పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారు
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం రామిరెడ్డిపల్లె, కూచివారిపల్లెల్లో పోలింగ్ ముగిసిన తర్వాత జరిగిన ఘర్షణలో.. అక్కడ లేనివారిపై పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారని బాధితుడు మురళీధర్ వాపోయారు.
తిరుపతిలో ఎన్నికల అనంతర ఘర్షణలపై బాధితుల ఆందోళన
పోలింగ్ రోజు వైకాపా మూకల దాడి
వీడియోల విడుదల
వైకాపా శ్రేణుల దాడి వీడియోను చూపిస్తున్న బాధితుడు మురళీధర్
ఈనాడు, తిరుపతి: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం రామిరెడ్డిపల్లె, కూచివారిపల్లెల్లో పోలింగ్ ముగిసిన తర్వాత జరిగిన ఘర్షణలో.. అక్కడ లేనివారిపై పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారని బాధితుడు మురళీధర్ వాపోయారు. ఈ ఘటనలకు సంబంధించిన వీడియోలను ఆదివారం ఆయన మీడియాకు విడుదల చేశారు. ‘పోలింగ్ రోజు నేను రామిరెడ్డిపల్లెలో తెదేపా ఏజెంట్గా కూర్చొన్నా. రాత్రి 7.54కు పోలింగ్ పూర్తయింది. 8.44కు పోలింగ్ బూత్ నుంచి బయటకు రాగానే వైకాపా నేత కొటాల చంద్రశేఖర్రెడ్డి, అతని అనుచరులు దాడి చేశారు. అక్కడి నుంచి ఎలాగోలా బయటపడి స్వగ్రామమైన కూచివారిపల్లెకు 9.06 గంటలకు చేరుకున్నా. చంద్రశేఖర్రెడ్డి అనుచరులు మరోసారి కూచివారిపల్లెకు వచ్చి రాళ్లు, కర్రలతో కొట్టారు. 12మంది తెదేపా సానుభూతిపరులకు గాయాలయ్యాయి. ఆత్మరక్షణ కోసం గ్రామస్థులు ఎదురుదాడికి దిగడంతో వాళ్లు పారిపోయారు. విషయం తెలుసుకున్న చంద్రగిరి వైకాపా అభ్యర్థి మోహిత్రెడ్డి, ఆయన సోదరుడు హర్షిత్రెడ్డి.. కర్రలు తీసుకొని 9.12 గంటలకు గ్రామానికి చేరుకున్నారు. అప్పటికే మాకు గాయాలు కావడంతో నారావారిపల్లెలోని ఆసుపత్రికి వెళ్లాం. చంద్రశేఖర్రెడ్డి ఇంటికి మేం నిప్పు పెట్టలేదు. పూర్తి ఆధారాలను సిట్కు అందిస్తాం. పోలీసులు కావాలని గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగులపైనా తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారు’ అని మురళీధర్ వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మాకు దయతో రెండు స్థానాలిచ్చారేమో..!’
‘ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ చూస్తే ఆశ్చర్యం వేసింది. ఆశ్చర్యం కాదు.. నవ్వొచ్చింది. ఆ ఫలితాల్లో వైకాపాకు రెండు ఎంపీ స్థానాలు ఇచ్చారు. -
ఆవిర్భావ సంబరాలు ఒక్కరోజుకే పరిమితమా?!
రేవంత్రెడ్డి అదృష్టవశాత్తు ముఖ్యమంత్రి అయ్యారని, ఆయనకు తెలంగాణ ప్రజల త్యాగాలు, ఉద్యమం గురించి ఏమాత్రం తెలియదని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. -
పోస్టల్ బ్యాలట్ వ్యవహారంపై సుప్రీంకు వైకాపా
పోస్టల్ బ్యాలట్ల ఓటరు డిక్లరేషన్కు సంబంధించిన ‘ఫాం-13ఏ’ పై అటెస్టింగ్ అధికారి సంతకం ఉంటే చాలు, ఆయన పేరు, హోదా, అధికారిక ముద్ర (సీలు) లేకపోయినా ఆ ఓట్లు చెల్లుబాటవుతాయంటూ కేంద్ర ఎన్నికల సంఘం మే 30న జారీచేసిన ఉత్తర్వులపై వైకాపా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. -
అయిదు రకాల కౌంటింగ్ ఏజెంట్లను అనుమతించండి
ఓట్ల లెక్కింపు ప్రక్రియను పార్టీల తరఫున పర్యవేక్షించేందుకు అయిదు రకాల ఏజెంట్లను అనుమతించాలని తెదేపా మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. -
భారాసలా నియంతృత్వం వద్దు.. ప్రజాపాలన అందించాలి: నారాయణ
త్యాగాలతో పోరాడి సాధించుకున్న తెలంగాణలో భారాస ప్రభుత్వం చేసిన నియంత పాలన మాదిరిగా కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనను అందించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ పేర్కొన్నారు. -
తెదేపా తరఫున పనిచేసినందుకు వాలంటీరు రాళ్ల దాడి
ఎన్నికల్లో తెదేపా తరఫున పని చేసినందుకు ముగ్గురు యువకులపై ఓ గ్రామ వాలంటీరు రాళ్ల దాడికి పాల్పడ్డాడు. -
శ్రీవారి భక్తుల ప్రాణాలు పణంగా పెడతారా?
తిరుమలలో భక్తులకు అందించే ఆహారం, నీరు అపరిశుభ్రంగా ఉండటంపై తెదేపా అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ ఆందోళన వ్యక్తంచేశారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో నైతిక విజయం కాంగ్రెస్దే
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో నైతిక విజయం కాంగ్రెస్ పార్టీదేనని మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. -
ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్ల ముసుగులో భూదోపిడీ
ఫ్రీహోల్డ్ సర్టిఫికెట్ల ముసుగులో విశాఖ చుట్టుపక్కల విలువైన భూములను వైకాపా నేతలు, సీఎస్ జవహర్రెడ్డి బినామీలు దోచేశారని జనసేన పార్టీ కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్ ఆరోపించారు. -
రాష్ట్రాలు రెండైనా తెలుగువారంతా ఒక్కటే
రాష్ట్రాలు రెండైనా తెలుగు ప్రజలంతా ఒక్కటేనని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్ర విభజన జరిగి ఆదివారంతో పదేళ్లు పూర్తయిన సందర్భంగా పేదరికం లేని సమాజం దిశగా రెండు రాష్ట్రాలూ పయనించాలని ఎక్స్ వేదికగా ఆయన అభిలషించారు. -
నెలకు రూ.2,400 కోట్లు వడ్డీ చెల్లింపులే
రాష్ట్ర ఆదాయం నెలకు రూ.8,500 కోట్లు ఉంటే.. ఆర్బీఐ నుంచి, కార్పొరేషన్ల ద్వారా, అనధికారికంగా వైకాపా ప్రభుత్వం రూ.6 వేల కోట్ల అప్పులు చేస్తోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ వివరించారు. -
సంక్షిప్త వార్తలు
మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయం వద్ద భద్రత ఏర్పాట్లను ట్రైనీ ఐపీఎస్ అధికారి మనోజ్హెగ్డే నేతృత్వంలోని బృందం ఆదివారం పరిశీలించింది. -
పూర్తి స్థాయి ఫలితాలొచ్చే వరకు అప్రమత్తంగా ఉండండి
పూర్తిస్థాయి ఫలితాలొచ్చే వరకూ అశ్రద్ధ వద్దని, కౌంటింగ్ పూర్తయ్యే వరకు కేంద్రంలోనే ఉండి.. ఆర్వో నుంచి డిక్లరేషన్ ఫాం తీసుకున్నాకే బయటకు రావాలని ఎన్డీయే అభ్యర్థులకు తెదేపా అధినేత చంద్రబాబు సూచించారు. -
కూటమి ఖాయం
ఇటీవలి కాలంలో 95%పైగా కచ్చితత్వంతో విశ్వసనీయ సర్వే సంస్థగా పేరొందిన ‘యాక్సిస్ మై ఇండియా’ ఎగ్జిట్ పోల్ కూడా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమిదే అధికారమని తేల్చింది! -
మహబూబ్నగర్ ఎమ్మెల్సీ స్థానం భారాసదే
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో భారాస విజయం సాధించింది. పార్టీ అభ్యర్థి నవీన్కుమార్రెడ్డి 109 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్రెడ్డిపై గెలుపొందారు. -
కాంగ్రెస్ సర్కారుకు రోజులు దగ్గర పడ్డాయి
పరిపాలనలో కాంగ్రెస్ సర్కారు గ్రాఫ్ రోజురోజుకూ దిగజారుతోందని, ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. -
తెలంగాణను ప్రజలే తెచ్చుకున్నారు
రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను రాష్ట్ర పండగలా కాకుండా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్వహించారని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ విమర్శించారు. -
అరుణాచల్లో మళ్లీ కమల వికాసం
ఈశాన్య భారత రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్లో భాజపా ప్రభంజనం సృష్టించింది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి.. వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు సిద్ధమైంది. -
ఎగ్జిట్ పోల్స్కి విలువ లేదు.. మమత రియాక్షన్ ఇదే!
ఎగ్జిట్ పోల్స్ అంచనాలపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘మాకు దయతో రెండు స్థానాలిచ్చారేమో..!’
-
భారత జట్టుకు కోచ్ కావడాన్ని ఇష్టపడతా: గౌతమ్ గంభీర్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (03/06/24)
-
టీ20 ప్రపంచకప్.. పసికూనపై చెమటోడ్చి నెగ్గిన విండీస్
-
పుస్తకం పట్టిన దివి.. మేకప్తో శ్రద్ధాదాస్.. వేదిక ప్రమోషన్స్!
-
భారత్తో మ్యాచ్ అంటే.. మాకూ టెన్షనే: బాబర్ అజామ్