లద్దాఖ్లో హోరాహోరీ
కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్లో సార్వత్రిక సమరం రసవత్తరంగా సాగుతోంది. ఇక్కడ భాజపా, కాంగ్రెస్ మధ్యే ముఖాముఖి పోటీ ఉంటుందని తొలుత భావించగా.. స్థానికంగా గట్టి పట్టున్న ఓ గ్రూపు స్వతంత్ర అభ్యర్థిని బరిలో దించడంతో పోరు త్రిముఖంగా మారింది.
కాక పుట్టిస్తున్న త్రిముఖ పోరు
తాశీ గ్యాల్సన్ సెరింగ్ నామ్గ్యాల్
కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్లో సార్వత్రిక సమరం రసవత్తరంగా సాగుతోంది. ఇక్కడ భాజపా, కాంగ్రెస్ మధ్యే ముఖాముఖి పోటీ ఉంటుందని తొలుత భావించగా.. స్థానికంగా గట్టి పట్టున్న ఓ గ్రూపు స్వతంత్ర అభ్యర్థిని బరిలో దించడంతో పోరు త్రిముఖంగా మారింది. ఆరో షెడ్యూల్లో చేర్పు, రాష్ట్ర హోదా వంటి డిమాండ్లతో లద్దాఖ్ కొన్ని నెలలుగా అట్టుడుకుతున్న నేపథ్యంలో ఎన్నికల ఫలితం ఎలా ఉంటుందన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. లోక్సభ సమరం అయిదో దశలో భాగంగా ఈ నెల 20న ఇక్కడ పోలింగ్ జరగనుంది.
హ్యాట్రిక్పై భాజపా కన్ను
లద్దాఖ్లో గత రెండు లోక్సభ ఎన్నికల్లోనూ భాజపా గెలుపొందింది. హ్యాట్రిక్పై కన్నేసిన ఆ పార్టీ.. ఈసారి సిటింగ్ ఎంపీ జమ్యాంగ్ సెరింగ్ నామ్గ్యాల్ను తప్పించి, తాశీ గ్యాల్సన్కు టికెట్ ఇచ్చింది. గ్యాల్సన్ ప్రస్తుతం లద్దాఖ్ అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ (లేహ్) చీఫ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిలర్ - ఛైర్మన్గా ఉన్నారు. కాంగ్రెస్ సెరింగ్ నామ్గ్యాల్ అనే మరో నాయకుడికి (సిటింగ్ ఎంపీ కాదు) బరిలో దించింది. లద్దాఖ్ ప్రజల తరఫున పలు నిరసన కార్యక్రమాలను ముందుండి నడిపిస్తున్న కార్గిల్ డెమోక్రటిక్ అలియన్స్ (కేడీయే) హనీఫా జాన్ను పోటీలో నిలిపింది. విపక్ష ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షంగా ఉన్న నేషనల్ కాన్ఫెరెన్స్ (ఎన్సీ) ఇక్కడ కాంగ్రెస్కు మద్దతు ప్రకటించింది.
అతిపెద్ద నియోజకవర్గం
వైశాల్యం పరంగా దేశంలోకెల్లా అతిపెద్ద లోక్సభ నియోజకవర్గం లద్దాఖ్. 173.26 చదరపు కిలోమీటర్ల మేర ఇది విస్తరించి ఉంది. 2019లో జమ్మూకశ్మీర్ నుంచి విడిపోయి కేంద్రపాలిత ప్రాంతంగా అవతరించిన తర్వాత లద్దాఖ్లో జరుగుతున్న తొలి ప్రధాన ఎన్నికలు ఇవే. ఈ స్థానాన్ని అత్యధికంగా కాంగ్రెస్ ఆరుసార్లు గెల్చుకుంది. ఇక్కడ ఓటర్ల సంఖ్య 1.84 లక్షలకు పైగా ఉంది. వీరిలో 95 వేలమందికిపైగా.. ముస్లింల ప్రాబల్యం అధికంగా ఉండే కార్గిల్ జిల్లాలోనే ఉన్నారు.
నాలుగేళ్లుగా పోరుబాట
లద్దాఖ్ను పూర్తిస్థాయి రాష్ట్రంగా ఏర్పాటుచేయాలని స్థానికులు నాలుగేళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. తమ ప్రాంతాన్ని రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్లో చేర్చాలనీ కోరుతున్నారు. వారి డిమాండ్లను కేంద్ర సర్కారు ఈ ఏడాది మార్చిలో తిరస్కరించింది. అప్పటి నుంచి కేడీయే, లేహ్ అపెక్స్ బాడీ (ఎల్ఏబీ)ల నేతృత్వంలో స్థానికంగా నిరసనలు ఉద్ధృతమయ్యాయి. లేహ్లో మార్చి 6న పూర్తిస్థాయి బంద్ను పాటించారు. భాజపాపై వ్యతిరేకత పెరిగింది. టికెట్ రాకపోవడంతో తీవ్ర నిరాశకు గురైన సిటింగ్ ఎంపీ జామ్యాంగ్ సెరింగ్ నమ్గ్యేల్ అన్యమనస్కంగానే పార్టీ తరఫున ప్రచారంలో పాల్గొంటున్నారు. తాను గెలిస్తే.. స్థానికుల డిమాండ్ల సాధన దిశగా కేంద్రం, లద్దాఖ్ నాయకత్వం మధ్య చర్చల ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తానంటూ గ్యాల్సన్ ఓట్లు అడుగుతున్నారు. లద్దాఖ్ను ఆరో షెడ్యూల్లో చేరుస్తామంటూ కాంగ్రెస్ ఇచ్చిన హామీ తనను గెలిపిస్తుందని నామ్గ్యాల్ ధీమాగా చెబుతున్నారు. అయితే గతంలో రెండుసార్లు ఈ సీటును గెల్చుకున్న ఎన్సీ నుంచి హస్తం పార్టీకి ఆశించిన స్థాయిలో మద్దతు అందడం లేదు. కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతివ్వాలంటూ తమ అధినాయకత్వం ఒత్తిడి చేయడం కార్గిల్లో ఎన్సీ నేతలకు నచ్చలేదు. తిరుగుబావుటా ఎగరేసి మార్చి 6న పార్టీకి వారంతా రాజీనామా చేశారు. జాన్ ఎన్నికల బరిలో దిగడం కూడా కాంగ్రెస్కు ఇబ్బందే. స్థానికంగా మరో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ను ఉపసంహరించుకునేలా కేడీఏ ఒప్పించింది. లద్దాఖ్లో గతంలో మూడుసార్లు స్వతంత్రులు గెలుపొందడం జాన్కు సానుకూలాంశం.
బారాముల్లాలో నువ్వానేనా!
బరిలో ఒమర్ అబ్దుల్లా, సజ్జాద్ లోన్
ఉత్తర కశ్మీర్లోని బారాముల్లా లోక్సభ స్థానంలో నేషనల్ కాన్ఫెరెన్స్ అగ్రనేత ఒమర్ అబ్దుల్లా, పీపుల్స్ కాన్ఫెరెన్స్ అగ్ర నాయకుడు సజ్జాద్ లోన్ నువ్వానేనా అన్నట్టు తలపడుతున్నారు. వారికి మాజీ ఎమ్మెల్యే షేక్ అబ్దుల్ రషీద్ అలియాస్ ఇంజినీర్ రషీద్ గట్టి సవాలు విసురుతున్నారు. ఈ నియోజకవర్గంలో మే 20న పోలింగ్ జరగనుంది.
హోరాహోరీ సమరాలు
బారాముల్లాలో రాజకీయ చైతన్యం ఎక్కువే. వేర్పాటువాదం, ముష్కరుల దాడులు బాగా ఎక్కువగా ఉన్న రోజుల్లోనూ.. కశ్మీర్లోని మిగిలిన రెండు లోక్సభ నియోజకవర్గాలతో (శ్రీనగర్, అనంతనాగ్) పోలిస్తే ఇక్కడ పోలింగ్ శాతం అధికంగా నమోదవుతూ ఉండేది. బారాముల్లా, కుప్వాడా, బాందీపొరా, బడ్గామ్ జిల్లాల పరిధిలోని 18 అసెంబ్లీ సెగ్మెంట్లు ఈ లోక్సభ స్థానం పరిధిలోకి వస్తాయి. ఇక్కడ ఎన్నికలు ఎప్పుడూ హోరాహోరీగా సాగుతుంటాయి.
ప్రముఖుల పోటీతో ఉత్కంఠ
విపక్ష ఇండియా కూటమి ఈ స్థానాన్ని ఎన్సీకి కేటాయించింది. ఆ పార్టీ తరఫున బరిలో నిలిచిన ఒమర్ అబ్దుల్లాకు కాంగ్రెస్ మద్దతు పెద్ద సానుకూలాంశం. సజ్జాద్ లోన్కు భాజపాతో సన్నిహితంగా మెలిగే జమ్మూకశ్మీర్ అప్నీ పార్టీ వంటి పక్షాల మద్దతు ఉంది. ఒమర్, లోన్ పరస్పరం తీవ్ర విమర్శలు గుప్పించుకుంటూ ప్రచారాన్ని వేడెక్కిస్తున్నారు. ఒమర్ను రాజకీయ పర్యాటకుడిగా లోన్ పేర్కొంటుండగా.. లోన్ను భాజపా మనిషిగా ఒమర్ ఆరోపిస్తున్నారు.
సానుభూతిపై ఆశతో ఇంజినీర్ రషీద్
బారాముల్లా బరిలో ఉన్న మరో అభ్యర్థి ఇంజినీర్ రషీద్నూ తక్కువగా అంచనా వేయలేం. 2019 ఎన్నికల్లో ఆయన లక్షకుపైగా ఓట్లు దక్కించుకొని మూడో స్థానంలో నిలిచారు. నాడు పీడీపీ, కాంగ్రెస్ అభ్యర్థుల కంటే ఆయన ఖాతాలోనే ఎక్కువ ఓట్లు పడ్డాయి. ఉగ్ర నిధుల కేసులో అయిదేళ్ల కిందట అరెస్టయిన రషీద్ ప్రస్తుతం తిహాడ్ జైల్లో ఉన్నారు. స్థానికుల్లో ఆయనపై ఉన్న సానుభూతి ఓట్ల రూపంలోకి మారే అవకాశాలున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రషీద్ భారీగా ఓట్లు చీలిస్తే.. లోన్ లాభపడతారని అంచనా వేస్తున్నారు.
ఈనాడు ప్రత్యేక విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు