‘కళింగ’ కదన కుతూహలం!
నువ్వా నేనా అన్నట్లు సాగుతున్న కళింగ గడ్డ ఒడిశాలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల పోరు కీలక దశకు చేరుకుంది. నేడు 5 లోక్సభ సీట్లు, 35 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలింగ్ జరగనుంది.
సీఎం నవీన్ పట్నాయక్కు భాజపా సవాల్
మధ్యలో ఇండియా కూటమి
5 లోక్సభ, 35 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నేడే పోలింగ్
భువనేశ్వర్ - న్యూస్టుడే
నువ్వా నేనా అన్నట్లు సాగుతున్న కళింగ గడ్డ ఒడిశాలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల పోరు కీలక దశకు చేరుకుంది. నేడు 5 లోక్సభ సీట్లు, 35 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలింగ్ జరగనుంది. బిజూ జనతాదళ్ (బిజద) అధినేత, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ (అసెంబ్లీకి), 5 సార్లు ఎంపీగా గెలిచిన భాజపా నేత జుయెల్ ఓరం (లోక్సభకు) ఈ విడత బరిలో నిలిచారు. అస్కా, కంధమాల్, సుందర్గఢ్, బరగఢ్, బొలంగీర్ లోక్సభ స్థానాలకు, వాటి పరిధిలోని అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి బిజద, భాజపాల మధ్య తీవ్ర పోరు సాగుతుండగా ఇండియా కూటమి గట్టి పోటీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది.
ఇనుము, సున్నపురాయిల గని
ఒడిశా పశ్చిమ ప్రాంతంలో ఉన్న సుందర్గఢ్ నియోజకవర్గంలో ఇనుప, సున్నపురాయి, మాంగనీస్ గనులు అధికంగా ఉంటాయి. ఇనుము, ఎరువులు, సిమెంటు, గ్లాస్ వంటి కర్మాగారాలకు ప్రసిద్ధి. పాక్షిక పట్టణ ప్రాంతంగా ఉన్న ఈ నియోజకవర్గం ఎస్టీలకు రిజర్వు అయింది. గతంలో ఇక్కడ కాంగ్రెస్, భాజపా, జనతాదళ్ గెలిచాయి. బిజద ఒక్కసారీ గెలవలేదు.
2014, 2019లలో భాజపా నేత, కేంద్ర మాజీ మంత్రి జుయెల్ ఓరం ఇక్కడి నుంచి గెలిచారు. మరోసారి ఆయనే పోటీ చేస్తున్నారు. ఆయన పోటీ చేయడం ఇది ఆరోసారి. గతంలో పోటీ చేసిన ఐదుసార్లూ గెలిచారు. రాజ్యసభ మాజీ సభ్యుడు, హాకీ జట్టు మాజీ కెప్టెన్ దిలీప్ తిర్కీ బిజద తరఫున పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి జనార్దన్ దెహురి బరిలో ఉన్నారు. గతంలో కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచినా ఈసారి పోటీ భాజపా, బిజద మధ్యే సాగుతోంది.
సాంస్కృతిక వారసత్వ కేంద్రం
ఒడిశాలోని బొలంగీర్ సాంస్కృతిక వారసత్వ కేంద్రం. దేశంలో ప్రముఖ పర్యాటక క్షేత్రం. ఈ నియోజకవర్గంలో అక్షరాస్యత 65.5 శాతం. 12శాతం మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తారు. 98శాతం హిందువులే ఉంటారు. ఎస్సీలు 18%, ఎస్టీలు 21% ఉంటారు. 1998లో భాజపా ఇక్కడ ఖాతా తెరిచింది. రాజ కుటుంబానికి చెందిన సంగీత కుమారి సింగ్దేవ్ పలుమార్లు విజయం సాధించారు. ఇక్కడ నీటి కొరత, వలసలు, మావోయిస్టుల ప్రభావం ప్రధాన సమస్యలు.
