బాధితులకు అండగా నిలిచిన మీడియాపై కేసులా?
వైకాపాకు ఓట్లేయలేదన్న కక్షతో విశాఖ కంచరపాలెంలోని ఓ కుటుంబంపై ఆ పార్టీ నేతలు చేసిన దాడి ఘటనను తప్పుదోవ పట్టించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఎన్డీయే నేతలు మండిపడ్డారు.
విశాఖ ఘటనలో పోలీసుల తీరు అప్రజాస్వామికం
కేసులు ఉపసంహరించుకునేలా ఈసీ ఆదేశాలివ్వాలి
ఎన్డీయే నేతల డిమాండ్
ఈనాడు డిజిటల్, అమరావతి: వైకాపాకు ఓట్లేయలేదన్న కక్షతో విశాఖ కంచరపాలెంలోని ఓ కుటుంబంపై ఆ పార్టీ నేతలు చేసిన దాడి ఘటనను తప్పుదోవ పట్టించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఎన్డీయే నేతలు మండిపడ్డారు. దాడి చేసినవారిని వదిలేసి.. బాధితుల గోడును ప్రసారం చేసిన ‘ఈనాడు’, ఈటీవీ, ఆంధ్రజ్యోతితో పాటు గాయాలపాలైన వారితో విలేకరుల సమావేశం నిర్వహించిన ఎన్డీయే కూటమి అభ్యర్థి విష్ణుకుమార్రాజుపై క్రిమినల్ కేసులు నమోదుచేయడం వారి ప్రాథమిక హక్కులను హరించడమేనని ధ్వజమెత్తారు. దీనిపై తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సోమవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనాకు లేఖ రాయగా, మిగతా కూటమి నేతలు ప్రకటనలు విడుదల చేశారు.
పత్రికా స్వేచ్ఛ హరిస్తున్నారు
- అచ్చెన్నాయుడు, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు
‘‘వైకాపా నేతల దాడిలో మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. అదే విషయాన్ని బాధితులు స్పష్టంగా చెప్పారు. దాడి చేసిన వైకాపా నాయకులను వదిలి.. బాధితుల పక్షాన మాట్లాడుతున్నవారిపై కేసులు నమోదుచేసిన పోలీసులు ఘటనను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు పత్రికలపై కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడుతున్నారు. జరిగిన విషయాన్ని ప్రసారం చేయడం తప్పెలా అవుతుంది? ప్రాథమిక హక్కులను కాలరాసేలా మీడియాపై నమోదుచేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకునేలా ఎన్నికల సంఘం ఆదేశాలివ్వాలి. వైకాపా నేతల సూచనల మేరకు నడుస్తూ.. విశాఖ పోలీసులు ఇప్పటికే అపఖ్యాతి పాలయ్యారు. ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలను రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంచడం, వారిపై అక్రమ కేసులు బనాయించడం, అధికార పార్టీ సిటింగ్ ఎంపీ కిడ్నాప్కు గురైనా.. మౌనంగా ఉండిపోయిన ఘనత విశాఖ పోలీసులకే దక్కుతోంది. హింసను అదుపు చేయడంలో విఫలమై.. పత్రికా స్వేచ్ఛను అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్న పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలి’’ అని సీఈఓకు రాసిన లేఖలో పేర్కొన్నారు.
జగన్పై స్వామిభక్తితోనే పత్రికలపై కేసులు
- దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ మంత్రి
‘‘ఓ సామాన్య కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని వెలుగులోకి తెచ్చిన మీడియాపై కేసులు నమోదు చేసి పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు. వారిపై పెట్టిన సెక్షన్లు చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది. జగన్పై స్వామిభక్తితో పోలీసులు చేసిన పనికి వారి ఖ్యాతి దేశాలు దాటుతోంది. విశాఖ డీసీపీ సత్తిబాబు అత్యుత్సాహంతో అడ్డగోలుగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీనిపై సిట్ దృష్టిపెట్టాలి. ఎన్నికల కమిషన్ కూడా స్పందించాలి. డీజీపీ హరీష్కుమార్ గుప్తా వివరణ ఇవ్వాలి. సీఎస్ జవహర్రెడ్డి బాధ్యత తీసుకోవాలి. రాష్ట్రంలో నేటికీ డీజీపీ అధికారం నడుస్తున్నట్లు లేదు. తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న ధనుంజయ్రెడ్డి, రఘురామిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిలే అంతా నడిపిస్తున్నట్లు ఉంది. వైకాపా దాడులను కళ్లకు కట్టినట్లు చూపిన పత్రికలు, విలేకరుల సమావేశం నిర్వహించిన విష్ణుకుమార్రాజుపై కేసులు పెట్టి.. పత్రికా స్వేచ్ఛను కట్టడి చేయాలనుకోవడం దారుణం. వీటన్నింటినీ ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం. ఈ ఘటనపై విశాఖ సీపీ వివరణ ఇవ్వాలి.’’
