లద్దాఖ్లో హోరాహోరీ
కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్లో సార్వత్రిక సమరం రసవత్తరంగా సాగుతోంది. ఇక్కడ భాజపా, కాంగ్రెస్ మధ్యే ముఖాముఖి పోటీ ఉంటుందని తొలుత భావించగా.. స్థానికంగా గట్టి పట్టున్న ఓ గ్రూపు స్వతంత్ర అభ్యర్థిని బరిలో దించడంతో పోరు త్రిముఖంగా మారింది.
కాక పుట్టిస్తున్న త్రిముఖ పోరు
తాశీ గ్యాల్సన్ సెరింగ్ నామ్గ్యాల్
కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్లో సార్వత్రిక సమరం రసవత్తరంగా సాగుతోంది. ఇక్కడ భాజపా, కాంగ్రెస్ మధ్యే ముఖాముఖి పోటీ ఉంటుందని తొలుత భావించగా.. స్థానికంగా గట్టి పట్టున్న ఓ గ్రూపు స్వతంత్ర అభ్యర్థిని బరిలో దించడంతో పోరు త్రిముఖంగా మారింది. ఆరో షెడ్యూల్లో చేర్పు, రాష్ట్ర హోదా వంటి డిమాండ్లతో లద్దాఖ్ కొన్ని నెలలుగా అట్టుడుకుతున్న నేపథ్యంలో ఎన్నికల ఫలితం ఎలా ఉంటుందన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. లోక్సభ సమరం అయిదో దశలో భాగంగా ఈ నెల 20న ఇక్కడ పోలింగ్ జరగనుంది.
హ్యాట్రిక్పై భాజపా కన్ను
లద్దాఖ్లో గత రెండు లోక్సభ ఎన్నికల్లోనూ భాజపా గెలుపొందింది. హ్యాట్రిక్పై కన్నేసిన ఆ పార్టీ.. ఈసారి సిటింగ్ ఎంపీ జమ్యాంగ్ సెరింగ్ నామ్గ్యాల్ను తప్పించి, తాశీ గ్యాల్సన్కు టికెట్ ఇచ్చింది. గ్యాల్సన్ ప్రస్తుతం లద్దాఖ్ అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ (లేహ్) చీఫ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిలర్ - ఛైర్మన్గా ఉన్నారు. కాంగ్రెస్ సెరింగ్ నామ్గ్యాల్ అనే మరో నాయకుడికి (సిటింగ్ ఎంపీ కాదు) బరిలో దించింది. లద్దాఖ్ ప్రజల తరఫున పలు నిరసన కార్యక్రమాలను ముందుండి నడిపిస్తున్న కార్గిల్ డెమోక్రటిక్ అలియన్స్ (కేడీయే) హనీఫా జాన్ను పోటీలో నిలిపింది. విపక్ష ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షంగా ఉన్న నేషనల్ కాన్ఫెరెన్స్ (ఎన్సీ) ఇక్కడ కాంగ్రెస్కు మద్దతు ప్రకటించింది.
అతిపెద్ద నియోజకవర్గం
వైశాల్యం పరంగా దేశంలోకెల్లా అతిపెద్ద లోక్సభ నియోజకవర్గం లద్దాఖ్. 173.26 చదరపు కిలోమీటర్ల మేర ఇది విస్తరించి ఉంది. 2019లో జమ్మూకశ్మీర్ నుంచి విడిపోయి కేంద్రపాలిత ప్రాంతంగా అవతరించిన తర్వాత లద్దాఖ్లో జరుగుతున్న తొలి ప్రధాన ఎన్నికలు ఇవే. ఈ స్థానాన్ని అత్యధికంగా కాంగ్రెస్ ఆరుసార్లు గెల్చుకుంది. ఇక్కడ ఓటర్ల సంఖ్య 1.84 లక్షలకు పైగా ఉంది. వీరిలో 95 వేలమందికిపైగా.. ముస్లింల ప్రాబల్యం అధికంగా ఉండే కార్గిల్ జిల్లాలోనే ఉన్నారు.