2014లో బిజద, 2019లో భాజపా ఇక్కడ గెలిచాయి. ఈసారి రాణి, సిటింగ్ ఎంపీ సంగీత కుమారి సింగ్దేవ్ ఐదోసారి భాజపా అభ్యర్థిగా బరిలో ఉన్నారు. మాజీ మంత్రి సురేంద్ర సింగ్ భొయ్ బిజద అభ్యర్థి. ఒడియా సినీ నటుడు మనోజ్ మిశ్ర కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు. తన ఓటు షేరును పెంచుకోవాలని భాజపా, 2014 విజయాన్ని పునరావృతం చేయాలని బిజద ప్రయత్నిస్తున్నాయి. సంగీత భారీగా ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ఎన్నికల తర్వాత ఆమె నియోజకవర్గంలో కనిపించరనే విమర్శ ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి ఇద్దరి ఓట్లను చీల్చే అవకాశముంది.
తీర ప్రాంతం
ఒడిశా తీర ప్రాంత నియోజకవర్గం అస్కా. గంజాం జిల్లా దీని పరిధిలోకే వస్తుంది. అతి పురాతన సహకార చక్కెర కర్మాగారం ఈ ప్రాంతంలో ఉంది. ఇక్కడ గతంలో కాంగ్రెస్, సీపీఐ. జనతాదళ్ గెలిచాయి. నవీన్ పట్నాయక్ తండ్రి బిజూ పట్నాయక్ గతంలో ఇక్కడి నుంచి విజయం సాధించారు. నవీన్ పట్నాయక్ ఒకసారి గెలిచారు.
2014, 2019లలో అస్కా నుంచి బిజద విజయం సాధించింది. తనకు బాగా పట్టున్న ఈ నియోజకవర్గంలో ఈసారి భాజపా గట్టి పోటీ ఇస్తోంది. బిజద అభ్యర్థిగా రంజితా సాహు, భాజపా తరఫున అనితా శుభదర్శిని, కాంగ్రెస్ నుంచి దేబకాంత శర్మ బరిలో ఉన్నారు. ముఖ్యమంత్రి పోటీ చేస్తున్న అసెంబ్లీ నియోజకవర్గం హింజిలి ఇందులోనే ఉంది. దీంతో బిజద తిరుగులేని విజయాలను సాధిస్తోంది.
నక్సల్స్ ప్రభావితం
ఒడిశాలోని 15 నక్సల్స్ ప్రభావిత జిల్లాల్లో బరగఢ్ ఒకటి. ఈ నియోజకవర్గంలో 82శాతం ప్రజలు పట్టణ ప్రాంతాల్లోనే ఉంటారు. ఎస్సీలు 19.5%, ఎస్టీలు 22.2% ఉంటారు. రైతుల సమస్యలు, రైల్వే అనుసంధానత, ఉద్యోగావకాశాలు, రోడ్లు, అయోధ్య రామ మందిరం ఇక్కడ ప్రధానాంశాలు.
2014లో బిజద, 2019లో భాజపా గెలిచాయి. ఈసారి భాజపా నుంచి కిసాన్ మోర్చా అధ్యక్షుడు ప్రదీప్ పురోహిత్, బిజద తరఫున పరిణీత మిశ్ర, కాంగ్రెస్ నుంచి సంజయ్ భోయ్ తలపడుతున్నారు. మోదీ వేవ్పై భాజపా ఆధారపడుతోంది. 2019లో సాధించిన అనూహ్య విజయాన్ని పునరావృతం చేయాలని భాజపా భావిస్తోంది. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో విభిన్న తీర్పును ఇక్కడి ప్రజలు ఇస్తారు. ఈసారీ అసెంబ్లీకి బిజదకు, లోక్సభకు భాజపాకు మద్దతు పలికే పరిస్థితే కనిపిస్తోంది.
పసుపు ఉత్పత్తికి ప్రసిద్ధి
దేశంలో అత్యధికంగా పసుపు ఉత్పత్తి చేసే ప్రాంతాల్లో కంధమాల్ ఒకటి. దాదాపు 60,000 గిరిజన కుటుంబాలు ఈ పంటను సాగు చేస్తాయి. ఈ ప్రాంతంలో గిరిజనులు సాగుచేసే పసుపునకు జీఐ గుర్తింపూ వచ్చింది. గిరిజనుల ప్రాబల్యం అధికంగా ఉన్నా ఇది జనరల్ నియోజకవర్గంగానే ఉంది. బిజదకు కంచుకోటే అయినా భాజపా క్రమంగా బలం పుంజుకుంటోంది.
ఈ నియోజకవర్గం ఏర్పాటైన 2009 నుంచీ బిజద గెలుస్తూ వస్తోంది. ఈసారి బిజద నుంచి సిటింగ్ ఎంపీ అచ్యుత సామంత, భాజపా తరఫున ఆరెస్సెస్ కార్యకర్త, వివిధ సేవా సంస్థలతో కలిసి పనిచేసే సుకాంత కుమార్ పాణిగ్రాహి, కాంగ్రెస్ నుంచి అమిర్ చంద్ నాయక్ తలపడుతున్నారు. ప్రధాన పోటీ బిజద, భాజపాల మధ్యే ఉంది. కాంగ్రెస్ పోటీ నామమాత్రమే. సామంతకు ఈ ప్రాంతంలో మంచి పేరుంది. ఆయనవల్లే కంధమాల్కు నీతి ఆయోగ్ 9 ఆకాంక్షిత జిల్లాల్లో చోటు దక్కింది. విద్య, గిరిజనుల అభివృద్ధి, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి వంటి అంశాల్లో సామంత కృషి గణనీయంగా ఉంది. దీంతో గెలుపుపై బిజద ఆశలు పెట్టుకుంది. మోదీపైనే భాజపా ఆధారపడుతోంది.
నవీన్కు వలసల తలనొప్పి
గత అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే ఈసారీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రెండు చోట్లా పోటీ చేస్తున్నారు. అస్కా లోక్సభ పరిధిలోని హింజిలి నుంచి ఆరోసారి బరిలోకి దిగారు. బొలంగీర్ జిల్లాలోని కంటాబంజి నుంచీ పోటీ చేస్తున్నారు. 2019లో హింజిలి, బిజెపుర్ల నుంచి పోటీ చేసిన సీఎం రెండు చోట్లా గెలిచారు. బిజెపుర్ను వదులుకున్నారు.
దక్షిణాన ఉండే హింజిలి, పశ్చిమాన ఉండే కంటాబంజి మధ్య దాదాపు 350 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అయితే ఈ రెండింటికి ఒక విషయంలో సారూప్యం ఉంది. అదే వలసల సమస్య. నిరుద్యోగం, మౌలిక వసతుల గురించి స్థానికులు మాట్లాడుతున్నా వలసలే ఇక్కడ అతి పెద్ద సమస్యగా ఉంది. రెండు ప్రాంతాల నుంచి దాదాపు లక్ష మంది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, తమిళనాడుతోపాటు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లారు. ఎన్నికల నేపథ్యంలో వీరికి డిమాండు ఏర్పడింది. వారిని వెనక్కి రప్పించేందుకు పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.
ఓటేయకపోతే ఉచిత బియ్యం, ఇతర ప్రభుత్వ పథకాలను ఇవ్వబోమని సర్పంచి బెదిరించారని, దీంతో సూరత్ నుంచి వచ్చామని సంతోష్ గౌడ అనే వలస కార్మికుడు తెలిపారు. రైలు టికెట్లతోపాటు భోజనానికి రూ.500 ఇచ్చారని వివరించారు. 24 ఏళ్లుగా పట్నాయక్ హింజిలి ఎమ్మెల్యేగా ఉంటున్నారు. చిన్న గ్రామంగా ఉన్న హింజిలిని ఆయన మున్సిపాలిటీ చేశారు. ప్రాంతీయ ఆసుపత్రి, గ్రామీణ పారిశ్రామిక పార్కు, నైపుణ్యాభివృద్ధి కేంద్రం, అగ్నిమాపకశాఖ కార్యాలయం, సాగునీటి ప్రాజెక్టు, ఇంటింటికీ తాగునీటి సౌకర్యాలను ముఖ్యమంత్రి కల్పించారు. కానీ వలస సమస్యను పరిష్కరించలేకపోయారు. ఇక్కడి ప్రజలు ఎక్కువగా కూరగాయలను పండిస్తారు. వారికి కోల్డ్ స్టోరేజీ సౌకర్యం లేదు. ఈసారి హింజిలిలో బిజద, భాజపా, కాంగ్రెస్తోపాటు 10 మంది పోటీ చేస్తున్నా ప్రధాన పోటీ బిజద, భాజపా మధ్యే ఉంది. ఇక్కడ 2.31 లక్షల మంది ఓటర్లున్నారు.
కంటాబంజిలోని ప్రజలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని ఇటుక ఫ్యాక్టరీల్లో పని చేసేందుకు వలస వెళ్తుంటారు. ముఖ్యమంత్రి తమ నియోజకవర్గానికి రావడంతో అభివృద్ధి జరుగుతుందని ఆశిస్తున్నామని స్థానికులు అంటున్నారు.
రవుర్కెలాలో ఇద్దరు యోధులు
ఉక్కు నగరం రవుర్కెలా అసెంబ్లీ స్థానంపై అందరి దృష్టి ఉంది. ఇక్కడ కేంద్ర మాజీ మంత్రి, పారిశ్రామిక వేత్త దిలీప్ రే భాజపా తరఫున బరిలో ఉన్నారు. కార్మికశాఖ మంత్రి శారదా ప్రసాద్ నాయక్ బిజద అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వీరిద్దరూ ఉద్ధండులే. ఓటర్లు ఎవరి పక్షాన నిలుస్తారన్నది ఆసక్తికరం.
గంజాం జిల్లా భంజనగర్లో ఆర్థికశాఖ మంత్రి బిక్రం కేసరి అరుఖ్, బొలంగీర్ జిల్లా టిట్లాగఢ్ స్థానంలో జల వనరులు, వాణిజ్య, రవాణాశాఖల మంత్రి టుకుని సాహు, బౌద్ధ్లో అటవీ, పర్యావరణశాఖల మంత్రి ప్రదీప్ అమత్, బరగఢ్ జిల్లా బిజెపుర్లో చేనేత, జౌళిశాఖ మంత్రి రీతా సాహు బిజద అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. వారు భాజపా నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా కొనసాగి ఉంటే 2021లోనే పోలవరం పూర్తయ్యేది: సీఎం చంద్రబాబు
2014-19 మధ్య పెట్టుబడులకు చిరునామాగా ఆంధ్రప్రదేశ్ను నిలిపామని సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. -
గోదావరిలో నీరుంది.. కానీ ప్రభుత్వానికి ఇచ్చే మనసు లేదు: కేటీఆర్
తెలంగాణలో కరవు అనే మాట వినపడకూడదని కేసీఆర్.. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
వైకాపా హయాంలో ప్రకటనల కుంభకోణం.. హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేల డిమాండ్
వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రకటనల కుంభకోణంపై హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. -
ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.. మంత్రులకు చంద్రబాబు సూచన
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించడం... వంటి మంచి పనుల్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. -
సకుటుంబ సమేతంగా కేసులు.. అక్రమ కేసులున్నవారు నిలబడాలని కోరిన చంద్రబాబు
వివాహాలు, ఇతర శుభకార్యాలకు సకుటుంబ సపరివార సమేతంగా రావాలని ఆహ్వానిస్తుంటాం.. అయితే గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలపై సకుటుంబ సమేతంగా అక్రమ కేసులు నమోదు చేసి వేధించారని చంద్రబాబు, ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. శ్వేతపత్రం విడుదల సందర్భంగా.. వైకాపా ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలపై నమోదైన అక్రమ కేసుల సంఖ్యను చంద్రబాబు ప్రస్తావించారు. -
ఏపీ ‘ఎస్కోబార్’ జగన్.. చీకటి సామ్రాజ్యాధిపతితో పోల్చిన చంద్రబాబు
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అరాచకాలను వివరించేటప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కొలంబియన్ మాదకద్రవ్యాల చీకటి సామ్రాజ్యాధిపతి పాబ్లో ఎమిలియో ఎస్కోబార్ చరిత్రను సభకు వినిపించారు. -
‘రఘురామను చిత్రహింసలు పెట్టినప్పుడు మీరంతా ఏమయ్యారు?’
మాజీ ముఖ్యమంత్రి జగన్ దిల్లీలో చేసిన నిరసనకు ఇండియా కూటమి నాయకులు మద్దతు పలకడాన్ని అనంతపురం తెదేపా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. -
అన్ని వర్గాలకూ మోసం
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలనూ మోసం చేసిందని, అందర్నీ వెన్నుపోటు పొడిచిందని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. -
శాంతిభద్రతల పరిరక్షణపై సభలో చర్చిద్దాం
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు.. రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలపై శాసనసభలో ఒక రోజు పూర్తిగా చర్చించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు. -
ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని దోచేశారు
‘వైకాపా ప్రభుత్వం చేసిన నిర్వాకాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు విద్యుత్తు, అమరావతి, పోలవరం, గనులు, మద్యంపై శ్వేతపత్రాలు విడుదల చేశారు. -
వైకాపా ప్రభుత్వం ఇళ్లు కూల్చింది.. ఆదుకోండి
తెదేపాకు అనుకూలంగా ఉన్నారని విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం దన్నానపేట గ్రామానికి చెందిన 30 మంది దళితుల ఇళ్లను అప్పటి వైకాపా ప్రభుత్వం కూల్చేసిందని ఆ మండల తెదేపా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు టొంపల నర్సయ్య గురువారం తెదేపా కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. -
వైకాపా పాలనలో తెదేపా శ్రేణులపై 2,560 కేసులు
వైకాపా హయాంలో గత ఐదేళ్లలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై 2,560 కేసులు నమోదు చేసి.. 2,370 మందిని అరెస్టు చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. -
ఇసుక, మద్యం అవినీతిపై విచారణ జరిపించాలి
ముఖ్యమంత్రి చంద్రబాబును రాష్ట్ర సచివాలయంలో గురువారం సీపీఎం నాయకులు కలిశారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. -
సమస్యలపై ప్రశ్నిస్తే.. వేధింపులే సమాధానం
శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం విడుదల చేసిన ‘శాంతిభద్రతల శ్వేతపత్రం’పై కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వేదికగా మాట్లాడారు. -
‘ఇండియా’ కూటమితో పొత్తు కోసమే జగన్ దిల్లీ యాత్ర
‘ఇండియా’ కూటమితో పొత్తు కోసమే వైకాపా అధ్యక్షుడు జగన్ దిల్లీ వెళ్లినట్లుగా ఉందని ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. దిల్లీ నుంచి అమరావతి చేరుకున్న జగన్... శాసనసభ సమావేశాలకు హాజరు కావాలని సూచించారు. -
ఇది పసలేని దండగమారి బడ్జెట్: కేటీఆర్
రాష్ట్ర ప్రభుత్వం పసలేని, దండగమారి బడ్జెట్ ప్రవేశపెట్టిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ప్రజల ఆకాంక్షలు పట్టించుకోకుండా ఆంక్షల పద్దు పెట్టారని అన్నారు. -
సంక్షిప్త వార్తలు (4)
బడ్జెట్లో అధిక కేటాయింపుల ద్వారా.. తమది రైతు ప్రభుత్వమని మరోసారి నిరూపించుకున్నట్లయిందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అన్నారు. -
ఫైళ్ల దహనంతో మాకు సంబంధం లేదు: వైకాపా ఎంపీ మిథున్రెడ్డి
మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో జరిగిన రెవెన్యూ దస్త్రాల దహనం ఘటనతో తమకెలాంటి సంబంధం లేదని వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి పేర్కొన్నారు. -
గాజులదిన్నె ప్రాజెక్టు పనులపై విచారణ చేపడతాం: మంత్రి నిమ్మల
సంజీవయ్య గాజులదిన్నె ప్రాజెక్టు పనులపై విచారణ చేపడతామని జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. -
రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతీయడానికే జగన్ దిల్లీ నిరసన: హోంమంత్రి అనిత
రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతీయడానికే మాజీ సీఎం జగన్ దిల్లీలో నిరసన పేరుతో చౌకబారు ఆరోపణలు చేశారని హోంమంత్రి అనిత మండిపడ్డారు. 36 రాజకీయ హత్యలు జరిగాయని నిస్సిగ్గుగా మాట్లాడారని ధ్వజమెత్తారు. -
వరద బాధిత రైతులను తక్షణమే ఆదుకోవాలి
కోస్తా జిల్లాల్లోని వరద బాధిత రైతులకు తక్షణమే నష్టపరిహారం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల గురువారం లేఖ రాశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఎవరినీ కించపరచడం మా ఉద్దేశం కాదు.. ‘డబుల్ ఇస్మార్ట్’ పాటపై మణిశర్మ క్లారిటీ
-
కార్గిల్ పోరు వేళ యుద్ధ భూమిలో మోదీ.. పాతికేళ్ల నాటి ఫొటోలు వైరల్
-
రివ్యూ: పురుషోత్తముడు.. రాజ్తరుణ్ ఖాతాలో హిట్ పడిందా?
-
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
-
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
-
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు