కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
పోటీకి సిద్ధమైన సత్యనారాయణ
మల్కాజిగిరి ఎంపీగానూ పోటీ చేస్తానని ప్రకటన
ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి: ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. పార్టీలో ఎన్నో ఏళ్లుగా పని చేస్తున్న తమను కాదని.. ఇతర పార్టీల నేతలను చేర్చుకొని టికెట్లు ఇవ్వడమే ఇందుకు కారణం. కేంద్ర మంత్రిగా, ఎమ్మెల్యేగా పని చేసిన సీనియర్ నేత సర్వే సత్యనారాయణ కాంగ్రెస్పై తిరుగుబాటు చేశారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల బరిలో నిలుస్తున్నట్లు ప్రకటించారు. బుధవారం ఆ పార్టీ తరఫున నామినేషన్ వేయడం గమనార్హం. మల్కాజిగిరి లోక్సభ స్థానం నుంచీ పోటీకి దిగుతున్నట్లు తెలిపారు. గతంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా గెలిచిన సర్వేకు ఇక్కడ చెప్పుకోదగిన ఓటు బ్యాంకు ఉండటంతో నేతల్లో ఆందోళన నెలకొంది.
నలుగురిలో ముగ్గురిది భారాస..
రాజధాని పరిధిలోకి వచ్చే నాలుగు లోక్సభ స్థానాల్లో మూడింటిలో కాంగ్రెస్ నేతలకు కాకుండా భారాస నుంచి వచ్చిన నేతలకే టిక్కెట్లు ఇచ్చారు.
ఖైరతాబాద్ నుంచి గెలిచిన భారాస ఎమ్మెల్యే దానం నాగేందర్ను పార్టీలోకి చేర్చుకుని సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. చేవెళ్ల సిట్టింగ్ భారాస ఎంపీ రంజిత్రెడ్డిని అదే స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ బరిలో నిలిపింది. మల్కాజిగిరి స్థానం నుంచి భారాస నేత, వికారాబాద్ జడ్పీ ఛైర్మన్ సునీతా మహేందర్రెడ్డికి హస్తం కండువా కప్పి ఎంపీగా పోటీ చేయిస్తున్నారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా అప్పటికప్పుడు భాజపా నేత శ్రీ గణేష్ను పార్టీలోకి చేర్చుకుని టికెట్ ప్రకటించారు.
సీనియర్ నేతల్లో అసంతృప్తి..
కంటోన్మెంట్ టికెట్ను సీనియర్ కాంగ్రెస్ నేత సర్వే సత్యనారాయణ ఆశించారు. గతంలో ఆయన ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. నియోజకవర్గంలో కొంతమేర కార్యకర్తల బలం ఉంది. ఈ నేపథ్యంలో తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. కొన్నేళ్లుగా ఆయన పార్టీలో చురుగ్గా లేరు.. దీంతో అభ్యర్థిత్వాన్ని ప్రాథమికంగానూ పరిశీలించలేదు. భాజపా నేత శ్రీ గణేష్ను పార్టీలోకి చేర్చుకుని ఆయనకు టికెట్ ఇచ్చారు. ఈ విషయంలో కనీసం తనకు చెప్పలేదని ఆగ్రహంతో ఉన్నారు. దీంతో కాంగ్రెస్తో అమీతుమీ తేల్చుకోవాలన్న ఉద్దేశంతో కంటోన్మెంట్ నుంచి బరిలో దిగాలని నిర్ణయించారు. బుధవారం ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగానే నామినేషన్ వేశారు. పార్టీ బీఫారం ఇవ్వదు కాబట్టి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉండే అవకాశం ఉంది. కాంగ్రెస్ను దెబ్బతీయడం కోసం ఆయన మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థిగానూ నామినేషన్ వేయాలని నిర్ణయించారు. ఇదే విషయాన్ని ఆయన అధికారికంగా ప్రకటించారు. రాష్ట్రంలో ఉన్నది రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ కాదని.. తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. దీన్ని బట్టి చూస్తే ఆయన కాంగ్రెస్ పార్టీతో తెగదెంపులకే సిద్ధమయ్యారని ఆ పార్టీ నేతలు అంటున్నారు. సర్వే సత్యనారాయణ 1985లో కంటోన్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తరువాత సిద్ధిపేట నుంచి ఒకసారి, మల్కాజిగిరి నుంచి ఒకసారి ఎంపీగా ఎన్నికయ్యారు. కేంద్రమంత్రిగా కొంతకాలం పనిచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.. మంత్రులకు చంద్రబాబు సూచన
