సంక్షిప్త వార్తలు
రాష్ట్రంలో ఎన్నికల అనంతరం జరుగుతున్న బదిలీలు.. వివక్షపూరితంగా జరుగుతున్నాయని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, విశ్రాంత ఐఏఎస్ అధికారి విజయ్కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.
బదిలీల్లో ఎస్సీ, ఎస్టీ అధికారులే బలవుతున్నారు
ఈనాడు డిజిటల్, అమరావతి: రాష్ట్రంలో ఎన్నికల అనంతరం జరుగుతున్న బదిలీలు.. వివక్షపూరితంగా జరుగుతున్నాయని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, విశ్రాంత ఐఏఎస్ అధికారి విజయ్కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా.. దానికి ఎస్సీ, ఎస్టీ అధికారులే బలవుతున్నారని ఆదివారం ఓ ప్రకటనలో మండిపడ్డారు. ‘పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ను మార్చడానికి కారణాలేంటో చెప్పాలి. మార్చిలో ఎన్నికల కమిషన్ బదిలీ చేసిన నలుగురిలో ముగ్గురు ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన కలెక్టర్లే ఉన్నారు. శివశంకర్ను తిరిగి పల్నాడులో కొనసాగించాలి’ అని ఆయన డిమాండు చేశారు.
సిట్తో ఒరిగేదేమీ లేదు: నారాయణ
గుంటూరు (నెహ్రూనగర్) న్యూస్టుడే: ఎన్నికల అనంతరం రాష్ట్రంలో చోటుచేసుకున్న ఘర్షణలకు పూర్తి బాధ్యత వైకాపా పాలకులదే అని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఆరోపించారు. గుంటూరులోని సీపీఐ కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ఓడిపోతామనే భయంతోనే వైకాపా నేతలు దాడులకు పాల్పడ్డారన్నారు. దాడులను నియంత్రించడంలో నిఘా, పోలీసు విభాగాలు, ఎన్నికల కమిషన్ విఫలమయ్యాయని.. దీని కోసం నియమించిన సిట్తో ఒరిగేదేమీ లేదన్నారు. దేశం, రాష్ట్రంలో రాజకీయ మార్పు తథ్యమని.. ప్రజావ్యతిరేక పాలన చేస్తున్న ఆయా ప్రభుత్వాలు గద్దెదిగడం ఖాయమన్నారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు పాల్గొన్నారు.
సీఎంను కలిసిన కడియం కుటుంబసభ్యులు
వరంగల్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వారి కుటుంబ సభ్యులు ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని హైదరాబాద్లోని ఆయన నివాసంలో కలిశారు. చిత్రంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్రెడ్డి ఉన్నారు. -
ఈనాడు, హైదరాబాద్
దిల్లీ మద్యం కేసులో దోషులు తప్పించుకోలేరు
భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రభాకర్
ఈనాడు, దిల్లీ: దిల్లీ మద్యం కేసు నుంచి దోషులెవరూ తప్పించుకోలేరని భాజపా తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ పేర్కొన్నారు. ఆయన ఆదివారం దిల్లీలోని తెలంగాణ భవన్లో విలేకర్లతో మాట్లాడారు. ‘‘కొంత మంది వ్యక్తులకు ప్రయోజనం చేకూర్చడానికే దిల్లీ మద్యం విధానాన్ని రూపొందించారు. ఆధారాలు లేకుండా కవితను అరెస్ట్ చేశారన్న భారాస తప్పుడు ఆరోపణలను ఖండిస్తున్నా’’ అని ప్రభాకర్ పేర్కొన్నారు.
దేశంలో ఉగ్రవాదాన్ని పెంచిన 370 అధికరణం
జమ్మూకశ్మీర్కు స్వయంప్రతిపత్తి కల్పించే 370 అధికరణాన్ని కాంగ్రెస్ పార్టీ 70 ఏళ్లపాటు కాపాడుతూ రావడంతోనే దేశంలో ఉగ్రవాదం పెరిగింది. మోదీని ప్రజలు రెండోసారి ప్రధానిని చేయగానే ఆయన ఈ అధికరణాన్ని రద్దుచేశారు. ఒకసారి జరిగిన విభజన చాలదన్నట్లు దేశాన్ని ఉత్తరాది, దక్షిణాదిగా విభజించాలని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. దీనిని భాజపా ఎప్పటికీ అనుమతించదు.
యూపీలోని జౌన్పుర్, ప్రయాగ్రాజ్ సభల్లో కేంద్రమంత్రి అమిత్షా
370 రద్దును ప్రజలు వ్యతిరేకిస్తున్నారు
370 అధికరణం రద్దును ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. మా సభలకు లభిస్తున్న స్పందనే దానికి నిదర్శనం. 2018 నుంచి ప్రజా ప్రభుత్వం లేక సమస్యలన్నీ అపరిష్కృతంగా ఉన్నాయి. కశ్మీర్కు ఇచ్చిన ఏ హామీనీ భాజపా నెరవేర్చలేకపోయింది. మా పార్టీని దెబ్బతీయడం లక్ష్యంగా ఇప్పుడు ఇక్కడ జోడుగుర్రాలపై స్వారీ చేస్తోంది.
పీటీఐ ఇంటర్వ్యూలో నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా
కాంగ్రెస్ ప్రధానులు పేదరికాన్ని నిర్మూలించలేకపోయారు
ప్రధానులుగా ఉన్న జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్గాంధీ, మన్మోహన్సింగ్లలో ఎవరూ దేశంలో పేదరికాన్ని నిర్మూలించలేకపోయారు. అంతమంది విఫలమైన పనిని మోదీ చేసి చూపించారు. 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తెచ్చారు. రామ్లల్లా తన ఆలయానికి చేరుకోవడంతో దేశంలో రామరాజ్యం నెలకొంది.
ఒడిశాలోని సంబల్పుర్లో రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్
మతం ఆధారంగా మేం మైనారిటీలకు రిజర్వేషన్లు ఇవ్వలేదు
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటక వంటి రాష్ట్రాల్లో కొన్ని మైనారిటీ వర్గాలకు రిజర్వేషన్లు ఇచ్చినా అది మత ప్రాతిపదికన కాదు. సామాజిక, ఆర్థిక వెనుకబాటుతనం ఆధారంగానే వాటిని ఇచ్చాం. మతం ఆధారంగా రిజర్వేషన్లు, పౌరసత్వం ఇవ్వకూడదన్న రాజ్యాంగానికి మేమంతా కట్టుబడి ఉన్నాం. భాజపా మాత్రం మత ప్రాతిపదికన పౌరసత్వం ఇస్తూ రాజ్యాంగాన్ని ఉల్లంఘించింది.
పట్నాలో విలేకరుల సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్
నిరుద్యోగుల్లో 83% మంది యువతే
ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన హామీల్లో అనేకం నెరవేరలేదు. దేశంలో నిరుద్యోగుల్లో 83% మంది యువతే. విద్యావంతులైన యువతీయువకుల్లో మూడింట రెండొంతుల మందికి ఉద్యోగాల్లేవు. స్కిల్ ఇండియా పథకం విఫలమైంది. ప్రతిరోజూ 30 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పదేళ్లలో దేశం అప్పు రెట్టింపు అయింది.
కోల్కతాలో మీడియాతో తృణమూల్ సీనియర్ నేత అమిత్ మిత్రా
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా హయాంలో రూ.9.74 లక్షల కోట్ల అప్పులు చేశారు: ఏపీ సీఎం చంద్రబాబు
2014-19 మధ్య పెట్టుబడులకు చిరునామాగా ఆంధ్రప్రదేశ్ను నిలిపామని సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. -
గోదావరిలో నీరుంది.. కానీ ప్రభుత్వానికి ఇచ్చే మనసు లేదు: కేటీఆర్
తెలంగాణలో కరవు అనే మాట వినపడకూడదని కేసీఆర్.. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
వైకాపా హయాంలో ప్రకటనల కుంభకోణం.. హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేల డిమాండ్
వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రకటనల కుంభకోణంపై హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. -
ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.. మంత్రులకు చంద్రబాబు సూచన
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించడం... వంటి మంచి పనుల్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. -
సకుటుంబ సమేతంగా కేసులు.. అక్రమ కేసులున్నవారు నిలబడాలని కోరిన చంద్రబాబు
వివాహాలు, ఇతర శుభకార్యాలకు సకుటుంబ సపరివార సమేతంగా రావాలని ఆహ్వానిస్తుంటాం.. అయితే గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలపై సకుటుంబ సమేతంగా అక్రమ కేసులు నమోదు చేసి వేధించారని చంద్రబాబు, ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. శ్వేతపత్రం విడుదల సందర్భంగా.. వైకాపా ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలపై నమోదైన అక్రమ కేసుల సంఖ్యను చంద్రబాబు ప్రస్తావించారు. -
ఏపీ ‘ఎస్కోబార్’ జగన్.. చీకటి సామ్రాజ్యాధిపతితో పోల్చిన చంద్రబాబు
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అరాచకాలను వివరించేటప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కొలంబియన్ మాదకద్రవ్యాల చీకటి సామ్రాజ్యాధిపతి పాబ్లో ఎమిలియో ఎస్కోబార్ చరిత్రను సభకు వినిపించారు. -
‘రఘురామను చిత్రహింసలు పెట్టినప్పుడు మీరంతా ఏమయ్యారు?’
మాజీ ముఖ్యమంత్రి జగన్ దిల్లీలో చేసిన నిరసనకు ఇండియా కూటమి నాయకులు మద్దతు పలకడాన్ని అనంతపురం తెదేపా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. -
అన్ని వర్గాలకూ మోసం
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలనూ మోసం చేసిందని, అందర్నీ వెన్నుపోటు పొడిచిందని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. -
శాంతిభద్రతల పరిరక్షణపై సభలో చర్చిద్దాం
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు.. రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలపై శాసనసభలో ఒక రోజు పూర్తిగా చర్చించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు. -
ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని దోచేశారు
‘వైకాపా ప్రభుత్వం చేసిన నిర్వాకాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు విద్యుత్తు, అమరావతి, పోలవరం, గనులు, మద్యంపై శ్వేతపత్రాలు విడుదల చేశారు. -
వైకాపా ప్రభుత్వం ఇళ్లు కూల్చింది.. ఆదుకోండి
తెదేపాకు అనుకూలంగా ఉన్నారని విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం దన్నానపేట గ్రామానికి చెందిన 30 మంది దళితుల ఇళ్లను అప్పటి వైకాపా ప్రభుత్వం కూల్చేసిందని ఆ మండల తెదేపా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు టొంపల నర్సయ్య గురువారం తెదేపా కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. -
వైకాపా పాలనలో తెదేపా శ్రేణులపై 2,560 కేసులు
వైకాపా హయాంలో గత ఐదేళ్లలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై 2,560 కేసులు నమోదు చేసి.. 2,370 మందిని అరెస్టు చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. -
ఇసుక, మద్యం అవినీతిపై విచారణ జరిపించాలి
ముఖ్యమంత్రి చంద్రబాబును రాష్ట్ర సచివాలయంలో గురువారం సీపీఎం నాయకులు కలిశారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. -
సమస్యలపై ప్రశ్నిస్తే.. వేధింపులే సమాధానం
శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం విడుదల చేసిన ‘శాంతిభద్రతల శ్వేతపత్రం’పై కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వేదికగా మాట్లాడారు. -
‘ఇండియా’ కూటమితో పొత్తు కోసమే జగన్ దిల్లీ యాత్ర
‘ఇండియా’ కూటమితో పొత్తు కోసమే వైకాపా అధ్యక్షుడు జగన్ దిల్లీ వెళ్లినట్లుగా ఉందని ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. దిల్లీ నుంచి అమరావతి చేరుకున్న జగన్... శాసనసభ సమావేశాలకు హాజరు కావాలని సూచించారు. -
ఇది పసలేని దండగమారి బడ్జెట్: కేటీఆర్
రాష్ట్ర ప్రభుత్వం పసలేని, దండగమారి బడ్జెట్ ప్రవేశపెట్టిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ప్రజల ఆకాంక్షలు పట్టించుకోకుండా ఆంక్షల పద్దు పెట్టారని అన్నారు. -
సంక్షిప్త వార్తలు (4)
బడ్జెట్లో అధిక కేటాయింపుల ద్వారా.. తమది రైతు ప్రభుత్వమని మరోసారి నిరూపించుకున్నట్లయిందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అన్నారు. -
ఫైళ్ల దహనంతో మాకు సంబంధం లేదు: వైకాపా ఎంపీ మిథున్రెడ్డి
మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో జరిగిన రెవెన్యూ దస్త్రాల దహనం ఘటనతో తమకెలాంటి సంబంధం లేదని వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి పేర్కొన్నారు. -
గాజులదిన్నె ప్రాజెక్టు పనులపై విచారణ చేపడతాం: మంత్రి నిమ్మల
సంజీవయ్య గాజులదిన్నె ప్రాజెక్టు పనులపై విచారణ చేపడతామని జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. -
రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతీయడానికే జగన్ దిల్లీ నిరసన: హోంమంత్రి అనిత
రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతీయడానికే మాజీ సీఎం జగన్ దిల్లీలో నిరసన పేరుతో చౌకబారు ఆరోపణలు చేశారని హోంమంత్రి అనిత మండిపడ్డారు. 36 రాజకీయ హత్యలు జరిగాయని నిస్సిగ్గుగా మాట్లాడారని ధ్వజమెత్తారు. -
వరద బాధిత రైతులను తక్షణమే ఆదుకోవాలి
కోస్తా జిల్లాల్లోని వరద బాధిత రైతులకు తక్షణమే నష్టపరిహారం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల గురువారం లేఖ రాశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఆధ్వర్యంలో క్వాడ్ సదస్సుకు బైడెన్ హాజరవుతారు: శ్వేత సౌధం
-
రివ్యూ: ‘రాయన్’.. ధనుష్ 50వ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా?
-
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
-
యశ్ ‘టాక్సిక్’లో బాలీవుడ్ భామ.. ఆ విషయం తాను చెప్పలేదంటూ పోస్ట్
-
ఎవరినీ కించపరచడం మా ఉద్దేశం కాదు.. ‘డబుల్ ఇస్మార్ట్’ పాటపై మణిశర్మ క్లారిటీ
-
కార్గిల్ పోరు వేళ యుద్ధ భూమిలో మోదీ.. పాతికేళ్ల నాటి ఫొటోలు వైరల్