రాజకీయ ప్రేరేపితమని అర్థమవుతోంది
- నాదెండ్ల మనోహర్
‘‘బాధితురాలు సుంకర ధనలక్ష్మి కుటుంబం చెప్పిన విషయాలను ప్రసారం చేయడాన్ని నేరంగా పరిగణించడం అప్రజాస్వామికం. వైకాపా పాలనలో మీడియాకు రాజకీయ రంగులు పులిమి వర్గాలుగా విభజించారు. మీడియా నియంత్రణకు జీఓ నంబరు 1 తీసుకొచ్చారు. బాధితులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించిన విష్ణుకుమార్రాజుపై కేసు నమోదుచేయడం చూస్తే ఇవన్నీ రాజకీయ ప్రేరేపితమని అర్థమవుతోంది. బాధితులపై దాడి చేసిన వారెవరో, ఎందుకు చేశారో పోలీసులు బయటపెట్టాలి. ఈ ఘటనపై ప్రత్యేకంగా విచారణ చేయించాలి.’’
పోలీసులది ఆటవిక న్యాయం
- లంకా దినకర్, భాజపా రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి
‘ఓట్లేయలేదన్న అక్కసుతో మహిళలు, ఓ గర్భిణిపై వైకాపా నాయకులు తీవ్రంగా దాడిచేశారు. ఈ ఘటనలో నిందితులను వదిలి, బాధితులకు అండగా ఉన్నవారిపై కేసులు నమోదు చేయడం ఆటవిక న్యాయం. ఎన్డీయే అభ్యర్థి విష్ణుకుమార్రాజు, మీడియా సంస్థలకు 41ఏ నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పోలీసు శాఖలో నేటికీ కొంతమంది జగన్ తొత్తులున్నారని అనిపిస్తోంది. పోలీసులు వైకాపా వాళ్ల దాడుల్ని దారి మళ్లించి, కుటుంబ కలహాలుగా చిత్రీకరించే కుట్ర చేస్తున్నారు. విశాఖ ఘటనతో పాటు.. తిరుపతిలో చంద్రగిరి ఎన్డీయే అభ్యర్థి పులివర్తి నానిపై దాడి ఘటనల్లో సూత్రధారులను శిక్షించాలి.’’
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా హయాంలో ప్రకటనల కుంభకోణం.. హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేల డిమాండ్
వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రకటనల కుంభకోణంపై హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. -
ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.. మంత్రులకు చంద్రబాబు సూచన
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించడం... వంటి మంచి పనుల్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. -
సకుటుంబ సమేతంగా కేసులు.. అక్రమ కేసులున్నవారు నిలబడాలని కోరిన చంద్రబాబు
వివాహాలు, ఇతర శుభకార్యాలకు సకుటుంబ సపరివార సమేతంగా రావాలని ఆహ్వానిస్తుంటాం.. అయితే గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలపై సకుటుంబ సమేతంగా అక్రమ కేసులు నమోదు చేసి వేధించారని చంద్రబాబు, ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. శ్వేతపత్రం విడుదల సందర్భంగా.. వైకాపా ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలపై నమోదైన అక్రమ కేసుల సంఖ్యను చంద్రబాబు ప్రస్తావించారు. -
ఏపీ ‘ఎస్కోబార్’ జగన్.. చీకటి సామ్రాజ్యాధిపతితో పోల్చిన చంద్రబాబు
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అరాచకాలను వివరించేటప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కొలంబియన్ మాదకద్రవ్యాల చీకటి సామ్రాజ్యాధిపతి పాబ్లో ఎమిలియో ఎస్కోబార్ చరిత్రను సభకు వినిపించారు. -
‘రఘురామను చిత్రహింసలు పెట్టినప్పుడు మీరంతా ఏమయ్యారు?’
మాజీ ముఖ్యమంత్రి జగన్ దిల్లీలో చేసిన నిరసనకు ఇండియా కూటమి నాయకులు మద్దతు పలకడాన్ని అనంతపురం తెదేపా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. -
అన్ని వర్గాలకూ మోసం
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలనూ మోసం చేసిందని, అందర్నీ వెన్నుపోటు పొడిచిందని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. -
శాంతిభద్రతల పరిరక్షణపై సభలో చర్చిద్దాం
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు.. రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలపై శాసనసభలో ఒక రోజు పూర్తిగా చర్చించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు. -
ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని దోచేశారు
‘వైకాపా ప్రభుత్వం చేసిన నిర్వాకాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు విద్యుత్తు, అమరావతి, పోలవరం, గనులు, మద్యంపై శ్వేతపత్రాలు విడుదల చేశారు. -
వైకాపా ప్రభుత్వం ఇళ్లు కూల్చింది.. ఆదుకోండి
తెదేపాకు అనుకూలంగా ఉన్నారని విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం దన్నానపేట గ్రామానికి చెందిన 30 మంది దళితుల ఇళ్లను అప్పటి వైకాపా ప్రభుత్వం కూల్చేసిందని ఆ మండల తెదేపా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు టొంపల నర్సయ్య గురువారం తెదేపా కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. -
వైకాపా పాలనలో తెదేపా శ్రేణులపై 2,560 కేసులు
వైకాపా హయాంలో గత ఐదేళ్లలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై 2,560 కేసులు నమోదు చేసి.. 2,370 మందిని అరెస్టు చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. -
ఇసుక, మద్యం అవినీతిపై విచారణ జరిపించాలి
ముఖ్యమంత్రి చంద్రబాబును రాష్ట్ర సచివాలయంలో గురువారం సీపీఎం నాయకులు కలిశారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. -
సమస్యలపై ప్రశ్నిస్తే.. వేధింపులే సమాధానం
శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం విడుదల చేసిన ‘శాంతిభద్రతల శ్వేతపత్రం’పై కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వేదికగా మాట్లాడారు. -
‘ఇండియా’ కూటమితో పొత్తు కోసమే జగన్ దిల్లీ యాత్ర
‘ఇండియా’ కూటమితో పొత్తు కోసమే వైకాపా అధ్యక్షుడు జగన్ దిల్లీ వెళ్లినట్లుగా ఉందని ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. దిల్లీ నుంచి అమరావతి చేరుకున్న జగన్... శాసనసభ సమావేశాలకు హాజరు కావాలని సూచించారు. -
ఇది పసలేని దండగమారి బడ్జెట్: కేటీఆర్
రాష్ట్ర ప్రభుత్వం పసలేని, దండగమారి బడ్జెట్ ప్రవేశపెట్టిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ప్రజల ఆకాంక్షలు పట్టించుకోకుండా ఆంక్షల పద్దు పెట్టారని అన్నారు. -
సంక్షిప్త వార్తలు (4)
బడ్జెట్లో అధిక కేటాయింపుల ద్వారా.. తమది రైతు ప్రభుత్వమని మరోసారి నిరూపించుకున్నట్లయిందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అన్నారు. -
ఫైళ్ల దహనంతో మాకు సంబంధం లేదు: వైకాపా ఎంపీ మిథున్రెడ్డి
మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో జరిగిన రెవెన్యూ దస్త్రాల దహనం ఘటనతో తమకెలాంటి సంబంధం లేదని వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి పేర్కొన్నారు. -
గాజులదిన్నె ప్రాజెక్టు పనులపై విచారణ చేపడతాం: మంత్రి నిమ్మల
సంజీవయ్య గాజులదిన్నె ప్రాజెక్టు పనులపై విచారణ చేపడతామని జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. -
రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతీయడానికే జగన్ దిల్లీ నిరసన: హోంమంత్రి అనిత
రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతీయడానికే మాజీ సీఎం జగన్ దిల్లీలో నిరసన పేరుతో చౌకబారు ఆరోపణలు చేశారని హోంమంత్రి అనిత మండిపడ్డారు. 36 రాజకీయ హత్యలు జరిగాయని నిస్సిగ్గుగా మాట్లాడారని ధ్వజమెత్తారు. -
వరద బాధిత రైతులను తక్షణమే ఆదుకోవాలి
కోస్తా జిల్లాల్లోని వరద బాధిత రైతులకు తక్షణమే నష్టపరిహారం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల గురువారం లేఖ రాశారు. -
రైతుల జీవితాలతో చెలగాటం వద్దు!
‘ఎన్నికలు అయిపోయాయి.. రాజకీయాలు వదిలేయండి.. రాజకీయాల కోసం రైతుల జీవితాలతో చెలగాటమాడొద్దు’ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. -
సంతోషదాయక బడ్జెట్: కూనంనేని
నిధుల పరంగా రాష్ట్రం సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సంతోషదాయకంగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మదనపల్లెలో బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన సిసోదియా
-
కేరళ, బెంగాల్ గవర్నర్ కార్యాలయాలకు సుప్రీం నోటీసులు
-
జాస్పర్ నగరం సగం భస్మీపటలం..!
-
నిరుద్యోగులూ నిరసనలు వద్దు.. మీ అన్నగా అండగా ఉంటా: సీఎం రేవంత్రెడ్డి
-
అంత డబ్బు నా వద్ద లేదు: జాన్వీకపూర్
-
జేడీ వాన్స్ వ్యాఖ్యలు వైరల్.. తీవ్రంగా ఖండించిన ప్రముఖ నటి