తెదేపా కార్యకర్తలపై పోలీసుల లాఠిన్యం
పల్నాడు జిల్లా మాచవరంలో ఎంపీపీ కుమారుడిపై జరిగిన దాడి కేసులో తెదేపాకు చెందిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకొని తీవ్రంగా హింసించారు.
మాచవరం ఎంపీపీ కుమారుడిపై దాడి కేసులో ఏకపక్ష వైఖరి
తమను హింసించారని న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లిన బాధితులు
వైద్య పరీక్షలకు ఆదేశం.. గాయాలైనట్లు వైద్యుల పరిశీలనలో వెల్లడి
వీపుపై కమిలిపోయిన గాయాలు చూపుతున్న నిఖిల్
ఈనాడు, అమరావతి-న్యూస్టుడే, గుంటూరు (నగరంపాలెం): పల్నాడు జిల్లా మాచవరంలో ఎంపీపీ కుమారుడిపై జరిగిన దాడి కేసులో తెదేపాకు చెందిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకొని తీవ్రంగా హింసించారు. వారు కొట్టిన దెబ్బలకు బాధితుల శరీరంపై ఎర్రగా కమిలిన గాయాలయ్యాయి. నడవలేని స్థితిలో ఉన్న నిఖిల్, శ్రీకాంత్, టి.రమేష్, యు.రమేష్, జి.రమేష్, కె.వెంకటేశ్వర్లుతో పాటు వృద్ధుడు వై.మోహనరావును పోలీసులు శుక్రవారం సత్తెనపల్లి కోర్టులో హాజరుపర్చారు. పోలీసులు తమను దారుణంగా కొట్టారని బాధితులు న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. బాధితులకు గుంటూరు ప్రభుత్వ బోధనాసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించి, నివేదిక అందజేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఈ నెల 14న తమపై మోర్జంపాడు గ్రామానికి చెందిన ఏడుగురు తెదేపా కార్యకర్తలు, సానుభూతిపరులు దాడి చేశారని మాచవరం ఎంపీపీ కుమారుడు లక్ష్మీరెడ్డి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన మాచవరం పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
బూటు కాలితో తన్నడంతో పొట్టపై గాయమైందని చూపుతున్న శ్రీకాంత్
ఎంపీపీ కుమారుడిపై తాము దాడి చేయలేదని చెప్పినా.. వినిపించుకోలేదని, తమను అన్యాయంగా కేసులో ఇరికించి చావబాదారని శుక్రవారం జీజీహెచ్ వద్ద మీడియాతో బాధితులు వాపోయారు. పోలీసులు తమను కాళ్లు చేతులపైనే కాకుండా మర్మాంగాలపై కూడా కొట్టారని, గొంతుపై బూటు కాలు మోపారని వివరించారు. దాడితో సంబంధం లేకపోయినా.. మేమే చేశామని ఒప్పుకోవాలని పోలీసులు తమపై ఒత్తిడి తీసుకొచ్చారని నిఖిల్, శ్రీకాంత్, రమేష్లు వాపోయారు. మరోవైపు నిందితులకు గాయాలేవీ కాలేదని నివేదిక ఇవ్వాలని పోలీసులు వైద్యులపై సైతం ఒత్తిడి చేసినట్లు సమాచారం. వైద్యులు అవేమీ పట్టించుకోకుండా నిందితులకు గాయాలయ్యాయని నివేదిక సమర్పించినట్లు తెలిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
త్వరలోనే నామినేటెడ్ పోస్టుల భర్తీ.. కార్యకర్తల రుణం తీర్చుకుంటా: చంద్రబాబు
పార్టీ కోసం కష్టపడిన వారి కోసం త్వరలోనే నామినేటెడ్ పదవులన్నీ భర్తీ చేస్తానని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి ఆయన మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్కు వచ్చారు. -
కోడెలపై పెట్టిన కేసు జగన్ మీద కూడా పెట్టొచ్చు కదా!: శివరాం
ప్రజాధనంతో ఏర్పాటు చేసిన ఫర్నిచర్ను సొంతానికి వినియోగించుకుంటున్న మాజీ సీఎం జగన్పై కేసు నమోదు చేయాలని కోడెల శివరాం ఓ ప్రకటనలో కోరారు. -
ఆ మంత్రిత్వ శాఖలు నా మనసుకు దగ్గరగా ఉన్నాయి.. ప్రజలకు మేలు చేస్తా: పవన్
మంత్రివర్గంలో తనకు కేటాయించిన శాఖలు జనసేన మూల సిద్ధాంతాలకు, తన మనసుకు దగ్గరగా ఉన్నాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. -
తాడేపల్లిలో రహదారి వివాదం.. ఘోర పరాభవం తర్వాత కూడా మారని జగన్ తీరు
జగన్ క్యాంపు కార్యాలయం వద్ద ప్రజాధనంతో నిర్మించిన డబుల్ లేన్ రోడ్డును మాజీ సీఎం భద్రతా సిబ్బంది ప్రైవేట్ రహదారిగా మార్చేశారు. -
ప్రజలకు.. నాకు మధ్య అడ్డుగోడలు ఉండటానికి వీల్లేదు: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టాక తొలిసారి ఆయన మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో అడుగుపెట్టారు. -
ఎన్డీయే మైనార్టీ సర్కార్... అయితే కొనసాగాలి: ఖర్గే కీలక వ్యాఖ్యలు
Mallikarjun Kharge: కేంద్రంలో ఎన్డీయే సంకీర్ణ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. ఆ సర్కారుకు మెజార్టీ లేదన్నారు. -
మీ ముందు హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉండదు: కమిషన్కు కేసీఆర్ లేఖ
విద్యుత్ కొనుగోలు విషయంలో భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్కు వివరణ ఇచ్చారు. -
పుంగనూరులో మాజీమంత్రి పెద్దిరెడ్డికి నిరసన సెగ
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటిస్తారనే సమాచారం తెలుసుకున్న తెదేపా నాయకులు నిరసన వ్యక్తం చేశారు. -
వైకాపా ప్రభుత్వ పాలనలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయింది: హోంమంత్రి అనిత
వైకాపా ప్రభుత్వ పాలనలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయిందని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. -
భారీ మెజార్టీతో నాపై బాధ్యత మరింత పెరిగింది: ‘ప్రజా దర్బార్’లో లోకేశ్
మంగళగిరి ప్రజల కోసం ప్రజా దర్బార్ నిర్వహించినట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చాలా సేవా కార్యక్రమాలు చేశామన్నారు. -
క్యాబినెట్లో యువతకు ప్రాధాన్యాన్ని స్వాగతిస్తున్నాం: యనమల రామకృష్ణుడు
‘‘రాష్ట్ర మంత్రివర్గంలో యువతకు ప్రాధాన్యం కల్పిస్తూ పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఆయన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. రాష్ట్ర మంత్రివర్గం కూర్పులో 50% కంటే ఎక్కువమంది యువతకు మంత్రి పదవులు ఇచ్చారు’’ అని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. -
నాడు డీజీపీ కార్యాలయం గేటు బయటే అడ్డగించారు.. నేడు ప్రొటోకాల్తో లోపలికి..
‘‘మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై డీజీపీకి వినతిపత్రం ఇద్దామని వెళ్తే కార్యాలయం గేటు లోపలకు కూడా అనుమతించకుండా రోడ్డుపైనే అడ్డగించారు. హెడ్కానిస్టేబుల్కు ఇచ్చి వెళ్లిపోవాలంటూ జులుం చూపారు. ఇదే డీజీపీ కార్యాలయం లోపలకు ప్రొటోకాల్తో నన్ను తీసుకెళ్లే రోజు ఒకటి వస్తుందని అప్పుడే వారికి చెప్పా. -
ఐటీ కంపెనీలను తీసుకొచ్చి ఉపాధి కల్పిస్తా
రాష్ట్రానికి ఐటీ, ఎలక్ట్రానిక్ కంపెనీలను తీసుకొచ్చి పెద్ద ఎత్తున యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తానని రాష్ట్ర ఐటీ, హెచ్ఆర్డీ మంత్రి నారా లోకేశ్ హామీ ఇచ్చారు. స్టాన్ఫర్డ్లో చదువుకొన్న తనకు గ్రామీణ విద్యావ్యవస్థను బలోపేతం చేసే అవకాశం రావడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. -
సంపన్న రాష్ట్రంగా చేద్దాం
‘మంత్రివర్గంలో మీతోపాటు సహచర మంత్రులతో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా. ఎన్డీయే నాయకత్వంలో సమాజంలోని అన్ని వర్గాల పురోగతి, శ్రేయస్సు, సమ్మిళిత అభివృద్ధిని సాధించడానికి సమష్టిగా కృషి చేద్దాం. -
తెదేపా రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు?
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును నియమించే అవకాశముంది. ఆయన ఈ ఎన్నికల్లో రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ సాధించారు. -
గృహ నిర్మాణాల పూర్తికి కృషి చేస్తాం: మంత్రి పార్థసారథి వెల్లడి
అసంపూర్తిగా ఉన్న పేదల గృహ నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేసేందుకు కృషి చేస్తానని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచారశాఖ మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య సచివాలయంలో శాఖాపరమైన బాధ్యతలను శుక్రవారం రాత్రి స్వీకరించారు. -
జగన్పై చర్యలు తప్పవు: గోరంట్ల
వైకాపా అయిదేళ్ల పాలనలో జరిగిన అవినీతిని బయటకు తీస్తామని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. శుక్రవారం రాజమహేంద్రవరంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. -
పెద్దిరెడ్డి పాపాల నిగ్గు తేల్చాలి
అధికారాన్ని అడ్డం పెట్టుకొని గత ఐదేళ్లలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనేక అక్రమాలు.. అరాచకాలకు పాల్పడ్డారని బీసీవై పార్టీ అధ్యక్షుడు బి.రామచంద్రయాదవ్ ఆరోపించారు. -
పార్లమెంటులో ఎవరికైనా అంశాల వారీగా మద్దతు
‘పార్లమెంటులో ఎన్డీయే అయినా, ఇంకెవరికైనా అంశాలవారీగానే మన మద్దతు ఉంటుంది. పార్టీ విధివిధానాల ప్రకారం ఎంపీలు ముందుకు సాగాలి’ అని వైకాపా ఎంపీలకు ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ స్పష్టం చేశారు. ‘రాజ్యసభలో 11, లోక్సభలో 4 మొత్తంగా పార్లమెంటులో మనకు 15మంది ఎంపీలున్నారు. -
శాసనమండలి వద్దన్న వారికే.. నేడు ఆ వ్యవస్థతో అవసరం వచ్చింది
శాసనమండలి వద్దన్న వారికే నేడు ఆ వ్యవస్థతో అవసరం ఏర్పడిందని.. జగన్ను ఉద్దేశించి ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఎద్దేవా చేశారు. ప్రస్తుతం మండలి సభ్యులతోనే వారు సమావేశాలు నిర్వహించుకుంటున్నారని పేర్కొన్నారు. -
రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలి: వర్ల రామయ్య
శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారే సవిత మంత్రి పదవి దక్కించుకోవడం హర్షణీయమని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కళ్లల్లో కారం కొట్టి.. కర్రలతో దాడి చేసి.. ప్రొఫెసర్పై విద్యార్థుల దుశ్చర్య
-
56 బిలియన్ డాలర్ల వేతన ప్యాకేజీకి ఆమోదం.. సంతోషంలో మస్క్ డ్యాన్స్
-
తొలిసారి బయటకు కేట్ మిడిల్టన్.. క్యాన్సర్ చికిత్సపై భావోద్వేగ పోస్టు..!
-
భాజపాదీ ‘రిక్షా’ పరిస్థితే.. అసలైన పోరాటం ఇప్పుడే మొదలైంది: ఉద్ధవ్ ఠాక్రే
-
రాబోయే రోజుల్లో గన్నవరం నుంచి మరిన్ని విమాన సర్వీసులు: ఎంపీ బాలశౌరి
-
త్వరలోనే నామినేటెడ్ పోస్టుల భర్తీ.. కార్యకర్తల రుణం తీర్చుకుంటా: చంద్రబాబు