ర కమిటీలోకి కొత్తగా 20 మందిని తీసుకున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. నలుగురు ఉపాధ్యక్షులు, ముగ్గురు ప్రధాన కార్యదర్శులు, ఆరుగురు కార్యనిర్వాహక కార్యదర్శులు, ఏడుగురు కార్యదర్శుల్ని అదనంగా నియమించినట్లు సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తెదేపా అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేపట్టినట్లు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా కొనసాగి ఉంటే 2021లోనే పోలవరం పూర్తయ్యేది: సీఎం చంద్రబాబు
2014-19 మధ్య పెట్టుబడులకు చిరునామాగా ఆంధ్రప్రదేశ్ను నిలిపామని సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. -
గోదావరిలో నీరుంది.. కానీ ప్రభుత్వానికి ఇచ్చే మనసు లేదు: కేటీఆర్
తెలంగాణలో కరవు అనే మాట వినపడకూడదని కేసీఆర్.. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
వైకాపా హయాంలో ప్రకటనల కుంభకోణం.. హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేల డిమాండ్
వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రకటనల కుంభకోణంపై హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. -
ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.. మంత్రులకు చంద్రబాబు సూచన
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించడం... వంటి మంచి పనుల్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. -
సకుటుంబ సమేతంగా కేసులు.. అక్రమ కేసులున్నవారు నిలబడాలని కోరిన చంద్రబాబు
వివాహాలు, ఇతర శుభకార్యాలకు సకుటుంబ సపరివార సమేతంగా రావాలని ఆహ్వానిస్తుంటాం.. అయితే గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలపై సకుటుంబ సమేతంగా అక్రమ కేసులు నమోదు చేసి వేధించారని చంద్రబాబు, ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. శ్వేతపత్రం విడుదల సందర్భంగా.. వైకాపా ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలపై నమోదైన అక్రమ కేసుల సంఖ్యను చంద్రబాబు ప్రస్తావించారు. -
ఏపీ ‘ఎస్కోబార్’ జగన్.. చీకటి సామ్రాజ్యాధిపతితో పోల్చిన చంద్రబాబు
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అరాచకాలను వివరించేటప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కొలంబియన్ మాదకద్రవ్యాల చీకటి సామ్రాజ్యాధిపతి పాబ్లో ఎమిలియో ఎస్కోబార్ చరిత్రను సభకు వినిపించారు. -
‘రఘురామను చిత్రహింసలు పెట్టినప్పుడు మీరంతా ఏమయ్యారు?’
మాజీ ముఖ్యమంత్రి జగన్ దిల్లీలో చేసిన నిరసనకు ఇండియా కూటమి నాయకులు మద్దతు పలకడాన్ని అనంతపురం తెదేపా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. -
అన్ని వర్గాలకూ మోసం
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలనూ మోసం చేసిందని, అందర్నీ వెన్నుపోటు పొడిచిందని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. -
శాంతిభద్రతల పరిరక్షణపై సభలో చర్చిద్దాం
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు.. రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలపై శాసనసభలో ఒక రోజు పూర్తిగా చర్చించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు. -
ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని దోచేశారు
‘వైకాపా ప్రభుత్వం చేసిన నిర్వాకాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు విద్యుత్తు, అమరావతి, పోలవరం, గనులు, మద్యంపై శ్వేతపత్రాలు విడుదల చేశారు. -
వైకాపా ప్రభుత్వం ఇళ్లు కూల్చింది.. ఆదుకోండి
తెదేపాకు అనుకూలంగా ఉన్నారని విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం దన్నానపేట గ్రామానికి చెందిన 30 మంది దళితుల ఇళ్లను అప్పటి వైకాపా ప్రభుత్వం కూల్చేసిందని ఆ మండల తెదేపా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు టొంపల నర్సయ్య గురువారం తెదేపా కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. -
వైకాపా పాలనలో తెదేపా శ్రేణులపై 2,560 కేసులు
వైకాపా హయాంలో గత ఐదేళ్లలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై 2,560 కేసులు నమోదు చేసి.. 2,370 మందిని అరెస్టు చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. -
ఇసుక, మద్యం అవినీతిపై విచారణ జరిపించాలి
ముఖ్యమంత్రి చంద్రబాబును రాష్ట్ర సచివాలయంలో గురువారం సీపీఎం నాయకులు కలిశారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. -
సమస్యలపై ప్రశ్నిస్తే.. వేధింపులే సమాధానం
శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం విడుదల చేసిన ‘శాంతిభద్రతల శ్వేతపత్రం’పై కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వేదికగా మాట్లాడారు. -
‘ఇండియా’ కూటమితో పొత్తు కోసమే జగన్ దిల్లీ యాత్ర
‘ఇండియా’ కూటమితో పొత్తు కోసమే వైకాపా అధ్యక్షుడు జగన్ దిల్లీ వెళ్లినట్లుగా ఉందని ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. దిల్లీ నుంచి అమరావతి చేరుకున్న జగన్... శాసనసభ సమావేశాలకు హాజరు కావాలని సూచించారు. -
ఇది పసలేని దండగమారి బడ్జెట్: కేటీఆర్
రాష్ట్ర ప్రభుత్వం పసలేని, దండగమారి బడ్జెట్ ప్రవేశపెట్టిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ప్రజల ఆకాంక్షలు పట్టించుకోకుండా ఆంక్షల పద్దు పెట్టారని అన్నారు. -
సంక్షిప్త వార్తలు (4)
బడ్జెట్లో అధిక కేటాయింపుల ద్వారా.. తమది రైతు ప్రభుత్వమని మరోసారి నిరూపించుకున్నట్లయిందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అన్నారు. -
ఫైళ్ల దహనంతో మాకు సంబంధం లేదు: వైకాపా ఎంపీ మిథున్రెడ్డి
మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో జరిగిన రెవెన్యూ దస్త్రాల దహనం ఘటనతో తమకెలాంటి సంబంధం లేదని వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి పేర్కొన్నారు. -
గాజులదిన్నె ప్రాజెక్టు పనులపై విచారణ చేపడతాం: మంత్రి నిమ్మల
సంజీవయ్య గాజులదిన్నె ప్రాజెక్టు పనులపై విచారణ చేపడతామని జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. -
రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతీయడానికే జగన్ దిల్లీ నిరసన: హోంమంత్రి అనిత
రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతీయడానికే మాజీ సీఎం జగన్ దిల్లీలో నిరసన పేరుతో చౌకబారు ఆరోపణలు చేశారని హోంమంత్రి అనిత మండిపడ్డారు. 36 రాజకీయ హత్యలు జరిగాయని నిస్సిగ్గుగా మాట్లాడారని ధ్వజమెత్తారు. -
వరద బాధిత రైతులను తక్షణమే ఆదుకోవాలి
కోస్తా జిల్లాల్లోని వరద బాధిత రైతులకు తక్షణమే నష్టపరిహారం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల గురువారం లేఖ రాశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
-
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
-
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
-
గూగుల్కు పోటీగా కొత్త సెర్చింజిన్.. తీసుకొచ్చిన చాట్జీపీటీ ఓనర్
-
రైటర్గా నాని.. జోరందుకున్న ప్రచారం
-
తెదేపా కొనసాగి ఉంటే 2021లోనే పోలవరం పూర్తయ్యేది: సీఎం చంద్రబాబు