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించడం... వంటి మంచి పనుల్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. -
సకుటుంబ సమేతంగా కేసులు.. అక్రమ కేసులున్నవారు నిలబడాలని కోరిన చంద్రబాబు
వివాహాలు, ఇతర శుభకార్యాలకు సకుటుంబ సపరివార సమేతంగా రావాలని ఆహ్వానిస్తుంటాం.. అయితే గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలపై సకుటుంబ సమేతంగా అక్రమ కేసులు నమోదు చేసి వేధించారని చంద్రబాబు, ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. శ్వేతపత్రం విడుదల సందర్భంగా.. వైకాపా ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలపై నమోదైన అక్రమ కేసుల సంఖ్యను చంద్రబాబు ప్రస్తావించారు. -
ఏపీ ‘ఎస్కోబార్’ జగన్.. చీకటి సామ్రాజ్యాధిపతితో పోల్చిన చంద్రబాబు
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అరాచకాలను వివరించేటప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కొలంబియన్ మాదకద్రవ్యాల చీకటి సామ్రాజ్యాధిపతి పాబ్లో ఎమిలియో ఎస్కోబార్ చరిత్రను సభకు వినిపించారు. -
‘రఘురామను చిత్రహింసలు పెట్టినప్పుడు మీరంతా ఏమయ్యారు?’
మాజీ ముఖ్యమంత్రి జగన్ దిల్లీలో చేసిన నిరసనకు ఇండియా కూటమి నాయకులు మద్దతు పలకడాన్ని అనంతపురం తెదేపా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. -
అన్ని వర్గాలకూ మోసం
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలనూ మోసం చేసిందని, అందర్నీ వెన్నుపోటు పొడిచిందని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. -
శాంతిభద్రతల పరిరక్షణపై సభలో చర్చిద్దాం
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు.. రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలపై శాసనసభలో ఒక రోజు పూర్తిగా చర్చించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు. -
ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని దోచేశారు
‘వైకాపా ప్రభుత్వం చేసిన నిర్వాకాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు విద్యుత్తు, అమరావతి, పోలవరం, గనులు, మద్యంపై శ్వేతపత్రాలు విడుదల చేశారు. -
వైకాపా ప్రభుత్వం ఇళ్లు కూల్చింది.. ఆదుకోండి
తెదేపాకు అనుకూలంగా ఉన్నారని విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం దన్నానపేట గ్రామానికి చెందిన 30 మంది దళితుల ఇళ్లను అప్పటి వైకాపా ప్రభుత్వం కూల్చేసిందని ఆ మండల తెదేపా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు టొంపల నర్సయ్య గురువారం తెదేపా కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. -
వైకాపా పాలనలో తెదేపా శ్రేణులపై 2,560 కేసులు
వైకాపా హయాంలో గత ఐదేళ్లలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై 2,560 కేసులు నమోదు చేసి.. 2,370 మందిని అరెస్టు చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. -
ఇసుక, మద్యం అవినీతిపై విచారణ జరిపించాలి
ముఖ్యమంత్రి చంద్రబాబును రాష్ట్ర సచివాలయంలో గురువారం సీపీఎం నాయకులు కలిశారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. -
సమస్యలపై ప్రశ్నిస్తే.. వేధింపులే సమాధానం
శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం విడుదల చేసిన ‘శాంతిభద్రతల శ్వేతపత్రం’పై కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వేదికగా మాట్లాడారు. -
‘ఇండియా’ కూటమితో పొత్తు కోసమే జగన్ దిల్లీ యాత్ర
‘ఇండియా’ కూటమితో పొత్తు కోసమే వైకాపా అధ్యక్షుడు జగన్ దిల్లీ వెళ్లినట్లుగా ఉందని ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. దిల్లీ నుంచి అమరావతి చేరుకున్న జగన్... శాసనసభ సమావేశాలకు హాజరు కావాలని సూచించారు. -
ఇది పసలేని దండగమారి బడ్జెట్: కేటీఆర్
రాష్ట్ర ప్రభుత్వం పసలేని, దండగమారి బడ్జెట్ ప్రవేశపెట్టిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ప్రజల ఆకాంక్షలు పట్టించుకోకుండా ఆంక్షల పద్దు పెట్టారని అన్నారు. -
సంక్షిప్త వార్తలు (4)
బడ్జెట్లో అధిక కేటాయింపుల ద్వారా.. తమది రైతు ప్రభుత్వమని మరోసారి నిరూపించుకున్నట్లయిందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అన్నారు. -
ఫైళ్ల దహనంతో మాకు సంబంధం లేదు: వైకాపా ఎంపీ మిథున్రెడ్డి
మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో జరిగిన రెవెన్యూ దస్త్రాల దహనం ఘటనతో తమకెలాంటి సంబంధం లేదని వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి పేర్కొన్నారు. -
గాజులదిన్నె ప్రాజెక్టు పనులపై విచారణ చేపడతాం: మంత్రి నిమ్మల
సంజీవయ్య గాజులదిన్నె ప్రాజెక్టు పనులపై విచారణ చేపడతామని జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. -
రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతీయడానికే జగన్ దిల్లీ నిరసన: హోంమంత్రి అనిత
రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతీయడానికే మాజీ సీఎం జగన్ దిల్లీలో నిరసన పేరుతో చౌకబారు ఆరోపణలు చేశారని హోంమంత్రి అనిత మండిపడ్డారు. 36 రాజకీయ హత్యలు జరిగాయని నిస్సిగ్గుగా మాట్లాడారని ధ్వజమెత్తారు. -
వరద బాధిత రైతులను తక్షణమే ఆదుకోవాలి
కోస్తా జిల్లాల్లోని వరద బాధిత రైతులకు తక్షణమే నష్టపరిహారం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల గురువారం లేఖ రాశారు. -
రైతుల జీవితాలతో చెలగాటం వద్దు!
‘ఎన్నికలు అయిపోయాయి.. రాజకీయాలు వదిలేయండి.. రాజకీయాల కోసం రైతుల జీవితాలతో చెలగాటమాడొద్దు’ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. -
సంతోషదాయక బడ్జెట్: కూనంనేని
నిధుల పరంగా రాష్ట్రం సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సంతోషదాయకంగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. -
హామీల అమలుపై చిత్తశుద్ధి ఏదీ?
ప్రగతి పట్టని, సరైన దిశానిర్దేశం లేని, హామీల అమలుపై చిత్తశుద్ధి లేని బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిందని భాజపా శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి విమర్శించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కార్గిల్ 25వ విజయ్ దివస్.. యుద్ధ స్మారకం వద్ద మోదీ నివాళులు
-
జోబైడెన్ మెదడు అద్భుతంగా పనిచేస్తోంది: శ్వేతసౌధం డాక్టర్ల సర్టిఫికెట్
-
ఆగస్టు 5 నుంచి 10 వరకు గోల్కొండ, శాతవాహన ఎక్స్ప్రెస్ల రద్దు
-
లాభాల్లో మార్కెట్లు.. 82,260 పైన సెన్సెక్స్.. 24,500 చేరువలో నిఫ్టీ
-
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసు నిందితుడు మృతి
-
వైకాపా నేతల స్థిరాస్తి దందాకు బ్రేక్