బ్యాలెట్ బాక్సులతోనే ‘స్థానిక’ ఎన్నికలు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికలను బ్యాలెట్ బాక్సులతో నిర్వహించాలని నిర్ణయించింది.
సిద్ధం చేస్తున్న రాష్ట్ర ఎన్నికల సంఘం
సీళ్లు, ట్యాగ్లను మే 15లోగా ముద్రించాలని పంచాయతీరాజ్ శాఖకు ఆదేశాలు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికలను బ్యాలెట్ బాక్సులతో నిర్వహించాలని నిర్ణయించింది. బ్యాలెట్ బాక్సులకు సంబంధించిన సీళ్లు, చిరునామా ట్యాగ్లను వచ్చే నెల 15లోగా ముద్రించాలని పంచాయతీరాజ్ కమిషనర్ను ఎస్ఈసీ మంగళవారం ఆదేశించింది. రాష్ట్రంలో సర్పంచుల పదవీ కాలం ఫిబ్రవరి ఒకటో తేదీతో ముగిసింది. మండల, జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ (ఎంపీటీసీ, జడ్పీటీసీ) సభ్యుల పదవీ కాలం జులై 3న ముగియనుంది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఎస్ఈసీ కసరత్తు చేపట్టింది. గ్రామ పంచాయతీల ఎన్నికలు వాయిదా పడడంతో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సంకేతాలు ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలను వేగవంతం చేసింది. ఇప్పటికే పంచాయతీలు, మండల పరిషత్లు, జిల్లా పరిషత్ల నుంచి స్థానాల సంఖ్య, రిజర్వేషన్లకు సంబంధించిన సమాచారం తీసుకుంది. తాజాగా బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలో మొదటి నుంచీ స్థానిక ఎన్నికలు బ్యాలెట్ బాక్సులతోనే నిర్వహిస్తున్నారు. ఈసారి కూడా అదేరీతిలో జరిపించాలని ఎస్ఈసీ నిర్ణయించింది. ఈ బ్యాలెట్ బాక్సులకు కాగితపు సీళ్లు, చిరునామా ట్యాగ్లను అతికించాల్సి ఉంది. దీనికోసం వాటి ముద్రణను చేపట్టాలని నిర్ణయించింది. పేపర్ సీళ్లతో పాటు పోలింగ్ కేంద్రం, గ్రామం, మండలం, జిల్లాలను సూచించే ట్యాగ్లను ఆంగ్ల, తెలుగు భాషల్లో ముద్రించాలని నిర్ణయించింది. వీటిని హైదరాబాద్లోని చంచల్గూడ ప్రింటింగ్ ప్రెస్లో ముద్రించాలని పంచాయతీరాజ్ కమిషనర్కు సూచించింది. పేపర్ సీల్, చిరునామా ట్యాగ్ల నమూనాను తెలుపుతూ పచ్చరంగులో వాటిని దళసరి కాగితంతో ముద్రించాలని సూచించింది. ఎన్నికలు జరిగే పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్ స్థానాల్లో పోలింగ్ కేంద్రాల్లోని నాలుగేసి బ్యాలెట్ బాక్స్లకు అవసరమయ్యేలా పేపర్ సీళ్లతో పాటు అదనంగా మరో 20 శాతం (రిజర్వ్), అదే సంఖ్యలో చిరునామా ట్యాగ్లను ముద్రించాలని సూచించింది.
తేదీలపై ప్రభుత్వానిదే నిర్ణయం!
లోక్సభ ఎన్నికల ప్రక్రియ జూన్ నాలుగో తేదీతో ముగుస్తుంది. అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలు జరిపే వీలుంది. తేదీలపై రాష్ట్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయం కానుంది. ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై స్పష్టత రావాల్సి ఉంది. బీసీ కమిషన్ ఛైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్రావు నేతృత్వంలో ఇప్పటికే స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై కసరత్తు చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తే జూన్లో ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత రెండు నుంచి మూడు నెలల వ్యవధిలో అభిప్రాయ సేకరణ, ఇంటింటి సర్వే నిర్వహించి, నివేదిక సమర్పించే అవకాశం ఉంది. దాన్ని ప్రభుత్వం ఆమోదించి, రిజర్వేషన్లను ఖరారు చేసి రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలియజేస్తుంది. దాని ఆధారంగా ఎన్నికలు జరిపే వీలుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నిక రద్దు
భారాస ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నికను రద్దు చేస్తూ శుక్రవారం హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆయన ఎన్నికైనట్లు 2021 డిసెంబరు 14న జారీ చేసిన ప్రకటన, 15న ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ చెల్లవని పేర్కొంది. -
జడ్పీటీసీ పదవి ఊరికే రాలేదు.. కొనుక్కున్నాం
పల్నాడు జిల్లా ముప్పాళ్ల జడ్పీటీసీ పదవి ఊరికే రాలేదని.. ఎంతో ఖర్చుపెట్టి కొనుక్కుంటే ఆ పదవి వచ్చిందని దమ్మాలపాడు గ్రామానికి చెందిన శిరిగిరి గోపాలరావు శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టు చర్చనీయాంశమైంది. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రెండో రోజు నలుగురి నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రెండో రోజు శుక్రవారం నలుగురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. -
ప్రభుత్వ అలసత్వం వల్లే వృద్ధులకు పింఛను కష్టాలు
నడవలేని స్థితిలో ఉన్న వారికి ఇంటి వద్దే పింఛన్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు బ్యాంకుల్లో జమ చేసి, వారిని ఇబ్బందులకు గురి చేయడం అన్యాయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
తాడేపల్లిలో డ్రగ్స్.. గోప్యంగా ఉంచిన అధికారులు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జగనాసురుడి పన్నాగం.. పండుటాకుల విలాపం
-
పార్కింగ్ గొడవ.. కక్షగట్టి ఏడాది తర్వాత హత్య
-
మంత్రి రోజాను అడ్డుకున్న వేమాపురం వాసులు
-
ఎన్నిక, తీర్పు రెండూ సంచలనమే.. భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ భవిష్యత్తు ప్రశ్నార్థకం!