నాలుగేళ్లుగా పోరుబాట
లద్దాఖ్ను పూర్తిస్థాయి రాష్ట్రంగా ఏర్పాటుచేయాలని స్థానికులు నాలుగేళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. తమ ప్రాంతాన్ని రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్లో చేర్చాలనీ కోరుతున్నారు. వారి డిమాండ్లను కేంద్ర సర్కారు ఈ ఏడాది మార్చిలో తిరస్కరించింది. అప్పటి నుంచి కేడీయే, లేహ్ అపెక్స్ బాడీ (ఎల్ఏబీ)ల నేతృత్వంలో స్థానికంగా నిరసనలు ఉద్ధృతమయ్యాయి. లేహ్లో మార్చి 6న పూర్తిస్థాయి బంద్ను పాటించారు. భాజపాపై వ్యతిరేకత పెరిగింది. టికెట్ రాకపోవడంతో తీవ్ర నిరాశకు గురైన సిటింగ్ ఎంపీ జామ్యాంగ్ సెరింగ్ నమ్గ్యేల్ అన్యమనస్కంగానే పార్టీ తరఫున ప్రచారంలో పాల్గొంటున్నారు. తాను గెలిస్తే.. స్థానికుల డిమాండ్ల సాధన దిశగా కేంద్రం, లద్దాఖ్ నాయకత్వం మధ్య చర్చల ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తానంటూ గ్యాల్సన్ ఓట్లు అడుగుతున్నారు. లద్దాఖ్ను ఆరో షెడ్యూల్లో చేరుస్తామంటూ కాంగ్రెస్ ఇచ్చిన హామీ తనను గెలిపిస్తుందని నామ్గ్యాల్ ధీమాగా చెబుతున్నారు. అయితే గతంలో రెండుసార్లు ఈ సీటును గెల్చుకున్న ఎన్సీ నుంచి హస్తం పార్టీకి ఆశించిన స్థాయిలో మద్దతు అందడం లేదు. కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతివ్వాలంటూ తమ అధినాయకత్వం ఒత్తిడి చేయడం కార్గిల్లో ఎన్సీ నేతలకు నచ్చలేదు. తిరుగుబావుటా ఎగరేసి మార్చి 6న పార్టీకి వారంతా రాజీనామా చేశారు. జాన్ ఎన్నికల బరిలో దిగడం కూడా కాంగ్రెస్కు ఇబ్బందే. స్థానికంగా మరో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ను ఉపసంహరించుకునేలా కేడీఏ ఒప్పించింది. లద్దాఖ్లో గతంలో మూడుసార్లు స్వతంత్రులు గెలుపొందడం జాన్కు సానుకూలాంశం.
బారాముల్లాలో నువ్వానేనా!
బరిలో ఒమర్ అబ్దుల్లా, సజ్జాద్ లోన్
ఉత్తర కశ్మీర్లోని బారాముల్లా లోక్సభ స్థానంలో నేషనల్ కాన్ఫెరెన్స్ అగ్రనేత ఒమర్ అబ్దుల్లా, పీపుల్స్ కాన్ఫెరెన్స్ అగ్ర నాయకుడు సజ్జాద్ లోన్ నువ్వానేనా అన్నట్టు తలపడుతున్నారు. వారికి మాజీ ఎమ్మెల్యే షేక్ అబ్దుల్ రషీద్ అలియాస్ ఇంజినీర్ రషీద్ గట్టి సవాలు విసురుతున్నారు. ఈ నియోజకవర్గంలో మే 20న పోలింగ్ జరగనుంది.
