పార్టీ నియమావళినే కాపాడుకోలేకపోయారు

కేవలం ఒక కుటుంబాన్ని ప్రోత్సహించడం కోసం కాంగ్రెస్‌ నేతలు తమ సొంత పార్టీ నియమావళిని రక్షించుకోవడంలోనూ విఫలమయ్యారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ విమర్శించారు.

Published : 22 May 2024 05:32 IST

కాంగ్రెస్‌ నేతలపై నిర్మల విమర్శ

పట్నా: కేవలం ఒక కుటుంబాన్ని ప్రోత్సహించడం కోసం కాంగ్రెస్‌ నేతలు తమ సొంత పార్టీ నియమావళిని రక్షించుకోవడంలోనూ విఫలమయ్యారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ విమర్శించారు. పైపెచ్చు రాజ్యాంగాన్ని ఎన్డీయే మార్చేయాలనుకుంటున్నట్లు అబద్ధాలను కాంగ్రెస్‌ నాయకులు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. మంగళవారం బిహార్‌లోని పట్నాలో నిర్మల విలేకరులతో మాట్లాడారు. సోనియాగాంధీని అందలమెక్కించడానికి ఆటంకాలు లేకుండా చూసేందుకు ఒక దశలో ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు సీతారాం కేసరిని గదిలో బంధించిన వైనాన్ని ఆ పార్టీ నేతలు జ్ఞాపకం చేసుకోవాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని