తెదేపా ముసుగులో విద్వేష ప్రసంగాలు చేస్తున్న కృష్ణారెడ్డిని అరెస్టు చేయాలి
సామాజిక మాధ్యమాల్లో తెదేపా కండువా ధరించి కులాల మధ్య వైషమ్యాలు సృష్టించేలా వీడియోలు చేస్తున్న వైకాపా నాయకుడు మన్విత్ కృష్ణారెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఐడీ అధికారులకు తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు.
సీఐడీకి పార్టీ నేతల ఫిర్యాదు
డీఐజీ సెంథిల్కుమార్కు వినతిపత్రం అందిస్తున్న వర్ల రామయ్య,
మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, మన్నవ సుబ్బారావు, చిట్టిబాబు, కోడూరి అఖిల్
ఈనాడు డిజిటల్, అమరావతి: సామాజిక మాధ్యమాల్లో తెదేపా కండువా ధరించి కులాల మధ్య వైషమ్యాలు సృష్టించేలా వీడియోలు చేస్తున్న వైకాపా నాయకుడు మన్విత్ కృష్ణారెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఐడీ అధికారులకు తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. ఇటువంటి వ్యక్తులను ప్రోత్సహిస్తున్నవారిని గుర్తించాలని పార్టీ నేతలతో కలిసి కోరారు. అనంతరం వర్ల విలేకర్లతో మాట్లాడారు. ‘తాడేపల్లి ప్యాలెస్ సూచనలతోనే తెదేపా కండువా ధరించి తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలను దూషిస్తున్న కృష్ణారెడ్డిని కఠినంగా శిక్షించాలి. ఓడిపోతున్నామని తెలిసే వైకాపా నేతలు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టులు పెట్టిస్తున్నారు. ఐదేళ్లుగా ఇలాంటివారిని అడ్డుపెట్టుకుని నీచ రాజకీయాలు చేశారు. ఇక వైకాపా పని అయిపోయింది. లండన్ నుంచి జగన్ తిరిగొస్తారో రారోనని అనుమానం ఉంది. తప్పకుండా రావాలి. ప్రతిపక్షంలో కూర్చుని తెదేపా ప్రభుత్వ వైభవాన్ని చూడాలి’ అన్నారు. కార్యక్రమంలో తెలుగురైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చిట్టిబాబు, గుంటూరు మిర్చియార్డు మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు, ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోడూరి అఖిల్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అందుకే హరీశ్రావును అమెరికాకు పంపించారు: మంత్రి కోమటిరెడ్డి
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్రావును హైదరాబాద్కు తిరిగిరావద్దని చెప్పించడానికి మాజీ మంత్రి హరీశ్రావును భారాస అధినేత కేసీఆర్ అమెరికాకు పంపించారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆరోపించారు. -
పూర్తి స్థాయి ఫలితాలొచ్చే వరకు అప్రమత్తంగా ఉండండి
పూర్తిస్థాయి ఫలితాలొచ్చే వరకూ అశ్రద్ధ వద్దని, కౌంటింగ్ పూర్తయ్యే వరకు కేంద్రంలోనే ఉండి.. ఆర్వో నుంచి డిక్లరేషన్ ఫాం తీసుకున్నాకే బయటకు రావాలని ఎన్డీయే అభ్యర్థులకు తెదేపా అధినేత చంద్రబాబు సూచించారు. -
కూటమి ఖాయం
ఇటీవలి కాలంలో 95%పైగా కచ్చితత్వంతో విశ్వసనీయ సర్వే సంస్థగా పేరొందిన ‘యాక్సిస్ మై ఇండియా’ ఎగ్జిట్ పోల్ కూడా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమిదే అధికారమని తేల్చింది! -
గురువు పార్టీని కూకటివేళ్లతో సహా పెకలించి..!
సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో సిక్కిం క్రాంతికారీ మోర్చా (ఎస్కేఎం) ప్రభంజనం సృష్టించింది. మొత్తం 32 స్థానాలకుగానూ 31 చోట్ల విజయం సాధించింది. -
రాజకీయ చాణక్యుడు.. పెమా ఖండూ!
అరుణాచల్ప్రదేశ్లో భాజపాను తొలిసారి అధికారంలోకి తెచ్చిన ఘనుడిగా ఇప్పటికే పేరు తెచ్చుకున్న పెమా ఖండూ.. మరోసారి రాష్ట్రంలో పార్టీకి ఘన విజయాన్ని సాధించిపెట్టారు. -
కౌంటింగ్ ఏజెంట్లను టేబుళ్ల వద్దకు అనుమతిస్తాం: ఈసీ
ఓట్ల లెక్కింపు నిబంధనల మార్పుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత అజయ్ మాకెన్ ‘ఎక్స్’ ద్వారా చేసిన ఆరోపణలపై స్పందించిన ఈసీ ఆదివారం వివరణ ఇచ్చింది. -
ఓట్ల గణనకు ముందు.. ఈసీ తలుపుతట్టిన భాజపా, విపక్షాలు
లోక్సభ ఎన్నికల ఓట్లగణన ఒకట్రెండు రోజుల్లో జరగనున్న వేళ.. అధికారపక్షమైన భాజపా, విపక్ష ‘ఇండియా’ కూటమి నేతలు ఆదివారం ఒకేరోజు ఎన్నికల సంఘం (ఈసీ) తలుపు తట్టారు. -
ఎగ్జిట్పోల్స్పై విపక్షాల పెదవి విరుపు
లోక్సభ ఎన్నికల ఫలితాలు ఎన్డీయేకు అనుకూలంగా ఉండవచ్చన్న ఎగ్జిట్పోల్స్పై పలు విపక్షాలు వరసగా రెండోరోజూ విరుచుకుపడ్డాయి. ఆ అంచనాలు వాస్తవమయ్యే అవకాశమే లేదన్నాయి. -
తిరిగి తిహాడ్ జైలుకు కేజ్రీవాల్
ఆప్ జాతీయ కన్వీనర్, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం తిరిగి తిహాడ్ జైలుకు చేరారు. -
అవి మోదీ మీడియా పోల్స్
లోక్సభ ఎన్నికల్లో విజయం ఎన్డీయే కూటమిదేనని ఎగ్జిట్పోల్స్ వెల్లడించడాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ తప్పుబట్టారు. అవన్నీ ‘మోదీ మీడియా పోల్స్’గా అభివర్ణించారు. -
ఎమ్మెల్యే పల్లాపై కేసు నమోదు
గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రంలోకి పార్టీ కండువాతో ప్రవేశించడంపై జనగామ ఎమ్మెల్యే(అప్పటి భారాస అభ్యర్థి) పల్లా రాజేశ్వర్రెడ్డిపై కోడ్ ఉల్లంఘనల కింద జనగామ ఠాణాలో కేసు నమోదైనట్లు ఎస్సై సృజన్ తెలిపారు. -
నిరాధార నిందలు మానుకోవాలి
‘‘నిరాధార నిందలు వేసి నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలనుకునే చౌకబారు ప్రయత్నాలు మానుకుని.. హుందాతనాన్ని నిలుపుకోవాలి’’ అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి టి.హరీశ్రావు హితవు పలికారు. -
‘మాకు దయతో రెండు స్థానాలిచ్చారేమో..!’
‘ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ చూస్తే ఆశ్చర్యం వేసింది. ఆశ్చర్యం కాదు.. నవ్వొచ్చింది. ఆ ఫలితాల్లో వైకాపాకు రెండు ఎంపీ స్థానాలు ఇచ్చారు. -
ఆవిర్భావ సంబరాలు ఒక్కరోజుకే పరిమితమా?!
రేవంత్రెడ్డి అదృష్టవశాత్తు ముఖ్యమంత్రి అయ్యారని, ఆయనకు తెలంగాణ ప్రజల త్యాగాలు, ఉద్యమం గురించి ఏమాత్రం తెలియదని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. -
పోస్టల్ బ్యాలట్ వ్యవహారంపై సుప్రీంకు వైకాపా
పోస్టల్ బ్యాలట్ల ఓటరు డిక్లరేషన్కు సంబంధించిన ‘ఫాం-13ఏ’ పై అటెస్టింగ్ అధికారి సంతకం ఉంటే చాలు, ఆయన పేరు, హోదా, అధికారిక ముద్ర (సీలు) లేకపోయినా ఆ ఓట్లు చెల్లుబాటవుతాయంటూ కేంద్ర ఎన్నికల సంఘం మే 30న జారీచేసిన ఉత్తర్వులపై వైకాపా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. -
అయిదు రకాల కౌంటింగ్ ఏజెంట్లను అనుమతించండి
ఓట్ల లెక్కింపు ప్రక్రియను పార్టీల తరఫున పర్యవేక్షించేందుకు అయిదు రకాల ఏజెంట్లను అనుమతించాలని తెదేపా మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. -
భారాసలా నియంతృత్వం వద్దు.. ప్రజాపాలన అందించాలి: నారాయణ
త్యాగాలతో పోరాడి సాధించుకున్న తెలంగాణలో భారాస ప్రభుత్వం చేసిన నియంత పాలన మాదిరిగా కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనను అందించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ పేర్కొన్నారు. -
తెదేపా తరఫున పనిచేసినందుకు వాలంటీరు రాళ్ల దాడి
ఎన్నికల్లో తెదేపా తరఫున పని చేసినందుకు ముగ్గురు యువకులపై ఓ గ్రామ వాలంటీరు రాళ్ల దాడికి పాల్పడ్డాడు. -
శ్రీవారి భక్తుల ప్రాణాలు పణంగా పెడతారా?
తిరుమలలో భక్తులకు అందించే ఆహారం, నీరు అపరిశుభ్రంగా ఉండటంపై తెదేపా అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ ఆందోళన వ్యక్తంచేశారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో నైతిక విజయం కాంగ్రెస్దే
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో నైతిక విజయం కాంగ్రెస్ పార్టీదేనని మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. -
ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్ల ముసుగులో భూదోపిడీ
ఫ్రీహోల్డ్ సర్టిఫికెట్ల ముసుగులో విశాఖ చుట్టుపక్కల విలువైన భూములను వైకాపా నేతలు, సీఎస్ జవహర్రెడ్డి బినామీలు దోచేశారని జనసేన పార్టీ కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్ ఆరోపించారు.
తాజా వార్తలు (Latest News)
-
గాల్లో ఢీకొన్న విమానాలు.. పైలట్ మృతి.. వీడియోలో రికార్డయిన దృశ్యాలు!
-
కాసేపట్లో తెలంగాణ పాలిసెట్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో
-
తాగి ఉన్నా.. మర్చిపోయా!: పుణె కారు ప్రమాద నిందితుడి సమాధానం
-
అమెరికాలో హైదరాబాద్ విద్యార్థిని మిస్సింగ్
-
కత్తితో దాడి చేసినా.. హైదరాబాద్లో దొంగలను ప్రతిఘటించిన యువకుడు
-
ఈ వారం థియేటర్/ఓటీటీలో అలరించే చిత్రాలు, సిరీస్లివే!