హోరాహోరీ సమరాలు
బారాముల్లాలో రాజకీయ చైతన్యం ఎక్కువే. వేర్పాటువాదం, ముష్కరుల దాడులు బాగా ఎక్కువగా ఉన్న రోజుల్లోనూ.. కశ్మీర్లోని మిగిలిన రెండు లోక్సభ నియోజకవర్గాలతో (శ్రీనగర్, అనంతనాగ్) పోలిస్తే ఇక్కడ పోలింగ్ శాతం అధికంగా నమోదవుతూ ఉండేది. బారాముల్లా, కుప్వాడా, బాందీపొరా, బడ్గామ్ జిల్లాల పరిధిలోని 18 అసెంబ్లీ సెగ్మెంట్లు ఈ లోక్సభ స్థానం పరిధిలోకి వస్తాయి. ఇక్కడ ఎన్నికలు ఎప్పుడూ హోరాహోరీగా సాగుతుంటాయి.
ప్రముఖుల పోటీతో ఉత్కంఠ
విపక్ష ఇండియా కూటమి ఈ స్థానాన్ని ఎన్సీకి కేటాయించింది. ఆ పార్టీ తరఫున బరిలో నిలిచిన ఒమర్ అబ్దుల్లాకు కాంగ్రెస్ మద్దతు పెద్ద సానుకూలాంశం. సజ్జాద్ లోన్కు భాజపాతో సన్నిహితంగా మెలిగే జమ్మూకశ్మీర్ అప్నీ పార్టీ వంటి పక్షాల మద్దతు ఉంది. ఒమర్, లోన్ పరస్పరం తీవ్ర విమర్శలు గుప్పించుకుంటూ ప్రచారాన్ని వేడెక్కిస్తున్నారు. ఒమర్ను రాజకీయ పర్యాటకుడిగా లోన్ పేర్కొంటుండగా.. లోన్ను భాజపా మనిషిగా ఒమర్ ఆరోపిస్తున్నారు.
సానుభూతిపై ఆశతో ఇంజినీర్ రషీద్
బారాముల్లా బరిలో ఉన్న మరో అభ్యర్థి ఇంజినీర్ రషీద్నూ తక్కువగా అంచనా వేయలేం. 2019 ఎన్నికల్లో ఆయన లక్షకుపైగా ఓట్లు దక్కించుకొని మూడో స్థానంలో నిలిచారు. నాడు పీడీపీ, కాంగ్రెస్ అభ్యర్థుల కంటే ఆయన ఖాతాలోనే ఎక్కువ ఓట్లు పడ్డాయి. ఉగ్ర నిధుల కేసులో అయిదేళ్ల కిందట అరెస్టయిన రషీద్ ప్రస్తుతం తిహాడ్ జైల్లో ఉన్నారు. స్థానికుల్లో ఆయనపై ఉన్న సానుభూతి ఓట్ల రూపంలోకి మారే అవకాశాలున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రషీద్ భారీగా ఓట్లు చీలిస్తే.. లోన్ లాభపడతారని అంచనా వేస్తున్నారు.
ఈనాడు ప్రత్యేక విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎవరూ చావు నోట్లో తల పెట్టి రాష్ట్రం తేలేదు
తెలంగాణ ఏర్పాటులో సోనియా గాంధీ గొప్పతనాన్ని అసెంబ్లీ మొదటి ప్రసంగంలో కేసీఆరే చెప్పారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చి పదేళ్లు పూర్తయిందని, రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోందని చెప్పారు. -
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభం
మహబూబ్నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. -
చంద్రబాబు రాకపోయినా వచ్చినట్లు తప్పుడు కథనం.. తెదేపా ఫిర్యాదు
మంగళగిరిలోని తెదేపా కార్యాలయంలో శుక్రవారం జరిగిన ప్రధాన కౌంటింగ్ ఏజెంట్ల సమావేశానికి తెదేపా అధినేత చంద్రబాబు హాజరు కాకపోయినా, హాజరైనట్లు ‘సాక్షి’లో తప్పుడు కథనం ప్రచురించడంపై ఆ పార్టీ నేతలు మండిపడ్డారు. -
తెదేపా ఏజెంటు వాహనానికి నిప్పు
వైఎస్సార్ జిల్లా కడప నగరంలోని శంకరాపురంలో తెదేపా ఏజెంట్ సిగిలి ప్రసాద్రెడ్డి ద్విచక్రవాహనానికి శుక్రవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. -
కూటమికే పీఠం!
అరాచకం... అభివృద్ధి మధ్య పోరుగా... రాజకీయంగా అత్యంత ఉత్కంఠ, ఉద్విగ్నత రేకెత్తించిన ఆంధ్రావని ఎన్నికల్లో తెదేపా-భాజపా-జనసేన ఎన్డీయే కూటమినే విజయం వరించబోతోందని ఎగ్జిట్పోల్స్ తేల్చాయి. -
ఆర్వోను బెదిరించినా చెవిరెడ్డిపై చర్యల్లేవు
ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు అత్యంత పవర్ఫుల్..! వారిని బెదిరించడం, అంతుచూస్తామనడం తీవ్రమైన నేరం..! ఆర్వోను ఒక అభ్యర్థి బెదిరిస్తే వెంటనే కేసు పెట్టి, అరెస్టు చేయాలి. -
పిన్నెల్లితో ప్రాణహాని.. హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వండి
మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్ జరుగుతున్న సమయంలో ఈవీఎంను ధ్వంసం చేసిన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అడ్డుకున్నందుకు తనపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని, ఈ నేపథ్యంలో ఆయన్నుంచి తనకు ప్రాణహాని ఉన్నందున హైకోర్టు ఆయనకు ఇచ్చిన ముందస్తు బెయిల్ రద్దుచేసి తనకు రక్షణ కల్పించాలని తెదేపా బూత్ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు సుప్రీంకోర్టుకు విన్నవించారు. -
విజయవాడ విమానాశ్రయంలో చంద్రబాబుకు ఘన స్వాగతం
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం తెదేపా కార్యకర్తలు చంద్రబాబునాయుడికి ఘనంగా స్వాగతం పలికారు. -
మంగళగిరిలో భారీ మద్యం డంప్
గుంటూరు జిల్లా మంగళగిరిలో వైకాపా నాయకుడి ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన మద్యాన్ని భారీ పరిమాణంలో సెబ్ అధికారులు శనివారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. -
సీఎస్ భూదోపిడీపై సీబీఐతో విచారణ చేయించాలి: వర్ల
విశాఖలో రూ.2 వేల కోట్ల విలువ చేసే పేదల భూముల దోపిడీ కుట్రలో కీలకపాత్రదారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి, ఆయన కుమారుడేనని..ఈ వ్యవహారాన్ని సీబీఐతో విచారణ చేయించాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. -
సంక్షిప్త వార్తలు (3)
ఎగ్జిట్పోల్స్ కూటమికి అనుకూలంగా రావడంతో తెదేపా ప్రధాన కార్యాలయంలో శనివారం రాత్రి కార్యకర్తలు మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. -
తెలంగాణలో మళ్లీ చీకట్లు మొదలు
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక దురదృష్టవశాత్తూ తెలంగాణలో మళ్లీ చీకట్లు మొదలయ్యాయి. కరెంట్ కోతలు నిత్యకృత్యమయ్యాయి అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. -
భారాస ఆధ్వర్యంలో అమరులకు నివాళి
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని భారాస ఆధ్వర్యంలో అమరులకు నివాళిగా కొవ్వొత్తులతో శనివారం భారీ ఊరేగింపు నిర్వహించారు. అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించిన అనంతరం భారీ ఊరేగింపు ప్రారంభమైంది. -
వాస్తవ ఫలితాలు ఎంతో భిన్నంగా ఉంటాయి
సార్వత్రిక ఎన్నికలపై ఎగ్జిట్పోల్స్ ఏం చెబుతున్నా వాస్తవ ఫలితాలు ఎంతో భిన్నంగా ఉంటాయని కాంగ్రెస్ పేర్కొంది. ‘జూన్ 4న నిష్క్రమించడం ఖాయమైన వ్యక్తి ఈ ఎగ్జిట్ పోల్స్ను సృష్టించారు. మానసికంగా ఆటాడుకునేందుకు ఇలా చేశారు. -
మాకు రికార్డుస్థాయి మద్దతు
ఓటర్లతో మమేకం కావడంలో అవకాశవాద ఇండియా కూటమి విఫలమైందని, వాటి తిరోగామి రాజకీయాలకు తిరస్కరణ ఎదురైందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ప్రజలు ఎన్డీయే కూటమికి రికార్డు స్థాయిలో మద్దతుగా నిలిచారని పేర్కొన్నారు. -
పూర్తయిన సార్వత్రిక సమరం
సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసింది. దాదాపు రెండున్నర నెలలుగా దేశవ్యాప్తంగా నెలకొన్న సందడికి తెరపడింది. ఓట్ల లెక్కింపుపైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. హ్యాట్రిక్ కోసం ఆరాటపడుతున్న ఎన్డీయే విజయం సాధిస్తుందా, మిత్రపక్షాలతో కలిసి ఇండియా కూటమి గెలుస్తుందా అనేది ఈ నెల 4న తేలనుంది. -
ఇండియా కూటమికి 295కు పైగా సీట్లు ఖాయం
సార్వత్రిక ఎన్నికల్లో విపక్ష ఇండియా కూటమి 295కు పైగా ఎంపీ స్థానాలను గెల్చుకుని కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ధీమా వ్యక్తం చేశారు. దిల్లీలోని ఖర్గే నివాసంలో కూటమి నేతలు శనివారం సమావేశమయ్యారు. -
ఓటరే అసలైన విజేత.. ఎన్నికల సంఘం
సార్వత్రిక సమరాన్ని విజయవంతం చేశారంటూ ఓటర్లకు కేంద్ర ఎన్నికల సంఘం సవినయంగా కృతజ్ఞతలు తెలిపింది. అనేక సవాళ్లు, సందేహాలను అధిగమించి వారంతా స్పందించడంపై ఒక ప్రకటన విడుదల చేసింది. ఓటరే అసలైన విజేత అని అభివర్ణించింది. -
దిల్లీ సీఎంకు అంబులెన్సు పంపిన భాజపా నేత గోయెల్
తాను తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నానంటూ కేజ్రీవాల్ పేర్కొనడంతో వైద్య పరీక్షల నిమిత్తం ఆయన్ను ఆస్పత్రికి తరలించేందుకు భాజపా నేత విజయ్ గోయెల్ శనివారం కేజ్రీవాల్ నివాసానికి అంబులెన్సు పంపారు. -
ఓట్ల లెక్కింపునకు 49 మంది పరిశీలకులు
‘‘లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపును పర్యవేక్షించేందుకు 49 మంది పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణకు కేటాయించింది. పరిశీలకుల ఆమోదం తర్వాతే ఫలితాలు ప్రకటిస్తారు. 2,414 మంది సూక్ష్మ పరిశీలకులను కూడా నియమించాం. -
తెలంగాణలో భాజపాకు రెండంకెల సీట్లు ఖాయం!
లోక్సభ ఎన్నికల్లో భాజపాకు రాష్ట్రంలో అనుకున్నదాని కంటే మంచి ఫలితాలు వస్తాయని భాజపా నేతలు అభిప్రాయపడ్డారు. పార్టీ లోక్సభ ఎన్నికల రాష్ట్ర ఇన్ఛార్జి అభయ్ పాటిల్ శనివారం సాయంత్రం ఎంపీ అభ్యర్థులతో భాజపా రాష్ట్ర కార్యాలయంలో సమావేశమయ్యారు.